రొట్టె బాలకిష్టయ్య సేవలు చిరస్మరణీయాలు

On
రొట్టె బాలకిష్టయ్య సేవలు చిరస్మరణీయాలు

(రామ కిష్టయ్య సంగన భట్ల
సీనియర్ ఇండిపెండెంట్ జర్నలిస్ట్)

విశ్రాంత విద్యాధికారి రొట్టె బాలకిష్టయ్య చేసిన విద్యారంగ సేవలు చిరస్మరణీయాలని తెలంగాణ ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంఘము నేతలు అన్నారు.

సోమవారం తెలంగాణ ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంఘము ధర్మపురి మండల శాఖ ఆధ్వర్యంలో జరిగిన సమావేశములో అధ్యక్షులు కొరిడే శంకర్ గారి అధ్యక్షతన, కార్యదర్శి ఇంధారపు బండయ్య నిర్వహణలో సమావేశమై, విశ్రాంత విద్యాశాఖాధికారి,  తెలంగాణ ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంఘము ధర్మపురి మండల శాఖ పూర్వ కార్యదర్శి కీ.శ. శ్రీ రొట్టె బాలకిష్టయ్య  మరణం తీరని ఆవేదన వ్యక్తం చేశారు.

 రొట్టె బాలకిష్టయ్య వృష నామ సంవత్సర పుష్య శుక్ల పక్ష షష్ఠి (23-12-1941, మంగళ వారం) నాడు పురాణ ప్రవచన పాండిత్యంలో ప్రసిద్ధి గాంచిన రొట్టె చంద్రశేఖర శాస్త్రి, యమునమ్మ దంపతులకు కనిష్ఠ పుత్రునిగా జన్మించారని, చిన్న వయసులోనే వినయశీలత, క్రమశిక్షణ, కర్తవ్య నిష్ఠలను ఆచరణలో చూపిన ఆయన, ఆ లక్షణాలతోనే ఉద్యోగ జీవితంలోనూ గుర్తింపు పొందారన్నారు.IMG-20251014-WA0002

బాలకిష్టయ్య తొలి నియామకంగా ఆనాటి ఉమ్మడి అదిలాబాద్ జిల్లాలోని విద్యాశాఖలో విధులు ప్రారంభించారని,  అనంతరం కరీంనగర్ జిల్లాకు బదిలీ కాగా, జగిత్యాలలోని పురాతనోన్నత పాఠశాలలో కొంతకాలం అంకితభావంతో సేవలందించారన్నారు. ఆయన కృషి, కార్యదక్షతను గుర్తించిన అధికారులు ఆయనను జిల్లా విద్యాశాఖ కార్యాలయానికి బదిలీ చేశారని, అక్కడి నుంచీ పదోన్నతుల మార్గంలో అదిలాబాద్ జిల్లా విద్యాశాఖ కార్యాలయానికి, ఆపై వరంగల్ ప్రాంతీయ సంయుక్త సంచాలకుల కార్యాలయానికి, తరువాత కాకినాడ ప్రాంతీయ కార్యాలయానికి బదిలీ అయ్యారని వివరించారు. సహాయ సంచాలకులుగా కృషి చేసి తిరిగి వరంగల్ ప్రాంతీయ సంయుక్త సంచాలకుల కార్యాలయానికి బదిలీ అయ్యి, 31-12-1999 న పదవీ విరమణ చేశారన్నారు.

ఉద్యోగ జీవనమంతా ఆయన సన్మార్గం, సేవాభావం, సహచరుల పట్ల సహకార దృక్పథంతో నిండి ఉండేదని,  సేవా నియమాలపై లోతైన అవగాహన కలిగి, అనేకమంది ఉద్యోగులకు సలహా, మార్గదర్శకత్వం, సహాయ సహకారాలు అందించారు. కొంతమందికి ఉద్యోగావకాశాలు దక్కేలా చేయూతనిచ్చారని, అందువల్ల ఆయన సహచరులందరి అభిమానాన్ని చూరగొన్నారన్నారు.

కుటుంబ పరంగా ఆయన ఒక పుత్రుడు, ఒక పుత్రికలను సద్గుణవంతులుగా తీర్చిదిద్దారని, పిల్లల విద్యాభ్యాసం, అభివృద్ధి పట్ల అపారమైన శ్రద్ధ కనబరచి వారిని ఉత్తమ స్థితిలో నిలిపారు. అయితే సహధర్మచారిణి వియోగం ఆయనకు తీవ్ర మానసిక దుఃఖాన్ని కలిగించిందని,  వయోభారంతో పాటు ఆ దుఃఖం కూడా ఆయన ఆరోగ్యంపై ప్రభావం చూపిందని,  కొన్ని నెలలుగా అనారోగ్యంతో బాధపడిన ఆయన 06-10-2025 సోమవారం నాడు ఈ లోకాన్ని విడిచిపెట్టి శ్రీ నృసింహునిలో ఐక్యమయ్యారని వివరించారు.

తన జీవితానంత్య దశలో కుటుంబ సభ్యులందరూ విశేషమైన సేవలు అందించడం ప్రశంసనీయమైనదని,  ఆయన సేవా నిబద్ధత, సహృదయత, సత్సంగత మన సంఘానికి ఆదర్శప్రాయమైనవిన్నారు. 2006 నుండి 2014 వరకు మూడు పర్యాయములు రిటైర్డ్ సంఘ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తించి సంఘానికి విశేష సేవలు అందించారు. ఆయన మరణం మన సంఘానికి తీరనిలోటన్నారు.

 రొట్టె బాలకిష్టయ్యకు శ్రీ నృసింహసాన్నిధ్యం కలగాలని, ఆయన కుటుంబ సభ్యులకు మనోధైర్యం ప్రసాదించాలని మనసారా ఆ లోకపాలుడు నారసింహుని మన సంఘం తరపున ప్రార్థిస్తు మన్నారు.

Tags
Join WhatsApp

More News...

Local News 

రిటైర్డ్ ఉద్యోగుల సంఘం నూతన కార్యవర్గానికి శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

రిటైర్డ్ ఉద్యోగుల సంఘం నూతన కార్యవర్గానికి శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ జగిత్యాల అక్టోబర్ 14 (ప్రజా మంటలు)తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం జగిత్యాల జిల్లా ఎన్నికల్లో నూతనంగా ఎన్నికైన నూతన కార్యవర్గ సభ్యులు జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ ని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలవగా నూతన కార్యవర్గ సభ్యులను అభినందించి శుభాకాంక్షలు తెలిపిన జగిత్యాల ఎమ్మెల్యే డా...
Read More...
Local News 

జిల్లా పరిధిలోని యువతకు, ఔత్సహిక ఫోటోగ్రాఫర్లకు ఫోటోగ్రఫీ,షార్ట్ ఫిలిమ్ పోటీలకు ఆహ్వానం:జిల్లా ఎస్పి అశోక్ కుమార్ 

జిల్లా పరిధిలోని యువతకు, ఔత్సహిక ఫోటోగ్రాఫర్లకు ఫోటోగ్రఫీ,షార్ట్ ఫిలిమ్ పోటీలకు ఆహ్వానం:జిల్లా ఎస్పి అశోక్ కుమార్  జగిత్యాల అక్టోబర్ 14(ప్రజా మంటలు)శాంతి భద్రతల మరియు సమాజ రక్షణలో తమ ప్రాణాలను సైతం తృణప్రాయంగా పెట్టి, పోరాడి వీరమరణం పొందిన అమర పోలీసుల జ్ఞాపకార్థం అక్టోబర్ 21 నాడు జరుగు “ పోలీస్ ఫ్లాగ్ డే ” సందర్భంగా పోలీస్ రిలేటెడ్ అంశం మీద ఫోటో గ్రఫీ, షార్ట్ ఫిలిం తీయడానికి జిల్లాలో...
Read More...
Local News 

కవి, ఉద్యమకారుడు ఆకుల గంగాధర్ మృతి

కవి, ఉద్యమకారుడు ఆకుల గంగాధర్ మృతి    జగిత్యాల అక్టోబర్ 14 (ప్రజా మంటలు): కవి, ఉద్యమకారుడు, బీట్ బజార్ వాస్తవ్యులు వ్యవసాయ మార్కెటింగ్ కమిటీలో లో పని చేస్తున్న ఆకుల గంగాధర్ ఆదివారం (13,అక్టోబర్) రోజున ఉదయం మరణించారు.   ఆకుల గంగాధర్ మంచి కవి. ఆయను బీఎస్ రాములు,ప్రోత్సహిస్తూ 1993 లో ఆయన కవితలతో "దళిత భారతి" అనే కవితా సంపుటిని విశాల...
Read More...
Local News  Spiritual   State News 

రొట్టె బాలకిష్టయ్య సేవలు చిరస్మరణీయాలు

రొట్టె బాలకిష్టయ్య సేవలు చిరస్మరణీయాలు (రామ కిష్టయ్య సంగన భట్లసీనియర్ ఇండిపెండెంట్ జర్నలిస్ట్) విశ్రాంత విద్యాధికారి రొట్టె బాలకిష్టయ్య చేసిన విద్యారంగ సేవలు చిరస్మరణీయాలని తెలంగాణ ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంఘము నేతలు అన్నారు. సోమవారం తెలంగాణ ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంఘము ధర్మపురి మండల శాఖ ఆధ్వర్యంలో జరిగిన సమావేశములో అధ్యక్షులు కొరిడే శంకర్ గారి అధ్యక్షతన, కార్యదర్శి...
Read More...
National  Comment  State News 

మావోయిస్టు ఉద్యమంలో కొత్త మలుపు - మల్లోజుల లొంగుబాటు?

మావోయిస్టు ఉద్యమంలో కొత్త మలుపు - మల్లోజుల లొంగుబాటు? మల్లోజుల వేణుగోపాల్ రావు – ఉద్యమ, జీవిత విశేషాలు ఇది వ్యక్తి మార్పు మాత్రమే కాదు, ఒక యుగం మార్పు సూచన. మల్లోజుల వేణుగోపాల్ రావు – జీవితంలోని ప్రధాన ఘట్టాలు మల్లోజుల వేణుగోపాల్ రావు (అలియాస్ సోను/అభయ్) తెలంగాణ రాష్ట్రంలోని సిద్దిపేట ప్రాంతానికి చెందినవారు. ఆయన విద్యార్థి దశ నుంచే వామపక్ష ఉద్యమాలపై ఆకర్షితుడై,...
Read More...
National  Crime  State News 

లొంగిపోయిన మల్లోజుల - మసక బారిన ఉద్యమ సంస్థ

లొంగిపోయిన మల్లోజుల - మసక బారిన ఉద్యమ సంస్థ ముంబాయి అక్టోబర్ 14: మహారాష్ట్ర గడ్చిరోలి లో  మావోయిస్టు అగ్రనేత మల్లోజుల వేణుగోపాల్ రావు లొంగిపోవడం మావోయిస్ట్ సంస్థకు కోలుకోలేనిదెబ్బగా భావించాలి.గత కొన్ని రోజులుగా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన మావోయిస్టుల నిర్మూలన కార్యక్రమంతో , ఎటు తోచని స్థితిలో మావోయిస్టులలో అంతర్మథనం మొదలయింది. ఎంతో మంది కేంధ్ర కమిటీ సభ్యులు ఆయుధాలు విడిచి లొంగిపోతున్నారు. ఈ...
Read More...
Local News 

గాంధీ మెడికల్ కాలేజీలో ఫెస్ట్–2025 ప్రారంభం

గాంధీ మెడికల్ కాలేజీలో ఫెస్ట్–2025 ప్రారంభం ఫ్యాకల్టీ, పీజీల మద్య టీ20 క్రికెట్ మ్యాచ్ సికింద్రాబాద్, అక్టోబర్ 13 (ప్రజామంటలు) : సికింద్రాబాద్‌గాంధీ మెడికల్‌కాలేజీ ఫెస్ట్‌సోమవారం మెడికల్ స్టూడెట్స్ సందడి మద్య  ప్రారంభమైంది. వైద్యసేవలతో బిజీగా ఉండే వైద్యవిద్యార్థులు, అధ్యాపకులకు ఆటవిడుపు దొరకడంతో కాలేజీ ఆవరణలో పండుగ వాతావరణం నెలకొంది. ఫెస్ట్ లో భాగంగా ఫ్యాకల్టీ, పీజీల జట్ల మధ్య టీ20 క్రికెట్‌మ్యాచ్‌హోరాహోరిగా...
Read More...
Local News 

ప్రజావాణి అర్జీలకు సత్వర పరిష్కార మార్గం చూపాలి వినతులు స్వీకరించిన జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్

ప్రజావాణి అర్జీలకు సత్వర పరిష్కార మార్గం చూపాలి  వినతులు స్వీకరించిన జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ జగిత్యాల అక్టోబర్ 13( ప్రజా మంటలు)               ప్రజావాణి అర్జీల పై సమగ్ర విచారణ జరిపి సమస్యలను పరిష్కరించాలని అధికారులను జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ అదేశించారు. సోమవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుండి ఫిర్యాదులు, వినతులను  అదనపు కలెక్టర్, ఆర్డీఓలతో తో కలిసి స్వీకరించారు.   ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్...
Read More...
Local News 

జగిత్యాల పట్టణ ధరూర్ క్యాంప్ కస్తూర్బా బాలికల పాఠశాలను సందర్శించిన  జగిత్యాల ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ 

జగిత్యాల పట్టణ ధరూర్ క్యాంప్ కస్తూర్బా బాలికల పాఠశాలను సందర్శించిన  జగిత్యాల ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్     జగిత్యాల అక్టోబర్ 13(ప్రజా మంటలు)పట్టణ ధరూర్ క్యాంప్  కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని (KGBV) స్థానిక శాసన సభ్యులు డా.సంజయ్ కుమార్  సందర్శించారు. పాఠశాల బోధన తరగతులు, భోజన వసతులు, స్టోర్ రూమ్ ,వంట గది శుభ్రత, విద్యార్థినుల ఆరోగ్య వివరాల పట్టిక ,హాజరు పట్టికను తదితర అంశాలను పరిశీలించి,విద్యార్థులతో కలిసి భోజనం చేశారు....
Read More...
Local News 

గ్రీవెన్స్ డే – బాధితుల సమస్యల పరిష్కారానికి చర్యలు: జిల్లా ఎస్పీ  అశోక్ కుమార్, 

గ్రీవెన్స్ డే – బాధితుల సమస్యల పరిష్కారానికి చర్యలు: జిల్లా ఎస్పీ  అశోక్ కుమార్,    జగిత్యాల   అక్టోబర్ 13( ప్రజా మంటలు)బాధితులకు సత్వర న్యాయం జరిగేలా చూడాలని అధికారులకు ఆదేశం. ప్రతి సోమవారం ప్రజల సౌకర్యార్థం నిర్వహించే గ్రీవెన్స్ డే లో బాగంగా సోమవారం       జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన 10 మంది అర్జీదారులతో ఎస్పీ   స్వయంగా కలసి వారి సమస్యలను తెలుసుకున్నారు. సంబంధిత...
Read More...
Local News  Crime 

అక్రమంగా పటాకులు నిల్వ – ₹45 లక్షల సొత్తు స్వాధీనం

అక్రమంగా పటాకులు నిల్వ – ₹45 లక్షల సొత్తు స్వాధీనం నిందితుడిని అరెస్ట్ చేసిన టాస్క్ ఫోర్స్, తిరుమలగిరి పోలీసులు సికింద్రాబాద్, అక్టోబర్ 13 (ప్రజామంటలు) : టాస్క్ ఫోర్స్‌నార్త్ జోన్‌పోలీసులు, తిరుమలగిరి పోలీసులతో కలిసి భారీగా పటాకులు నిల్వ ఉంచిన గోదాంపై దాడి చేశారు. ఈ దాడిలో సుమారు రూ.45 లక్షల విలువైన వివిధ రకాల పేలుడు పటాకులను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల...
Read More...
Local News 

నిరుపేద కుటుంబానికి ₹ 11 వేల ఆర్థిక సాయం అందజేత

నిరుపేద కుటుంబానికి ₹ 11 వేల ఆర్థిక సాయం అందజేత జగిత్యాల అక్టోబర్ 13 (ప్రజా మంటలు): పట్టణంలోని దత్తు గిర్ని వద్ద నివసించే మన నిరుపేద పద్మశాలి కుటుంబానికి చెందిన మచ్చ గంగారాం (హోటల్) గత ఐదు దశాబ్దాలుగా టిఫిన్ సెంటర్ (అటుకులు & మిర్చి) నిర్వహిస్తూ తన కుటుంబాన్ని పోషిస్తూ జీవనం సాగించారు. అయితే ఇటీవల అనారోగ్యంతో బాధపడి, ఎనిమిది రోజుల క్రితం ఆయన...
Read More...