అన్ని వర్గాలకు సమాన హక్కులు, స్వేచ్ఛ, గౌరవం కల్పించిన మహోన్నత వ్యక్తి డా.బాబా సాహెబ్ అంబేద్కర్: జిల్లా ఎస్పి అశోక్ కుమార్
సిరిసిల్ల. రాజేంద్ర శర్మ
జగిత్యాల ఏప్రిల్ 14 (ప్రజా మంటలు)
సామాజిక వివక్షను జయించి, అత్యున్నత విద్యను సాధించిన గొప్ప మేధావిగా ,భారత రాజ్యాంగం ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత రాజ్యాంగంగా ఉండడానికి కీలక పాత్ర పోషించిన వ్యక్తి భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అని జిల్లా ఎస్పి అశోక్ కుమార్ అన్నారు.
భారతరత్న డా.బాబా సాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఈ రోజు జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ అంబేద్కర్ చిత్ర పటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ.. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అన్ని వర్గాల ప్రజలకు సమన్యాయం కల్పిస్తూ భారత దేశ అభివృద్ధికి, అభ్యున్నతికి పాటుపడిన వ్యక్తి గా అభివర్ణించారు. భారతీయ సమాజంలో కూడా దళితులు, పేదలు, మహిళల కు సమాజంలో సమాన గౌరవం కల్పించే దిశగా రాజ్యాంగ కల్పన చేసిన వ్యక్తి గా అభివర్ణించారు. భారత రాజ్యాంగ నిర్మాతగా మాత్రమే కాకుండా, సామాజిక సమానత్వం, స్వాతంత్య్రం, విద్య, శ్రామిక హక్కుల కోసం పోరాడిన గొప్ప వ్యక్తి అని ఆయన భావాలు సమాజ అభివృద్ధికి దిక్సూచిగా నిలుస్తాయిని ప్రతి ఒక్కరూ అంబేద్కర్ ఆశయాలను అనుసరిస్తూ సమానత్వంతో కూడిన సమాజ నిర్మాణానికి కృషి చేయాలి అని పేర్కొన్నారు.
ఈ యొక్క కార్యక్రమమ లో అదనపు ఎస్పి బీమ్ రావు, డి సి ఆర్ బి డిఎస్పి సురేష్, ఎస్బి ఇన్స్పెక్టర్ ఆరిఫ్ అలీ ఖాన్, రిజర్వ్ ఇన్స్పెక్టర్ వేణు, మరియు రిజర్వు సబ్ ఇన్స్పెక్టర్లు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
గాంధీ టెర్రస్ లపై రెడ్ క్రాస్ సింబల్ ల ఏర్పాటు..

అమరవీరుడు మురళి నాయక్ ఆత్మ శాంతి చేకూర్చాలని కొవ్వొత్తుల ర్యాలీ

రత్నాకర్ రావు సేవలు నేటి తరానికి స్ఫూర్తిదాయకం....ఎమ్మేల్యే డా.సంజయ్

ఆపరేషన్ సింధూర్ కు మద్దతుగా బి.ఆర్.ఎస్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు

కరెంటు షాక్ తో మరణించిన కుటుంబానికి ప్రభుత్వం ద్వారా 5 లక్షల ఆర్థిక సహాయం అందజేసిన జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

భారత రక్షక దళాలకు మద్దతుగా పాత్రికేయుల సంఘీభావ ర్యాలీ

శ్రీ రాధా రుక్మిణి సత్యభామ సమేత మధన వేణుగోపాలస్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా కళ్యాణ వేడుకలు

వాసవి మాత ఆలయంలో ఘనంగా గురువారాల ఏకాదశి ఉద్యాపన ఉత్సవము

సీఎం సహాయ నిధి నిరుపేదల పాలిట వరం 8లక్షల ఎల్ ఓ సి అందజేసిన జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

శ్రీ సూర్య ధనవంతరి ఆలయంలో బ్రహ్మోత్సవాలలో భాగంగా కుంకుమార్చనలు పాల్గొన్న బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు డా భోగ శ్రావణి

ఆపరేషన్ సింధూర్ విజయవంతం కావాలని, సైనికులకు మనోధైర్యం కల్పించాలని దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో పూజలు

జగిత్యాల ప్రధాన కూడల్లో ఉన్నటువంటి అక్రమ షెడ్లను తొలగించాలి. -విశ్వహిందూ పరిషత్ నాయకులు
