మాదిగలను అవమానించిన మంత్రి పొన్నం ను మంత్రి పదవి నుంచి తొలగించాలి ఎమ్మార్పీఎస్ డిమాండ్.
జిల్లా కేంద్రంలో మంత్రి పొన్నం ప్రభాకర్ దిష్టిబొమ్మ దహనం
జగిత్యాల అక్టోబర్ 07 (ప్రజా మంటలు):
మాదిగల ఆత్మగౌరవాన్ని అవహేళన చేసిన మంత్రి పొన్నం*
*మాదిగలకు వేను వెంటనే క్షమాపణ చెప్పాలని,మాదిగలను అవమానించిన మంత్రి పొన్నం ప్రభాకర్ ను మంత్రి పదవి నుండి తొలగించాలని ఎమ్మార్పీఎస్ డిమాండ్ చేసింది.
జగిత్యాల జిల్లా కేంద్రంలోనీ తహసిల్ చౌరస్తాలోని అంబేద్కర్ గారి విగ్రహం వద్ద ఎమ్మార్పీఎస్, ఆధ్వర్యంలో రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ఆదివారం రోజున హైదరాబాద్ లోని "జూబ్లీహిల్స్" లో జరిగిన పాత్రికేయుల సమావేశం లో మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్, మాదిగల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా సహచర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ను కించపరుస్తూ మాట్లాడడాన్ని ఖండిస్తూ మందకృష్ణ మాదిగ గారి ఆదేశాల మేరకు పొన్నం ప్రభాకర్ దిష్టిబొమ్మను దహనం చేశామన్నారు.
కాలయాపన చేయకుండా వెంటనే అడ్లూరి లక్ష్మణ్ కు,అలాగే మాదిగలకు క్షమాపణ చెప్పాలని, మందకృష్ణ మాదిగ నాయకత్వంలో మరింత ఉద్యమాన్ని చేస్తామని హెచ్చరించారు
ఈ కార్యక్రమంలో ఎంఎస్పీ జిల్లా అధ్యక్షులు దూమల గంగారం ఎమ్మార్పీస్, జిల్లా అధ్యక్షులు సురుగు శ్రీనివాస్,ఎంఎస్పీ జిల్లా అధికార ప్రతినిధి బెజ్జంకి సతీష్, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్, చెట్టుపల్లి లక్ష్మణ్, మాజీ ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కమిటీ మాజీ సభ్యులు దుమల రాజ్ కుమార్ హుమెన్ రైట్స్ రాష్ట్ర నాయకులు నక్క గంగారం దుమల జిల్లా కార్యదర్శి సంగేపు ముత్తు, జిల్లా నాయకులు నక్క సతీష్,దుమల గంగాధర్, , నియోజకవర్గ ఇన్చార్జ్ బొల్లారపూ దివాకర్, కో ఇంచార్జి పోడేటి సునీల్, ధర్మపురి నియోజకవర్గ ఇన్చార్జి చిర్ర లక్ష్మణ్, అర్బన్ మండల అధ్యక్షుడు బాబురావు గంగారం, బాపురపు వంశీ,ఎలగందుల మోహన్, లింగంపల్లి నరేష్, తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
బీసీ రిజర్వేషన్ల కార్యరూపానికి అంతా ఒకటవ్వాలి

రైల్ నిలయం వద్ద రైల్వే పింఛనర్ల ఆందోళన

రాష్ర్టంలో వేద పాఠశాలల అభివృద్దికి కృషి చేస్తాం - రాష్ర్ట దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ

గాంధీలో ఉచిత వాటర్ ప్యూరిఫైడ్ సెంటర్స్ ప్రారంభం

మెటా ఫండ్ నిందితుల అరెస్ట్ ల్యాప్ టాప్, ఏటీఎం ,క్రెడిట్ కార్డ్స్ పాస్బుక్కుల స్వాధీనం_ ఎస్పీ అశోక్ కుమార్

కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తా ఆదిలాబాద్ ,మంచిర్యాల టిపిసిసి ఆర్గనైజర్ , అబ్జర్వర్ గా అడువాల జ్యోతి
.jpg)
సైబర్ నేరాలపై ఆధునిక చట్టాలపై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలి _ పట్టణ సిఐ కరుణాకర్

మారియా కొరినా మచడో: 2025 నోబెల్ శాంతి బహుమతి

తీన్మార్ మల్లన్నకు మద్దతు పలికిన ప్రజాసేన పార్టీ అధ్యక్షులు ఆకుల హనుమాండ్లు నల్ల బ్యాడ్జీలతో జాతీయ రహదారిపై నిరసన... అడ్డుకున్న పోలీసులు

మున్సిపల్ స్టాండింగ్ కౌన్సిల్ మెంబర్ గా సిరిపురం మహేంద్ర నాథ్

ప్రతి సభ్యుడు యూనియన్ నిబంధనలకు లోబడి నడుచుకోవాలి ఐజేయు అనుబంధ ప్రెస్ క్లబ్ ల ఏర్పాటుకు తోడ్పడాలి

మానసిక ఆరోగ్యం తోనే సమాజం అభివృద్ధి -సీనియర్ సివిల్ జడ్జి డి. నాగేశ్వర్ రావు
