రాయికల్ మండలంలోని బోర్నపల్లిలో గోదావరి వరద తీవ్రతను రైతులు గ్రామస్తులతో కలిసి పరిశీలించిన మాజీ మంత్రి జీవన్ రెడ్డి
యూరియా కొరత..కేంద్రందే బాధ్యత..!
నాలుగు వంతెనల నిర్మాణం...నాకు సంతృప్తినిచ్చింది..!
..బోర్నపల్లి,కమ్మునూరు బ్రిడ్జిల నిర్మాణం దగ్గరుండి పర్యవేక్షించా!
- పదేళ్ల తర్వాత రేషన్ కార్డులు, ఇండ్ల మంజూరు
- మాజీ మంత్రి జీవన్ రెడ్డి
రాయికల్ ఆగస్ట్ (ప్రజా మంటలు):
యూరియా కొరతపై మాట్లాడుతూ,కేంద్రం తెలంగాణ రాష్ట్రంపై వివక్ష చూపిస్తుందని, మంత్రులు తెలంగాణ రాష్ట్ర ఎంపీలు కేంద్రంపై ఉత్తిడి తీసుకువస్తున్నారని మాజీ మంత్రి జీవన్ రెడ్లి తెలిపారు.
బోర్నపల్లి బ్రిడ్జి వద్ద గోదావరి వరదను పరిశీలించి, గ్రామస్తులతో మాట్లాడిన జీవన్ రెడ్డి, రాయికల్ లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
గత ప్రభుత్వం గ్రామాలలో ఒక్క ఇల్లు మంజూరు ఇవ్వలేదు హౌసింగ్ శాఖను నిర్వీర్యం చేసింది అన్నారు.గత ప్రభుత్వం 3 లక్షల రూపాయలు ఇంటి సహాయానికి అని పత్రం ఇచ్చిన అది అమలు చేయలేదు
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తదుపరి 5 లక్షల రూపాయల మంజూరుతో మొదటి విడతలో నియోజకవర్గానికి 3500 ఇండ్లు మంజూరు చేయడం జరుగుతుందని అన్నారు
యూరియా కొరత..కేంద్రందే బాధ్యత..!
రామగుండం ఎరువుల కర్మాగారంలో 8 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా ఉత్పత్తి కావలసి ఉండగా కేవలం 5 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా ఉత్పత్తి కావడంతో యూరియా కొరత ఏర్పడిందని దీనిపై కేంద్రందే బాధ్యత అని మాజీ మంత్రి జీవన్ రెడ్డి అన్నారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు రాయికల్ మండలంలోని బోర్నపల్లి బ్రిడ్జి వద్ద గోదావరి నీటి ఉధృతి పెరగడంతో గోదావరి తీర ప్రాంతాలను మంగళవారం పరిశీలించి ప్రజలు,అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
అనంతరం రాయికల్ పట్టణంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో మాజీ మంత్రి మాట్లాడుతూ రైతులకు సకాలంలో ఎరువులు అందక ఇబ్బందులు పడుతున్నారని రాష్ట్రంలో ఉన్న రామగుండం ఎరువుల కర్మాగారం నుండి ఉత్పత్తి అయ్యే యూరియా 90% తెలంగాణ రైతాంగానికి కేటాయించకపోవడం కేంద్ర మంత్రులు,బిజెపి ఎంపీల బాధ్యత రాహిత్యమని మండిపడ్డారు.
నాలుగు వంతెనల నిర్మాణం...నాకు సంతృప్తినిచ్చింది..!
ఉమ్మడి అదిలాబాద్, కరీంనగర్ జిల్లాల మధ్య వాణిజ్య వ్యాపార, రవాణా సౌకర్యార్థం కడెం,రాయికల్ మండలాల మధ్యలో బోర్నపల్లి బ్రిడ్జి,కమ్మనూరు, కలమడుగు మధ్య బ్రిడ్జి నిర్మాణం, మల్లాపూర్ మండల్ బాదనకుర్తి బ్రిడ్జి,నిజాంబాద్ జిల్లా మోర్తాడ్ మండలం గుమ్మిరియాల గోదావరి నదిపై ఈ నాలుగు వంతెనల నిర్మాణంలో నాకు భాగస్వామ్యం ఉండడం నా జీవితంలో అత్యంత తృప్తినిచ్చిన అంశమని మాజీ మంత్రి జీవన్ రెడ్డి అన్నారు.
జగిత్యాల నియోజకవర్గంలోని బోర్నపల్లి వంతెన నిర్మాణం చేపట్టాలని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకురాగా మంజూరు చేశారని, మీ బోర్నపల్లి,కమ్మునూరు బ్రిడ్జిల నిర్మాణం దగ్గరుండి పర్యవేక్షించానని పేర్కొన్నారు.
పదేళ్ల తర్వాత రేషన్ కార్డులు, ఇండ్ల మంజూరు
గత బిఆర్ఎస్ ప్రభుత్వం రెండు పర్యాయాలు అధికారం చేపట్టిన గడిచిన 10 ఏళ్లలో ఒక్క రేషన్ కార్డు, ఇళ్లను ఇవ్వలేదని పేర్కొన్నారు. 18 ఏళ్ల కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టిన వెంటనే రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లను, ఉచిత బస్సు, ఉచిత విద్యుత్తు, సన్నబియ్యం వంటి మహోన్నత కార్యక్రమాలను అమలు చేసిందన్నారు. 42 శాతం బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకమని కొనియాడారు.
ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు గోపి రాజారెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి గుర్రం మహేందర్ గౌడ్,నాయకులు కొయ్యేడి మహిపాల్,బాపురపు నర్సయ్య,బత్తిని భూమయ్య, కోడిపెల్లి ఆంజనేయులు,తలారి రాజేష్,పొన్నం శ్రీకాంత్,చింతల పెళ్లి గంగారెడ్డి,బత్తిని నాగరాజు, నరసింహారెడ్డి,ఏలేటి రాజేందర్,రాజీవ్,జలపతి రెడ్డి, ఉప్పు లక్ష్మణ్,రాజారెడ్డి,మసుద్,శివ,రాజేష్,రాజారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
వరల్డ్ మస్కిటో డే సందర్భంగా ర్యాలీ

సినిమాల్లో మహిళలకు సమానత్వం - పురుష-స్త్రీ బైనరీని దాటి వెళ్ళాలి, అంతర సంబంధితిత వాస్తవికతలను పరిష్కరించాలి: కేరళ హైకోర్టు

దేశ యువతకు స్ఫూర్తి రాజీవ్ గాంధీ - సీఎం రేవంత్ రెడ్డి

మాజీ ప్రధాని రాజీవ్ గాంధీకి మంత్రి అడ్లూరి లక్ష్మణ్,మాజీ మంత్రి జీవన్ రెడ్డి

వచ్చే ఎన్నికల్లో పోటీచేస్తా - నటుడు సుమన్
1.jpeg)
ఉప రాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డికి చిన్నారెడ్డి సంపూర్ణ మద్దతు
1.jpeg)
రేపటి నుండి శ్రీ లోక మాత పోచమ్మ తల్లి దేవాలయ 63వ వార్షికోత్సవాలు

ముంబై మోనో రైలు ప్రమాదంలో 400 మంది సురక్షితం

వాంకిడి ఘటనపై తెలంగాణ ప్రభుత్వానికి ఎన్హెచ్ఆర్సీ నోటీసులు

కాంగ్రెస్ కుట్రలను తిప్పికొట్టాలి - బిజెపి నాయకురాలు ఎం. రాజేశ్వరి

వైద్యుల సమస్యల్ని పరిష్కరించాలని మంత్రి కి టీజీజీడీఏ నేతల వినతి

గాంధీ ఆసుపత్రి కి స్పెషల్ ఆఫీసర్ ను నియమిస్తాం...వైద్య ఆరోగ్య శాఖ మంత్రి
.jpg)