సింగరేణి లాభాలలో 35%బోనస్, పెండింగ్ సమస్యల పరిష్కారానికి బొగ్గుగని కార్మిక సంఘం ధర్నా

On
సింగరేణి లాభాలలో 35%బోనస్, పెండింగ్ సమస్యల పరిష్కారానికి బొగ్గుగని కార్మిక సంఘం ధర్నా

కొత్తగూడెం సెప్టెంబర్ 03 (ప్రజా మంటలు):

తెలంగాణ కార్మిక సంఘం అధ్యక్షులు, మాజీ మంత్రి   కొప్పుల ఈశ్వర్, మిర్యాల రాజి రెడ్డి, ముఖ్య ప్రధాన కార్యదర్శి కాపు కృష్ణ, జనరల్ సెక్రెటరీ సురేందర్ రెడ్డి వర్కింగ్ ప్రెసిడెంట్ మాదాసు రామ్మూర్తి సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఆధ్వర్యంలో తెలంగాణ బొగ్గు గని సంఘం ఆధ్వర్యంలో కొత్తగూడెం హెడ్ ఆఫీస్ ముందు  ధర్నా నిర్వహించారు. 

ఈ ధర్నా కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా జిల్లా పార్టీ అధ్యక్షులు పినపాక మాజీ శాసనసభ్యులు రేగా కాంతారావు, వనమా వెంకటేశ్వరరావు, హరిప్రియ  నాయక్, మాజీ గ్రంథాలయ చైర్మన్ దిండిగల  రాజేందర్, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ కాపు సీతాలక్ష్మి, ఎంపీపీ బదవత్ శాంత, వనమా రాఘవ పాల్గొన్నారు. IMG-20250902-WA0009

సింగరేణి సంస్థ 2024-25 ఆర్థిక సంవత్సరంలో సాధించిన వాస్తవ లాభాలు వెల్లడించడంతోపాటు 35% వాటా ప్రకటించి మరియు పెండింగ్ సమస్యలను తక్షణమే పరిష్కరించాలలని డిమాండ్ చేశారు. అదేవిధంగా సింగరేణి కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడంలో యాజమాన్యం అసాధారణ జాప్యం చేస్తున్నది. 

పెరిగిన రాజకీయ జోక్యం - కొప్పుల ఈశ్వర్ 

సింగరేణి సంస్థలో మునుపెన్నడూ లేని విధంగా రాజకీయ జోక్యం విపరీతంగా పెరిగిపోయింది. సింగరేణి యాజమాన్యం బొగ్గు ఉత్పత్తి, కార్మికుల రక్షణ, సంస్థ ఆస్తులను కాపాడుతూ కొత్త బొగ్గు గనులను తీసుకురావడానికి కృషి చేయవలసిన బాధ్యతలను విస్మరించింది. అందుకు విరుద్ధంగా అధికార పార్టీ ఎమ్మెల్యేల కార్యాలయాల వద్ద సింగరేణి అధికారులు పడిగాపులు కాస్తున్నారు. ఇది అత్యంత గర్హనీయమైన చర్య. ఇప్పటికైనా సంస్థ భవిష్యత్తును, కార్మికుల మనోభావాలను గమనించి నడుచుకోవాలని కొప్పుల ఈశ్వర్ అన్నారు.. 

కార్మికుల హక్కులను కాపాడటం, సాధించడంలో గుర్తింపు సంఘం ఏఐటియూసి, ప్రాతినిధ్య సంఘం ఐఎన్టీయూసీ ఘోరంగా విఫలమయ్యాయి. కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న యాజమాన్యానికి వంత పాడుతూ కాలక్షేపం చేస్తున్నాయి. 

డిమాండ్లను తక్షణమే పరిష్కరించాలని టీబీజీకేఎస్ డిమాండ్ 

1)వాస్తవ లాభాలపై 35% వాటాను ప్రకటించాలి
2)కార్మికులకు ఆదాయపుపన్ను ను రద్దు చేయాలి, అలవెన్స్ లపై ఆదాయపన్ను ను యాజమాన్యమే చెల్లించాలి 
3)అనారోగ్య సమస్య లతో మెడికల్ బోర్డ్ కి వెళ్లే కార్మికులందరిని అన్ ఫిట్ చేయాలి. 24 నెలల సర్వీస్ కాల పరిమితిని 36 నెలలకు పెంచాలి.

4)వేలం పాట తో సంబంధం లేకుండా సింగరేణికి నూతన బొగ్గుగనులు కేటాయించాలి.
5)సింగరేణి సంస్థకు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించవలసిన 43 వేల కోట్ల రూపాయల బకాయిలను కోల్ బెల్ట్ ఎమ్మెల్యేలు, మంత్రులు తక్షణమే ఇప్పించాలని డిమాండ్ చేస్తున్నాం.

6)మెడికల్,ట్రైనింగ్ పూర్తి చేసుకున్న డిపెండెంట్ లకు వెంటనే నియామక పత్రాలు ఇవ్వాలి 
7)35 సంవత్సరాల నుండి 40 ఏళ్లకు వయసు పరిమితిని పెంచిన యాజమాన్యం వారిలో 10th క్లాస్ సర్టిఫికేట్ లేని వారిని విజిలెన్స్ కు పంపడాన్ని నిలిపివేసి వారికి వెంటనే
ఉద్యోగాలు ఇవ్వాలి.
8) మారుపేర్లతో పనిచేస్తూ అన్ ఫిట్ అయినా కార్మికుల పిల్లలకు వన్ టైం సెటిల్మెంట్ ప్రకారం ఉద్యోగాలు ఇచ్చి వారిని ఆదుకోవాలి.
9)జూలై నెలలో ఫిట్ ఫర్ సేమ్ జాబ్ ఉత్తర్వులు ఇచ్చిన  50 మంది ఉద్యోగులను తిరిగి మెడికల్ బోర్డు కు పిలిచి వారందరిని అన్ ఫిట్(ఇన్వాలిడేషన్)చేయాలి 
10)కొత్త ట్రాన్స్ఫర్ పాలసీ ని రద్దు చేయాలి. ట్రాన్స్ఫర్ పాలసీ పారదర్శకంగా ఉండేలా చూడాలి.

ఈ సమస్యల మీద డైరెక్టర్ పా గౌతమ్ పొట్రూ ఐఏఎస్ గారికి మెమోరాండం  ఇవ్వడం జరిగింది 

 ఈ ధర్నా కార్యక్రమంలో  సెంట్రల్ వైస్ ప్రెసిడెంట్లు అన్ని ఏరియాల వైస్ ప్రెసిడెంట్లు, డిప్యూటీ జనరల్ సెక్రటరీలు, జాయింట్ సెక్రటరీలు, ఆర్గనైజింగ్ సెక్రటరీలు, సెంట్రల్ కమిటీ సభ్యులు, బ్రాంచ్ సెక్రటరీలు, బ్రాంచి కమిటీ సభ్యులు, ఫిట్ సెక్రటరీలు, హిట్ కమిటీ సభ్యులు, బిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు సింగరేణి కార్మికులు డిఎల్ఆర్ కార్మికులు  పాల్గొన్నారు.

Tags

More News...

Local News 

రైళ్లపై రాళ్ల దాడులు – 33 మంది అరెస్టు

రైళ్లపై రాళ్ల దాడులు – 33 మంది అరెస్టు రెండు నెలల్లో 54 రాళ్ళ దాడి కేసులు నమోదు సికింద్రాబాద్, సెప్టెంబర్ 02 (ప్రజామంటలు) : దక్షిణ మధ్య రైల్వే పరిధిలో రైళ్లపై రాళ్లు రువ్విన వారిపై, రైల్వే ట్రాక్‌లపై ప్రమాదకర వస్తువులు ఉంచిన వారిపై రైల్వే రక్షణ దళం (ఆర్‌పిఎఫ్) కఠిన చర్యలు చేపట్టింది. జూలై 1 నుండి ఆగస్టు 31 వరకు మొత్తం...
Read More...
Local News 

గణేశ్ నిమజ్జనోత్సవానికి ఏర్పాట్లు పూర్తి చేయాలి : జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్  గణేష్ నిమజ్జనోత్సవానికి పటిష్ట బందోబస్తు: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ 

గణేశ్ నిమజ్జనోత్సవానికి ఏర్పాట్లు పూర్తి చేయాలి : జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్  గణేష్ నిమజ్జనోత్సవానికి పటిష్ట బందోబస్తు: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్  గణేశ్ నిమజ్జన ప్రాంతాలను ప్రత్యక్షంగా పరిశీలించిన జిల్లా కలెక్టర్,ఎస్పీ జగిత్యాల /మెట్పల్లి సెప్టెంబర్ 2 (ప్రజా మంటలు)   గణేశ్ నిమజ్జనO శాంతియుతంగా, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా సజావుగా జరిగేలా అన్ని విభాగాలు సమన్వయంతో కట్టుదిట్టమైన ఏర్పాట్లు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్  సత్య ప్రసాద్  అన్నారు.  జిల్లా ఎస్పి  అశోక్ కుమార్  తో కలిసి...
Read More...
Local News 

జిల్లా పరిధిలో సిటీ పోలీస్ యాక్ట్ అమలు: జిల్లా ఎస్పీ  అశోక్ కుమార్ 

జిల్లా పరిధిలో సిటీ పోలీస్ యాక్ట్ అమలు: జిల్లా ఎస్పీ  అశోక్ కుమార్    జగిత్యాల సెప్టెంబర్ 2 ( ప్రజా మంటలు)జిల్లాలో శాంతి భద్రతలను దృష్టిలో వుంచుకొని నెల రోజుల (సెప్టెంబర్ 1వ తేది నుండి 30 వరకు) పాటు జిల్లా వ్యాప్తంగా పోలీసు యాక్ట్  అమలులో ఉంటుందని జిల్లా ఎస్పీ   తెలిపినారు. దీని ప్రకారం పోలీసు అధికారుల అనుమతి లేకుండా ఎలాంటి ధర్నాలు, రాస్తా రోకోలు, నిరసనలు,...
Read More...
Local News 

ఈనెల 19న ఎఫ్టీపీసీ గ్రేటర్ ఎక్సలెన్సీ అవార్డ్స్ ప్రధానం

ఈనెల 19న ఎఫ్టీపీసీ గ్రేటర్ ఎక్సలెన్సీ అవార్డ్స్ ప్రధానం పోస్టర్ ఆవిష్కరించిన  హైడ్రా కమిషనర్ రంగనాథ్ సికింద్రాబాద్, సెప్టెంబర్ 02  (ప్రజామంటలు) : ఫిల్మ్, టెలివిజన్ రంగాల్లో విశిష్ట సేవలు అందించిన వ్యక్తులను గుర్తించి సత్కరించడానికి ఎఫ్ టీ పి సి -ఇండియా (ఫిల్మ్ టెలివిషన్ ప్రమోషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా) ప్రతి సంవత్సరం ప్రదానం చేస్తున్న గ్రేటర్ ఎక్సలెన్సీ అవార్డ్స్ 2025 ప్రధానోత్సవ వేడుకలు...
Read More...
Local News 

గణేశ్ సెలబ్రేషన్స్ నేపద్యంలో పోలీసుల ప్లాగ్ మార్చ్

గణేశ్ సెలబ్రేషన్స్ నేపద్యంలో పోలీసుల ప్లాగ్ మార్చ్ సికింద్రాబాద్, సెప్టెంబర్ 02 (ప్రజామంటలు) : గణేష్ నవరాత్రి ఉత్సవాలు, రాబోవు నిమజ్జన వేడుకల సందర్భంగా మహంకాళి డివిజన్ పరిధిలోని మహంకాళి, మార్కెట్ , రాంగోపాల్పేట పోలీస్ స్టేషన్ల పరిధిలో  బందోబస్తుకు వచ్చిన అదనపు పోలీస్  సిబ్బందితో పోలీస్ అధికారులు, సిబ్బంది మంగళవారం ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు.   క్లాక్ టవర్, 31 బస్ స్టాప్, పాలికా...
Read More...
Local News 

గొల్లపల్లి మండల కేంద్రంలో  ధర్నా, నిరసన తెలిపిన బి ఆర్ఎస్ 

గొల్లపల్లి మండల కేంద్రంలో  ధర్నా, నిరసన తెలిపిన బి ఆర్ఎస్  కాళేశ్వరం మీద కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న కుట్రలను నిరసన  (అంకం భూమయ్య)   గొల్లపల్లి ఆగస్టు 02 (ప్రజా మంటలు):  కాలేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అవినీతి ఆరోపణలకి కాలేశ్వరం ప్రాజెక్టు యొక్క కేసును సిబిఐ కి అప్పగించడం నిరసిస్తూ తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రివర్యులు  కేసీఆర్ పిలుపుమేరకు తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రివర్యులు కొప్పుల...
Read More...
Local News  State News 

సింగరేణి లాభాలలో 35%బోనస్, పెండింగ్ సమస్యల పరిష్కారానికి బొగ్గుగని కార్మిక సంఘం ధర్నా

సింగరేణి లాభాలలో 35%బోనస్, పెండింగ్ సమస్యల పరిష్కారానికి బొగ్గుగని కార్మిక సంఘం ధర్నా కొత్తగూడెం సెప్టెంబర్ 03 (ప్రజా మంటలు): తెలంగాణ కార్మిక సంఘం అధ్యక్షులు, మాజీ మంత్రి   కొప్పుల ఈశ్వర్, మిర్యాల రాజి రెడ్డి, ముఖ్య ప్రధాన కార్యదర్శి కాపు కృష్ణ, జనరల్ సెక్రెటరీ సురేందర్ రెడ్డి వర్కింగ్ ప్రెసిడెంట్ మాదాసు రామ్మూర్తి సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఆధ్వర్యంలో తెలంగాణ బొగ్గు గని సంఘం ఆధ్వర్యంలో కొత్తగూడెం హెడ్...
Read More...
Local News 

ఘనంగా వైయస్ రాజశేఖరరెడ్డి వర్ధంతిని

ఘనంగా వైయస్ రాజశేఖరరెడ్డి వర్ధంతిని (అంకం భూమయ్య) గొల్లపల్లి సెప్టెంబర్ 02 (ప్రజా మంటలు): గొల్లపెల్లి మండల కేంద్రంలో మంగళవారం మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రజల మనసుల్లో చిరస్మరణీయంగా నిలిచిపోయిన మహానేత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర 16వ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతిని పురస్కరించుకొని గొల్లపెల్లి మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. మండల కాంగ్రెస్...
Read More...
Local News 

యంగ్ బాయ్స్ యూత్ వినాయక మండపం వద్ద మహా అన్నదానం 

యంగ్ బాయ్స్ యూత్ వినాయక మండపం వద్ద మహా అన్నదానం  అన్నదానంలో పాల్గొన్న భక్తులందరికీ ధన్యవాదాలు  జైడి విజయ్ రెడ్డి ఇబ్రహీంపట్నం సెప్టెంబర్ 2( ప్రజా మంటలు దగ్గుల అశోక్):   జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలోని యామాపూర్ గ్రామంలో యంగ్ బాయ్స్ యూత్ ఆధ్వర్యంలో మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ అన్నదాన కార్యక్రమంలో పెద్ద ఎత్తున గ్రామవాసులు మరియు చుట్టుపక్క గ్రామ ప్రజలు అధిక యంగ్...
Read More...
Local News 

గాంధీ విగ్రహం వద్ద గుర్తుతెలియని డెడ్ బాడీ

గాంధీ విగ్రహం వద్ద గుర్తుతెలియని డెడ్ బాడీ సికింద్రాబాద్,  సెప్టెంబర్ 02 (ప్రజా మంటలు): గాంధీ ఆసుపత్రి ఆవరణలో మరో గుర్తు తెలియని డెడ్ బాడీ వెలుగు చూసింది.  చిలకలగూడ పోలీసులు తెలిపిన వివరాలు.. గాంధీ ఆసుపత్రి ఎదురుగా ఉన్న భారీ గాంధీ విగ్రహం పక్కన పడి ఉన్న దాదాపు 60-65 ఏళ్ల గుర్తుతెలియని వ్యక్తి డెడ్ బాడీని పెట్రోలింగ్ చేస్తున్న పోలీసులు గమనించారు....
Read More...
State News 

 సీఎం ప్రజావాణి కి వచ్చే వృద్ధులు, వికలాంగులకు ఉచిత రవాణా కోసం...బ్యాటరీ వెహికల్ 

 సీఎం ప్రజావాణి కి వచ్చే వృద్ధులు, వికలాంగులకు ఉచిత రవాణా కోసం...బ్యాటరీ వెహికల్  పూజలు చేసి బ్యాటరీ వాహనాన్ని ప్రారంభించిన చిన్నారెడ్డి, దివ్య దేవరాజన్  హైదరాబాద్ సెప్టెంబర్ 03 (ప్రజా మంటలు):   రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టి విజయవంతంగా ప్రజల సమస్యలను పరిష్కరిస్తున్న ముఖ్యమంత్రి ప్రజావాణికి రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా బ్యాటరీ వాహనాన్ని మంజూరు చేసింది. రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్, ప్రజావాణి ఇన్చార్జి డాక్టర్ జి చిన్నారెడ్డి,...
Read More...
National  State News 

BRS నుంచి కవిత సస్పెన్షన్.. హరీష్ రావుకు పార్టీ  మద్దతు!

BRS నుంచి కవిత సస్పెన్షన్.. హరీష్ రావుకు పార్టీ  మద్దతు! అందరూ అనుకున్నదే అయింది..కవిత మార్గం ఎటు వైపో... జాగృతి, బిసి నాయకులతో కవిత సమావేశం హైదరాబాద్ సెప్టెంబర్ 03 (ప్రజా మంటలు): ఎమ్మెల్సీ కవితకు బీఆర్ఎస్ బిగ్ షాక్ ఇచ్చింది.నిన్నటి కవిత సంచలన ఆరోపణల నేపథ్యంలో BRS పార్టీ అధినేత కేసీఆర్ సూచనల మేరకు క్రమశిక్షణ కమిటీ, ఆమెను పార్టీ నుండి సస్పెండ్ చేస్తూ ప్రకటన...
Read More...