మాజీ ప్రధాని రాజీవ్ గాంధీకి మంత్రి అడ్లూరి లక్ష్మణ్,మాజీ మంత్రి జీవన్ రెడ్డి

On
మాజీ ప్రధాని రాజీవ్ గాంధీకి మంత్రి అడ్లూరి లక్ష్మణ్,మాజీ మంత్రి జీవన్ రెడ్డి

ఇందిరా భవన్ లో ఘనంగా రాజీవ్ గాంధీ జయంతి ఉత్సవాలు

జగిత్యాల ఆగస్ట్ 20 (

ప్రజా మంటలు):

జగిత్యాల జిల్లా కేంద్రంలో ఇందిరా భవన్ లో రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా రాజీవ్ గాంధీ చిత్రపటానికి, తెలంగాణ రాష్ట్ర ఎస్సీ ఎస్టీ మైనార్టీ వికలాంగుల శాఖ మంత్రి వర్యులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు మరియు మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి ఘన నివాళులు అర్పించారు.

మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి  మాట్లాడుతూ...పార్టీ ఫిరాయింపులను అరికట్టడానికి దేశంలో  పార్టీ ఫిరాయింపు చట్టాన్ని రూపొందించిన గొప్ప నాయకుడు రాజీవ్ గాంధీ .
కలిస్తాన్ ఉగ్రవాదుల చేతిలో ఆనాటి ప్రధాని దేశ సమగ్రత సమైక్యత కొరకు పాటుపడుతున్న సందర్భంగా బలి కావడం ఆ పరిస్థితులలో దేశానికి నాయకత్వం వహించడానికి భవిష్యత్తు ప్రధాని ఎవరు అని యావత్ ప్రజానీకం ఎదురుచూస్తున్న తరుణంలో రాజీవ్ గాంధీ భారత ప్రధానిగా బాధ్యతలు చేపట్టి నవ తరానికి యువతకు ప్రాధాన్యత కల్పించే విధంగా రూపకల్పన చేశారు

భారతదేశాన్ని ప్రపంచ దేశాలలో ఒక శాంతి కాముక దేశంగా నిలబెట్టే విధంగా సాంకేతిక విద్యకు ప్రాధాన్యత కల్పింప చేయడానికి భారతదేశాన్ని ఆధునిక యుగంలో ముందుకు తీసుకెళ్లడానికి ఆనాడే అడుగులు వేసినటువంటి ఘనత రాజీవ్ గాంధీకి దక్కుతుంది

దేశంలోని కోట్లాదిమంది నిరుద్యోగ యువత ఆధారపడుతున్నటువంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని కల్పింపిప చేయడానికి ఆనాడే సాన్ ఫిట్రోడను సలహాదారుడిగా నియామకం చేసుకొని నాంది పలకడం జరిగింది

అదేవిధంగా దేశ నిర్మాణంలో యువతకు ప్రాధాన్యత కల్పింప చేయబడే విధంగా 21 సంవత్సరాల వరకు ఉన్న ఓటు హక్కును 18 సంవత్సరాలకు కుదింపు చేసి 18 సంవత్సరాల ప్రతి యువకుడు దేశ నిర్మాణంలో పాత్ర వహించే విధంగా మార్పు తీసుకురావడం జరిగింది అంటే రాజీవ్ గాంధీ అని చెప్పక తప్పదు

రాజ్యాంగ నిబంధనలకు కట్టుబడి ఉండే విధంగా ఆనాటి నవభారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి రాజ్యాంగ విలువలను అనుగుణంగా ప్రజాస్వామ్య హక్కులు నిలబెట్టే విధంగా పార్టీ ఫిరాయింపులను అరికట్టడం కొరకు దేశంలో పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని రూపొందించి ఏ పార్టీకి ఎంపికైనటువంటి అభ్యర్థి అదే పార్టీలో కొనసాగే విధంగా పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని 1985లో రాజీవ్ గాంధీ రూపొందించి దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థను బలోపేతం చేయడానికి చర్యలు చేపట్టడం జరిగింది

స్థానిక సంస్థలకు ప్రాధాన్యత కల్పింప చేయబడే విధంగా గ్రామీణ ప్రాంతమే కానీ పట్టణ ప్రాంతమే కానీ కేవలం ఎన్నికలు నిర్వహిస్తేనే సరిపోదు ఎన్నికల నిర్వహణతో పాటు నిధులు కూడా సమకూర్చబడాలనే ఆలోచనతోని ప్రత్యక్షంగా ఢిల్లీ నుండి గల్లీకి నిధులు సమకూర్చబడే విధంగా చట్టంలో మార్పులు తీసుకొచ్చి మనకు కేంద్రం నుండి లభించే గ్రాండ్స్ అన్నిటికీ రూపకల్పన చేసింది రాజీవ్ గాంధీ యే.

బలహీన వర్గాలకు స్థానిక సంస్థలలో 33% ఆనాడు రిజర్వేషన్ సౌకర్యం కల్పింప చేయబడే విధంగా మహిళలకు ప్రాధాన్యత కల్పింప చేయబడే విధంగా చట్టంలో మార్పులు చేసినటువంటి ఘనత రాజీవ్ గాంధీ కి దక్కుతుంది

అటువంటి మహాత్ముడు ప్రపంచ శాంతిని కోరడంలో భాగంగా శ్రీలంక మన పోరుగు దేశంలో శాంతిని నెలకొల్పాలని తపనతోని తీసుకున్న చర్యలతో ఏ విధంగా కలుస్తాను ఉగ్రవాదులు ఆనాడు ఇందిరా గాంధీ ని బలి తీసుకోవడం జరిగిందో అదే విధంగా శ్రీలంక ఉగ్రవాదులు రాజీవ్ గాంధీని బలి తీసుకోవడం జరిగింది

దేశ స్వాతంత్రం కొరకు ఎందరో మహానుభావులు ప్రాణాలు త్యాగాలు చేశారు కానీ దేశ స్వాతంత్ర అనంతరం ఈ ప్రజాస్వామ్యత భారతదేశంలో దేశ సమగ్రత కొరకు సమైక్యత కొరకు ప్రాణాలర్పించినటువంటి త్యాగమూర్తులు  కేవలం ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ  లు మాత్రమే.

అటువంటి త్యాగమూర్తులు మనకు ఆదర్శం కావడం ప్రతి కాంగ్రెస్ కార్యకర్త గర్వపడాలి

ఇందిరాగాంధీ గారి రాజీవ్ గాంధీ గారి ఆశయాలను కార్యరూపం దాల్పింపచేయడమే మన వంతు బాధ్యత భావించాలి

రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్  మాట్లాడుతూ...

అపాయం ఉన్న లెక్కచేయకుండా దేశ సమగ్రతకు సమైక్యతకు దేశం కోసం రాజీవ్ గాంధీ చేసిన సేవలు మరువలేనిది

రాజీవ్ గాంధీ  ప్రపంచ దేశాలలో భారతదేశం కూడా అగ్రగామిగా ఉండాలని కంప్యూటర్ యుగం సాఫ్ట్వేర్ యుగం గొప్పగా భారతదేశం ప్రపంచ దేశాలకు దీటుగా రాణిస్తుంది అంటే ఆనాడు రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు గొప్ప ఆలోచనతోని కంప్యూటర్ యుగం యొక్క వ్యవస్థను సంస్కరణ చేయడం జరిగింది సాఫ్ట్వేర్ యొక్క వ్యవస్థను అప్పుడే గుర్తించారు

రాబోయే రోజులలో భారతదేశ దేశాలకు దీటుగా ఉండాలని అదేవిధంగా కమ్యూనికేషన్ వ్యవస్థ ఆ కమ్యూనికేషన్ వ్యవస్థతో భారతదేశం అగ్రగామిగా ఉన్నది

ఈరోజు గ్రామీణ ప్రాంతం స్థానిక ప్రజలతో ఎన్నుకోబడిన సర్పంచ్లకు పూర్తిగా అధికారాలు ఉండాలి కేంద్రం ద్వారా వచ్చే నిధులు నేరుగా గ్రామపంచాయతీ వరకు నిధులు నేరుగా వెళ్లాలని చట్టాన్ని చేసి అధికారమిచ్చిన గొప్ప నాయకుడు రాజీవ్ గాంధీ గారు

బి ఆర్ అంబేద్కర్ గారు అందించిన  భారత రాజ్యాంగం ద్వారా 18 సంవత్సరాలకే ఓటు హక్కును కల్పించిన గొప్ప నాయకుడు రాజీవ్ గాంధీ

ఇందిరా గాంధీ గారు రాజీవ్ గాంధీ ఈ దేశానికి చేసిన సేవలు మరువలేనివి ఆరోజు భారీ నీటిపారుదల ప్రాజెక్టులు భారతదేశ ప్రజలకు రైతాంగానికి గొప్ప గొప్ప ప్రాజెక్టులు శ్రీశైలం , శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులు రూపకల్పన చేసిన గొప్ప నాయకులు

ఇందిరా గాంధీ  గరీబ్ హటావో రాజీవ్ గాంధీ  యువతకు ఆదర్శంగా కంప్యూటర్ వ్యవస్థను ఇతర దేశాలకు దీటుగా భారతదేశం ఉండే విధంగా రూపకల్పన చేశారు

అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాలకు అండగా ఉండే విధంగా రాజీవ్ గాంధీ ఇందిరాగాంధీ సేవలు మరువలేనివను అన్నారు.

జిల్లా కాంగ్రెస్ మహిళ అధ్యక్షురాలు తాటిపర్తి విజయలక్ష్మి జగిత్యాల పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు కొత్త మోహన్ కాంగ్రెస్ నాయకులు బండా శంకర్, మాజీ కౌన్సిలర్ నరసయ్య తదితరులు పాల్గొన్నారు.

Tags

More News...

Local News 

ఓట్ల కుంభకోణంపై SIT ద్వారా విచారణ చేపట్టాలని సుప్రీంకోర్టులో పిటిషన్

ఓట్ల కుంభకోణంపై SIT ద్వారా విచారణ చేపట్టాలని సుప్రీంకోర్టులో పిటిషన్ న్యూ డిల్లీ ఆగస్ట్ 20: బెంగళూరు సెంట్రల్ నియోజకవర్గంలో రాహుల్ గాంధీ ఓటర్ల జాబితాలో అవకతవకలు జరిగాయని చేసిన ఆరోపణలపై సిట్ విచారణ కోరుతూ సుప్రీంకోర్టులో పిఐఎల్ దాఖలైంది 2024 లోక్‌సభ ఎన్నికల సమయంలో బెంగళూరు సెంట్రల్ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున ఓటర్ల జాబితాలో అవకతవకలు జరిగాయని ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ లేవనెత్తిన ఆరోపణలపై...
Read More...
Local News 

ఇందిరమ్మ ఇళ్ళ నిర్మాణ పనులు వేగవంతంగా పూర్తి చేయాలి - ఎంపీడీవో మహమ్మద్ సలీం

ఇందిరమ్మ ఇళ్ళ నిర్మాణ పనులు వేగవంతంగా పూర్తి చేయాలి - ఎంపీడీవో మహమ్మద్ సలీం ఇబ్రహీంపట్నం ఆగస్టు 20 (ప్రజా మంటలు):   ఇబ్రహీంపట్నం మండలంలోని వేములకుర్తి గ్రామాన్ని ఎంపీడీఓ సలీం బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా గ్రామంలోని ఇందిరమ్మ ఇళ్ళను పరిశీలించి, నిర్మాణ పనులు వేగవంతంగా పూర్తి చేయాలన్నారు. అదేవిధంగా ఇందిరమ్మ ఇళ్ళు మంజూరైనవారు ఇప్పటికీ ఇంకా ఇళ్ళ నిర్మాణాలు ప్రారంభించని లబ్ధిదారులు వెంటనే ఇళ్ళ నిర్మాణాలు ప్రారంభించి, నిర్ణిత సమయంలో...
Read More...
Local News 

ఇబ్రహీంపట్నం తాసిల్దార్ కార్యాలయ తనిఖీ.

ఇబ్రహీంపట్నం తాసిల్దార్ కార్యాలయ తనిఖీ. ఇబ్రహీంపట్నం ఆగస్టు 20 (ప్రజా మంటలు దగ్గుల అశోక్): ఇబ్రహీంపట్నం మండల్ తాసిల్దార్ కార్యాలయంనుఅదనపు కలెక్టర్  మరియు ఆర్డీవో మెట్పల్లి  తనిఖీ చేశారు, భూ భారత్ కి సంబంధించిన ఫైల్ వెరిఫై చేసి, త్వరగా పూర్తి చేయుటకు ఆదేశాలు జారీ చేసిసారు. కార్యాలయ సిబ్బందికి తగు సూచనలు జారీ చేసి,  గోదుర్ గ్రామంలో గల రాజరాజేశ్వర...
Read More...
Local News  State News 

మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి  వేడుకల్లో డాక్టర్ కోట నీలిమ

మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి  వేడుకల్లో డాక్టర్ కోట నీలిమ సికింద్రాబాద్, ఆగస్ట్ 20 (ప్రజామంటలు) : ఆధునిక భారత రూపకర్త, ఐటీ విప్లవ పితామహుడు, మాజీ ప్రధానమంత్రి భారతరత్న ,దివంగత రాజీవ్ గాంధీ 81వ జయంతి వేడుకలను బన్సీలాల్ పేట్, బేగంపేట్, అమీర్ పేట్, సనత్ నగర్ డివిజన్లలో పీసీసీ వైస్ ప్రెసిడెంట్, సనత్ నగర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి డాక్టర్ కోట నీలిమ...
Read More...
Local News  State News  Crime 

ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో దంపతుల అదృశ్యం

ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో దంపతుల అదృశ్యం ఇబ్రహీంపట్నం ఆగస్టు 20( ప్రజా మంటలు దగ్గుల అశోక్): ఇబ్రహీంపట్నం గ్రామానికి చెందిన బోడ రవి - బోడ ప్రమీల దంపతులిద్దరూ శనివారం 16వ తేదీన ఇంట్లో నుండి వెళ్లి, ఇప్పటివరకు ఇంటికి తిరిగి రాలేదని పోలీసులకు కూతురు ఫిర్యాదు చేసింది. అదృశ్యం అయిన వారి కూతురు అంబటి మీనాక్షి, ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు...
Read More...
Local News 

ఘనంగా రాజీవ్ గాంధీ గారి జయంతి వేడుక

ఘనంగా రాజీవ్ గాంధీ గారి జయంతి వేడుక (అంకం భూమయ్య)  గొల్లపల్లి ఆగస్టు 20 (ప్రజా మంటలు):  గొల్లపెల్లి మండల కేంద్రంలో స్థానిక ఎంపిడిఓ కార్యాలయం వద్ద మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారతదేశ మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు జరుపుకొన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించారు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ముస్కు...
Read More...
National  Opinion  State News 

130వ సవరణ రాజకీయ శుద్ధికా లేక రాజ్యాంగ మౌలికాంశాలనే మార్చడానికా? 

130వ సవరణ రాజకీయ శుద్ధికా లేక రాజ్యాంగ మౌలికాంశాలనే మార్చడానికా?  130వ రాజ్యాంగ సవరణ బిల్లు ప్రతిపక్షాల ప్రభుత్వాలను కూల్చడానికేనా?  రాష్ట్ర ప్రభుత్వాలు ఇక గవర్నర్ చేతిలో కీలుబొమ్మలేనా? న్యూ ఢిల్లీ ఆగస్ట్ 20:130వ సవరణ బిల్లు ఆర్టికల్ 75 (కేంద్ర మంత్రులకు సంబంధించిన నిబంధనలు), ఆర్టికల్ 164 (రాష్ట్ర మంత్రులకు సంబంధించిన నిబంధనలు), మరియు ఆర్టికల్ 239AA (దిల్లీ కేంద్రపాలిత ప్రాంతానికి సంబంధించిన నిబంధనలు)లలో...
Read More...
Local News 

ముల్కనూర్ నూతన ఎస్సైగా రాజు

ముల్కనూర్ నూతన ఎస్సైగా రాజు భీమదేవరపల్లి, ఆగస్టు 20 ప్రజామంటలు :  ముల్కనూర్ నూతన ఎస్సైగా గీసుకొండ పోలీస్ సషన్లో విధులు నిర్వర్తిస్తున్న ఎస్ఐ రాజు రానున్నారు.భీమదేవరపల్లి మండలంలో గత రెండున్నర సంవత్సరాలుగా సబ్‌ఇన్‌స్పెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న నండ్రు సాయిబాబును వర్ధన్నపేట పోలీస్ స్టేషన్ కు సాధారణ బదిలీలలో  భాగంగా బదిలీ అయ్యారు. బుధవారం వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని వివిధ...
Read More...
Local News 

వరల్డ్ మస్కిటో డే సందర్భంగా ర్యాలీ

వరల్డ్ మస్కిటో డే సందర్భంగా ర్యాలీ సికింద్రాబాద్, ఆగస్టు 20 (ప్రజామంటలు): ప్రపంచ దోమల దినోత్సవం సందర్భంగా జిహెచ్ఎంసి ఎంటమాలజీ సిబ్బంది బన్సీలాల్ పేట డివిజన్ బోయిగూడ ఐడిహెచ్ కాలనీ లో దోమల అవగాహన ర్యాలీ నిర్వహించారు.  దోమలతో కలుగు వ్యాధులు,  వాటి వ్యాప్తి, నివారణ పై స్థానికులకు అవగాహన కల్పించారు . ర్యాలీలో గాంధీ అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్  డాక్టర్...
Read More...
National  Filmi News  State News 

సినిమాల్లో మహిళలకు సమానత్వం - పురుష-స్త్రీ బైనరీని దాటి వెళ్ళాలి, అంతర సంబంధితిత వాస్తవికతలను పరిష్కరించాలి: కేరళ హైకోర్టు

సినిమాల్లో మహిళలకు సమానత్వం - పురుష-స్త్రీ బైనరీని దాటి వెళ్ళాలి, అంతర సంబంధితిత  వాస్తవికతలను పరిష్కరించాలి: కేరళ హైకోర్టు పబ్లిక్ పాలసీ ముసాయిదాను సమర్పించండి - కోర్ట్ ఆదేశాలు  సినిమాల్లో మహిళలకు సమానత్వ చట్టం పురుష-స్త్రీ బైనరీని దాటి వెళ్ళాలి, అంతర సంబంధితిత (intersectional) వాస్తవికతలను పరిష్కరించాలి: కేరళ హైకోర్టు లో న్యాయమూర్తులు మౌఖిక సూచన చేశారు వినోద పరిశ్రమలో మహిళల రక్షణ కోసం సమానత్వ చట్టాన్ని రూపొందించేటప్పుడు సంబంధితిత" అంశాలను కూడా...
Read More...
Local News  State News 

దేశ యువతకు స్ఫూర్తి రాజీవ్ గాంధీ - సీఎం రేవంత్ రెడ్డి 

దేశ యువతకు స్ఫూర్తి రాజీవ్ గాంధీ - సీఎం రేవంత్ రెడ్డి  మాజీ ప్రధాని రాజీవ్ గాంధీకి ఘన నివాళులు  దేశ సమగ్రతను కాపాడేందుకు ఆయన ప్రాణాలర్పించారు - రేవంత్ రెడ్డి  హైదరాబాద్ ఆగస్ట్ 20 (ప్రజా మంటలు): పారదర్శక పరిపాలన అందించడానికి సాంకేతికతను జోడించాలని ఆనాడు రాజీవ్ గాంధీ ఆలోచన చేశారని,18 ఏండ్లు నిండిన వారికి ఓటు హక్కును కల్పించి దేశ భవిష్యత్ ను నిర్ణయించే అవకాశం...
Read More...
Local News 

మాజీ ప్రధాని రాజీవ్ గాంధీకి మంత్రి అడ్లూరి లక్ష్మణ్,మాజీ మంత్రి జీవన్ రెడ్డి

మాజీ ప్రధాని రాజీవ్ గాంధీకి మంత్రి అడ్లూరి లక్ష్మణ్,మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఇందిరా భవన్ లో ఘనంగా రాజీవ్ గాంధీ జయంతి ఉత్సవాలు జగిత్యాల ఆగస్ట్ 20 ( ప్రజా మంటలు): జగిత్యాల జిల్లా కేంద్రంలో ఇందిరా భవన్ లో రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా రాజీవ్ గాంధీ చిత్రపటానికి, తెలంగాణ రాష్ట్ర ఎస్సీ ఎస్టీ మైనార్టీ వికలాంగుల శాఖ మంత్రి వర్యులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు...
Read More...