రైల్వే ఉద్యోగుల సమిష్టి కృషితోనే దేశంలో నెంబర్ 4
దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్ కుమార్ జైన్
బోయిగూడలో సౌత్ సెంట్రల్ రైల్వే ఎంప్లాయిస్ సంఘ్ 113వ జనరల్ కౌన్సిల్ సమావేశం
సికింద్రాబాద్ జూన్ 17 (ప్రజామంటలు) :
దక్షిణమద్య రైల్వే ఉద్యోగ సిబ్బంది అంకితభావంతో విధులు నిర్వర్తించడం వలనే సౌత్ సెంట్రల్ రైల్వే ఉత్తమ ఫలితాలు సాధించి దేశంలోనే నాలుగో స్థానంలో నిలిచిందని జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ అన్నారు.
దక్షిణ మధ్య రైల్వే ఎంప్లాయిస్ సంఘ్ 113వ జనరల్ కౌన్సిల్ సమావేశం మంగళవారం సికింద్రాబాద్ బోయిగూడ లోని రైల్ కళారంగ్ ఆడిటోరియంలో జరిగింది. ముఖ్యఅతిథిగా హాజరైన జనరల్ మేనేజర్ మాట్లాడుతూ... భవిష్యత్తులో కూడా ఉద్యోగులు మరింత కష్టపడి పని చేసి సౌత్ సెంట్రల్ రైల్వే జోన్ ను దేశంలోనే నెంబర్ వన్ గా చేయాలని ఆయన సూచించారు. ఎన్ ఎఫ్ ఐ ఆర్ జాతీయ కార్యదర్శి, దక్షిణ మధ్య రైల్వే ఎంప్లాయిస్ సంఘ్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ మర్రి రాఘవయ్య మాట్లాడుతూ... కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఏకీకృత పెన్షన్ విధానం, కొత్త పెన్షన్ విధానాలను తాము వ్యతిరేకిస్తున్నామని అన్నారు. పాత పెన్షన్ పద్ధతి అమలు చేసే వరకు తాము న్యాయ పోరాటం చేస్తామని అన్నారు.
8వ పే కమిషన్ ప్రకటించిన కేంద్రం ఇప్పటివరకు దానికి చైర్మన్ ను ఎందుకు నియమించలేదని ప్రశ్నించారు. రైల్వేలో కార్మికులకు కనీస వేతనం 60 వేల రూపాయలు ఉండాలని, రైల్వేలో ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని, అర్హులకు ప్రమోషన్లు ఇవ్వాలని ఈ సమావేశంలో తీర్మానించినట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా జూన్ నెల చివరన రిటైర్మెంట్ చేయబోతున్న జీఎం అరుణ్ కుమార్ ను ఎంప్లాయిస్ సంఘ్ తరఫున ఘనంగా సన్మానించారు.ఈ సమావేశంలో ప్రిన్సిపల్ చీఫ్ పర్సనల్ ఆఫీసర్ సిద్ధార్థ్ కటి, సంఘ్ సంయుక్త కార్యదర్శి భరణి భాను ప్రసాద్, జోనల్ అధ్యక్షుడు ప్రభాకర్ ఆండ్రుస్, ఎజీఎస్ లు రుద్రారెడ్డి, రవూఫ్, దక్షిణమధ్య రైల్వే లోని అన్ని డివిజన్ల నుండి పెద్ద సంఖ్యలో ప్రతినిధులు హాజరయ్యారు.
దక్షిణ మద్య రైల్వే ఎంప్లాయిస్ సంఘ్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ మర్రి రాఘవయ్య జన్మదినం సందర్బంగా ఆయనకు పలువురు బర్త్ డే శుభాకాంక్షలు తెలిపారు. కేకు కట్ చేసి, బాణసంచా కాల్చారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
వృద్ధుల వైద్యసేవలకు మంత్రికి వినతి - సీనియర్ సిటీజేన్స్ రాష్ట్ర కార్యదర్శి హరి ఆశోక్ కుమార్

ఏవీ డిగ్రీ కాలేజీలో చైల్డ్ లేబర్ డే సెమినార్

పార్టీ బలోపేతానికి నూతన కార్యవర్గం కృషి చేయాలి_ బిజెపి మండల అధ్యక్షులు

స్థానిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ముందుకు సాగాలి మహిళా కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు, జగిత్యాల ఇంచార్జి సుగుణ రెడ్డి

భారత ప్రభుత్వ యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వశాఖ, లక్ష్మీ భాయ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ గ్వాలియర్ ప్రవేశ పరీక్షలకు ఎంట్రన్స్ పరీక్ష

బదిలీపై వెళ్తున్న జగిత్యాల సెర్ప్ ఎపిడి చరణ్ దాస్ _ఘనంగా వీడ్కోలు పలికిన సెర్ప్ సిబ్బంది
.jpg)
గ్రామాల్లో విజిబుల్ పోలీసింగ్ పై ప్రత్యేక దృష్టి సారించాలి, మల్లాపూర్ ,రాయికల్ పోలీస్ స్టేషన్ లను ఆకస్మికగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ అశోక్ కుమార్

యోగా శరీరాన్ని, మనస్సును, శ్వాసను ఆలోచనలను ఏకం చేస్తుంది - శ్రీ ఓం ప్రకాశ్ స్వర్ణ

రైల్వే ఉద్యోగుల సమిష్టి కృషితోనే దేశంలో నెంబర్ 4

తుల గంగవ్వ మెమోరియల్ ట్రస్ట్ అధ్వర్యంలో నోట్ బుక్స్ పంపిణి.

విద్యాశాఖ కొత్త సంచలకుని కలిసిన రాష్ట్ర ట్రస్మా బృందం

అమ్మ మాట అంగన్వాడి బడిబాట.
