రాయికల్ మండలంలోని బోర్నపల్లిలో గోదావరి వరద తీవ్రతను రైతులు గ్రామస్తులతో కలిసి పరిశీలించిన మాజీ మంత్రి జీవన్ రెడ్డి 

On
రాయికల్ మండలంలోని బోర్నపల్లిలో గోదావరి వరద తీవ్రతను రైతులు గ్రామస్తులతో కలిసి పరిశీలించిన మాజీ మంత్రి జీవన్ రెడ్డి 

యూరియా కొరత..కేంద్రందే బాధ్యత..!
నాలుగు వంతెనల నిర్మాణం...నాకు సంతృప్తినిచ్చింది..!
..బోర్నపల్లి,కమ్మునూరు బ్రిడ్జిల నిర్మాణం దగ్గరుండి పర్యవేక్షించా!
- పదేళ్ల తర్వాత రేషన్ కార్డులు, ఇండ్ల మంజూరు
- మాజీ మంత్రి జీవన్ రెడ్డి

రాయికల్ ఆగస్ట్ (ప్రజా మంటలు):

యూరియా కొరతపై మాట్లాడుతూ,కేంద్రం తెలంగాణ రాష్ట్రంపై వివక్ష చూపిస్తుందని, మంత్రులు తెలంగాణ రాష్ట్ర ఎంపీలు కేంద్రంపై ఉత్తిడి తీసుకువస్తున్నారని మాజీ మంత్రి జీవన్ రెడ్లి తెలిపారు. 

బోర్నపల్లి బ్రిడ్జి వద్ద గోదావరి వరదను పరిశీలించి, గ్రామస్తులతో మాట్లాడిన జీవన్ రెడ్డి, రాయికల్ లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు.

గత ప్రభుత్వం గ్రామాలలో ఒక్క ఇల్లు మంజూరు ఇవ్వలేదు హౌసింగ్ శాఖను నిర్వీర్యం చేసింది అన్నారు.గత ప్రభుత్వం 3 లక్షల రూపాయలు ఇంటి సహాయానికి అని పత్రం ఇచ్చిన అది అమలు చేయలేదు

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తదుపరి 5 లక్షల రూపాయల మంజూరుతో మొదటి విడతలో నియోజకవర్గానికి 3500 ఇండ్లు మంజూరు చేయడం జరుగుతుందని అన్నారు

యూరియా కొరత..కేంద్రందే బాధ్యత..!

రామగుండం ఎరువుల కర్మాగారంలో 8 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా ఉత్పత్తి కావలసి ఉండగా కేవలం 5 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా ఉత్పత్తి కావడంతో యూరియా కొరత ఏర్పడిందని దీనిపై కేంద్రందే బాధ్యత అని మాజీ మంత్రి జీవన్ రెడ్డి అన్నారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు రాయికల్ మండలంలోని బోర్నపల్లి బ్రిడ్జి వద్ద గోదావరి నీటి ఉధృతి పెరగడంతో గోదావరి తీర ప్రాంతాలను మంగళవారం పరిశీలించి ప్రజలు,అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

అనంతరం రాయికల్ పట్టణంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో మాజీ మంత్రి మాట్లాడుతూ రైతులకు సకాలంలో ఎరువులు అందక ఇబ్బందులు పడుతున్నారని రాష్ట్రంలో ఉన్న రామగుండం ఎరువుల కర్మాగారం నుండి ఉత్పత్తి అయ్యే యూరియా 90% తెలంగాణ రైతాంగానికి కేటాయించకపోవడం కేంద్ర మంత్రులు,బిజెపి ఎంపీల బాధ్యత రాహిత్యమని మండిపడ్డారు.

నాలుగు వంతెనల నిర్మాణం...నాకు సంతృప్తినిచ్చింది..!

ఉమ్మడి అదిలాబాద్, కరీంనగర్ జిల్లాల మధ్య వాణిజ్య వ్యాపార, రవాణా సౌకర్యార్థం కడెం,రాయికల్ మండలాల మధ్యలో బోర్నపల్లి బ్రిడ్జి,కమ్మనూరు, కలమడుగు మధ్య బ్రిడ్జి నిర్మాణం, మల్లాపూర్ మండల్ బాదనకుర్తి బ్రిడ్జి,నిజాంబాద్ జిల్లా మోర్తాడ్ మండలం గుమ్మిరియాల గోదావరి నదిపై ఈ నాలుగు వంతెనల నిర్మాణంలో నాకు భాగస్వామ్యం ఉండడం నా జీవితంలో అత్యంత తృప్తినిచ్చిన అంశమని మాజీ మంత్రి జీవన్ రెడ్డి అన్నారు.

జగిత్యాల నియోజకవర్గంలోని బోర్నపల్లి వంతెన నిర్మాణం చేపట్టాలని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకురాగా మంజూరు చేశారని, మీ బోర్నపల్లి,కమ్మునూరు బ్రిడ్జిల నిర్మాణం దగ్గరుండి పర్యవేక్షించానని పేర్కొన్నారు.

పదేళ్ల తర్వాత రేషన్ కార్డులు, ఇండ్ల మంజూరు

గత బిఆర్ఎస్ ప్రభుత్వం రెండు పర్యాయాలు అధికారం చేపట్టిన గడిచిన 10 ఏళ్లలో ఒక్క రేషన్ కార్డు, ఇళ్లను ఇవ్వలేదని పేర్కొన్నారు. 18 ఏళ్ల కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టిన వెంటనే రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లను, ఉచిత బస్సు, ఉచిత విద్యుత్తు, సన్నబియ్యం వంటి మహోన్నత కార్యక్రమాలను అమలు చేసిందన్నారు. 42 శాతం బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకమని కొనియాడారు.

IMG_20250819_184648ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు గోపి రాజారెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి గుర్రం మహేందర్ గౌడ్,నాయకులు కొయ్యేడి మహిపాల్,బాపురపు నర్సయ్య,బత్తిని భూమయ్య, కోడిపెల్లి ఆంజనేయులు,తలారి రాజేష్,పొన్నం శ్రీకాంత్,చింతల పెళ్లి గంగారెడ్డి,బత్తిని నాగరాజు, నరసింహారెడ్డి,ఏలేటి రాజేందర్,రాజీవ్,జలపతి రెడ్డి, ఉప్పు లక్ష్మణ్,రాజారెడ్డి,మసుద్,శివ,రాజేష్,రాజారెడ్డి,  తదితరులు పాల్గొన్నారు.

Tags

More News...

Local News 

వరల్డ్ మస్కిటో డే సందర్భంగా ర్యాలీ

వరల్డ్ మస్కిటో డే సందర్భంగా ర్యాలీ సికింద్రాబాద్, ఆగస్టు 20 (ప్రజామంటలు): ప్రపంచ దోమల దినోత్సవం సందర్భంగా జిహెచ్ఎంసి ఎంటమాలజీ సిబ్బంది బన్సీలాల్ పేట డివిజన్ బోయిగూడ ఐడిహెచ్ కాలనీ లో దోమల అవగాహన ర్యాలీ నిర్వహించారు.  దోమలతో కలుగు వ్యాధులు,  వాటి వ్యాప్తి, నివారణ పై స్థానికులకు అవగాహన కల్పించారు . ర్యాలీలో గాంధీ అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్  డాక్టర్...
Read More...
National  Filmi News  State News 

సినిమాల్లో మహిళలకు సమానత్వం - పురుష-స్త్రీ బైనరీని దాటి వెళ్ళాలి, అంతర సంబంధితిత వాస్తవికతలను పరిష్కరించాలి: కేరళ హైకోర్టు

సినిమాల్లో మహిళలకు సమానత్వం - పురుష-స్త్రీ బైనరీని దాటి వెళ్ళాలి, అంతర సంబంధితిత  వాస్తవికతలను పరిష్కరించాలి: కేరళ హైకోర్టు పబ్లిక్ పాలసీ ముసాయిదాను సమర్పించండి - కోర్ట్ ఆదేశాలు  సినిమాల్లో మహిళలకు సమానత్వ చట్టం పురుష-స్త్రీ బైనరీని దాటి వెళ్ళాలి, అంతర సంబంధితిత (intersectional) వాస్తవికతలను పరిష్కరించాలి: కేరళ హైకోర్టు లో న్యాయమూర్తులు మౌఖిక సూచన చేశారు వినోద పరిశ్రమలో మహిళల రక్షణ కోసం సమానత్వ చట్టాన్ని రూపొందించేటప్పుడు సంబంధితిత" అంశాలను కూడా...
Read More...
Local News  State News 

దేశ యువతకు స్ఫూర్తి రాజీవ్ గాంధీ - సీఎం రేవంత్ రెడ్డి 

దేశ యువతకు స్ఫూర్తి రాజీవ్ గాంధీ - సీఎం రేవంత్ రెడ్డి  మాజీ ప్రధాని రాజీవ్ గాంధీకి ఘన నివాళులు  దేశ సమగ్రతను కాపాడేందుకు ఆయన ప్రాణాలర్పించారు - రేవంత్ రెడ్డి  హైదరాబాద్ ఆగస్ట్ 20 (ప్రజా మంటలు): పారదర్శక పరిపాలన అందించడానికి సాంకేతికతను జోడించాలని ఆనాడు రాజీవ్ గాంధీ ఆలోచన చేశారని,18 ఏండ్లు నిండిన వారికి ఓటు హక్కును కల్పించి దేశ భవిష్యత్ ను నిర్ణయించే అవకాశం...
Read More...
Local News 

మాజీ ప్రధాని రాజీవ్ గాంధీకి మంత్రి అడ్లూరి లక్ష్మణ్,మాజీ మంత్రి జీవన్ రెడ్డి

మాజీ ప్రధాని రాజీవ్ గాంధీకి మంత్రి అడ్లూరి లక్ష్మణ్,మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఇందిరా భవన్ లో ఘనంగా రాజీవ్ గాంధీ జయంతి ఉత్సవాలు జగిత్యాల ఆగస్ట్ 20 ( ప్రజా మంటలు): జగిత్యాల జిల్లా కేంద్రంలో ఇందిరా భవన్ లో రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా రాజీవ్ గాంధీ చిత్రపటానికి, తెలంగాణ రాష్ట్ర ఎస్సీ ఎస్టీ మైనార్టీ వికలాంగుల శాఖ మంత్రి వర్యులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు...
Read More...
Filmi News  State News 

వచ్చే ఎన్నికల్లో పోటీచేస్తా - నటుడు సుమన్

వచ్చే ఎన్నికల్లో పోటీచేస్తా - నటుడు సుమన్ ఎందరో నటులు సినీరంగం నుండి రాజకీయాల్లోకి - అదేబాటలు సుమన్ విజయవాడ ఆగస్టు 20: 2029 లో సుమన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి పోటీ పోటీచేస్తానని ప్రకటించారు.ఇక తాజాగా సినీ హీరో సుమన్ ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో స్వతంత్ర సమరయోధులు సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహ ఆవిష్కరణకు హాజరయ్యారు. ఈ సభలో మాట్లాడిన సుమన్ తన...
Read More...
National  State News 

ఉప రాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డికి చిన్నారెడ్డి సంపూర్ణ మద్దతు

ఉప రాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డికి చిన్నారెడ్డి సంపూర్ణ మద్దతు సుదర్శన్ రెడ్డి అభ్యర్థిత్వాన్ని స్వాగతించిన చిన్నారెడ్డి గారు హైదరాబాద్ ఆగస్ట్ 20 (ప్రజా మంటలు): భారత దేశ ఉప రాష్ట్రపతి ఇండియా కూటమి అభ్యర్థిగా జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారి పేరును ప్రకటించడం పట్ల రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ డాక్టర్ జీ. చిన్నారెడ్డి ఒక ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు.  ప్రస్తుతం దేశంలో...
Read More...
Local News  Spiritual  

రేపటి నుండి శ్రీ లోక మాత పోచమ్మ తల్లి దేవాలయ 63వ వార్షికోత్సవాలు

రేపటి నుండి శ్రీ లోక మాత పోచమ్మ తల్లి దేవాలయ 63వ వార్షికోత్సవాలు జగిత్యాల ఆగస్ట్ 19 (ప్రజా మంటలు)): శ్రీ లోక మాత పోచమ్మ తల్లి దేవాలయ 63వ వార్షికోత్సవ ఉత్సవ ప్రచార రథాన్ని డీఎస్పీ దుర్శెట్టి రఘు చందర్ ప్రారంభించారు. అమ్మవారి ఉత్సవాలు తేదీ:20-08-2025 బుధవారం  నుండి 23-08-2025 శనివారం  వరకు జరుగురాయని ఆలయ కమిటీ ప్రకటించింది. డీఎస్పీ దుర్శెట్టి రఘు చందర్  అమ్మవారుకు ప్రత్యేక పూజలు...
Read More...
National  State News 

ముంబై మోనో రైలు ప్రమాదంలో 400 మంది సురక్షితం

ముంబై మోనో రైలు ప్రమాదంలో 400 మంది సురక్షితం ముంబై ఆగస్టు 19: ముంబైలోని మోనోరైలులో చిక్కుకున్న ప్రయాణికులందరినీ సురక్షితంగా రక్షించారు. ముంబైలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా రైలు సర్వీసులు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. ఈ పరిస్థితిలో, ఈ సాయంత్రం (ఆగస్టు 19) భారీ వర్షాల మధ్య నడుస్తున్న మోనోరైలు ముంబైలోని మైసూర్ కాలనీ స్టేషన్ సమీపంలో కదులుతుండగా అకస్మాత్తుగా మధ్యలో ఆగిపోయింది....
Read More...
State News 

వాంకిడి ఘటనపై తెలంగాణ ప్రభుత్వానికి ఎన్హెచ్ఆర్సీ నోటీసులు

వాంకిడి ఘటనపై తెలంగాణ ప్రభుత్వానికి ఎన్హెచ్ఆర్సీ నోటీసులు సికింద్రాబాద్, ఆగస్ట్ 19 (ప్రజామంటలు) : తెలంగాణ ప్రభుత్వానికి జాతీయ మానవ హక్కుల కమిషన్ నోటీసులు ఇచ్చింది.- వాంకిడి ప్రభుత్వ ఆశ్రమ పాఠశాల విద్యార్థిని శైలజ కలుషిత ఆహరం తిని 22 రోజులు మృత్యువు తో పోరాడి గత ఏడాది నవంబర్ 25 న మృతి చెందిన విషయం విదితమే. ఈ ఘటనలో-  సుమారు 60...
Read More...
Local News 

కాంగ్రెస్ కుట్రలను తిప్పికొట్టాలి - బిజెపి నాయకురాలు ఎం. రాజేశ్వరి

కాంగ్రెస్ కుట్రలను తిప్పికొట్టాలి - బిజెపి నాయకురాలు ఎం. రాజేశ్వరి అంబేడ్కర్ ను రాజ్యాంగాన్ని అవమానించింది కాంగ్రెస్సే .. సికింద్రాబాద్,  ఆగస్టు 19 (ప్రజా మంటలు):  రాజ్యాంగాన్ని మార్చేందుకు కుట్ర జరుగుతుందని దాన్ని అంబేడ్కర్ వాదులు తిప్పికొట్టాలని కాంగ్రెస్ నాయకులు చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పి కొట్టి అంబేద్కర్ గారిని  రాజ్యాంగాన్ని అవమానించిన కాంగ్రెస్ పార్టీ విధానాన్ని ప్రజలకు వివరించి కాంగ్రెస్ పార్టీ గతంలో చేసిన ప్రస్తుతం చేస్తున్న...
Read More...
Local News  State News 

వైద్యుల సమస్యల్ని పరిష్కరించాలని మంత్రి కి టీజీజీడీఏ నేతల వినతి

వైద్యుల సమస్యల్ని పరిష్కరించాలని మంత్రి కి టీజీజీడీఏ నేతల వినతి సికింద్రాబాద్, ఆగస్ట్ 19 (ప్రజామంటలు) : ప్రభుత్వ వైద్యుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ మంగళవారం గాంధీ ఆసుపత్రిలో రాష్ర్ట వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ కు తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం గాంధీ యూనిట్ నేతలు వినతి పత్రం సమర్పించారు. కెరీర్ అడ్వాన్స్మెంట్, టైం బౌండ్ ప్రమోషన్స్ అమలు చేయాలని, వైద్యులకు ట్రాన్స్...
Read More...

గాంధీ ఆసుపత్రి కి  స్పెషల్ ఆఫీసర్ ను నియమిస్తాం...వైద్య ఆరోగ్య శాఖ మంత్రి

గాంధీ ఆసుపత్రి కి  స్పెషల్ ఆఫీసర్ ను నియమిస్తాం...వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఓపీ విభాగాల్లో పర్యటించిన మంత్రి    వైద్యాధికారులతో కలసి రివ్యూ మీటింగ్ సికింద్రాబాద్, ఆగస్ట్ 19 (ప్రజామంటలు) : రాష్ర్టంలోనే పెద్ద ఆసుపత్రిగా పేరుగాంచిన గాంధీ ఆసుపత్రిలో ఎప్పటి కప్పుడు సమస్యల పరిష్కారానికి, అడ్మినిస్ర్టేషన్ లో లోపాలు లేకుండా ఓ స్పెషల్ ఆఫీసర్ ను నియమించాలనే ఆలోచన ఉన్నట్లు రాష్ర్ట వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర...
Read More...