నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని ఎదగాలి. -ఆర్ఎస్ఎస్ జిల్లా సంఘచాలక్, డాక్టర్ ఆకుతోట శ్రీనివాసరెడ్డి
జగిత్యాల జూన్ బుధవారం 18 (ప్రజా మంటలు) విద్యార్థులు
మారుతున్న కాలానికి అనుగుణంగా నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుపుచ్చుకొని జీవితంలో ఉన్నత స్థానం సాధించాలని ఆర్ఎస్ఎస్ జిల్లా సంఘచాలక్, ఐఎంఏ ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఆకుతోట శ్రీనివాసరెడ్డి అన్నారు.
వాల్మీకి ఆవాసం సేవా భారతి ద్వారా నిర్వహిస్తున్న ఉచిత కంప్యూటర్ శిక్షణ కేంద్రంలో రెండవ బ్యాచ్ శిక్షణ కార్యక్రమాన్ని బుధవారం ఉదయం 11 గంటలకు ప్రారంభించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా యశస్వి ఎంటర్ప్రైజెస్ అధినేత కోటగిరి శ్రీనివాస్, మాజీ కౌన్సిలర్ రంగు గోపాల్ హాజరుకాగా ప్రధాన వక్తగా డాక్టర్ ఆకుతోట శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ ఆర్ఎస్ఎస్ సేవా విభాగం సేవా భారతి ద్వారా దేశవ్యాప్తంగా 1,70,000 సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయని తెలిపారు. వాల్మీకి ఆవాసం ద్వారా ఉచిత ట్యూషన్ సెంటర్లు, బాల సంస్కార కేంద్రాలు, కుట్టు శిక్షణ కేంద్రం తో పాటు ఉచిత కంప్యూటర్ శిక్షణను అందించడం జరుగుతుందన్నారు.
ప్రతి ఒక్కరికి ఉద్యోగాలు కల్పించడం ఏ ప్రభుత్వం వల్ల కూడా సాధ్యం కాదని యువత తమ నైపుణ్యాలను పెంచుకొని స్వయం ఉపాధి కోసం ప్రయత్నించాలన్నారు. మనదేశంలో నైపుణ్యం గల యువత ఎంతో మంది ఉన్నారని వారు తమ స్టార్టప్ ల ద్వారా వందలాది మందికి ఉపాధి కల్పిస్తున్నారని తెలిపారు. కంప్యూటర్ దశ దాటి ప్రస్తుతం ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్) యుగం నడుస్తుందని ఆ దిశగా యువత తమ నైపుణ్యాలకు మరింత పదును పెట్టి జీవితము లో ఎదగాలని సూచించారు. వాల్మీకి ఆవాసం ద్వారా నిర్వహిస్తున్న ఉచిత కంప్యూటర్ శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో వాల్మీకి ఆవాస ప్రధాన కార్యదర్శి నందెల్లి మదన్మోహన్ రావు, కమిటీ సభ్యులు అశోక్ రావు,బెజ్జంకి సంపూర్ణ చారి, ఎలగందుల కైలాసం, గౌరిశెట్టి హరీష్, శిక్షణ కేంద్రం ఇంచార్జ్ సత్యం, మల్లేశం తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
జగిత్యాల మెడికల్ కళాశాలకు ఎన్ఎంసి నోటీస్ జారీ చేయడం రాష్ట్ర ప్రభుత్వానికి సిగ్గుచేటు

చిన్న వయసులోనే సామాజిక బాధ్యతతో వ్యవహరించడం అభినందనీయం

రైతుల భూ సమస్యలను మళ్ళీ కలెక్టర్,తహసీల్దార్లకు ఇవ్వడం సరికాదు

తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ నిర్వహించిన జిల్లా మహాసభ పాల్గొన్న ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ కు పెద్దమ్మ తల్లి బోనాల ఆహ్వాన పత్రిక అందజేత

నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని ఎదగాలి. -ఆర్ఎస్ఎస్ జిల్లా సంఘచాలక్, డాక్టర్ ఆకుతోట శ్రీనివాసరెడ్డి

దశాబ్దం తర్వాత నెరవేరుతున్న పేదల సొంతింటి కల

బహరేన్ లో తొమ్మిది మంది తెలంగాణ వసూల అరెస్ట్

బీజేపీ జగిత్యాల పట్టణ అధ్యక్షులు కొక్కు గంగాధర్

బోనాల జాతర నిధులు పక్కదారి పడుతున్నాయి..

ఉద్యోగ సిబ్బంది కృషితోనే సౌత్ సెంట్రల్ రైల్వేకు దేశంలో గుర్తింపు

గల్ఫ్ అడ్వైజరి బొర్డ్ కు చాంద్ పాషా విజ్ఞప్తి
