చెవి, ముక్కు, గొంతు వ్యాధులపై ఆధునిక చికిత్సా విధానాలపై సెమినార్
రాష్టంతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న 700 మంది ఈఎన్టీ వైద్యుల హాజరు
గాంధీ లో రెండు రోజుల మహాసభ
సికింద్రాబాద్, సెప్టెంబర్ 20 (ప్రజామంటలు) :
సికింద్రాబాద్ గాంధీ మెడికల్ కాలేజ్ లో ఈఎన్టి డాక్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర స్థాయి ఈఎన్టి వైద్యుల మహాసభ (AOI TG CON–2025) ఘనంగా నిర్వహించారు. రెండు రోజులపాటు జరిగే ఈ రాష్ట్ర స్థాయి సదస్సులో కాళోజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ పి వి నందకుమార్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ చెవి, ముక్కు, గొంతు సంబంధిత వ్యాధులపై ఆధునిక చికిత్సా విధానాలు, శస్త్ర చికిత్సలో నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి శస్త్ర చికిత్సలు నిర్వహించే పద్ధతులపై ఈ తరం వైద్యులకు ఇలాంటి సదస్సులు ఎంత ఉపయోగపడతాయని ఆయన అన్నారు. తాము కూడా రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో తాజా టెక్నాలజీ ద్వారా రోగులకు మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తామని అన్నారు.
సీనియర్ల అనుభవాలు సలహాలు సూచనలు జూనియర్ డాక్టర్లకు ఎంత అవసరమని, చక్కటి సదస్సు ఏర్పాటు చేసిన నిర్వాహకులను ఆయన అభినందించారు. గాంధీ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ డాక్టర్ కే ఇందిరా, గాంధీ హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ ఎన్ వాణి, తెలంగాణ ఈ ఎన్ టీ వైద్యుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ శోభన్ బాబు, ఎలెక్టెడ్ అధ్యక్షుడు డాక్టర్ వెంకటరామిరెడ్డి, రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి డాక్టర్ భూపేందర్ సింగ్ రాథోడ్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ రమేష్, కార్యదర్శి డాక్టర్ ఆనంద్ హాజరయ్యారు. ఈ సదస్సులో తెలంగాణ తోపాటు దేశవ్యాప్తంగా పేరుపొందిన 700 మంది ఈఎన్టి వైద్యులు, పరిశోధకులు పాల్గొన్నారు. రాష్ట్ర నిర్వాహక కార్యదర్శి డా. జె.బి.ఎస్. రాథోడ్ మాట్లాడుతూ, “AOI TG CON–2025 మహాసభ ద్వారా యువ వైద్యులకు కొత్త జ్ఞానం, శిక్షణ లభిస్తుందని, సీనియర్ నిపుణుల అనుభవాలను పంచుకోవడం ద్వారా వైద్య రంగానికి, యువ వైద్యులకు మరింత మేలు కలుగుతుందని అన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
బీసీ రిజర్వేషన్ల కార్యరూపానికి అంతా ఒకటవ్వాలి

రైల్ నిలయం వద్ద రైల్వే పింఛనర్ల ఆందోళన

రాష్ర్టంలో వేద పాఠశాలల అభివృద్దికి కృషి చేస్తాం - రాష్ర్ట దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ

గాంధీలో ఉచిత వాటర్ ప్యూరిఫైడ్ సెంటర్స్ ప్రారంభం

మెటా ఫండ్ నిందితుల అరెస్ట్ ల్యాప్ టాప్, ఏటీఎం ,క్రెడిట్ కార్డ్స్ పాస్బుక్కుల స్వాధీనం_ ఎస్పీ అశోక్ కుమార్

కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తా ఆదిలాబాద్ ,మంచిర్యాల టిపిసిసి ఆర్గనైజర్ , అబ్జర్వర్ గా అడువాల జ్యోతి
.jpg)
సైబర్ నేరాలపై ఆధునిక చట్టాలపై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలి _ పట్టణ సిఐ కరుణాకర్

మారియా కొరినా మచడో: 2025 నోబెల్ శాంతి బహుమతి

తీన్మార్ మల్లన్నకు మద్దతు పలికిన ప్రజాసేన పార్టీ అధ్యక్షులు ఆకుల హనుమాండ్లు నల్ల బ్యాడ్జీలతో జాతీయ రహదారిపై నిరసన... అడ్డుకున్న పోలీసులు

మున్సిపల్ స్టాండింగ్ కౌన్సిల్ మెంబర్ గా సిరిపురం మహేంద్ర నాథ్

ప్రతి సభ్యుడు యూనియన్ నిబంధనలకు లోబడి నడుచుకోవాలి ఐజేయు అనుబంధ ప్రెస్ క్లబ్ ల ఏర్పాటుకు తోడ్పడాలి

మానసిక ఆరోగ్యం తోనే సమాజం అభివృద్ధి -సీనియర్ సివిల్ జడ్జి డి. నాగేశ్వర్ రావు
