భక్తి శ్రద్ధలతో ఏకాదశి వేడుకలు -  ధర్మపురిలో భక్తుల దైవ దర్శనాలు

On
భక్తి శ్రద్ధలతో ఏకాదశి వేడుకలు -  ధర్మపురిలో భక్తుల దైవ దర్శనాలు

( రామ కిష్టయ్య సంగన భట్ల)
ధర్మపురి సెప్టెంబర్ 03:
సుప్రసిద్ధ గోదావరీ తీరస్థ ప్రాచీన పుణ్య తీర్ధ మైన ధర్మపురి క్షేత్రంలో, భాద్రపద శుద్ధ ఏకాదశి పర్వ దిన వేడుకలను బుధ
వారం సాంప్రదాయ రీతిలో వైభవంగా జరుపుకున్నారు. దీనినే వామన ఏకాదశి అంటారు. ఆషాఢ శుద్ధ ఏకాదశినాడు విష్ణువు నిద్రకు ఉపక్రమించి, బాద్రపద ఏకాదశికి రెండు నెలలు అయిన సందర్భంగా పక్కకు ఒత్తిగిల్లు తాడు. ఆ ఒత్తిలడం ఎడమ నుండి కుడికి కనుక దీనిని "పర్శ్వ పరివర్తినేకా దశి" అని కూడా అంటారు.

ఏకాదశి పర్వదిన సందర్భంగా సుదూర ప్రాంతాలనుండి, ఆర్టీసీ బస్సులలో, ప్రైవేటు వాహనాలలో బుధ
వారం ఉదయాత్పూర్వం నుండి శ్రమకోర్చి ఏతెంచిన భక్తులు, గోదావరి నదిలో మంగళ స్నానాలు ఆచరించి, గోదావరి మాతను పూజించి, మొక్కులు చెల్లించు కున్నారు.

IMG-20250903-WA0040 అనంతరం దైవ దర్శనార్ధం దేవాలయాలకు తరలి వెళ్ళారు. దేవస్థానం ఈఓ శ్రీనివాస్, జక్కు రవీందర్ నేతృత్వం లోని ధర్మ కర్తల,  సూపరింటెండెంట్ కిరణ్ ఆధ్వర్యంలో ఆస్థాన వేద పండితులు బొజ్జా రమేశ శర్మ, ఆర్చక పురోహి తులు బొజ్జా సంతోష శర్మ, సంపత్ కుమార శర్మ, పాలెపు ప్రవీణ్ శర్మ, రాజగోపాల శర్మ, దేవాలయాల అర్చకులు విధివిధాన వేదోక్త, పంచోపనిషత్ యుక్త ప్రత్యేక పర్వ దిన పూజలు, నిత్య కళ్యాణాదులను నిర్వహించారు. 


 ఏకాదశి తిథి పర్వదినాన వివిధ ఆలయాలలో క్షీరాభిషేకాది కార్యక్రమాలను కన్నుల పండువగా నిర్వహించారు. అశేష భక్తులు ఏకాదశి సందర్భ ప్రత్యేక పూజలలలో పాల్గొన్నారు. బుధవార సహిత ఏకాదశి పర్వదిన సందర్భంలో క్షేత్ర ముత్తయిదువులు ప్రత్యేక వ్రతాలను ఆచరించారు.

Tags

More News...

Local News 

విద్యార్ధి దశ నుండే సైబర్ నేరాల నివారణ పై అవగాహన కలిగి ఉండాలి: సైబర్ క్రైమ్ డీఎస్పీ వెంకటరమణ

విద్యార్ధి దశ నుండే సైబర్ నేరాల నివారణ పై అవగాహన కలిగి ఉండాలి: సైబర్ క్రైమ్ డీఎస్పీ వెంకటరమణ    జగిత్యాల సెప్టెంబర్ 3 (ప్రజా మంటలు) జిల్లా ఎస్పీ  అశోక్ కుమార్  ఆదేశాలమేరకు సైబర్ నేరాలు నివారణ , సైబర్ భద్రత   అవగాహన గురించి ప్రతి నెల మొదటి బుధవారం రోజున *సైబర్ జాగౄక్త దివాస్* అనే ప్రత్యేక కార్యక్రమం జిల్లా లోని అన్ని పోలీస్ స్టేషన్లో పరిధిలో వివిధ పాఠశాలల్లో ఉన్న విద్యార్థులకు, యువతకు,...
Read More...
Local News 

రెడ్ బుల్స్ గణేష్ మంటపం వద్ద ఘనంగా కుంకుమార్చనలు 

రెడ్ బుల్స్ గణేష్ మంటపం వద్ద ఘనంగా కుంకుమార్చనలు  జగిత్యాల సెప్టెంబర్ 3) ప్రజా మంటలు) జిల్లా కేంద్రంలోని బ్రాహ్మణ వీధిలో రెడ్ బుల్స్ యూత్ అసోసియేషన్ వినాయక మండపం వద్ద బుధవారం సాయంత్రం మాతలచే సామూహిక కుంకుమార్చన నిర్వహించారు. భక్తులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంగళహారతి, మంత్రపుష్పం అనంతరం భక్తులకు తీర్థ ప్రసాద వితరణ, ఆశీర్వచనం చేశారు. అమ్మవారి నామస్మరణతో మంటపమంతా...
Read More...
Local News 

శ్రీ లలిత నారాయణ రెసిడెన్సిలో ఘనంగా కుంకుమార్చన, దీపాలంకరణ 

శ్రీ లలిత నారాయణ రెసిడెన్సిలో ఘనంగా కుంకుమార్చన, దీపాలంకరణ  జగిత్యాల సెప్టెంబర్ 3( ప్రజా మంటలు) జగిత్యాల జిల్లా కేంద్రంలోని గోవిందపల్లి శ్రీ లలితా నారాయణ రెసిడెన్సీల కుటుంబాల వారిచే బుధవారం సామూహిక కుంకుమార్చన కార్యక్రమం నిర్వహించారు. మహిళలు విశేష సంఖ్యలో పాల్గొని కుంకుమార్చన నిర్వహించారు. అమ్మవారి నామస్మరణతో గణేశ మంటపం రెసిడెన్సి ఆవరణ అంతా మారుమోగింది. కుంకుమార్చన అనంతరం పాల్గొన్న మహిళలకు తీర్థ ప్రసాద...
Read More...

భక్తి శ్రద్ధలతో ఏకాదశి వేడుకలు -  ధర్మపురిలో భక్తుల దైవ దర్శనాలు

భక్తి శ్రద్ధలతో ఏకాదశి వేడుకలు -  ధర్మపురిలో భక్తుల దైవ దర్శనాలు ( రామ కిష్టయ్య సంగన భట్ల)ధర్మపురి సెప్టెంబర్ 03:సుప్రసిద్ధ గోదావరీ తీరస్థ ప్రాచీన పుణ్య తీర్ధ మైన ధర్మపురి క్షేత్రంలో, భాద్రపద శుద్ధ ఏకాదశి పర్వ దిన వేడుకలను బుధవారం సాంప్రదాయ రీతిలో వైభవంగా జరుపుకున్నారు. దీనినే వామన ఏకాదశి అంటారు. ఆషాఢ శుద్ధ ఏకాదశినాడు విష్ణువు నిద్రకు ఉపక్రమించి, బాద్రపద...
Read More...
Local News 

విఘ్నేశ్వర స్వామికి విద్యార్థుల పూజలు

విఘ్నేశ్వర స్వామికి విద్యార్థుల పూజలు కరీంనగర్ సెప్టెంబర్ 03 (ప్రజా మంటలు): వినాయక చవితి నవరాత్రోత్సవాలు పురస్కరించుకుని, స్థానిక జ్యోతినగర్ లోని సాధన స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ లో ప్రత్యేక పూజలు నిర్వహించారు.వినాయక చవితి నుండి నేటి వరకు ప్రతి దినం విద్యార్థులచే పూజలు అందుకుంటున్న విఘ్నేశ్వరుడికి విద్యార్థులు అత్యంత భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించి విద్యా సద్బుద్ధి కలగాలని భగవంతుణ్ణి...
Read More...
Local News  State News 

కవితపై వేటు – సరైన నిర్ణయమే - మాజీ మంత్రి, ఎమ్మెల్యే మల్లారెడ్డి

కవితపై వేటు – సరైన నిర్ణయమే - మాజీ మంత్రి, ఎమ్మెల్యే మల్లారెడ్డి సికింద్రాబాద్, సెప్టెంబర్ 03 ( ప్రజామంటలు) : బీఆర్‌ఎస్‌ అధిష్టానం ఎమ్మెల్సీ కవితపై వేటు వేసిన విషయంపై మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి స్పందించారు. బుధవారం బోయిన్‌పల్లి శ్రీ వెంకటేశ్వర లారీ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన గణనాథుడి ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈసందర్బంగా మీడియాతో మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్ పార్టీని ధిక్కరించిన కవితపై...
Read More...
State News 

సామాజిక తెలంగాణ కోసం చర్చించి త్వరలో నిర్ణయం - కల్వకుంట్ల కవిత 

సామాజిక తెలంగాణ కోసం చర్చించి త్వరలో నిర్ణయం - కల్వకుంట్ల కవిత  హైదరాబాద్ సెప్టెంబర్ 03 (ప్రజా మంటలు):ప్రస్తుతానికి బీ ఆర్ ఎస్ పార్టీకి రాజీనామా చేశా... ఆ పార్టీ ఇచ్చిన ఎమ్మెల్సీ పదవిని వదిలేసా..!మా అమ్మను కలవలేక పోతున్న అదొక్కటే బాధ..నేను భవిష్యత్తులో ఏం చేయాలనే విషయంపై బీసీ బిడ్డలతో.. సామాజిక తెలంగాణ కోసం పాటుపడే మేధావులతో.. జాగృతి నాయకులు కార్యకర్తలతో చర్చించే...
Read More...
State News 

రేవంత్ రెడ్డి తో హరీశ్ రావు కుమ్మక్కు - ఖండించిన రేవంత్ రెడ్డి 

రేవంత్ రెడ్డి తో హరీశ్ రావు కుమ్మక్కు - ఖండించిన రేవంత్ రెడ్డి  కవిత వ్యాఖ్యలపై స్పందించిన సీఎం రేవంత్‌ హైదరాబాద్ సెప్టెంబర్ 03 (ప్రజా మంటలు): ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన కల్వకుంట్ల కవిత రేవంత్ రెడ్డి తో హరీశ్ కుమ్ముక్కైనట్లు ఆరోపించారు.ఈ ఆరోపణలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఖండించారు. వారి ప్రకటనలు: కవిత ప్రెస్ మీట్.... ఒకే విమానంలో రేవంత్‌తో కలిసి హరీష్‌ ప్రయాణించారు, రేవంత్‌కు హరీష్‌రావు...
Read More...
National  State News 

ఎమ్మెల్సీ పదవికి, పార్టీకి కల్వకుంట్ల కవిత రాజీనామా

ఎమ్మెల్సీ పదవికి, పార్టీకి కల్వకుంట్ల కవిత రాజీనామా హరీష్ రావు వల్లే జగ్గారెడ్డి,విజయశాంతి, డా.విజయరామారావు, ఈటెల పార్టీ వీడారు - కవిత  రేవంత్ రెడ్డి తో కుమ్మక్కు - అందుకే వీరిపై కేసులు ఉండవు పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి ఎవరు? సంతోష్ రావు క్లాస్మెంట్ అందుకే వీటి అవినీతిపై కేసులు లేవు మహిళా నాయకులు నాకు వ్యతిరేకంగా ప్రెస్ మీట్ - స్వాగతం  హైదరాబాద్...
Read More...
Local News 

రైళ్లపై రాళ్ల దాడులు – 33 మంది అరెస్టు

రైళ్లపై రాళ్ల దాడులు – 33 మంది అరెస్టు రెండు నెలల్లో 54 రాళ్ళ దాడి కేసులు నమోదు సికింద్రాబాద్, సెప్టెంబర్ 02 (ప్రజామంటలు) : దక్షిణ మధ్య రైల్వే పరిధిలో రైళ్లపై రాళ్లు రువ్విన వారిపై, రైల్వే ట్రాక్‌లపై ప్రమాదకర వస్తువులు ఉంచిన వారిపై రైల్వే రక్షణ దళం (ఆర్‌పిఎఫ్) కఠిన చర్యలు చేపట్టింది. జూలై 1 నుండి ఆగస్టు 31 వరకు మొత్తం...
Read More...
Local News 

గణేశ్ నిమజ్జనోత్సవానికి ఏర్పాట్లు పూర్తి చేయాలి : జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్  గణేష్ నిమజ్జనోత్సవానికి పటిష్ట బందోబస్తు: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ 

గణేశ్ నిమజ్జనోత్సవానికి ఏర్పాట్లు పూర్తి చేయాలి : జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్  గణేష్ నిమజ్జనోత్సవానికి పటిష్ట బందోబస్తు: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్  గణేశ్ నిమజ్జన ప్రాంతాలను ప్రత్యక్షంగా పరిశీలించిన జిల్లా కలెక్టర్,ఎస్పీ జగిత్యాల /మెట్పల్లి సెప్టెంబర్ 2 (ప్రజా మంటలు)   గణేశ్ నిమజ్జనO శాంతియుతంగా, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా సజావుగా జరిగేలా అన్ని విభాగాలు సమన్వయంతో కట్టుదిట్టమైన ఏర్పాట్లు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్  సత్య ప్రసాద్  అన్నారు.  జిల్లా ఎస్పి  అశోక్ కుమార్  తో కలిసి...
Read More...
Local News 

జిల్లా పరిధిలో సిటీ పోలీస్ యాక్ట్ అమలు: జిల్లా ఎస్పీ  అశోక్ కుమార్ 

జిల్లా పరిధిలో సిటీ పోలీస్ యాక్ట్ అమలు: జిల్లా ఎస్పీ  అశోక్ కుమార్    జగిత్యాల సెప్టెంబర్ 2 ( ప్రజా మంటలు)జిల్లాలో శాంతి భద్రతలను దృష్టిలో వుంచుకొని నెల రోజుల (సెప్టెంబర్ 1వ తేది నుండి 30 వరకు) పాటు జిల్లా వ్యాప్తంగా పోలీసు యాక్ట్  అమలులో ఉంటుందని జిల్లా ఎస్పీ   తెలిపినారు. దీని ప్రకారం పోలీసు అధికారుల అనుమతి లేకుండా ఎలాంటి ధర్నాలు, రాస్తా రోకోలు, నిరసనలు,...
Read More...