గల్ఫ్ అడ్వైజరి బొర్డ్ కు చాంద్ పాషా విజ్ఞప్తి
టిపిసిసి, ఎన్.ఆర్. సెల్ (కన్వీనర్), .షేక్ చాంద్ పాషా గల్ఫ్ సలహా బోర్డును, గల్ఫ్ లో మృతి చెందిన కార్మికులకు చెల్లించాల్సిన పరిహారం గత కొన్ని సంవత్సరాలుగా అందడం లేదని, గత ప్రభుత్వాల ఉత్తర్వులమేర చెల్లించాల్సిన మొత్తాన్ని వెంటనే చెల్లించేట్లుగా ప్రభుత్వానికి సూచించాలని కోరారు.
ఎన్.ఆర్.ఐ గల్ఫ్ అడ్వైజరీ బొర్డు మీటింగ్లో ఈ క్రింద పొందు పర్చిన సూచనలు బొర్డు మీటింగ్లో ప్రతి పాదించాలని చాంద్ పాషా కోరారు..
1. చాలా రిజిష్టర్డ్ మరియు నాన్ రిజిష్టర్డ్ రిక్రూటింగ్ ఎజెన్సిలు వాళ్ల వాళ్ల సబ్ ఏజెంట్స్ ద్వారా పాస్ పోర్టులు సేకరించి వాళ్లకు వీరు స్కిల్ ట్రేయినింగ్ ఇప్పిస్లామని ఫేక్ ట్రేయినింగ్ సెంట్ర్ల నుండి సర్టిఫికేట్లు తెప్పించి వాల్లను స్కిల్డ్ వర్కర్లుగా పంపిస్తున్నారు. వీరు బయట దేశంలో కంపెనీలలో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఇట్టి రిజిష్టర్డ్ మరియు ఆన్ రిజిష్టర్డ్ రిక్రూటింగ్ ఎజేన్సిస్ల పై ప్రొటెక్టర్ జనరల్ ఆఫ్ ఎమిగ్రెంట్స్ వారు తీవ్రమైన చర్యలు తీసుకోవాలి. వీళ్లపై సరిjైున మానిటరింగ్ లేక ఈ ఫేక్ రిజిష్టరింగ్ ఎజెన్సిస్ రెచ్చి పోతున్నాయి. వీరిపై తరచుగా సి.ఐ.డి డిపార్ట్మెంట్ ద్వారా మానిటరింగ్ చేపట్టాలి.
2. చాలా ఎజెన్సీలు రకరకాల విసాలు, జాబ్ విసా, విసిట్ నుండి ఎంప్లయిమెంట్ విసా, ఆజాద్ విసా, ఫ్రీ విసా, ట్రాన్సిట్ విసా అని ఎమిగ్రెంట్ వర్కర్లను మొసాలకు గురిచేస్తున్నారు. ఇటువంటి రకరకాల విసాలు ఇస్లున్న ఎజెన్సిల లైసెన్స్లు త్వరగా రద్దు చేయాలి. ఇటువంటి ఎజెన్సిలపై ప్రొటెక్టర్ ఆఫ్ ఎమిగ్రెంట్, రాష్ట్ర సి.ఐ.డి ద్వారా ప్రతి జిల్లా కేంద్రంలో తనిఖీలు నిర్వహించాలి.
3. ఎందరో ఎజెంట్లు సరైన అర్హత మరియు రిక్రూట్మెంట్ అవగాహన లేకుండా వేరే డిగ్రీ హోల్డర్స్ పేరు మీద లైసెన్స్లు తీసుకొని (రిక్రూట్మెంట్ లైసెన్స్ పొందుటకు కొరకు డిగ్రీ తప్పనిసరి) రక రకాల మొసాలకు పాల్పడుచున్నారు. ఎందరో ముగిసిన (ఎక్సైర్) లైసెన్స్లపైన సస్పెండ్ లైసెన్స్ పైనా కూడా బిజినెస్ నిర్వహిస్తున్నారు. వీరిపై కూడా ఎల్లప్పుడు రాష్ట్ర సి.ఐ.డి మానిటరింగ్, పోలీస్ వారి నిఘా ఉండాలి.
4. రిక్రూట్మెంట్ ఎజెన్సీలు వారు పంపేముందు అభ్యర్తుల యొక్క అర్హతలను బట్టి వారికి ఇక్కడే ముందస్తు ట్రైనింగ్ ఇప్పించాలి. దీంతో ఎంప్లాయిమెంట్ వర్కర్లు ఎలాంటి ఇబ్బందులకు గురికారు. మరియు ప్రవాసి బారతీయ భీమా యోజన (పి.బి.బి.వై) ఇన్సూరెన్స్ పాలసి కవరేజ్ ప్రస్తుతం రూ॥ 10,00,000/` (రూపాయలు పది లక్షలు) గా వుంది. ఇప్పుడు లిబియా దేశంలో ప్రవాస భారతీయులకు రూ॥ 25,00,000/` (ప్రమాద భీమా) దీన్ని 2012 సం॥లో కేంద్ర ప్రభుత్వం అమోదించింది. అయితే ఇదే రూ॥ 25,00,000/` ప్రమాద భీమా సౌకర్యం అన్ని గల్ఫ్ దేశాలకు వర్తింపజేయాలి.
5. 2006 సం॥లో యు.ఎ.ఇ ప్రభుత్వం ఆమ్నెస్టి ప్రకటిఆంచింది. దీని ప్రకారం ఎవరైతే ఇల్లిగల్గా వున్నారో వాల్లందరిని వారి వారి దేశాలకు పంపించింది. అప్పటి యు.పి.ఎ`1 ప్రభుత్వంలో వీరికి ఉచిత ప్రయాణ టికెట్లు పంపించింది. వీరందరికి 2007 సం॥లో అప్పటి శ్రీ డా॥ వై.ఎస్ రాజశేఖర్ రెడ్డి గారి ప్రభుత్వం ఒక లక్ష (రూ॥ 1,00,000/`) ఆర్తిక సహయం జి.ఒ నెం. 256 ద్వారా ప్రకటించి మొదటి విడతగా 29 మందికి ప్రభుత్వం 2009 లో లక్ష రూపాయల చెక్కును మొదటి అసెంబ్లీ సమావేశంలోనే పంపణీ చేయడం జరిగింది. ఇదే జి.ఒ 256 ను ఉమ్మడి ఆంద్రప్రదేశ్ లో 2014 వరకు కొనసాగించారు. మళ్లి 2019 ఎలక్షన్స్లో రూ॥ 5,00,000/` ఆర్థిక సహయం గల్ఫ్లో మృతి చెందిన కుటుంబాలకు ఇస్తామని హామి ఇచ్చారు. ఇప్పుడు 2023 అసెంబ్లీ ఎలక్షన్ కాంగ్రెస్ పార్టీ మానిఫెస్టోలో రూ॥ 5,00,000/` పరిహరం ఇస్తామని ప్రకటించారు. దీని ప్రకారం తేది: 07`12`2023 తర్వాత గల్ఫ్లో మరణించిన వారందరికి రూ॥ 5,00,000/` ఆర్థిక సహయం ఇవ్వడం జరుగుతుంది. ఇట్టి రూ॥ 5,00,000/` పరిహరం కనీసం సగబాగం రూ॥ 2,50,000/` 2007 లో పాసైన జి.ఒ 256 వారికి కూడా వర్తింపచేయాలని మీ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను.
పైన పేర్కొనబడిన అన్ని సమస్యలకు పరిష్కార మార్గం ఈ క్రింద పేర్కొనబడిన వ్యవస్థలను ఇప్పుడు మీ ఆద్వర్యంలో రూపొందించాలి.
ఎన్.ఆర్.ఐ ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఇట్టి శాఖ డా॥ వైఎస్ఆర్ కాంగ్రెస్ లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రవాస ఆంధ్రుల శాఖ మంత్రిగా దుద్దిళ్ల శ్రీధర్బాబు నియమితులయ్యారు. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వంలో కూడా అదే ఎన్.ఆర్.ఐ మంత్రిత్వ శాఖను కొనసాగించాలి.
2006 లో అప్పటి డా॥ వైఎస్.ఆర్ ప్రభుత్వ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఒ.ఎమ్.కాప్ అనే సంస్థను స్థాపించి గ్రామ స్థాయి నుండి జిల్లా స్థాయి వరకు నిరుద్యోగ యువతకు అవగాహన సదస్తులు నిర్వహించి వారికి 3 నెలలు ఉచిత బోజన సౌకర్యం కల్పిస్తు స్కిల్డ్ ట్రైనింగ్ ఇప్పించి బయటకు పంపడం జరిగింది.
అప్పట్లో అన్ స్కిల్డ్ లేబర్ విసా మరియు మజ్రా (గొర్రెల కాపలి) మరియు విసిట్ విసాలు బ్యాన్ చేయడం జరిగింది. ఇదే విదానం ఇప్పుడూ కొనసాగించాలి. ప్రస్తుత ప్రభుత్వ ఆద్వర్యంలో టామ్కామ్ (ుూవీజూవీ) నడుస్తుంది. ఇది అనుకున్న స్థాయిలో పనిచేయక నిరుద్యోగులకు ఎలాంటి శిక్షణలు ఇవ్వక రిక్రూట్మెంట్ ఎజెన్సీలతో కుమ్మక్కైనారు. కాబట్టి ుూవీజూవీ గత 10 సం॥ల కార్యకలపాలపై సి.ఐ.డి ద్వారా విచారణ జరిపించి ఇక నుండి అయినా నిరుద్యోగులకు ఎలాంటి ఖర్చులు గాని డబ్బులు వసూలు చేయకుండా వారిని విదేశాలకు పంపించాలి. దీన్ని ఇప్పటి ఎన్.ఆర్.ఐ మంత్రిత్వ శాఖ పకడ్బందిగా అమలు చేయాలి.
ుూవీజూవీ వ్యవహరాల్లో ఎన్.జి.ఒలు కాని ఇతర సంఘాలు కాని ఎలాంటి జోక్యం వుండకూడదు. దీన్ని ప్రభుత్వ యంత్రాంగం ద్వారా అంటే జిల్లా కలెక్టర్లు మరియు మండల స్థాయిలో యం.డి.ఒ గారి ఆద్వర్యంలోనే నిర్వహించాలి. ప్రతి నియోజకవర్గ ఎం.ఎల్.ఎ లకు కార్యక్రమాలపై దృష్టి సారించాలి.
గల్ఫ్లో ప్రమాదంలో మరణించేవారు అంటే రోడ్డు ప్రమాదాలలో, పని స్థలంలో ప్రమాదాలలో మరణించిన వారి ఇస్సూరెన్స్ క్లైం లు ఇవ్వకుండా సంవత్సరాలు గడుస్తున్నాయి. దీనిలో ఇండియన్ ఎంబసీ ఆధికారులకు అక్కడి ప్రభుత్వాలు సహకరించడం లేదు. ఉదాహరణకు 5 కేసుల తమరి ముందు ఉంచుతున్నాను. 15 రోజుల క్రితం ప్రజావాణిలో 13 కేసులు కేస్ స్టడీ కొరకు ఇవ్వడం జరిగింది. ఇట్టి విషయం మీతో చర్చించడం జరిగింది. ప్రత్యేకంగా ఇట్టి విషయాన్ని మీ కమిటి మీటింగ్లో చర్చించగలరు.
పైన పేర్కొన్న అంశాలను పకడ్బందీగా అమలు చేయాలంటే రాష్ట్ర స్థాయిలో ఎన్.ఆర్.ఐ కమిషన్ను స్థాపించి, దీనికి ఐ.పి.ఎస్ స్థాయి అధికారిని నియమించాలి. వీరి ఆద్వర్యంలో ప్రతి జిల్లాకు ఒక ఎన్.ఆర్.ఐ పోలీస్ స్టేషన్, ఎన్.ఆర్.ఐ కోర్టు ప్రత్యేకంగా ఏర్పరచాలి. ఎమిగ్రేషన్ చట్టం 1983 రూల్స్ Ê రెగ్యులేషన్స్ క్రింద చట్టాలను ఉల్లంఘించిన ట్రావెల్ ఎజెన్సిలపై ఎన్.ఆర్.ఐ పోలీస్ శాఖ వాళ్లే చర్యలు చేపట్టాలి. ఇందులో సివిల్ పోలీస్ వాళ్లకు ఎలాంటి జోక్యం వుండకూడదను చాంద్ పాషా కోరారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
గల్ఫ్ అడ్వైజరి బొర్డ్ కు చాంద్ పాషా విజ్ఞప్తి

గాంధీ ఆస్పత్రి ఆవరణలో ముగ్గురు యాచకుల మృతి

వృద్ధుల వైద్యసేవలకు మంత్రికి వినతి - సీనియర్ సిటీజేన్స్ రాష్ట్ర కార్యదర్శి హరి ఆశోక్ కుమార్

ఏవీ డిగ్రీ కాలేజీలో చైల్డ్ లేబర్ డే సెమినార్

పార్టీ బలోపేతానికి నూతన కార్యవర్గం కృషి చేయాలి_ బిజెపి మండల అధ్యక్షులు

స్థానిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ముందుకు సాగాలి మహిళా కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు, జగిత్యాల ఇంచార్జి సుగుణ రెడ్డి

భారత ప్రభుత్వ యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వశాఖ, లక్ష్మీ భాయ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ గ్వాలియర్ ప్రవేశ పరీక్షలకు ఎంట్రన్స్ పరీక్ష

బదిలీపై వెళ్తున్న జగిత్యాల సెర్ప్ ఎపిడి చరణ్ దాస్ _ఘనంగా వీడ్కోలు పలికిన సెర్ప్ సిబ్బంది
.jpg)
గ్రామాల్లో విజిబుల్ పోలీసింగ్ పై ప్రత్యేక దృష్టి సారించాలి, మల్లాపూర్ ,రాయికల్ పోలీస్ స్టేషన్ లను ఆకస్మికగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ అశోక్ కుమార్

యోగా శరీరాన్ని, మనస్సును, శ్వాసను ఆలోచనలను ఏకం చేస్తుంది - శ్రీ ఓం ప్రకాశ్ స్వర్ణ

రైల్వే ఉద్యోగుల సమిష్టి కృషితోనే దేశంలో నెంబర్ 4

తుల గంగవ్వ మెమోరియల్ ట్రస్ట్ అధ్వర్యంలో నోట్ బుక్స్ పంపిణి.
