గ్రామాల్లో విజిబుల్ పోలీసింగ్ పై ప్రత్యేక దృష్టి సారించాలి, మల్లాపూర్ ,రాయికల్ పోలీస్ స్టేషన్ లను ఆకస్మికగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ అశోక్ కుమార్
మల్లాపూర్ రాయికల్ జూన్ 17 ( ప్రజా మంటలు)
జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఆకస్మికంగా మల్లాపూర్, రాయికల్ పోలీస్ స్టేషన్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ ల పరిసరాలను, స్టేషన్ పరిధిలో నమోదు అవుతున్న, నమోదైన కేసుల వివారలు,స్టేషన్ రికార్డ్ లు తనిఖీ చేసి కేసుల దర్యాప్తు విషయంలో అలసత్వం వహించవద్దని,ప్రజా ఫిర్యాదులలో ఎటువంటి జాప్యం చేయకుండా బాధితుల పిర్యాదుల పట్ల తక్షణమే స్పందించాలని అన్నారు.
,ప్రజలకు ఎల్లపుడు అందుబాటులో ఉండాలని సూచించారు.బ్లూ కోట్ ,పెట్రో కార్ సిబ్బంది 100 డయల్ కాల్స్ కి తక్షణమే స్పందిస్తూ వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టాలన్నారు. విజిబుల్ పోలీసింగ్ పై ప్రత్యేక దృష్టి చూపుతూ, స్టేషన్ పరిధిలోని గ్రామాలను తరుచూ సందర్శించాలన్నారు.పాత నేరస్థుల పై నిఘా ఉంచాలన్నారు.
నేరాలు ఎక్కువగా జరిగే ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు, ప్రజలతో సత్సంబంధాలను మెరుగుపరచుకుంటూ ప్రజలకు, యువతకు ప్రత్యేకంగా,షీ టీమ్స్,ట్రాఫిక్ నియమాలు, సైబర్ నేరాల నివారణ పై చైతన్యాన్ని తీసుకురావాలని సూచించారు.విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని యువకులను మోసం చేసే వారి పట్ల కఠినంగా వ్యవహరించాలని సూచించారు.
అనంతరం సిబ్బంది తో ఎస్పీ మాట్లాడుతూ... పోలీస్ స్టేషన్ అంతా పరిశుభ్రంగా గా ఉంచుకోవాలని, ప్రతి ఒక్కరు బాధ్యతాయుతంగా ఉంటూ విధి నిర్వహణలో క్రమశిక్షణతో ఉండాలని సూచించారు. పోలీస్ స్టేషన్ పరిధిలో ఏలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సిబ్బంది అందరి కృషి చేయాలని సిబ్బంది, అధికారులు అందరూ విధులు సక్రమంగా విధులు నిర్వహించడం ద్వారానే శాంతిభద్రతలు అదుపులో ఉంటాయని సూచించారు.పోలీస్ శాఖ నూతన టెక్నాలజీ అధునాతన టెక్నాలజీ ఉపయోగిస్తున్న దాని గురించి పూర్తి అవగాహన ఉండాలని సూచించారు. సిబ్బంది కి ఏమైనా సమస్యలు ఉన్నాయా అని, ఏమైనా ఉంటే తమ దృష్టి కి తీసుకొని రావాలి అని సూచించారు.
ఎస్పి వెంట ఎస్.ఐ లు రాజు ,సుదీర్ రావు మరియు సిబ్బంది ఉన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
వృద్ధుల వైద్యసేవలకు మంత్రికి వినతి - సీనియర్ సిటీజేన్స్ రాష్ట్ర కార్యదర్శి హరి ఆశోక్ కుమార్

ఏవీ డిగ్రీ కాలేజీలో చైల్డ్ లేబర్ డే సెమినార్

పార్టీ బలోపేతానికి నూతన కార్యవర్గం కృషి చేయాలి_ బిజెపి మండల అధ్యక్షులు

స్థానిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ముందుకు సాగాలి మహిళా కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు, జగిత్యాల ఇంచార్జి సుగుణ రెడ్డి

భారత ప్రభుత్వ యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వశాఖ, లక్ష్మీ భాయ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ గ్వాలియర్ ప్రవేశ పరీక్షలకు ఎంట్రన్స్ పరీక్ష

బదిలీపై వెళ్తున్న జగిత్యాల సెర్ప్ ఎపిడి చరణ్ దాస్ _ఘనంగా వీడ్కోలు పలికిన సెర్ప్ సిబ్బంది
.jpg)
గ్రామాల్లో విజిబుల్ పోలీసింగ్ పై ప్రత్యేక దృష్టి సారించాలి, మల్లాపూర్ ,రాయికల్ పోలీస్ స్టేషన్ లను ఆకస్మికగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ అశోక్ కుమార్

యోగా శరీరాన్ని, మనస్సును, శ్వాసను ఆలోచనలను ఏకం చేస్తుంది - శ్రీ ఓం ప్రకాశ్ స్వర్ణ

రైల్వే ఉద్యోగుల సమిష్టి కృషితోనే దేశంలో నెంబర్ 4

తుల గంగవ్వ మెమోరియల్ ట్రస్ట్ అధ్వర్యంలో నోట్ బుక్స్ పంపిణి.

విద్యాశాఖ కొత్త సంచలకుని కలిసిన రాష్ట్ర ట్రస్మా బృందం

అమ్మ మాట అంగన్వాడి బడిబాట.
