తార్నాక లో ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు
హాజరైన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
సికింద్రాబాద్ మే22 (ప్రజామంటలు):
హనుమాన్ జయంతి వేడుకలను తార్నాక లోని గణపతి దేవాలయంలో గురువారం బండ శివారెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన ఆంజనేయుని ప్రత్యేక పూజ లో ముఖ్యఅతిథిగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి , మాజీ మేయర్ బండ కార్తీక చంద్రారెడ్డి పాల్గొన్నారు. ప్రత్యేక పూజలు చేసిన, అనంతరం ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో స్థానికులతో కలిసి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి భోజనం చేశారు. అనంతరం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ... ప్రధాని నరేంద్ర మోడీ తరపున ప్రజలందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలియజేశారు.
భగవంతుడు ఆంజనేయుని ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. హన్మాన్ జయంతి వేడుకలో సిటీ మాజీ మేయర్ బండ కార్తీక రెడ్డి, రాష్ట్ర బిజెపి నాయకులు, మాజీ మంత్రి మర్రి శశిదర్ రెడ్డి,మాజీ ఎమ్మెల్సీ ఎన్ రామచంద్రరావు, బిజెపి రాష్ట్ర నాయకులు బండ చంద్రారెడ్డి, రాష్ట్ర ఓబిసి అధ్యక్షుడు ఆనంద్, గౌతమ్ రావు, జిల్లా బీజేపీ ప్రెసిడెంట్ భరత్ గౌడ్, నాయకులు యాది రెడ్డి, రాజశేఖర్ రెడ్డి, వెంకటరమణి,వీరన్న, ఆయా పార్టీల ముఖ్యమైన నాయకులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
జగిత్యాల మెడికల్ కళాశాలకు ఎన్ఎంసి నోటీస్ జారీ చేయడం రాష్ట్ర ప్రభుత్వానికి సిగ్గుచేటు

చిన్న వయసులోనే సామాజిక బాధ్యతతో వ్యవహరించడం అభినందనీయం

రైతుల భూ సమస్యలను మళ్ళీ కలెక్టర్,తహసీల్దార్లకు ఇవ్వడం సరికాదు

తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ నిర్వహించిన జిల్లా మహాసభ పాల్గొన్న ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ కు పెద్దమ్మ తల్లి బోనాల ఆహ్వాన పత్రిక అందజేత

నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని ఎదగాలి. -ఆర్ఎస్ఎస్ జిల్లా సంఘచాలక్, డాక్టర్ ఆకుతోట శ్రీనివాసరెడ్డి

దశాబ్దం తర్వాత నెరవేరుతున్న పేదల సొంతింటి కల

బహరేన్ లో తొమ్మిది మంది తెలంగాణ వసూల అరెస్ట్

బీజేపీ జగిత్యాల పట్టణ అధ్యక్షులు కొక్కు గంగాధర్

బోనాల జాతర నిధులు పక్కదారి పడుతున్నాయి..

ఉద్యోగ సిబ్బంది కృషితోనే సౌత్ సెంట్రల్ రైల్వేకు దేశంలో గుర్తింపు

గల్ఫ్ అడ్వైజరి బొర్డ్ కు చాంద్ పాషా విజ్ఞప్తి
