ఉద్యోగ సిబ్బంది కృషితోనే సౌత్ సెంట్రల్ రైల్వేకు దేశంలో గుర్తింపు
దక్షిణ మద్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్
సికింద్రాబాద్, జూన్ 18 (ప్రజామంటలు) :
ఉద్యోగ సిబ్బంది నిరంతరంగా అంకిత భావంతో చేసిన కృషితోనే దక్షిణ మద్య రైల్వే జోన్ కు దేశంలోనే నాలుగవ స్థానం దక్కిందని సౌత్ సెంట్రల్ రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ అన్నారు. సౌత్ సెంట్రల్ రైల్వే మజ్దూర్ యూనియన్ నాయకులు వ్యక్తిగత పనులకన్నా ఉద్యోగుల సంక్షేమం కొరకు ఎక్కువగా పని చేస్తారని కార్మికుల కోసం పని చేసే చరిత్ర ఉన్నది కాబట్టే మజ్దూర్ యూనియన్ ను కార్మికులు మొదటి స్థానంలో గెలిపించారని సౌత్ సెంట్రల్ రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ అన్నారు . బుధవారం సికింద్రాబాద్ లోని ఎస్సీఆర్ఎమ్యూ కార్యాలయంలో జరిగిన సన్మాన సభలో ఆయన మాట్లాడుతూ..నిజాయితీతో నిరంతరం పని చేసే మజ్దూర్ యూనియన్ జనరల్ సెక్రెటరీ శంకర్ రావు తనకు ఆదర్శం అని అన్నారు. ఉద్యోగుల పని తీరుతోనే ఇండియన్ రైల్వేలో సికింద్రాబాద్ జోన్ కు ప్రత్యేక గుర్తింపు వచ్చిందని అన్నారు.మజ్దూర్ యూనియన్ ఆధ్వర్యంలో జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ పదవి విరమణ సందర్బంగా అభినందన సత్కార సభ జోనల్ వ్యాప్తంగా తరలి వచ్చి జనరల్ మేనేజర్ తో తమకు ఉన్న అనుబంధాన్ని నెమరేసుకున్న మజ్దూర్ యూనియన్ నాయకులు మజ్దూర్ యూనియన్ ఆధ్వర్యంలో యూనియన్ కేంద్ర కార్యాలయ లో దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ పదవి విరమణ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన సమావేశంలో జోనల్ అధ్యక్షులు కాల్వ శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ ను ఘనంగా పూలమాల బొకేలతో సత్కరించారు. మజ్దూర్ యూనియన్ జోనల్ జనరల్ సెక్రెటరీ కామ్రేడ్ డాక్టర్ శంకర్ రావు మాట్లాడుతూ అరుణ్ కుమార్ జైన్ సేవలు మరువలేనివి అని అన్నారు ఉద్యోగుల సంక్షేమానికి పెద్దపీట వేశారని అన్నారు. ఇండియన్ రైల్వే సికింద్రాబాద్ జోన్ అగ్రగామిగా నిలిపారని అన్నారు. రైల్వే ఉద్యోగుల సౌకర్యార్థం స్పెషల్ వార్డుల ఏర్పాటు, క్యాతలిక్ ల్యాబులు, 20 గెస్ట్ రూముల నిర్మాణం చేపట్టారని అన్నారు సికింద్రాబాద్ జోన్ లో సుమారు 15 వేలకు పైగా నూతన ఉద్యోగాలు భర్తీ చేసిన ఘనత అరుణ్ కుమార్ జైన్ కు దక్కిందన్నారు. తిరుపతి లో కల్యాణ మండపం ఏర్పాటు నిధులు మంజూరు చేశారన్నారు.
ఈ కార్యక్రమంలో అడిషనల్ జనరల్ మేనేజర్ నీరాజ్ అగర్వాల్, జనరల్ మేనేజర్ సెక్రెటరీ శ్రీనివాస్, ప్రిన్సిపాల్ ఎలక్ట్రీకల్ ఇంజినీర్ బ్రీజ్ మోహన్ మీనా, ప్రిన్సిపాల్ చీఫ్ మెడికల్ డైరెక్టర్ నిర్మల రాజారామ్, ప్రిన్సిపాల్ చీఫ్ సెక్యూరిటీ కమిషనర్ ఆరోమా ఠాగూర్, ప్రిన్సిపాల్ చీఫ్ పర్సనల్ ఆఫీసర్ సిద్దార్ధ,మజ్దూర్ యూనియన్ వర్కింగ్ ప్రెసిడెంట్ మురళీధర్, అసిస్టెంట్ జనరల్ సెక్రెటరీ ఉదయభాస్కర్, రామకృష్ణ, భారటే, శ్రీనివాస్ రెడ్డి జోనల్ కోశాధికారి సరోజినీ రెడ్డి సికింద్రాబాద్ డివిజనల్ సెక్రెటరీ రవీందర్, హైదరాబాద్ డివిజనల్ కృష్ణ, విజయవాడ డివిజనల్ సెక్రెటరీ లీలా, వర్క్ షాపు డివిజనల్ సెక్రెటరీ బుచ్చి రెడ్డి, నాందేడ్ డివిజనల్ సెక్రెటరీ మాణికుమార్, ఈడీబీ డివిజనల్ సెక్రెటరీ సంజీవయ్య సిసియాస్ ప్రెసిడెంట్ చిలుకు స్వామి వైస్ ప్రెసిడెంట్ రాంమ్మోహన్ లతో పాటు పలువురు మజ్దూర్ యూనియన్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
కొండగట్టు గిరి ప్రదక్షిణకు అన్ని సౌకర్యాలు కల్పిస్తాం: మంత్రి అడ్లూరి లక్ష్మణ్
కొండగట్టు, మే 11 (ప్రజా మంటలు):
జగిత్యాల జిల్లా మల్యాల మండలంలోని కొండగట్టు అంజన్న ఆలయంలో రాష్ట్ర సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సోమవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. పెద్ద హనుమాన్ జయంతిని పురస్కరించుకుని స్వామివారిని దర్శించుకున్న మంత్రి, అంజన్నకు పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా ఆలయ పూజారులు మంత్రికి... ట్రై సైకిల్స్ ను అందజేసిన ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్, డి ఎస్పీ పురుషోత్తం రెడ్డి
జగిత్యాల మే 10 (ప్రజా మంటలు)
రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో, ఆపి ప్రైవేంటివ్ హెల్త్ క్లినిక్, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సహకారంతో దివ్యాంగ విద్యార్థులకు ట్రై సైకిల్స్ ను అందజేసే కార్యక్రమం జరిగింది.
జిల్లా కేంద్రంలోని పావని కంటి హాస్పిటల్ ఆవరణలో జరిగిన ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ జగిత్యాల పూర్వ అధ్యక్షుడు, శాసన... కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానంలో అంగరంగ వైభవంగా ప్రారంభమైన హనుమాన్ పెద్ద జయంతి ఉత్సవాలు
కొండగట్టు మే 10 (ప్రజా మంటలు)జగిత్యాల జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానంలో హనుమాన్ పెద్ద జయంతి ఉత్సవాలు ఆదివారం అత్యంత ఘనంగా ప్రారంభమయ్యాయి. విశేష సంఖ్యలో భక్తుల నడుమ ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది.
హనుమాన్ పెద్ద జయంతి సందర్భంగా భద్రాచల శ్రీ సీతారామచంద్రస్వామి
వైదిక... విద్యార్థులకు బాల్యం నుండే సంస్కారాన్ని అందించాలి. ఆర్ఎస్ఎస్ జిల్లా బౌద్ధిక్ ప్రముఖ కొంగరి సాయి కృష్ణ
జగిత్యాల మే 10 (ప్రజా మంటలు ) విద్యార్థులకు చదువుతోపాటు సంస్కారాన్ని కూడా బాల్యం నుండే అలవాటు చేయాలని ఆర్ఎస్ఎస్ జిల్లా బౌద్ధిక్ ప్రముఖ కొంగరి సాయి కృష్ణ అన్నారు. సేవా భారతి, గీతా విద్యాలయం ఆధ్వర్యంలో ఈనెల ఒకటి నుండి పది రోజులపాటు నిర్వహించిన సంస్కార సాధన వర్గ ముగింపు సమావేశం ఆదివారం గీతా... ఎల్లమ్మ తల్లి ప్రాణ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్న మాజీమంత్రి జీవన్ రెడ్డి
సారంగపూర్ మీ 10 ( ప్రజా మంటలు)మండలం లచ్చక్క పేట గ్రామంలో రేణుక ఎల్లమ్మ తల్లి ప్రాణ ప్రతిష్టా మరియు పట్నాల మహోత్సవ కార్యక్రమంలో పాల్గొని ఎల్లమ్మ తల్లిని దర్శించుకున్నారు. మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి
ఎల్లమ్మ తల్లి ఆశీర్వచనాలు దీవెనలు అందరి పైన పైన ఉండాలనీ
అన్నింటి కన్న ప్రమాదకరమైన వృత్తి... ఎల్లమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్
సారంగాపూర్ మే 10(ప్రజా మంటలు) మండలము లచ్చక్క పేట గ్రామంలో ఎల్లమ్మ తల్లీ విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించిన జగిత్యాల శాసనసభ్యులు డా. సంజయ్ కుమార్
ఎమ్మెల్యే మాట్లాడుతూ
రేణుక ఎల్లమ్మ దయతో పాడి పంటలు ,ప్రజలు అందరూ సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు.
హిందూ ధర్మ రక్షణకు అందరూ పాటుపడాలన్నారు.
ఇతర... తెలంగాణ ఉద్యమకారుల డిమాండ్లకు కవిత మద్దతు జూన్ 2 వరకు కాంగ్రెస్కు గడువు
హైదరాబాద్ మే 10 (ప్రజా మంటలు):
ఉద్యమకారుల డిమాండ్లకు మద్దతుగా, హామీల అమలుకు కాంగ్రెస్ ప్రభుత్వానికి జూన్ 2 వరకు గడువుఅమలు లేకపోతే ఉద్యమకారులతో కలిసి ఆందోళనకు హెచ్చరిక చేస్తూ, టి ఆర్ఎస్ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తెలంగాణ ఉద్యమకారుల డిమాండ్లకు సంపూర్ణ మద్దతు ప్రకటించారు.
హైదరాబాద్లో ఆదివారం నిర్వహించిన తెలంగాణ ఉద్యమకారుల సంఘాల... మొక్కజొన్న కొనుగోలు ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించాలి ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలి రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్
జగిత్యాల మే 8(ప్రజా మంటలు)
జిల్లా కేంద్రంలోని బీట్ బజార్లో ఏర్పాటు చేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్,జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ తో కలిసి శుక్రవారం పరిశీలించారు.
సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్
కొనుగోలు... ఈవీఎం గోదాము తనిఖీ భద్రత ఏర్పాట్లు, సిసి కెమెరాల పనితీరులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్
జగిత్యాల మే 8( ప్రజా మంటలు)రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ఆదేశాల మేరకు శుక్రవారం రోజున జిల్లా ఎన్నికల అధికారి మరియు జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ దరూర్ క్యాంప్ లో గల ఈవీఎం లను భద్రపరిచిన గోదామును తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్.
జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్
ప్రతినెల... కరీంనగర్ PMJ జ్యువెలరీ షాప్లో కాల్పులతో దోపిడీ – 5 మంది నిందితుల కోసం 12 బృందాల గాలింపు
కరీంనగర్ మే 03 (ప్రజా మంటలు):
కరీంనగర్ జ్యోతినగర్లోని PMJ జ్యువెలరీ షాప్లో పట్టపగలే సంచలన దోపిడీ జరిగింది. ఐదుగురు దుండగులు తుపాకులతో షాప్లోకి చొరబడి సిబ్బందిపై కాల్పులు జరిపి, భారీగా బంగారు ఆభరణాలు దోచుకుని పరారయ్యారు. గాయపడిన సిబ్బందిని ఆసుపత్రికి తరలించగా, వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
ఘటన స్థలాన్ని కేంద్ర మంత్రి... కవితపై విమర్శలు చేస్తే ఊరుకోం: టీఆర్ఎస్ నేతల హెచ్చరిక
హైదరాబాద్, మే 03 (ప్రజా మంటలు):
తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) రాష్ట్ర నాయకులు నిర్వహించిన ప్రెస్ మీట్లో బీఆర్ఎస్ నాయకత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు శ్రీకాంత్ గౌడ్ మాట్లాడుతూ, కవిత గారి పెరుగుతున్న ప్రజాదరణను చూసి బీఆర్ఎస్ నేతలు భయపడుతున్నారని వ్యాఖ్యానించారు.కవిత గారిపై కేపీ వివేకానంద చేసిన వ్యాఖ్యలను... డీసీపీవో హరీష్పై కఠిన చర్య – సేవల నుంచి తొలగింపు
జగిత్యాల, మే 02 (ప్రజా మంటలు):
జగిత్యాల జిల్లా డీసీపీవో ఎం. హరీష్ను సేవల నుంచి శాశ్వతంగా తొలగిస్తూ జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. అధికార దుర్వినియోగం, మహిళా ఉద్యోగులపై వేధింపులు, హాజరు రికార్డుల్లో మార్పులు వంటి ఆరోపణలు ఆయనపై నిర్ధారణ కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.ఈ అంశాలపై గతంలోనే హరీష్కు... 