సంప్రదాయ రీతిలో భాగవత సప్తాహాలు ప్రారంభం

On
సంప్రదాయ రీతిలో భాగవత సప్తాహాలు ప్రారంభం

(రామ కిష్టయ్య సంగన భట్ల...
   9440595494)
.
 రాష్ట్రంలోని సుప్రసిద్ద పుణ్యక్షేత్రమైన ధర్మపురి పట్టణానికి ప్రత్యేకత ఉంది. గంభీర గౌతమీ  (గోదావరి) నది తీరంలో వెలసిన తీర్థంగా, పలు దేవాలయాల సమాహారంతో క్షేత్రంగా, తన ఆస్థాన కవిగా, ఆస్థానానికి  వన్నె తెచ్చిన కన్నడ  ఆదికవిగా భావింప బడే, విక్రమార్జున చరిత్ర కావ్య కర్త  పంప మహా కవి, ఆ కావ్యాన్ని తనకు అంకితం ఇచ్చిన సందర్భంగా,  
 వేముల వాడ రాజధానిగా పాలించిన చాళుక్య రాజు రెండవ అరి కేసరి ద్వారా దానమీయ బడిన బ్రాహ్మణ అగ్రహారంగా నేపథ్యం కలిగిన నేల ఇది. దేశంలోనే అరుదైన బ్రహ్మ విష్ణు మహేశ్వరుల త్రైమూర్త్య  నిలయంగా విరాజిల్లుతోంది. అంతే కాదు... 
ఆర్ష విజ్ఞాన సంపత్తికి, సనాతన సంప్రదాయ ఆచరణలకు అనాదిగా పట్టుకొమ్మగా నిలిచి, ధర్మ ప్రచార కేంద్రంగా, సభ్యతా సంస్కృతులకు ఆలవాలంగా ఉన్న ధర్మపురి తన ప్రాచీన వారసత్వ ఆచార వ్యవహారాలను కొనసాగిస్తూనే ఉంది. అలా ఏటా భాద్రపద శుద్ధ సప్తమి నుండి పౌర్ణమి వరకు లబ్ధ ప్రతిష్ఠులు 
పౌరాణికులచే భాగవత పురాణ ప్రవచనాలు జరుగు తుండడం క్షేత్ర వాసుల పురాకృత సుకృత ఫలితమే మరి. ఈ ఏడు ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవస్థాన అంతర్గత శ్రీ రామ లింగేశ్వర స్వామి ఆలయంలో, దేవస్థానము, శ్రీ శారదా మహిళా మండలి సంయుక్త నిర్వహణలో శృంగేరీ పీఠం ఆస్థాన పౌరాణికులు, పండితులు బ్రహ్మశ్రీ పురాణం మహేశ్వర శర్మ భాగవత పురాణ సప్తాహం కొనసాగిస్తున్నారు.

భాగవత పురాణ శ్రవణం ద్వారా ముక్తి లభ్యం
.............................................
 
 భాగవత పురాణ శ్రవణం ద్వారా కలియుగంలో ముక్తి లభించగలదని, భక్తిశ్రద్ధ లతో భారత ప్రాచీన ఆర్ష విజ్ఞానానికి మూలాధారాలైన పురాణాలను శ్రవణం చేయాలని పౌరాణికులు, పురాణం మహేశ్వర శర్మ ఉద్ఘాటించారు.  క్షేత్రంలో శ్రీరామలింగేశ్వరాలయంలో శ్రీశారదా మహిళా మండలి,  దేవస్థానం సౌజన్యంతో ఆయన సప్తాహ కార్య క్రమాన్ని  ప్రారంభించారు. సనక సనందాదులు నారదునికి తెలిపిన విధానాన్ని, నారద పూర్వజన్మ వృత్తాంతాన్ని, పాండవుల మహా ప్రస్తానాన్ని, పరీక్షిత్తు పూర్వజన్మ నేపథ్యాన్ని సోదాహరణంగా పౌరాణికులు మహేశ్వర శర్మ శ్రవణానందంగా చేసిన ప్రవచనాన్ని క్షేత్ర వాసులు విని తరించారు. అధిక సంఖ్యలో మహిళలు హాజరైనారు. అంతకు ముందు శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవస్థానం,  స్థానిక శారదా మహిళా మండలి ఆధ్వర్యంలో దేవస్థానం పక్షాన ధర్మకర్తల మండలి అధ్యక్షులు జక్కు రవీందర్, సూపరింటెండెంట్ కిరణ్ సీనియర్ అసిస్టెంట్ అలువాల శ్రీనివాస్ వేద పండితులు బొజ్జ రమేష్ శర్మ పాలెపు ప్రవీణ్ కుమార్ శర్మ  అభిషేకం పురోహితులు బొజ్జ రాజగోపాల్,  సిబ్బంది  శారదా మహిళా మండలి సభ్యులు, స్థానిక మహిళలు దేవస్థానం నుండి మేళతాళాలతో  పాలెపు బద్రీనాథ్ శర్మ గారి ఇంటివద్ద ఉన్న బ్రహ్మశ్రీ పురాణం మహేశ్వర శర్మను పూలమాల శేష వస్త్రంతొ దేవస్థానం అద్యక్షులు జక్కు రవీందర్ సన్మానించడం జరిగింది.
 అనంతరం శ్రీ రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానంనకు ఆహ్వానించి, దేవస్థానంలో గల వేదికపై భాగవత గ్రంథానికి పూజచేసి ప్రవచన కార్యక్రమము ప్రారంభించారు.

Tags

More News...

Local News  State News 

బహుళ అంతస్తుల భవనాలు,ఇతర నిర్మాణాల అనుమతులలో జాప్యం కూడదు సి ఎం రేవంత్ రెడ్డి 

బహుళ అంతస్తుల భవనాలు,ఇతర నిర్మాణాల అనుమతులలో జాప్యం కూడదు సి ఎం రేవంత్ రెడ్డి  హైదరాబాద్ సెప్టెంబర్ 01  (ప్రజా మంటలు): బ‌హుళ అంత‌స్తుల భ‌వ‌నాలు, ఇత‌ర నిర్మాణాల‌కు సంబంధించి అనుమ‌తులు జారీ చేసే విష‌యంలో జరుగుతున్న జాప్యంపై ముఖ్య‌మంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధికారులపై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. బ‌హుళ అంత‌స్తుల భ‌వ‌నాలు, గేటెడ్ క‌మ్యూనిటీల నిర్మాణం, ఇత‌ర అనుమ‌తుల విష‌యంలో కొంద‌రు అధికారులు ఉద్దేశపూర్వకంగా అల‌సత్వం చూపుతున్నార‌ని...
Read More...
National  Local News  State News  Current Affairs  

ఎమ్మెల్సీ కవిత చేసిన వ్యాఖ్యలు బీఆర్ఎస్‌లో ప్రకంపనలు

ఎమ్మెల్సీ కవిత చేసిన వ్యాఖ్యలు బీఆర్ఎస్‌లో ప్రకంపనలు హైదరాబాద్ ఆగస్ట్ 01 (ప్రజా మంటలు): బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ కవితకు బిగ్ షాక్ ఇచ్చారు.ఎమ్మెల్సీ కవిత చేసిన వ్యాఖ్యలు బీఆర్ఎస్‌లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. కేసీఆర్ ఫాం హౌస్ లో కేసీఆర్, పలువురు సీనియర్ నాయకులతో సమావేశం నిర్వహిస్తున్నారు. కాళేశ్వరం కేసును సిబిఐ దర్యాప్తుకు అప్పగించడంపై బియారెస్ నాయకులు చర్చిస్తున్న సమయంలో...
Read More...
Local News 

ప్రజావాణి అర్జీలను సత్వరమే పరిష్కరించాలి జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్

ప్రజావాణి అర్జీలను సత్వరమే పరిష్కరించాలి     జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్              జగిత్యాల సెప్టెంబర్ 1 (ప్రజా మంటలు)            ప్రజావాణి అర్జీలను సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ తెలిపారు. సోమవారం కలెక్టరెట్ ఆడిటోరియంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుండి ఫిర్యాదులు, వినతులను  అదనపు కలెక్టర్, ఆర్డీఓలతో తో కలిసి స్వీకరించారు.   ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమస్యల పరిష్కారం కోరుతూ జిల్లా కేంద్రంతో...
Read More...
Local News  State News 

సంప్రదాయ రీతిలో భాగవత సప్తాహాలు ప్రారంభం

సంప్రదాయ రీతిలో భాగవత సప్తాహాలు ప్రారంభం (రామ కిష్టయ్య సంగన భట్ల...      9440595494).  రాష్ట్రంలోని సుప్రసిద్ద పుణ్యక్షేత్రమైన ధర్మపురి పట్టణానికి ప్రత్యేకత ఉంది. గంభీర గౌతమీ  (గోదావరి) నది తీరంలో వెలసిన తీర్థంగా, పలు దేవాలయాల సమాహారంతో క్షేత్రంగా, తన ఆస్థాన కవిగా, ఆస్థానానికి  వన్నె తెచ్చిన కన్నడ  ఆదికవిగా భావింప బడే, విక్రమార్జున చరిత్ర కావ్య కర్త  పంప ఆర్ష...
Read More...
Local News 

నిబద్ధత క్రమశిక్షణతో పనిచేస్తేనే  ప్రజల్లో మంచి పేరు వస్తుంది.. డిఈ దురిశెట్టి మనోహర్  అంకితభావంతో పని చేశారు.. మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.. విద్యుత్ శాఖకే వన్నె తెచ్చారు.. జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్

నిబద్ధత క్రమశిక్షణతో పనిచేస్తేనే  ప్రజల్లో మంచి పేరు వస్తుంది.. డిఈ దురిశెట్టి మనోహర్  అంకితభావంతో పని చేశారు.. మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.. విద్యుత్ శాఖకే వన్నె తెచ్చారు..  జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ ..మెట్పల్లి సెప్టెంబర్ 1 (ప్రజా మంటలు)ఎన్పీడీసీఎల్ డి ఈ మనోహర్ ఉద్యోగ విరమణ కార్యక్రమానికి కలెక్టర్ హాజరు.. మనోహర్ ను ఘనంగా సన్మానించిన అధికారులు.. ఉద్యోగ బాధ్యతలను నిబద్దతతో క్రమశిక్షణతో నిర్వర్తిస్తే అటు ప్రజలు అటు అధికారుల్లో మంచి గుర్తింపు వస్తుందని దురిశెట్టి మనోహర్ విద్యుత్ శాఖ ఏ డీఈ గా పనిచేసి...
Read More...

ముత్తారం వినాయక మండపంలో ఘనంగా కుంకుమార్చనలు - ప్రత్యేక పూజలతో భక్తి పారవశ్యంలో భక్తులు

ముత్తారం వినాయక మండపంలో ఘనంగా కుంకుమార్చనలు - ప్రత్యేక పూజలతో భక్తి పారవశ్యంలో భక్తులు ముత్తారం వినాయక మండపంలో ఘనంగా కుంకుమార్చనలు - ప్రత్యేక పూజలతో భక్తి శ్రద్ధ భీమదేవరపల్లి, సెప్టెంబర్ 01 (ప్రజామంటలు) : మండలంలోని ముత్తారం గ్రామంలో ఏర్పాటు చేసిన వినాయక మండపం వద్ద మంగళవారం భక్తి శ్రద్ధలతో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. మధ్యాహ్నం మహిళల ఆధ్వర్యంలో కుంకుమార్చనలు ఘనంగా జరిపారు. పెద్ద సంఖ్యలో మహిళలు సాంప్రదాయ వేషధారణలో...
Read More...
Local News 

  మా కామాఖ్య హాస్పిటల్ వారిచే   ప్రెస్ క్లబ్ గణపతి వద్ద  అన్నప్రసాద వితరణ

   మా కామాఖ్య హాస్పిటల్ వారిచే   ప్రెస్ క్లబ్ గణపతి వద్ద  అన్నప్రసాద వితరణ    జగిత్యాల సెప్టెంబర్ 1 ( ప్రజా మంటలు) జిల్లా కేంద్రంలోని తహసీల్ చౌరస్తా వద్ద గల టియూడబ్ల్యూజే ఐజేయు అనుబంధ జగిత్యాల పట్టణ ప్రెస్ క్లబ్ లో వినాయక నవరాత్రులు పురస్కరించుకొని ప్రతిష్టించిన గణపతి వద్ద  సోమవారం మధ్యాహ్నం అన్నప్రసాద వితరణ కార్యక్రమం ఏర్పాటు చేశారు. జగిత్యాల పట్టణంలోని మా కామాఖ్య హాస్పిటల్ ప్రముఖ గైనకాలజిస్ట్...
Read More...
Local News 

ముత్తారం వినాయక మండపంలో ఘనంగా కుంకుమార్చనలు - ప్రత్యేక పూజలతో

ముత్తారం వినాయక మండపంలో ఘనంగా కుంకుమార్చనలు - ప్రత్యేక పూజలతో భీమదేవరపల్లి, సెప్టెంబర్ 01 (ప్రజామంటలు) :    మండలంలోని ముత్తారం గ్రామంలో ఏర్పాటు చేసిన వినాయక మండపం వద్ద మంగళవారం భక్తి శ్రద్ధలతో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. మధ్యాహ్నం మహిళల ఆధ్వర్యంలో కుంకుమార్చనలు ఘనంగా జరిపారు. పెద్ద సంఖ్యలో మహిళలు సాంప్రదాయ వేషధారణలో పాల్గొని గణపతిని ఆరాధించారు. సాయంత్రం భక్తుల సమక్షంలో ప్రత్యేక పూజలు నిర్వహించగా, గ్రామస్తులు,...
Read More...
Local News 

పాత పెన్షన్ స్కీం అమలు చేయాలి

పాత పెన్షన్ స్కీం అమలు చేయాలి సికింద్రాబాద్, సెప్టెంబర్01 ( ప్రజామంటలు) : నో కాంట్రిబ్యూషన్ పెన్షన్ స్కీమ్‌ (NCPS) రద్దు చేసి పాత పెన్షన్ స్కీమ్‌ (OPS) అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ టీజీఈ జేఏసీ ఆధ్వర్యంలో ఈరోజు సమావేశం జరిగింది. ఈ సమావేశానికి టీజీఈ జేఏసీ యూనియన్‌ కోఆర్డినేటర్‌ జి.వి.కృష్ణారావు హాజరయ్యారు.ఆర్‌టీసీ కళ్యాణం ఆడిటోరియంలో జరిగిన ఈ సమావేశంలో ఎయిడెడ్‌...
Read More...
Local News 

గౌడ సంఘ ఆధ్వర్యంలో ఘనంగా వినాయక నిమజ్జనం

గౌడ సంఘ ఆధ్వర్యంలో ఘనంగా వినాయక నిమజ్జనం (అంకం భూమయ్య)  గొల్లపల్లి సెప్టెంబర్ 01 (ప్రజా మంటలు):   గొల్లపల్లి మండలంలోని రాఘవపట్నం గ్రామంలో గౌడ సంఘం ఆధ్వర్యంలో ఎల్లమ్మ ఆలయంలో వినాయకుడిని నెలకొల్పగా నిమజ్జన వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించారు. ఐదు రోజుల పూజల అనంతరం వినాయకుడిని ట్రాక్టర్లో డప్పు నృత్యాలతో ఉరేగింపుగా తీసుకువెళ్లి గ్రామంలోని సమీప చెరువులో నిమజ్జనం చేశారు. ఈ కార్యక్రమం...
Read More...
National  State News  Current Affairs  

కాంగ్రెస్ ప్రభుత్వం అనుక్షణం  కేసీఆర్ జపం చేస్తోంది - ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు

కాంగ్రెస్ ప్రభుత్వం అనుక్షణం  కేసీఆర్ జపం చేస్తోంది - ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు వరదలు వస్తే ఆదుకోలేని  స్థితిలో ప్రభుత్వం ఉంది. సిబిఐ విచారణలో కేసీఆర్ కడిగిన ముత్యంలా బయటకు వస్తారు. హరీష్ రావు,సంతోష్ రావు వెనుక రేవంత్ రెడ్డి ఉన్నారు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత హైదరాబాద్సెప్టెంబర్ 01 (ప్రజా మంటలు): ప్రజలకు న్యాయం చేయలేక, కాంగ్రెస్ ప్రభుత్వం అనుక్షణం  కేసీఆర్ జపం చేస్తోందని,కేసీఆర్ పై సీబీఐ...
Read More...
Local News 

పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత -పర్యావరణ పరిరక్షణకై మక్తాల  దంపతులు

పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత -పర్యావరణ పరిరక్షణకై మక్తాల  దంపతులు మక్తాల ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు మక్తాల జలంధర్ గౌడ్ - సేవ భూషణ్ జాతీయస్థాయి పురస్కారం-2025  సికింద్రాబాద్, సెప్టెంబర్ 01 (ప్రజామంటలు): పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యతని మక్తాల ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు మక్తాల జలంధర్ గౌడ్ అన్నారు. సుందరయ్య విజ్ఞాన కేంద్రం లో జరిగిన మహాకవి శ్రీ దాశరధి కృష్ణమాచార్యుల శతజయంతి సందర్భంగా...
Read More...