దళితలు అంటే అందరికీ చులకనే - మాజీ మంత్రి కొప్పుల
దళితులు ఏ స్థాయిలో ఉన్న వివక్ష తప్పడం లేదు- మాజీ మంత్రి కొప్పుల
(అంకం భూమయ్య)
గొల్లపల్లి అక్టోబర్ 07 (ప్రజా మంటలు)
దళితులు సమాజంలో ఏ స్థాయికి ఎదిగినా కూడా వారిని తక్కువగానే చూస్తున్నారు.ప్రపంచ మేధావి, భారత దేశానికి రాజ్యాంగాన్ని అందించిన డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ కాలం నుంచి ఇప్పటిదాకా దళితులపై వివక్షత కొనసాగుతూనే ఉందని, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ దళితులపై జరుగుతున్న వివక్షతపై విచారం వ్యక్తం చేశారు.
సమాజంలో కులవివక్ష అంతరించడానికి ఆర్థిక మరియు సామాజిక సమానత్వం అవసరం ఉందన్నారుదళితులు ప్రభుత్వాలు, ఉద్యోగవర్గాలు, ఉన్నతాధికారులు, జాతీయ స్థాయిలో పనిచేస్తున్న అనేక మంది మేధావులపై కూడా వివక్ష కనిపించడం బాధాకరం అని అన్నారు.
బహుజన వాదం పేరుతో బిసి, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలు తమ హక్కుల కోసం ఏకతాటిపైకి పోరాటం చేస్తున్నారని గుర్తు చేశారు.సుప్రీం కోర్ట్ చీఫ్ జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్పై జరిగిన దాడి, రాష్ట్ర దళిత మంత్రి పై మరో మంత్రి చేసిన అనుచిత వ్యాఖ్యలు, ఇవి జాతిపై జరిగినటువంటి అవమానాలుగా భావిస్తున్నట్లు మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు.
ఇలాంటి వ్యాఖ్యలు, దాడులపై వెంటనే బేషరతుగా క్షమాపణలు చెప్పాలని, వాటిని ఏ సభ్యసమాజం కూడా సమర్థించలేదని మాజీ మంత్రి కొప్పుల ఆగ్రహం వ్యక్తం చేశారు దళితులపై కొనసాగుతున్న అసమానతలు తక్షణమే ఆగి, సమానత్వ భావన పెంపొందే సమాజం ఏర్పడాలని ఆయన పిలుపునిచ్చారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
పెట్టుబడిదారుల దృష్టి యుఎస్ వెలుపలకి — ‘పూర్వ-యుఎస్’ ఫండ్లలో రికార్డు ప్రవాహాలు
.jpg)
శబరిమల బంగారు పూత వివాదం — 1999లోనే కప్పారన్న మాజీ కమిషనర్
.jpeg)
రెట్టింపైన బంగారు గనుల కంపెనీ షేర్లు
.jpg)
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

చిన్న వయస్సు నుండే పిల్లలకు లైంగిక విద్యను అందించాలి: SC
.jpg)
మన దేశ సనాతన ధర్మం, సంప్రదాయాలు ఎంతో గొప్పవి -రాష్ర్ట గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ

గాంధీలో ముగిసిన బీసీఎంఈ మూడు రోజుల శిక్షణ

ఢిల్లీ పబ్లిక్ స్కూల్ బస్సులో అగ్ని ప్రమాదం, తప్పిన పెనుముప్పు

బెస్ట్ అవైలబుల్ స్కూల్ విద్యార్థుల తల్లిదండ్రులు రాస్తారోకో నిర్వహించారు.

గాంధీ ఆసుపత్రిలో ప్రపంచ దృష్టి దినోత్సవం

పార్టీ ఎవరికి B ఫాం ఇస్తే,, వారినే గెలిపించి మాజీ మంత్రి జీవన్ రెడ్డి

లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత నేత్ర శిబిరం
