స్థానిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ముందుకు సాగాలి మహిళా కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు, జగిత్యాల ఇంచార్జి సుగుణ రెడ్డి
జగిత్యాల, జూన్ 17(ప్రజా మంటలు )
రానున్న రోజుల్లో మహిళా కాంగ్రెస్ ను క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లి, బూత్ లెవల్ నుండి మహిళా కాంగ్రెస్ ను బలోపేతం చెయ్యాలని తెలంగాణ మహిళా కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు, జగిత్యాల ఇంచార్జి సుగుణ రెడ్డి అన్నారు.
మహిళా కాంగ్రెస్ జాతీయ అధ్యక్షురాలు ఆల్క లంబా ఆదేశాల మెరకు, రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు మొగిలి సునీతా రావు సూచనల మేరకు మహిళా కాంగ్రెస్ జగిత్యాల జిల్లా శాఖ సమీక్ష సమావేశం కు ముఖ్య అతిథిగా హాజరైన ఆమె మహిళా కాంగ్రెస్ పనితీరును అడిగి తెలుసుకొని, నివేదికను పరిశీలించారు.
ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళల కోసం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశ పెట్టిందన్నారు. ఉచిత ఆర్టీసీ బస్ సౌకర్యం తో పాటుగా, రాష్ట్రం లో కోటి మంది మహిళలను కోటిశ్వరులను చెయ్యడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతుందన్నారు. ప్రభుత్వ పథకాలను గడప గడపకు తీసుకెళ్ళి ప్రజలకు వివరించాలని సూచించారు. అలాగే రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు గెలుపే లక్ష్యంగా మహిళా కాంగ్రెస్ సభ్యులు ప్రత్యేక కృషి చెయ్యాలన్నారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర మహిళా కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలు, జగిత్యాల ఇంచార్జీ సుగుణ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి సుమలత, జగిత్యాల జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు తాటిపర్తి విజయలక్ష్మి దేవేందర్ రెడ్డి, రాష్ట్ర మహిళాకాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి శోభరాణి,గోపి మాధవి,అల్లాల సరిత,సరళ ,పిప్పరి అనిత,మమత, సిరికొండ పద్మ, అచ్చ లావణ్య, సులోచన , మ్యాదరి లక్ష్మి, కొండ్రా విజయలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
వృద్ధుల వైద్యసేవలకు మంత్రికి వినతి - సీనియర్ సిటీజేన్స్ రాష్ట్ర కార్యదర్శి హరి ఆశోక్ కుమార్

ఏవీ డిగ్రీ కాలేజీలో చైల్డ్ లేబర్ డే సెమినార్

పార్టీ బలోపేతానికి నూతన కార్యవర్గం కృషి చేయాలి_ బిజెపి మండల అధ్యక్షులు

స్థానిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ముందుకు సాగాలి మహిళా కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు, జగిత్యాల ఇంచార్జి సుగుణ రెడ్డి

భారత ప్రభుత్వ యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వశాఖ, లక్ష్మీ భాయ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ గ్వాలియర్ ప్రవేశ పరీక్షలకు ఎంట్రన్స్ పరీక్ష

బదిలీపై వెళ్తున్న జగిత్యాల సెర్ప్ ఎపిడి చరణ్ దాస్ _ఘనంగా వీడ్కోలు పలికిన సెర్ప్ సిబ్బంది
.jpg)
గ్రామాల్లో విజిబుల్ పోలీసింగ్ పై ప్రత్యేక దృష్టి సారించాలి, మల్లాపూర్ ,రాయికల్ పోలీస్ స్టేషన్ లను ఆకస్మికగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ అశోక్ కుమార్

యోగా శరీరాన్ని, మనస్సును, శ్వాసను ఆలోచనలను ఏకం చేస్తుంది - శ్రీ ఓం ప్రకాశ్ స్వర్ణ

రైల్వే ఉద్యోగుల సమిష్టి కృషితోనే దేశంలో నెంబర్ 4

తుల గంగవ్వ మెమోరియల్ ట్రస్ట్ అధ్వర్యంలో నోట్ బుక్స్ పంపిణి.

విద్యాశాఖ కొత్త సంచలకుని కలిసిన రాష్ట్ర ట్రస్మా బృందం

అమ్మ మాట అంగన్వాడి బడిబాట.
