తక్షణమే మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి దళారి వ్యవస్థ నుండి రైతులను కాపాడాలి - జిల్లా తొలి జడ్పీ చైర్ పర్సన్ దావ వసంత సురేష్
రాయికల్ అక్టోబర్ 8 (ప్రజా మంటలు)
పట్టణం లోని బి ఆర్ ఎస్ నాయకులతో కలిసి మీడియా సమావేశంలో పాల్గొన్న జిల్లా తొలి జడ్పీ చైర్ పర్సన్ దావ వసంత సురేష్
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ...
ఆరుగాలం రైతు కష్టపడి పండించిన మొక్క జొన్న పంటను కొనుగోలు చేయకుండ, కొనుగోలు సెంటర్లు ప్రారంభించకుండా రైతులను ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇబ్బంది పెడుతుంది, కనీసం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసే స్థితిలో ఈ ప్రభుత్వం లేదా...? అని ప్రశ్నించారు.
ఆనాడు రైతు బాంధవుడు కేసీఆర్ సకాలంలో కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి,మద్దతు ధర కల్పించి రైతుకు నష్టం కాకుండా దళారి వ్యవస్థ లేకుండా చివరి గింజ వరకు కొనుగోలు చేసిన ఘనత కేసిఆర్దే అన్నారు.
అకాల వర్షాలకు తడిచిన మొక్కజొన్న పంటను కూడా ఎలాంటి నిబంధనలు లేకుండా కొనుగోలు చేయాలన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం సకాలంలో కొనుగోలు కేంద్రాలు ప్రారంభించకపోవడంతో దళారులకు రైతులు అమ్మడం తో రైతుకు ఒక క్వింటాల్కు 600 నుండి 800 రూపాయల నష్టంతో అమ్ముకుంటున్నాడు. కాబట్టి దీనికి ప్రభుత్వం పూర్తి బాధ్యత వహించి ఈ నష్టాన్ని కూడా రైతులకు చెల్లించాలని డిమాండ్ చేశారు.
ఆనాడు ఓట్ల కోసం అన్ని పంటలకు మద్దతు ధర మరియు బోనస్ కల్పిస్తానని బోగస్ మాటలు చెప్పి గద్దె ఎక్కిన తర్వాత రైతుకు మొండి చేయి చూపిస్తున్నారు.
వంద రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేస్తా అని చెప్పి 22 నెలలైనా కూడా ఇప్పటికే ఒక్క హామీ కూడా పూర్తిగా అమలు చేయడంలో విఫలమైందని అన్నారు.
ఉచిత బస్సు పథకం పెట్టి బస్సుల సంఖ్య తగ్గించి చార్జీలు పెంచి సామాన్య ప్రజల నడ్డి విరుస్తుంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అని అన్నారు.
రైతులతో పాటు అన్ని వర్గాల ప్రజలను ఈ ప్రభుత్వం మోసం చేసింది స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ ప్రభుత్వానికి రైతులతో పాటు ప్రజలు తగిన గుణపాఠం చెప్తారని అన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం పై ప్రజలందరు తీవ్రంగా విసిగి పోయినారు మళ్ళీ కేసీఆర్ పాలన కావాలని తెలంగాణ ప్రజలు అంటున్నారు.
జగిత్యాల నియోజకవర్గం లో స్థానిక సంస్థ ఎన్నికల్లో గులాబీ జెండా తప్పకుండా ఎగరడం ఖాయమని అన్నారు.
ప్రభుత్వం వెంటనే స్పందించి కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి రైతును ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో రాయికల్ పట్టణ మరియు మండల అధ్యక్షులు ఎలేటి అనిల్ బర్కం మల్లేష్ కో ఆర్డినేటర్ తురగ శ్రీధర్ రెడ్డి మాజీ కౌన్సిలర్ సాయి కుమార్ మహేష్ గౌడ్ మహేందర్ మాజీ కో ఆప్షన్ సోహెల్ మాజీ ఎంపీటీసీ రాజేందర్ గౌడ్ నాయకులు రామచంద్రం వినోద్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
పెట్టుబడిదారుల దృష్టి యుఎస్ వెలుపలకి — ‘పూర్వ-యుఎస్’ ఫండ్లలో రికార్డు ప్రవాహాలు
.jpg)
శబరిమల బంగారు పూత వివాదం — 1999లోనే కప్పారన్న మాజీ కమిషనర్
.jpeg)
రెట్టింపైన బంగారు గనుల కంపెనీ షేర్లు
.jpg)
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

చిన్న వయస్సు నుండే పిల్లలకు లైంగిక విద్యను అందించాలి: SC
.jpg)
మన దేశ సనాతన ధర్మం, సంప్రదాయాలు ఎంతో గొప్పవి -రాష్ర్ట గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ

గాంధీలో ముగిసిన బీసీఎంఈ మూడు రోజుల శిక్షణ

ఢిల్లీ పబ్లిక్ స్కూల్ బస్సులో అగ్ని ప్రమాదం, తప్పిన పెనుముప్పు

బెస్ట్ అవైలబుల్ స్కూల్ విద్యార్థుల తల్లిదండ్రులు రాస్తారోకో నిర్వహించారు.

గాంధీ ఆసుపత్రిలో ప్రపంచ దృష్టి దినోత్సవం

పార్టీ ఎవరికి B ఫాం ఇస్తే,, వారినే గెలిపించి మాజీ మంత్రి జీవన్ రెడ్డి

లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత నేత్ర శిబిరం
