మన దేశ సనాతన ధర్మం, సంప్రదాయాలు ఎంతో గొప్పవి -రాష్ర్ట గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ
స్కందగిరి ఆలయంలో వేద విద్వాన మహాసభకు హాజరు
సికింద్రాబాద్, అక్టోబర్ 09 ( ప్రజామంటలు ) :
మన భారతీయుల జీవన ప్రమాణాలు, సనాతన ధర్మం, సంస్కృతి సాంప్రదాయాలు ఎంతో గొప్పవని, అవి మన వేద విజ్ఞానంతో ముడిపడి ఉన్నాయని రాష్ర్ట గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అన్నారు. మన దేశ ప్రాచీన సంస్కృతి, అసలైన దేశచరిత్ర, వేదాలను నేటి తరం తెలుసుకోవాలని ఆయన సూచించారు. పద్మారావునగర్ లోని స్కందగిరి శ్రీసుబ్రహ్మాణ్యస్వామి ఆలయంలో జరుగుతున్న శ్రీ జనార్ధనానంద సరస్వతీ స్వామి సంస్కృతి ట్రస్ట్ రజతోత్సవాలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈసందర్బంగా తెలంగాణ వేద విద్వాన మహాసభల నిర్వాహకులను ఆయన అభినందించారు. రజతోత్సవాల ప్రత్యేక సంచికను ఈసందర్బంగా గవర్నర్ విడుదల చేశారు. శ్రీస్కందగిరి స్వామి ఆలయ ఛైర్మన్, రిటైర్ట్ ఐఏఎస్ అధికారి ఎల్వీ సుబ్రహ్మాణ్యం, ఆలయ మేనేజింగ్ ట్రస్టీ కృష్ణన్ రాజమణి, శ్రీజనార్ధన సరస్వతీ స్వామి సంస్కృతి ట్రస్ట్ చైర్మన్ తూములూరి సాయినాథ్ శర్మ, కార్యదర్శి బ్రహ్మానంద శర్మ,చింతపల్లి సుబ్రహ్హాన్యం, ఎన్వీ శ్రావణ్ తో పాటు పలువురు ప్రముఖులు, వేద పండితులు, వేద విద్యార్థులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.:
More News...
<%- node_title %>
<%- node_title %>
గాంధీలో ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం

ఈనెల 12న సికింద్రాబాద్ లో ముదిరాజ్ ల దసరా సమ్మేళనం

బీసీ రిజర్వేషన్ల కార్యరూపానికి అంతా ఒకటవ్వాలి

రైల్ నిలయం వద్ద రైల్వే పింఛనర్ల ఆందోళన

రాష్ర్టంలో వేద పాఠశాలల అభివృద్దికి కృషి చేస్తాం - రాష్ర్ట దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ

గాంధీలో ఉచిత వాటర్ ప్యూరిఫైడ్ సెంటర్స్ ప్రారంభం

మెటా ఫండ్ నిందితుల అరెస్ట్ ల్యాప్ టాప్, ఏటీఎం ,క్రెడిట్ కార్డ్స్ పాస్బుక్కుల స్వాధీనం_ ఎస్పీ అశోక్ కుమార్

కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తా ఆదిలాబాద్ ,మంచిర్యాల టిపిసిసి ఆర్గనైజర్ , అబ్జర్వర్ గా అడువాల జ్యోతి
.jpg)
సైబర్ నేరాలపై ఆధునిక చట్టాలపై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలి _ పట్టణ సిఐ కరుణాకర్

మారియా కొరినా మచడో: 2025 నోబెల్ శాంతి బహుమతి

తీన్మార్ మల్లన్నకు మద్దతు పలికిన ప్రజాసేన పార్టీ అధ్యక్షులు ఆకుల హనుమాండ్లు

మున్సిపల్ స్టాండింగ్ కౌన్సిల్ మెంబర్ గా సిరిపురం మహేంద్ర నాథ్
