చిన్న హనుమాన్ జయంతి ఉత్సవాల విజయవంత నిర్వహణకు కృతజ్ఞతలుగా జిల్లా ఎస్పీకి సత్కారం
గొల్లపల్లి ఎప్రిల్ 14 (ప్రజా మంటలు):
కొండగట్టు ఆంజనేయ స్వామి దేవస్థానంలో చిన్న హనుమాన్ జయంతి ఉత్సవాలు అత్యంత వైభవంగా, శాంతియుతంగా నిర్వహించబడిన సందర్భంగా, ఈ ఉత్సవాల నిర్వహణకు అవసరమైన భద్రతా ఏర్పాట్లను సమర్థవంతంగా చేపట్టిన జిల్లా పోలీస్ శాఖకు కృతజ్ఞతగా, ఆలయ ఈవో శ్రీకాంత్ రావు జిల్లా ఎస్పీ శ్రీ అశోక్ కుమార్ ను జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలసి, శాలువాతో సత్కరించారు.
ఈ సందర్భంగా ఆలయ ఈవో శ్రీకాంత్ రావు మాట్లాడుతూ, జయంతి ఉత్సవాల రోజులలో భక్తులు ఎటువంటిఇబ్బందులు లేకుండా, భద్రతతో కూడిన శాంతియుత వాతావరణంలో దర్శనం చేసుకునేలా చర్యలు తీసుకున్న పోలీస్ శాఖకు మనఃపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అన్నారు.
ఈ సందర్భంగా ఎస్పీమాట్లాడుతూ.. జయంతి సందర్భంగా వేలాది మంది భక్తులు హాజరయ్యారు. ఈ ఉత్సవాలు ప్రశాంతంగా పూర్తయ్యేందుకు సహకరించిన హనుమాన్ మాల విరమణ భక్తులకు, ప్రజలకు, పోలీస్ శాఖ తరపున కృతజ్ఞతలు. ఇతర జిల్లాల నుంచి సాయం చేసిన పోలీసు బృందాల సహకారం, క్షేత్రస్థాయిలో పనిచేసిన జగిత్యాల జిల్లా పోలీస్ అధికారులు, సిబ్బంది ఈ ఉత్సవాలు విజయవంతంగా జరిగాయి అన్నారు. అదే విధంగా భవిష్యత్తులో నిర్వహించబోయే పండుగలు, కార్యక్రమాల సందర్భాలలో కూడా పోలీసు శాఖ తరపున పూర్తిస్థాయి భద్రతా ఏర్పాట్లకు ఎల్లవేళలా ముందుంటామని తెలిపారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
గాంధీ టెర్రస్ లపై రెడ్ క్రాస్ సింబల్ ల ఏర్పాటు..

అమరవీరుడు మురళి నాయక్ ఆత్మ శాంతి చేకూర్చాలని కొవ్వొత్తుల ర్యాలీ

రత్నాకర్ రావు సేవలు నేటి తరానికి స్ఫూర్తిదాయకం....ఎమ్మేల్యే డా.సంజయ్

ఆపరేషన్ సింధూర్ కు మద్దతుగా బి.ఆర్.ఎస్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు

కరెంటు షాక్ తో మరణించిన కుటుంబానికి ప్రభుత్వం ద్వారా 5 లక్షల ఆర్థిక సహాయం అందజేసిన జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

భారత రక్షక దళాలకు మద్దతుగా పాత్రికేయుల సంఘీభావ ర్యాలీ

శ్రీ రాధా రుక్మిణి సత్యభామ సమేత మధన వేణుగోపాలస్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా కళ్యాణ వేడుకలు

వాసవి మాత ఆలయంలో ఘనంగా గురువారాల ఏకాదశి ఉద్యాపన ఉత్సవము

సీఎం సహాయ నిధి నిరుపేదల పాలిట వరం 8లక్షల ఎల్ ఓ సి అందజేసిన జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

శ్రీ సూర్య ధనవంతరి ఆలయంలో బ్రహ్మోత్సవాలలో భాగంగా కుంకుమార్చనలు పాల్గొన్న బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు డా భోగ శ్రావణి

ఆపరేషన్ సింధూర్ విజయవంతం కావాలని, సైనికులకు మనోధైర్యం కల్పించాలని దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో పూజలు

జగిత్యాల ప్రధాన కూడల్లో ఉన్నటువంటి అక్రమ షెడ్లను తొలగించాలి. -విశ్వహిందూ పరిషత్ నాయకులు
