ఆరునెలల పాటు గోదావరి ఒడిలో ఉండే శివయ్య.. ధ్వజ స్తంభం లేని, శ్రీరాముడు సైకతం తో చేసిన లింగమే ఈ శివాలయం 

On
ఆరునెలల పాటు గోదావరి ఒడిలో ఉండే శివయ్య..  ధ్వజ స్తంభం లేని, శ్రీరాముడు సైకతం తో చేసిన లింగమే ఈ శివాలయం 


నందిపేట సెప్టెంబర్ 12 (ప్రజా మంటలు)
 పవిత్ర భారతదేశంలో ఎన్నో శివాలయాలు ఉన్నాయి. అందులో కొన్నింటికి మాత్రమే చారిత్రక నేపథ్యం ఉందని రాయికల్ పట్టణంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల (బాలురు) తెలుగు పండితులు చెరుకు మహేశ్వర శర్మ తెలిపారు.

శతాబ్దాల చరిత్రను తమలో దాచుకున్న కొన్ని ఆలయాల్లో అడుగడుగునా వింతలు విశేషాలు నేటికీ మనల్ని ఆశ్చర్యపరుస్తూనే ఉంటాయని చెప్పారు.
అలాంటి అద్భుతమైన శివాలయం నిజామాబాద్ జిల్లా నందిపేట మండలం ఉమ్మెడ గ్రామంలో ఉందని అన్నారు. అక్కడ కొలువైన శివుడు ఏడాదిలో ఆరు నెలలు మాత్రమే భక్తులకు దర్శనమిచ్చి మిగతా ఆరు నెలలు గోదారమ్మ ఒడిలోకి చేరిపోతాడు అక్కడ గర్భగుడికి ద్వారం ఉండదు ఆలయంలో ధ్వజస్తంభం కనిపించదు .ఇలాంటి ఎన్నో ప్రత్యేకతలు ఉమ్మెడ ఉమా మహేశ్వరుడి ఆలయ సన్నిధిలో భక్తులను ఆశ్చర్య పరుస్తాయి.
చుట్టూ విశాలమైన నీలాకాశం.. కనుచూపు మేరలో గోదావరి తీరం.. ఆధ్యాత్మిక వెలుగులు ప్రసరించే ప్రాంతం..

కోదండరాముడు నడయాడిన పవిత్ర ప్రదేశం.. సైకత లింగం కొలువుదీరిన పరమ పవిత్ర పుణ్యక్షేత్రం.. ఉమా మహేశ్వరుడి సన్నిధి.
 ఉమామహేశ్వర పుణ్యక్షేత్రానికి వెయ్యేళ్ల చరిత్ర ఉందని స్థానికులు తెలిపారు. కాశీలో ఉన్నట్లుగానే.. ఇక్కడ కొలువైన శివలింగంపై త్రినేత్రం కనిపిస్తుందని చెబుతారు. కల్యాణ చాణక్యులు ఈ ఆలయాన్ని నిర్మించారని శాసనాలు చెబుతున్నాయి. ఆలయ మండపానికి మూడు ముఖ ద్వారాలు ఉంటాయి. సాక్షాత్తు శ్రీరాముడు చేసిన సైకత లింగమే ఇక్కడ కొలువు దీరిందని పురాణాలు చెబుతున్నాయి.

ఈ ఆలయంలో ప్రత్యేతక ఏంటంటే గర్భగుడికి తలుపులు ఉండవు. సాధారణంగా మనం ఏ ఆలయానికి వెళ్లిన ముందుగా ధ్వజస్తంభం కనిపిస్తుంది. కానీ ఉమామహేశ్వర ఆలయంలో ధ్వజస్తంభం ఉండదు.
కేవలం ఆరు నెలలు మాత్రమే ఉమా మహేశ్వరస్వామి దర్శనం భక్తులకు కలుగుతుంది. మిగతా ఆరు నెలలు స్వామి గోదావరి ఒడిలోకి చేరిపోతారు. ఏటా గోదావరికి వరదలు వచ్చినప్పుడల్లా.. ఆలయం పూర్తిగా నీట మునిగిపోతుంది. ఎగువ మహారాష్ట్రలో భారీ వర్షాలు కురిసినా.. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరుకున్నా… ఇక్కడి శివాలయం గోదావరి ఒడిలోకి వెళ్లిపోతుంది. సుమారు 6 నెలల పాటు పూజలు, ధూపదీప నైవేధ్యాలు పూర్తిగా నిలిచిపోతాయి. గోదావరి జోరు తగ్గిన తర్వాత మళ్లీ ఆలయాన్ని శుద్ధి చేసి నిత్య పూజలు చేస్తుంటారు.

ఉమ్మెడ లో కొలువైన ఉమా మహేశ్వరుడి ని కోరిన కోర్కెలు తీర్చే స్వామిగా భక్తులు నమ్ముతారు. ఏడాదిలో ఆరు నెలలు మాత్రమే స్వామి దర్శనానికి అవకాశం ఉండడంతో ఎక్కడెక్కడి నుంచో ఈ ఆలయానికి తరలివస్తుంటారు. ఇక శివరాత్రి, కార్తీకమాసాల్లో ఆలయం వేలాది భక్తజనులతో రద్దీగా మారిపోతుంది.
ప్రతిఏడాది దాదాపుగా ఆరు నెలల పాటు నీట్లోనే ఉన్నా.. ఆలయం మాత్రం చెక్కు చెదరదు.సాధారణంగా అంతకాలం పాటు నీట్లో ఉంటే ఎలాంటి నిర్మాణమైనా కొన్నేళ్లకు శిథిలావస్థకు చేరుకుంటుంది.
కానీ ఉమా మహేశ్వరుడి ఆలయం విషయంలో అలాంటిదేమీ జరగలేదు.

దాదాపు వెయ్యేళ్ల కింద నిర్మాణం జరిగినా… ఇప్పటికీ అంతే బలంగా ఉంది.ఇప్పుడు నీట మునిగినందున మరో ఆరు నెలల వరకు స్వామి దర్శనం దొరకదు.  శ్రీరాంసాగర్ ప్రాజెక్టు 1075 అడుగులకు చేరుకోగానే ఆలయంలోకి బ్యాక్ వాటర్ వస్తుంది. 1085 అడుగులకు చేరుకోగానే శ్రీ ఉమ మహేశ్వర ఆలయం గర్భగుడి పూర్తిగా నీటిలో మునిగిపోతుంది. ప్రాజెక్టు నీటి మట్టం 1070 అడుగులకు చేరుకోనేంత వరకు  ఆలయం అలాగే ఉంటుంది. ప్రతి సంవత్సరం మహాశివరాత్రి ఉత్సవాలకు ఉమా మహేశ్వరుడు ప్రజలకు దర్శనం ఇస్తారని ఆలయ ప్రధాన అర్చకులు తెలిపారు.
           **.   
చెరుకు మహేశ్వర శర్మ తెలుగు పండితులు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బాలురు రాయికల్, జగిత్యాల

Tags

More News...

Local News 

అంగరంగ వైభవంగా కొనసాగిన వామన పురాణం 

అంగరంగ వైభవంగా కొనసాగిన వామన పురాణం  జగిత్యాల సెప్టెంబర్ 12(ప్రజా మంటలు)  జిల్లా కేంద్రంలోని ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం గీత భవన్ లో అంగరంగ వైభవంగా జరుగుతున్న అష్టాదశ పురాణ మహా యజ్ఞం శుక్రవారం  14వ రోజుకు చేరింది. వామన పురాణంలోని ప్రహ్లాదునితో వామనుని యుద్ధం ,సతిదేవి జన్మ వృత్తాంతం  దక్షయజ్ఞం, ఘట్టాలు ఆచార్యులు కండ్లకు కట్టినట్టుగా వివరించారు. వామన పురాణం...
Read More...
Local News 

అంగన్వాడీ కేంద్రంలో, సంచార జాతుల వారి మధ్యలో  స్కై ఫౌండేషన్ వేడుకలు 

అంగన్వాడీ కేంద్రంలో, సంచార జాతుల వారి మధ్యలో  స్కై ఫౌండేషన్ వేడుకలు  సికింద్రాబాద్, సెప్టెంబర్ 12 (ప్రజామంటలు): స్కై ఫౌండేషన్ సంస్థ స్థాపించి పదమూడు సంవత్సరాలు దాటినా శుభ సందర్భంగా శుక్రవారం  అంగన్వాడీ కేంద్రంలో వేడుకలు నిర్వహించారు.  చిన్నారులతో కేక్ కట్ చేయించి, రకరకాల తినుబండారాలు,నోట్ పుస్తకాలు, పలకలు, బలపాలు, ఇతర స్టేషనరీ వస్తువులు, బహుమతులు అందించారు, అలానే రోడ్ల పక్కన జీవనం సాగించే సంచారజాతుల వారితో కేక్...
Read More...
Local News 

మైనార్టీలకు కాంగ్రెస్ పార్టీ సదా అండగా ఉంటుంది - రాష్ర్ట మంత్రి వివేక్ వెంకటస్వామి

మైనార్టీలకు కాంగ్రెస్ పార్టీ సదా అండగా ఉంటుంది - రాష్ర్ట మంత్రి వివేక్ వెంకటస్వామి వైఎంసీఏ లో చిన్నప్పుడు క్రికెట్, టేబుల్ టెన్నిస్ ఆడేవాన్ని     సికింద్రాబాద్ వైఎంసీఏ లో మంత్రి అడ్లూరి తో కలసి ప్రారంబోత్సవాలు సికింద్రాబాద్, సెప్టెంబర్ 12 (ప్రజామంటలు) : మైనార్టీలకు కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ అండగా ఉంటుందని, అలాగే మైనార్టీలు కూడ ఎప్పుడూ  పార్టీ వెంట నడుస్తారని మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. శుక్రవారం సికింద్రాబాద్ వైఎంసీఏలో...
Read More...
Local News 

మాజీ మంత్రి హరీష్ రావును కలిసిన మాజీ మంత్రి రాజేశం గౌడ్ 

మాజీ మంత్రి హరీష్ రావును కలిసిన మాజీ మంత్రి రాజేశం గౌడ్  హైదరాబాద్, సెప్టెంబర్ 12 (ప్రజా మంటలు): మాజీ మంత్రి, తెలంగాణ తొలి ఆర్థిక సంఘం చైర్మన్ జి. రాజేశం గౌడ్ ఈరోజు, మాజీ మంత్రి, సిద్ధిపేట శాసనసభ్యులు హరీష్ రావును వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సమావేశంలో  రాజేశం గౌడ్, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు  ఆరోగ్య పరిస్థితిపై హరీష్ రావు...
Read More...
Local News 

సైన్స్ ల్యాబ్ నిర్మూణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

సైన్స్ ల్యాబ్ నిర్మూణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్    జగిత్యాల రూరల్ సెప్టెంబర్ 12( ప్రజా మంటలు)మండలంలోని చలిగల్ గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 14 లక్షలతో నిర్మించనున్న సైన్స్ ల్యాబ్ నిర్మాణానికి శంకుస్థాపన చేసి, ఎస్సీ సబ్ ప్లాన్ నిధులు 19 లక్షలతో ఎస్సీ కాలనీలో సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన జగిత్యాల శాసనసభ్యులు డా సంజయ్ కుమార్...
Read More...
Local News  State News 

సింగరేణి ఎన్నికల్లో గెలవబోయేది మనమే - కల్వకుంట్ల కవిత

సింగరేణి ఎన్నికల్లో గెలవబోయేది మనమే - కల్వకుంట్ల కవిత హెచ్ఎంఎస్ లో సభ్వత్యాలు పెంచాలి.  ట్రైనింగ్ ప్రొగ్రామ్స్ పెట్టుకుందాం హెచ్ఎంఎస్, జాగృతి రెండు కళ్లలా పనిచేస్తాయి. హైదరాబాద్ సెప్టెంబర్ 12 (ప్రజా మంటలు): బంజారాహిల్స్ లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో హెచ్ఎంఎస్ – సింగరేణి జాగృతి సంయుక్త సమావేశం(ఏబీ సింగరేణి మైనర్స్ అండ్ ఇంజనీరింగ్ వర్కర్స్ యూనియన్ కేంద్ర కార్యవర్గ సమావేశం హెచ్ఎంఎస్ గౌరవ అధ్యక్షురాలు...
Read More...
Local News 

జగిత్యాల జిల్లా పెగడపల్లి ఎమ్మార్వో రవీందర్ పై కేసు నమోదు

జగిత్యాల జిల్లా పెగడపల్లి ఎమ్మార్వో రవీందర్ పై కేసు నమోదు .జగిత్యాల సెప్టెంబర్ 12 ( ప్రజా మంటలు)  జగిత్యాల జిల్లా పెగడపల్లి ఎమ్మార్వో రవీందర్ తోటి మహిళా ఉద్యోగి పట్ల అసభ్యంగా ప్రవర్తించడంతో పోలీసులకు బాధితురాలి ఫిర్యాదు.  విధి నిర్వహణ లో కలిసి పని చేసిన ఓ మహిళా ఉద్యోగికి వాట్సాప్ లో అసభ్యకరంగా మెసేజ్ లో చేయడం, కాల్స్ చేసి వేధించిన ఎమ్మార్వో...
Read More...
Local News 

గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్ గా ప్రొ. వాణి బాధ్యతల స్వీకరణ

గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్ గా ప్రొ. వాణి బాధ్యతల స్వీకరణ శుభాకాంక్షలు తెలిపిన టీఎన్జీవో నేతలు సికింద్రాబాద్, సెప్టెంబర్ 12 ( ప్రజామంటలు ): సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రి నూతన సూపరింటెండెంట్ గా అడిషనల్ డీఎంఈ ప్రొఫెసర్ డాక్టర్ వాణి శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా సూపరింటెండెంట్ డా.వాణిని ప్రెసిడెంట్ ప్రభాకర్ ఆధ్వర్యంలో టీఎన్జీవో గాంధీ యూనిట్ నాయకులు శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా...
Read More...
Local News 

రాజీ మార్గమే...రాచ మార్గం...లోక్ అదాలత్ ఈనెల 13న 

రాజీ మార్గమే...రాచ మార్గం...లోక్ అదాలత్ ఈనెల 13న  లోక్ అదాలత్ ను గొల్లపల్లి మండల ప్రజలు సద్వినియోగం చేసుకోండి - ఎస్ఐ, కృష్ణ సాగర్ రెడ్డి (అంకం భూమయ్య)  గొల్లపల్లి సెప్టెంబర్ 12 (ప్రజా మంటలు):  కేసుల్లో రాజీ మార్గం అనుసరిస్తే రాచ మార్గమేనని చెబుతూఈనెల 13న జరగనున్న జాతీయ  లోక్ అదాలతును సద్వినియోగం చేసుకోవాలని  గొల్లపల్లి ఎస్ఐ , కృష్ణ సాగర్...
Read More...
Local News 

మేడిపల్లి పోలీస్ స్టేషన్ ను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ  అశోక్ కుమార్ 

మేడిపల్లి పోలీస్ స్టేషన్ ను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ  అశోక్ కుమార్  మేడిపల్లి సెప్టెంబర్ 12( ప్రజా మంటలు)విజిబుల్ పోలీసింగ్ పై ప్రత్యేక దృష్టి సారించాలి సైబర్ నేరాల నివారణ పై ప్రజలకు అవగాహన కల్పించాలి   మేడిపల్లి పోలీస్ స్టేషన్ ను జిల్లా ఎస్పి  సందర్శించి స్టేషన్ లో నిర్వహిస్తున్న రికార్డులు, కేసు డైరీలను, రిజిష్టర్ లను పరిశీలించి, రికార్డులన్నీ సక్రమంగా నిర్వహిస్తున్నారా లేదా అని చెక్...
Read More...
Local News 

ఎన్ సి డియక్స్ నుంచి పసుపు ను తొలగించాలి జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి ని  కోరిన పసుపు వ్యాపారులు

ఎన్ సి డియక్స్ నుంచి పసుపు ను తొలగించాలి  జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి ని  కోరిన పసుపు వ్యాపారులు నిజాంబాద్ సెప్టెంబర్ 12(ప్రజా మంటలు) కమలాకర్ జర్నలిస్ట్ మెట్పల్లి  ఎన్ సి డిఎక్స్ ఆన్లైన్ ట్రేడింగ్ పసుపు పంట క్రయా విక్రయాలను  తొలగించాలని కోరుతు జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి నిశుక్రవారం  నిజామాబాద్ కార్యలయం లో హింగోలి, నాందేడ్,నిజామాబాద్,మెట్ పల్లి పసుపు వ్యాపారులు కలిసి ఆన్లైన్ ట్రేడింగ్ తదితర అంశాలపై జాతీయ పసుపు...
Read More...
Local News 

హరీష్ కుటుంబానికి విద్యుత్ శాఖ అండగా నిలవాలి  కోరుట్ల నియోజకవర్గ ఇన్చార్జి జువ్వడి నర్సింగరావు 

హరీష్ కుటుంబానికి విద్యుత్ శాఖ అండగా నిలవాలి   కోరుట్ల నియోజకవర్గ ఇన్చార్జి జువ్వడి నర్సింగరావు  మెట్పల్లి సెప్టెంబర్ 12(ప్రజా మంటలు) హరీష్ కుటుంబానికి విద్యుత్ శాఖ అండగా నిలవాలని జగిత్యాల జిల్లా  కోరుట్ల నియోజకవర్గ ఇన్చార్జి జువ్వడి నర్సింగరావు అన్నారు. శుక్రవారం  మెట్ పల్లి పట్టణంలో 15 వార్డులో ఇటీవల ఇబ్రహింపట్నం మండలం లోని బర్దిపూర్ గ్రామంలో విధ్యుత్ శాఖ తాత్కాలిక ఉద్యోగి గా పని చేస్తున్న సాంబార్ హరీష్ స్దంబ...
Read More...