వసతులు పెంచండి...వైద్య సిబ్బంది ఖాళీ పోస్టులను భర్తీ చేయండి - కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
గాంధీ ఆసుపత్రిని సందర్శించిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
రోగుల వార్డులు, ఆక్సిజన్ ప్లాంట్ల పరిశీలన
సికింద్రాబాద్, జూన్ 16 (ప్రజామంటలు) :
సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిని సోమవారం కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి సందర్శించారు. ఈసందర్బంగా ఆసుపత్రిలోని పేషంట్లు చికిత్స పొందుతున్న వార్డులు, ఆసుపత్రి ఆవరణలోని ఆక్సిజన్ ప్లాంట్లు, ఇతర విభాగాలను కేంద్రమంత్రి సందర్శించి, అక్కడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
ఈసందర్బంగా ఆసుపత్రి సూపరింటెండెంట్ డా.రాజకుమారి, ఆర్ఎంవోలు, వైద్యాధికారులతో సమావేశమై గాంధీ ఆసుపత్రిలోని సమస్యలు, రోగులకు అందుతున్న వైద్య సౌకర్యాలు, చేయాల్సిన పనులు తదితర అంశాలపై చర్చించి, వివరాలను అడిగి తెలుసుకున్నారు. వైద్యాధికారులతో కలసి ఆసుపత్రి ఆవరణ అంతా కలియ తిరిగారు. పేషంట్లను కలిసి వారికి అందుతున్న ట్రీట్మెంట్ గురించి అడిగి తెలుసుకున్నారు. గత కోవిడ్ పాండమిక్ లో పీఎం కేర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆక్సిజన్ ప్లాంట్ ను సందర్శించి, దాని పనితీరును అడిగి తెలుసుకున్నారు.
అనంతరం గాంధీ ఆవరణలో మీడియాతో కేంద్ర మంత్రి మాట్లాడారు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న సికింద్రాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలో అతిపెద్ద ప్రభుత్వ ఆసుపత్రి గాంధీ ని ఈ రోజు పర్యటనకు వచ్చానన్నారు. ఇక్కడి సమస్యలు, సౌకర్యాలు, అభివృద్ది పనులపై అధికారులతో మాట్లాడినట్లు తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆదేశాల మేరకు ఆయా ఎంపీల పరిధిలోని ప్రభుత్వ ఆసుపత్రుల సందర్శనకు వచ్చామన్నారు. కరోనా పాజిటివ్ కేసులు మళ్ళీ పెరుగుతున్న నేపద్యంలో ఆసుపత్రి అధికారులను అప్రమత్తం చేయాలని, కరోనా ప్రొటోకాల్ ను ప్రజలు పాటించేలా గుర్తు చేయాలని చెప్పారన్నారు. గాంధీలో గత కొంతకాలంగా ఖాళీగా ఉన్న ఆర్ఎంవోలు, డాక్టర్లు,నర్సులు, ఇతర సిబ్బంది పోస్టులను భర్తీ చేయాలని ఆయన రాష్ర్ట ప్రభుత్వాన్ని కోరారు.
ఆయుష్మాన్ భారత్ పథకం కింద ఆధార్ కార్డు ఆధారంగా పేషంట్లకు సులభంగా ఓపీ నమోదు ప్రక్రియ కొనసాగుతుందన్నారు. ఆయుష్మాన్ భారత్ పథకంతో ఒక్కసారి మొబైల్ ద్వారా రిజిస్ర్టేషన్ చేసుకుంటే గాంధీ తో పాటు ఇతర ప్రభుత్వ ఆసుపత్రుల్లో భవిష్యత్ లో ఓపీ సేవలు పొందటం చాలా సులభమన్నారు. గాంధీలో కొన్ని పారిశుద్ద్య సమస్యలున్నాయని, వీటిని అధిగమించి, శానిటేషన్ పనులను ముమ్మరం చేయాలన్నారు.కొన్ని ఔట్ సోర్సింగ్ కంపెనీలు నెలల తరబడిగా సిబ్బందికి జీతాలు ఇవ్వడం లేదని తమకు సమాచారం ఉందని, వెంటనే ఆయా కంపెనీల కాంట్రాక్టర్లను పిలిచి, సిబ్బందికి జీతాలను వెంటనే ఇప్పించాలని కేంద్రమంత్రి సూపరింటెండెంట్ ను ఆదేశించారు.
గాంధీలో తరచుగా ఎంఆర్ఐ, ఎక్స్ రే,ఈసీజీ, అల్ర్టా సౌండ్ స్కానింగ్, సిటీ స్కానింగ్, గుండె సంబంధిత పరీక్షలు చేసే 2డీకో మెషిన్లు మొరయిస్తున్నాయని, దీనివలన దూరప్రాంతాల నుంచి వచ్చే రోగులు నానా ఇబ్బందులు పడుతున్నారని పలువురు కేంద్ర మంత్రి దృష్టికి తీసుకువెళ్ళారు. వివిద టెస్టుల కోసం రోగులు రోజుల తరబడిగా పడిగాపులు కాయాల్సి వస్తుందని, పేషంట్ల రద్దీకి అనుగుణంగా మెషిన్ల సంఖ్య పెంచాలని కోరారు. ఘనత వహించిన గాంధీలో బీఎస్ఎన్ఎల్ సంస్థకు బిల్లులు చెల్లించకపోవడంతో గత కొంతకాలంగా ఫోన్లు పనిచేయడం లేదని పలువురు కేంద్ర మంత్రికి తెలిపారు. ఫోన్లు పనిచేయకపోవడంతో రోగులు, డాక్టర్లు, సిబ్బంది ఇబ్బందులు పడుతున్నారన్నారు. అలాగే మెడిసన్స్ పూర్తి స్థాయిలో లభ్యం కావడం లేదన్నారు. రోగులకు ఇబ్బంది లేకుండా ఎప్పటికప్పుడు సమీక్షలు జరుపుతు, సమస్యలు లేకుండా చూడాలని కేంద్ర మంత్రి సూపరింటెండెంట్ ను ఆదేశించారు. కేంద్ర మంత్రి వెంట మాజీ మంత్రి మర్రి శశిధర్ రెడ్డి, ఇతర బీజేపీ నాయకులు, గాంధీ ఆసుపత్రి ఆర్ఎంవోలు, వైద్యులు, సిబ్బంది ఉన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
మొక్కజొన్న కొనుగోలు ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించాలి ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలి రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్
జగిత్యాల మే 8(ప్రజా మంటలు)
జిల్లా కేంద్రంలోని బీట్ బజార్లో ఏర్పాటు చేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్,జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ తో కలిసి శుక్రవారం పరిశీలించారు.
సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్
కొనుగోలు... ఈవీఎం గోదాము తనిఖీ భద్రత ఏర్పాట్లు, సిసి కెమెరాల పనితీరులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్
జగిత్యాల మే 8( ప్రజా మంటలు)రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ఆదేశాల మేరకు శుక్రవారం రోజున జిల్లా ఎన్నికల అధికారి మరియు జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ దరూర్ క్యాంప్ లో గల ఈవీఎం లను భద్రపరిచిన గోదామును తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్.
జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్
ప్రతినెల... కరీంనగర్ PMJ జ్యువెలరీ షాప్లో కాల్పులతో దోపిడీ – 5 మంది నిందితుల కోసం 12 బృందాల గాలింపు
కరీంనగర్ మే 03 (ప్రజా మంటలు):
కరీంనగర్ జ్యోతినగర్లోని PMJ జ్యువెలరీ షాప్లో పట్టపగలే సంచలన దోపిడీ జరిగింది. ఐదుగురు దుండగులు తుపాకులతో షాప్లోకి చొరబడి సిబ్బందిపై కాల్పులు జరిపి, భారీగా బంగారు ఆభరణాలు దోచుకుని పరారయ్యారు. గాయపడిన సిబ్బందిని ఆసుపత్రికి తరలించగా, వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
ఘటన స్థలాన్ని కేంద్ర మంత్రి... కవితపై విమర్శలు చేస్తే ఊరుకోం: టీఆర్ఎస్ నేతల హెచ్చరిక
హైదరాబాద్, మే 03 (ప్రజా మంటలు):
తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) రాష్ట్ర నాయకులు నిర్వహించిన ప్రెస్ మీట్లో బీఆర్ఎస్ నాయకత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు శ్రీకాంత్ గౌడ్ మాట్లాడుతూ, కవిత గారి పెరుగుతున్న ప్రజాదరణను చూసి బీఆర్ఎస్ నేతలు భయపడుతున్నారని వ్యాఖ్యానించారు.కవిత గారిపై కేపీ వివేకానంద చేసిన వ్యాఖ్యలను... డీసీపీవో హరీష్పై కఠిన చర్య – సేవల నుంచి తొలగింపు
జగిత్యాల, మే 02 (ప్రజా మంటలు):
జగిత్యాల జిల్లా డీసీపీవో ఎం. హరీష్ను సేవల నుంచి శాశ్వతంగా తొలగిస్తూ జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. అధికార దుర్వినియోగం, మహిళా ఉద్యోగులపై వేధింపులు, హాజరు రికార్డుల్లో మార్పులు వంటి ఆరోపణలు ఆయనపై నిర్ధారణ కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.ఈ అంశాలపై గతంలోనే హరీష్కు... సురభి గోశాల, తాటిపల్లిలో భక్తిశ్రద్ధలతో సామూహిక శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాలు
జగిత్యాల మే1(ప్రజా మంటలు)సురభి గోశాలలో నిర్వహించిన సామూహిక శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం విజయవంతంగా, ఎంతో భక్తి శ్రద్ధలతో ముగిసింది. 11 మంది దంపతులు కలసి, ఒకే సంకల్పంతో, ఒకే భక్తితో వ్రతం నిర్వహించడం చూడటం నిజంగా హృదయానికి హత్తుకునే అనుభూతనీ నిర్వాహకులు అన్నారు.
మొదట గోమాతకు పూజలు చేసి, అనంతరం శ్రీకృష్ణ పరమాత్ముని... సర్వోదయ తెలంగాణ” – ఉచిత విద్య, వైద్యం, 4 లక్షల ఉద్యోగాల హామీ!
హైదరాబాద్ మే 02 (ప్రజా మంటలు):
తెలంగాణలో కొత్త రాజకీయ శక్తిగా “తెలంగాణ రక్షణ సేన”ను ప్రారంభించిన కల్వకుంట్ల కవిత, సర్వోదయ తెలంగాణ లక్ష్యంగా ముందుకు వెళ్తున్నట్లు ప్రకటించారు. ఈ వేదిక ద్వారా రాష్ట్రంలోని అన్ని వర్గాల సమస్యలపై పోరాటం చేస్తామని మీట్ ది ప్రెస్ లో
తెలిపారు.
“సర్వోదయ తెలంగాణ కోసం పాంచజన్యం మార్గంలో... ఘనంగా శ్రీ వేణుగోపాల స్వామి బ్రహ్మోత్సవాల ప్రత్యేక వేడుకలు శ్రీ నరసింహ స్వామి జయంతి ప్రత్యేక వేడుకలు
జగిత్యాల ఏప్రిల్ 30 (ప్రజా మంటలు) పట్టణంలోని శ్రీ వేణుగోపాలస్వామి ఆలయంలో గురువారం ఉదయం 11 గంటలకు బ్రహ్మోత్సవ వేడుకల సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలను నిర్వహించి అనంతరం శ్రీ లక్ష్మీనరసింహ జయంతి సందర్భంగా స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. ఈ బ్రహ్మోత్సవాల్లో భాగంగా నవగ్రహ పూజా అలాగే సంతాన గోపాల హోమ పూజా కార్యక్రమంలో... కోరుట్ల బార్ అసోసియేషన్ సీనియర్ న్యాయవాది బైరి విజయ్ కుమార్ కు ప్రతిష్టాత్మక దళిత రత్న పురస్కారం
కోరుట్ల, ఏప్రిల్ 30(ప్రజా మంటలు)
జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణానికి చెందిన సీనియర్ న్యాయవాది బైరి విజయ్ కుమార్ దళిత రత్న పురస్కారం అందించారు. గురువారం హైదరాబాద్లోని రవీంద్ర భారతిలో డా. బాబు జగ్జీవన్ రామ్, డా. బి.ఆర్. అంబేద్కర్ జయంతి ఉత్సవాల కమిటీ ఆధ్వర్యంలో కోరుట్ల బార్ అసోసియేషన్ సీనియర్ న్యాయవాది బైరి విజయ్... సినీ దర్శకుడు బండి రఘురాం కన్నుమూత
హైదరాబాద్, ఏప్రిల్ 30 (ప్రజా మంటలు):
జగిత్యాలకు చెందిన సినీ దర్శకుడు బండి రఘురాం ఏప్రిల్ 28న కన్నుమూశారు. హైదరాబాద్లోని యూసుఫ్గూడలో నివాసముంటున్న ఆయన సాయంత్రం పార్క్లో నడుస్తూ ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. గుండెపోటుతో మృతిచెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయన మృతి సినీ, జర్నలిజం వర్గాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది.రఘురాం జగిత్యాలకు చెందిన బండి... ఎస్ ఎస్ ఎస్ ఎం హై స్కూల్ ఎస్ ఎస్ సి ర్యాంకర్లకు అభినందనలు
జగిత్యాల ఏప్రిల్ 29 ( ప్రజా మంటలు) జిల్లా కేంద్రానికి చెందిన ఎస్ ఎస్ ఎస్ ఎం హై స్కూల్ కు చెందిన సింగిడి చక్రిత 561/600, ఎంబారి చరణ్ 547/600 బుధవారం విడుదలైన ఎస్ఎస్సి ఫలితాలలో ఉత్తమ మార్కులు సాధించినారు. 500 పైబడి 45 శాతం విద్యార్థులు ఫలితాలు సాధించారు. 100% విద్యార్థులు ఉత్తీర్ణత... ఎస్ఎస్ఎస్సి లో578/600 మార్కులు సాధించిన పాలెపు హాసిని శర్మను అభినందించిన పాఠశాల యాజమాన్యం
జగిత్యాల ఏప్రిల్ 29 ( ప్రజా మంటలు) పొలాస గ్రామానికి చెందిన పాలెపు రాజు కూతురు పాలెపు హాసిని శర్మ జిల్లా కేంద్రంలోని శ్రీనిధి ఒలంపియాడ్ పాఠశాలలో చదువుచున్నది. బుధవారం విడుదలైన ఎస్ఎస్ఎస్సి ఫలితాలలో 578/600 మార్కులు సాధించింది. ఈ సందర్భంగా శ్రీనిధి ఒలంపియాడ్ పాఠశాల కరస్పాండెంట్ ఎం రాజేందర్ ప్రిన్సిపల్ మేఘమాల డైరెక్టర్ 