యోగా శరీరాన్ని, మనస్సును, శ్వాసను ఆలోచనలను ఏకం చేస్తుంది - శ్రీ ఓం ప్రకాశ్ స్వర్ణ
యోగా సంగం కార్యక్రమాన్ని నిర్వహించిన పీఐబీ, సీబీసీ కార్యాలయం
సికింద్రాబాద్, జూన్ 17 ( ప్రజామంటలు) :
'వార్త' నిర్వహ యోగా అనేది భారతీయ ప్రాచీన సంప్రదాయాన్ని ప్రతిబింబించే గొప్ప ఆధ్యాత్మిక పరిచయం అని, ఇది శరీరాన్ని,మనస్సును,శ్వాసను, ఆలోచనలను ఒకే దారిలో ఉంచేలా చేస్తుందని ప్రముఖ యోగా గురువు శ్రీ ఓం ప్రకాశ్ స్వర్ణ అన్నారు.
కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని పత్రికా సమాచార కార్యాలయం, సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ కార్యాలయాలు 11 వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం యోగా అవగాహాన కార్యక్రమం 'యోగా సంగం' నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కవాడిగూడ లోని కేంద్ర ప్రభుత్వ కార్యాలయ సముదాయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
యోగా అనేది మనకు ఆరోగ్యాన్ని,మానసిక ప్రశాంతతను కలిగించే సమగ్ర సాధన పద్ధతి.యోగా ద్వారా సంపూర్ణ ఆరోగ్యకర జీవన శైలిని అలవరుచుకోవటం, మానసిక ప్రశాంతత, శారీరక దారుఢ్యాన్ని పెంపొందించుకోవటం వంటి అంశాలపై కేంద్ర ప్రభుత్వ కార్యాలయ సముదాయంలోని అధికారులు, ఉద్యోగులకు అవగాహన కల్పించినట్లు పిఐబి , సిబిసి అదనపు డైరెక్టర్ జనరల్ శృతి పాటిల్ తెలిపారు.మహిళా జర్నలిస్టులు, ఉద్యోగుల కోసం 'హార్మోన్ల నుండి వైద్యం వరకు మహిళల ఆరోగ్యంపై యోగా ప్రభావం' అనే అంశంపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం 'వార్త' నిర్వహించారు.
శారీరక, మానసిక శ్రేయస్సుపై దృష్టి సారించిన ఈ సమావేశానికి దాదాపు 50 మంది జర్నలిస్టులు, మహిళా ఉద్యోగులు హాజరయ్యారు. నేచర్ క్యూర్ ఆసుపత్రికి చెందిన వైద్యురాలు డా.వైష్ణవి మహిళల ఆరోగ్య సమస్యలకు సంబంధించి ప్రాణాయామం, ఆసనాలు సహా యోగా పద్ధతులను ప్రదర్శించారు. నాడి శోధన, అనులోమ్ విలోమ్ వంటి శ్వాస పద్ధతుల ద్వారా ఒత్తిడి నుంచి ఏ విధంగా ఉపశమనం కలిగుతుందో వివరంగా తెలిపారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
వృద్ధుల వైద్యసేవలకు మంత్రికి వినతి - సీనియర్ సిటీజేన్స్ రాష్ట్ర కార్యదర్శి హరి ఆశోక్ కుమార్

ఏవీ డిగ్రీ కాలేజీలో చైల్డ్ లేబర్ డే సెమినార్

పార్టీ బలోపేతానికి నూతన కార్యవర్గం కృషి చేయాలి_ బిజెపి మండల అధ్యక్షులు

స్థానిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ముందుకు సాగాలి మహిళా కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు, జగిత్యాల ఇంచార్జి సుగుణ రెడ్డి

భారత ప్రభుత్వ యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వశాఖ, లక్ష్మీ భాయ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ గ్వాలియర్ ప్రవేశ పరీక్షలకు ఎంట్రన్స్ పరీక్ష

బదిలీపై వెళ్తున్న జగిత్యాల సెర్ప్ ఎపిడి చరణ్ దాస్ _ఘనంగా వీడ్కోలు పలికిన సెర్ప్ సిబ్బంది
.jpg)
గ్రామాల్లో విజిబుల్ పోలీసింగ్ పై ప్రత్యేక దృష్టి సారించాలి, మల్లాపూర్ ,రాయికల్ పోలీస్ స్టేషన్ లను ఆకస్మికగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ అశోక్ కుమార్

యోగా శరీరాన్ని, మనస్సును, శ్వాసను ఆలోచనలను ఏకం చేస్తుంది - శ్రీ ఓం ప్రకాశ్ స్వర్ణ

రైల్వే ఉద్యోగుల సమిష్టి కృషితోనే దేశంలో నెంబర్ 4

తుల గంగవ్వ మెమోరియల్ ట్రస్ట్ అధ్వర్యంలో నోట్ బుక్స్ పంపిణి.

విద్యాశాఖ కొత్త సంచలకుని కలిసిన రాష్ట్ర ట్రస్మా బృందం

అమ్మ మాట అంగన్వాడి బడిబాట.
