త్రాగునీటి సౌకర్యాలపై ప్రత్యేక దృష్టి - ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్
(రామ కిష్టయ్య సంగన భట్ల)
ధర్మపురి ఎప్రిల్ 11:
ప్రత్యేక దృష్టి సారించి, తగు జాగ్రత్తలు తీసుకో గలమని రాష్ట్ర ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ స్పష్టం చేశారు. గురువారం ధర్మపురి మున్సిపాలిటీలో ప్రభుత్వ విప్, స్థానిక ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ నూతన వాటర్ ట్యాంకర్లను ప్రారంభించి కమలాపూర్ ఇందిరమ్మ కాలనిలో నిర్మాణంలో ఉన్న బస్తీ దవాఖాన, చిల్డ్రన్స్ పార్కులను పరిశీలించి, అమృత్ నల్లా పైప్ లైన్ పనులను ప్రారంభించి జరుగుతున్న పనుల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.
అనంతరం మీడియా ప్రతినిధులతో లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ...
తలపున గోదావరి ఉన్నా , గత ప్రభుత్వంలో ధర్మపురి మున్సిపాలిటీలో మంచినీటి సరఫరాకు ఎక్కడో ఉన్న డబ్బా నుండి పైప్ లైన్ ద్వారా నీటిని సరఫరా చేయడం జరిగిందని, కానీ తాను గెలిచిన వెంటనే జిల్లా కలెక్టర్, సంబంధిత అధికారులతో ధర్మపురి మున్సిపల్ లో త్రాగునీటి శాశ్వత పరిష్కారం కోసం సమావేశమై చర్చించడం జరిగిందని వివరించారు. డబ్బాలో మోటార్ల నిర్వహణ సరిగా లేక నీటి సరఫరా ఆగిపోతే మొదట ఇబ్బంది జరిగేది ధర్మపురికే, కనుక దాని నిర్వహణకు కొత్త మోటార్ల కొనుగోలుకు కోటి రూపాయల ప్రపోజల్స్ సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపండం జరిగిందని తెలిపారు.
మాజీ మంత్రివర్యులు రత్నాకర్ రావు బోలి చెరువు వద్ద ఫిల్టర్ బెడ్ ఏర్పాటు చేసి ధర్మపురి ప్రాంతానికి నీటిని ఇచ్చే ఆలోచన చేసినప్పటికీ, గత పాలకులు మిషన్ భగీరథ పథకం పేరున దాన్ని పక్కకు పెట్టడం జరిగిందని, ధర్మపురి మున్సిపల్ లో గాని ధర్మపురి నియోజకవర్గంలో గానీ త్రాగు నీటికి ఎక్కడ ఇబ్బంది కాకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటామని, దాని కొరకు ప్రభుత్వం నుండి ఎటువంటి సహాయ సహకారాలు అవసరం ఉన్న అందిస్తామని తెలిపారు. కార్యక్రమంలో అధికారులు మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
గొల్లపల్లి మండల కేంద్రంలో సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాల భవనం

పాకిస్తాన్ పై భారత దాడి - బన్సీలాల్ పేట లో బీజేపీ సంబరాలు..

క్రీడా మైదానం కొరకు ప్రభుత్వ భూమిని పరిశీలించిన ఆర్డీవో మధుసూదన్
.jpg)
సింధూరం తో పులకరించిన పెహల్గాం పుడమి

సైలెన్సర్లు మార్పడి చేసి ప్రజలకు ఇబ్బంది కలిగిస్తే చట్టపరమైన చర్యలు: జిల్లా ఎస్పి అశోక్ కుమార్

వాసవి మాత జయంతిని పురస్కరించుకుని మాతలచే సామూహిక కుంకుమార్చన ,పల్లకి సేవ శోభ యాత్ర

విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఉచిత కుట్టు శిక్షణ శిబిరం ప్రారంభం

ఘనంగా వాసవి మాత జయంతి ఉత్సవాలు*🚩🚩🚩🚩

వ్యభిచారం చేస్తూ పట్టుబడ్డ ఉగాండా యువతి
.jpeg)
మాక్ డ్రిల్ విజయవంతం - అత్యవసర పరిస్థితుల్లో ఎస్కేప్ కావడంపై అవెర్నెస్

సోలార్ పవర్ స్కీం ను వినియోగించుకోండి.. - జిల్లా బీజేపీ ప్రెసిడెంట్ భరత్ గౌడ్

పేకాట స్థావరంపై సిసి ఎస్ పోలీసుల దాడి *పోలీసుల అదుపులో 6 గురు, 26060/- రూపాయలు స్వాదీనం
