మల్లాపూర్ మం. నడికుడ జి.పి.లో హక్కుల కమిటీచే రికార్డుల తనిఖీ
త్వరలో ఉన్నతాధికారులకు నివేదిక
ప్రభుత్వాలు చట్టాలపై అవగాహన కల్పించాలి :
ఎన్.హెచ్.ఆర్.సి. (ఎన్ జివో) డిమాండ్
మల్లాపూర్ సెప్టెంబర్ 04 (ప్రజా మంటలు):
జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం నడికుడ గ్రామ పంచాయతీ లో గురువారం నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో రికార్డుల తనిఖీ చేశారు. పిర్యాదు దారుడు అప్పం చిన్నారెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ రికార్డుల తనిఖీలో 2017 నుండి 2025 వరకు రికార్డులు, ఆర్థిక లావాదేవీలు, బిల్లు లు, తీర్మానాలు, జనరల్ ఫండ్, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా వచ్చిన నిధుల వివరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా తనిఖీల ప్రతినిధులు మాట్లాడుతూ సమాచార హక్కు చట్టం -2005 భారత దేశ ప్రజలకు వజ్రాయుధమని అన్నారు. ఈ చట్టాన్ని ప్రతి భారత పౌరుడు, ముఖ్యంగా యువత ఉపయోగించుకోవాలని కోరారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చట్టాల పైన అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు.
ఈ కార్య క్రమంలో నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ స్వచ్ఛంద సంస్థ రాష్ట్ర అధ్యక్షులు నక్క గంగారాం, సీనియర్ ఆర్టీఐ ఆక్టివిస్ట్, సీనియర్ జర్నలిస్ట్ చుక్క గంగారెడ్డి, ఎన్ హెచ్ ఆర్ సి జగిత్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి సాతారపు పద్మ - జనార్దన్, జగిత్యాల నియోజక వర్గ ఇంచార్జ్ సంగెపు ముత్తు, జగిత్యాల పట్టణ అధ్యక్షులు దేవ్ సింగ్ రాథోడ్ తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
శిశువు కడుపు నుండి ఇద్దరు పరాన్నజీవి కవలల తొలగింపు

గణేష్ నిమజ్జనోత్సవానికి భద్రతా ఏర్పాట్లు పూర్తి:- ఎస్పీ అశోక్ కుమార్

జైలు నుంచి ఖైదీల పరారీ
.jpg)
ప్రైడ్ ఆఫ్ తెలంగాణ అవార్డుకు ఆకర్షణ నామినేటెడ్

గురువుల రుణం తీర్చుకోలేనిది - సర్వేపల్లి రాధాకృష్ణకు బీజేపీ నేతల నివాళులు

తల్లి తర్వాత తల్లిలా చిన్నారులకు అన్ని సేవలు చేసేది అంగన్ వాడీలు

రక్తమూలుగ మార్పిడితో వందల మందికి కొత్త జీవితం

జగిత్యాల బ్రాహ్మణ వీధి హరిహరాలయంలో వినాయక స్వామిని దర్శించుకున్న డి.ఎస్.పి, సీఐ

దివ్యత్వానికి ప్రతిరూపం శ్రీకృష్ణ తత్వం

15, 516లు పలికిన రంగమ్మ గూడెం వినాయక లడ్డు

జగిత్యాలలో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు

బుగ్గారంలో BRS పార్టీ లో చేరిన కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తలు
