మండల పంచాయతీ అధికారి ఆదేశాలు పట్టించుకొని కార్యదర్శులు
గొల్లపల్లి జూన్ 02 (ప్రజామంటలు) :
రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను గొల్లపల్లి మండలంలోని పలు ప్రభుత్వ కార్యాలయాలు ,గ్రామపంచాయతీ కార్యాలయాలో అధికారులు జాతీయ జెండాను ఆవిష్కరించి ఘనంగా నిర్వహించారు.
కాగా ఈ వేడుకల్లో పలువురు పంచాయతీ కార్యదర్శిలు వ్యవహరించిన తీరు ప్రజలను గందరగోళానికి గురి చేసింది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర గీతం తో పాటు నూతనంగా ఏర్పాటుచేసిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని అధికారికంగా గుర్తిస్తూ జీవో రిలీజ్ చేసింది.
నేడు రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల్లో మండలంలోని కొన్ని గ్రామపంచాయతీ కార్యాలయాల్లో ప్రభుత్వం అధికారికంగా గుర్తించిన తెలంగాణ తల్లి చిత్రపటం ను ఉపయోగించగా మరికొన్ని పంచాయతీ కార్యాలయాల్లో మాత్రం బీఆర్ఎస్ సమయంలో చేలామణిలో ఉన్న పాత తెలంగాణ తల్లి చిత్రపటం తో వేడుకలు నిర్వహించారు. దీంతో కార్యదర్శిల తీరుతో ప్రజలు అయోమయానికి గురవుతూ ఇంతకీ అసలైన తెలంగాణ తల్లి ఎవరు? ప్రభుత్వం అధికారికంగా గుర్తించినప్పటికీ అధికారులకు ఈ విషయంలో క్లారిటీ లేనట్టుంది అని చర్చించుకుంటున్నారు.
మండల పంచాయతీ అధికారిని చరవాణిలో వివరణ కోరగా నూతనంగా ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెట్టాలని ఒక రోజే ముందు ఆదేశాలు జారీ చేశామని తెలిపారు
More News...
<%- node_title %>
<%- node_title %>
బక్రీద్ గొర్రె పొట్టేళ్ళ సందడి - చిలకలగూడ గ్రౌండ్ లో మేకల విక్రయాలు

సికింద్రాబాద్ లో ప్రపంచ పర్యావరణ దినోత్సవ ర్యాలీ..

మొక్కలు నాటడం ప్రతి ఒక్కరూ భాద్యత గా భావించాలి

పర్యావరణ పరిరక్షణ ప్రతి పౌరుని బాధ్యత

భూభారతి రెవెన్యూ సదస్సులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్

అమ్మక్కపేటలో భూ భారతి గ్రామ సభలో పాల్గొన్న జువ్వడి కృష్ణారావు

పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత -సీనియర్ సివిల్ జడ్జి నాగేశ్వర్ రావు.
.jpg)
వైద్యులు విధులకు సమయపాలన పాటించాలి జిల్లా కలెక్టర్ బి.సత్య ప్రసాద్ .

9వ వార్డులో వనమహోత్సవం పాల్గొన్న ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

అమ్మవారి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే డా సంజయ్

అసాంఘిక కార్యకలాపాలకు అడ్డ (చింతకుంట)మినీ ట్యాంక్ బండ్

అడ్లూరి" చొరవ తోనే "అభివృద్ధి" పనులు - స్పష్టం చేసిన టిజెఎస్ జిల్లా అధ్యక్షులు చుక్క గంగారెడ్డి
