బుగ్గారంలో రాజకీయాల కతీతంగా అంబేద్కర్ జయంతి వేడుకలు
హర్షం వ్యక్తం చేసిన బుగ్గారం ప్రజలు
బుగ్గారం ఏప్రిల్ 14:
జగిత్యాల జిల్లా బుగ్గారం మండల కేంద్రంలో సోమ వారం రాజకీయాల కతీతంగా అంబేద్కర్ జయంతి వేడుకలు నిర్వహించారు. అధికారికంగా జరిగిన ఈ అంబేద్కర్ జయంతి వేడుకల కార్యక్రమానికి బుగ్గారం పంచాయతీ సెక్రటరీ అక్బర్ తగిన ఏర్పాట్లు చేశారు. సమ న్వయంతో అన్ని పార్టీల నేతలను ఆయన ఆహ్వానించారు. అంబేద్కర్ యువజన సంఘం ముఖ్య నాయకులు సమన్వయ కర్తలుగా వ్యవహరించారు. కాంగ్రెస్, బిజెపి, బిఆర్ఎస్, తెలంగాణ జన సమితి, డీఎస్పీ తదితర పార్టీల నాయకులు, పుర ప్రముఖులు, మండల ప్రముఖులు పాల్గొని అంబేద్కర్ విగ్రహానికి పూల మాలలు వేసి ఆయన సేవలను కొనియాడారు.
ఈ వేడుకలు ఘనంగా జరగడంతో బుగ్గారం మండల ప్రజలు హర్షం వ్యక్తం చేసారు. ఇటీవలనే బిసి రిజర్వేషన్ల శాతాన్ని 42 శాతానికి పెంచడం, అంబేద్కర్ జయంతి సందర్భంగా ఎస్సీ వర్గీకరణ జీవో ను విడుదల చేయడం పట్ల, సభికులు, ప్రజలు హర్షం వ్యక్తం చేసారు.
సిఎం రేవంత్ రెడ్డి, అంబేద్కర్ ల చిత్ర పటాలకు పాలాభిషేకం చేశారు. ముందుగా ఒక్కొక్కరుగా అంబెడ్కర్ విగ్రహానికి పూల మాలలు వేశారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ప్రముఖులు మాట్లాడారు. అంబేద్కర్ ఆశయాలను కొనసాగిద్దాం అంటూ నినాదాలు చేశారు. ఏర్పాట్లు ఘనంగా చేసిన పంచాయతీ కార్యదర్శి అక్బర్ సేవలను గుర్తించి రాజకీయాలకతీతంగా సభికులు అందరూ కలిసి శాలువాతో ఘనంగా అక్బర్ ను సత్కరించారు.
ఈ కార్యక్రమంలో డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ అభిమానులు, వివిధ పార్టీల నేతలు, అంబేద్కర్ యువజన సంఘం ప్రతినిధులు, వివిధ గ్రామాల ప్రజలైన చుక్క గంగారెడ్డి, రాయిల్ల రవి కుమార్, కండ్లె మదన్, వేముల సుభాష్, నగునూరి నర్సాగౌడ్, సిగిరి అంజిత్,
నక్క జితేందర్, నక్క చెంద్రమౌళి, దూడ పోచారాజు, డా.నక్క రాజు, దూడ జీవన్, ఎండీ రహమాన్, పొన్నం సత్తయ్య గౌడ్, మూల శ్రీనివాస్ గౌడ్, జంగ శ్రీనివాస్, తాడేపు లింగన్న, కోడిమ్యాల రాజన్న, నక్క సాగర్, లతో పాటు యువకులు, గ్రామ పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
గాంధీ టెర్రస్ లపై రెడ్ క్రాస్ సింబల్ ల ఏర్పాటు..

అమరవీరుడు మురళి నాయక్ ఆత్మ శాంతి చేకూర్చాలని కొవ్వొత్తుల ర్యాలీ

రత్నాకర్ రావు సేవలు నేటి తరానికి స్ఫూర్తిదాయకం....ఎమ్మేల్యే డా.సంజయ్

ఆపరేషన్ సింధూర్ కు మద్దతుగా బి.ఆర్.ఎస్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు

కరెంటు షాక్ తో మరణించిన కుటుంబానికి ప్రభుత్వం ద్వారా 5 లక్షల ఆర్థిక సహాయం అందజేసిన జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

భారత రక్షక దళాలకు మద్దతుగా పాత్రికేయుల సంఘీభావ ర్యాలీ

శ్రీ రాధా రుక్మిణి సత్యభామ సమేత మధన వేణుగోపాలస్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా కళ్యాణ వేడుకలు

వాసవి మాత ఆలయంలో ఘనంగా గురువారాల ఏకాదశి ఉద్యాపన ఉత్సవము

సీఎం సహాయ నిధి నిరుపేదల పాలిట వరం 8లక్షల ఎల్ ఓ సి అందజేసిన జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

శ్రీ సూర్య ధనవంతరి ఆలయంలో బ్రహ్మోత్సవాలలో భాగంగా కుంకుమార్చనలు పాల్గొన్న బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు డా భోగ శ్రావణి

ఆపరేషన్ సింధూర్ విజయవంతం కావాలని, సైనికులకు మనోధైర్యం కల్పించాలని దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో పూజలు

జగిత్యాల ప్రధాన కూడల్లో ఉన్నటువంటి అక్రమ షెడ్లను తొలగించాలి. -విశ్వహిందూ పరిషత్ నాయకులు
