బైకుల దొంగ దంపతులను పట్టించిన సీసీ టీవీ ఫుటేజీ
మద్యం, సిగరేట్లకు అలవాటై...బైక్ దొంతనాలు..
రూ.5లక్షల విలువ చేసే ఆరు బైకుల స్వాధీనం
సికింద్రాబాద్, సెప్టెంబర్ 04 (ప్రజామంటలు) :
ప్రభుత్వ ఆసుపత్రులను టార్గెట్చేసుకుంటూ వరుసగా బైక్ దొంగతనాలు చేస్తున్న ఇద్దరు దొంగ దంపతులను చిలకలగూడ పోలీసులు పట్టుకున్నారు. వీరి వద్ద నుంచి రూ.ఐదు లక్షల విలువ చేసే ఆరు ద్వి చక్రవాహనాలను స్వాధీనం చేసుకున్నారు. చిలకలగూడ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆలేరు మండలానికి చెందిన కొటగిరి వినోద్ (30), అతని భార్య పావని (19)లు మద్యం, సిగరెట్ అలవాట్లకు డబ్బు కోసం బైక్ దొంగతనాలు చేస్తున్నారు. గాంధీ ఆసుపత్రి సహా జనసంచారం ఎక్కువగా ఉండే ప్రభుత్వ ఆసుపత్రుల వద్ద పార్క్ చేసిన బైక్లను అపహరిస్తూ వచ్చారు. ఆగస్టు 20న గాంధీ ఆసుపత్రి పార్కింగ్లో నిలిపిన బైక్దొంగతనంపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సీసీటీవీ ఆధారాలతో వారిని గుర్తించారు.సెప్టెంబర్ 3న ఉదయం చిలకలగూడ పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
వారి వద్ద నుంచి గాంధీలో దొంగిలించిన నాలుగు బైక్లు, భువనగిరి టౌన్ పోలీస్స్టేషన్ పరిధిలో మరో రెండు బైక్లు సహా మొత్తం ఆరు బైక్లు (విలువ రూ.5 లక్షలు) స్వాధీనం చేసుకున్నారు. ఈ ఆపరేషన్ను ఈస్ట్జోన్ డీసీపీ డాక్టర్ బీ. బాలస్వామి, అదనపు డీసీపీ జె. నర్సయ్య, ఏసీపీ కే. శశాంక్రెడ్డి నేతృత్వంలో చిలకలగూడ పోలీసులు విజయవంతంగా నిర్వహించారు. కేసును చేధించిన సీఐ అనుదీప్,డీఐ రమేశ్ గౌడ్,ఎస్.ఐ రాకేశ్ లను అభినందించి, రివార్డులను అందచేశారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
దివ్యత్వానికి ప్రతిరూపం శ్రీకృష్ణ తత్వం

15, 516లు పలికిన రంగమ్మ గూడెం వినాయక లడ్డు

జగిత్యాలలో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు

బుగ్గారంలో BRS పార్టీ లో చేరిన కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తలు

కేసీఆర్ ను తిట్టడం కాదు, ప్రజలను పట్టించుకోండి - జగిత్యాల BRS నాయకుల సలహా

దాతల సహకారంతో వెలుగులోకి విద్యార్థుల ప్రతిభ _ దాతల దాతృత్వం అభినందనీయం జిల్లా విద్యాధికారి రాము

ఎస్ కే ఎన్ ఆర్ జగిత్యాల అధ్యాపకునికి తెలంగాణ రాష్ట్ర ఉత్తమ అధ్యాపకునిగా అవార్డు

మహిళా ప్రతిభకు వేదిక..ఫ్యాషన్ షో

కెన్యాలో ఘనంగా గణేశుడి నిమజ్జన సెలబ్రేషన్స్

అమిత్ షా హైదరాబాద్ పర్యటన రద్దు
1.jpeg)
2026 కల్లా 1.50. లక్షలకు చేరువగా 10 గ్రామ్ ల బంగారం ధర
-overlay.jpeg.jpg)
విద్యుత్ గణేష మంటపం వద్ద అన్న ప్రసాద వితరణ
