బాసర ఘటనపై జాతీయ మానవ హక్కుల కమిషన్ కు ఫిర్యాదు
సికింద్రాబాద్, జూన్ 16 ( ప్రజామంటలు) :
నిర్మల్ జిల్లా బాసర - ప్రసిద్ధ పుణ్యక్షేత్రంలో గోదావరి నది నీటిలో మునిగి ఐదుగురు యువకులు దుర్మరణం పాలైన ఘటనపై ప్రముఖ న్యాయవాది రామారావు ఇమ్మానేని జాతీయ మానవ హక్కుల కమిషన్ కు ఫిర్యాదు చేశారు. స్పందించిన జాతీయ మానవ హక్కుల కమిషన్ ఆయన పిటిషన్ ను విచారణకు స్వీకరించి కేసు నెంబర్ 14075/IN/2025 గా నమోదు చేసింది. ఐదు నిండు ప్రాణాలు గల్లంతుకు అధికారుల నిర్లక్ష్యమే కారణమన్నారు.
బాసర క్షేత్ర గోదావరి లోని పుష్కరఘాట్ లో ఎలాంటి హెచ్చరిక సూచికలు, కంచెలు, మైక్ అనౌన్స్ మెంట్ లు లేవని, దరిదాపుల్లో గజ ఈతగళ్లు లేరని, కనీసం లైఫ్ జాకెట్లు లాంటి భద్రత ఏర్పాట్లు ఏవీ లేవన్నారు. ఘటన జరిగిన వెంటనే అధికారులు తక్షణం స్పందించలేదని ఫిర్యాదు లో పేర్కొన్నారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన అధికారులపై చర్యలు తీసుకునే విధంగా ఆదేశాలు జారీ చేయాలని అడ్వకేట్ రామారావు పిటిషన్ లో కోరారు. మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా రాష్ర్ట ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
జాగ్రత్త గా ఉండండి... ఎన్నో రకాల డిజిటల్ మోసాలు

మాజీ మంత్రి హరీష్ రావుకు అస్వస్థత.. కిమ్స్ లో అడ్మిట్

వసతులు పెంచండి...వైద్య సిబ్బంది ఖాళీ పోస్టులను భర్తీ చేయండి - కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ముగిసిన కేటీఆర్ ఏసీబి విచారణ.

బైక్ పై ఒరిస్సా నుండి గంజాయి తరలిస్తున్న ముగ్గురు అరెస్ట్ తిమ్మాపూర్ సిఐ సదన్ కుమార్

బాసర ఘటనపై జాతీయ మానవ హక్కుల కమిషన్ కు ఫిర్యాదు

నవదుర్గ పీఠ క్షేత్రం రెండో వార్షికోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్సీ కవిత ,తొలి జడ్పీ చైర్ పర్సన్ దావ వసంత

రైతు నేస్తం రైతులతొ ముఖాముఖి వీడియో కాన్ఫరెన్స్ కార్యక్రమం
.jpg)
ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు భూమి పూజ

టీపీసీసీ జనరల్ సెక్రటరీగా రామారావు గౌడ్ *ఘనంగా సత్కరించిన ఐఎన్టీయూసీ 3194 నేతలు
.jpg)
బాధితుల సమస్యల పరిష్కారానికే గ్రీవెన్స్ డే జిల్లా ఎస్పీ అశోక్ కుమార్,

ముల్కనూర్ సొసైటీ కార్యవర్గ సభ్యుర్యాలిగా నామినేషన్ పత్రాలు సమర్పించిన కాశిరెడ్డి వసంత
