అధికారులపై కుక్కల దాడి ఘటనపై ఎస్హెచ్ఆర్సీ కి అడ్వకేట్ ఫిర్యాదు

On
అధికారులపై కుక్కల దాడి ఘటనపై ఎస్హెచ్ఆర్సీ కి అడ్వకేట్ ఫిర్యాదు

విచారణకు స్వీకరించిన మానవ హక్కుల కమిషన్
  *ప్రతివాదిగా రాష్ర్ట ప్రభుత్వ  ముఖ్య కార్యదర్శిని చేర్చిన కమిషన్

సికింద్రాబాద్, ఆగస్ట్ 17 (ప్రజామంటలు) :

సూర్యాపేట జిల్లా తుంగతుర్తి జిల్లా పరిషత్ హైస్కూల్ ఆవరణలో  అధికారులపై వీధి కుక్కలు కరిచి గాయపరిచిన  ఘటనపై సిటీకి చెందిన అడ్వకేట్ రామారావు ఇమ్మనేని చేసిన ఫిర్యాదును తెలంగాణ రాష్ర్ట మానవ హక్కుల కమిషన్ విచారణకు స్వీకరించింది.

ఈ ఘటనలో ప్రధాన ప్రతివాదిగా రాష్ర్ట ప్రభుత్వ ముఖ్య కార్యదర్శిని పేర్కొంటూ నెంబర్ 858/ఐఎన్/2025  ద్వారా విచారణకు నిర్ణయించింది. తుంగతుర్తి జిల్లా పరిషత్ హైస్కూల్ ఆవరణలో ఇండిపెండెంట్స్ డే సెలబ్రేషన్స్ కు సంబందించి ఏర్పాట్లలో ఉన్న ఆరుగురిపై  వీధి కుక్కలు దాడి చేసి గాయపరిచాయని రామారావు తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఓ వైపు వీధికుక్కల నియంత్రణపై సుప్రీం కోర్టు జోక్యం చేసుకున్నప్పటికీ జిల్లా ప్రభుత్వ  యంత్రాంగం మాత్రం కుక్కల నియంత్రణలో నిర్లక్ష్యంగా ఉందన్నారు.

ఈ విషయమై జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ పై చర్యలు తీసుకోవాలని, వీధికుక్కల దాడిలో గాయపడ్డ ఆరుగురికి వైద్య సహాయం, తగిన పరిహారం అందించే విధంగా ప్రభుత్వాన్ని ఆదేశించాలని అడ్వకేట్ రామారావు తన ఫిర్యాదులో తెలంగాణ రాష్ర్ట మానవ హక్కుల కమిషన్ ను కోరారు.

Tags

More News...

Local News  Spiritual  

ముగిసిన రాజ్ ప్రకాష్ పాల్ పశ్చాత్తాప సమావేశాలు

ముగిసిన రాజ్ ప్రకాష్ పాల్ పశ్చాత్తాప సమావేశాలు సికింద్రాబాద్, ఆగస్ట్ 17 (ప్రజామంటలు): లార్డ్ చర్చ్ పాస్టర్ రాజ్ ప్రకాష్ పాల్ ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు నగరంలోని ఎల్బీస్టేడియంలో పశ్చాత్తాప సమావేశాల పేరుతో నిర్వహించిన సభలు ఆదివారంతో ముగిశాయి. హైదరాబాద్ లోని  వివిధ ప్రాంతాలతో పాటు తెలంగాణాలోని వివిధ జిల్లాల నుంచి మూడు రోజుల పాటు వేలాది మంది క్రైస్తవులు హాజరయ్యారు. ఈ...
Read More...
Local News  Spiritual  

మెటుపల్లిలో ఇస్కాన్ శ్రీ కృష్ణ జన్మాష్టమి మహోత్సవం

మెటుపల్లిలో ఇస్కాన్ శ్రీ కృష్ణ జన్మాష్టమి మహోత్సవం   శ్రీ రాధా గోవర్ధనధారి ఆలయం లో గోకులాష్టమి కార్యక్రమాలు   మెట్ పల్లి ఆగస్టు 17 (ప్రజా మంటలు దగ్గుల అశోక్): మెట్ పల్లి -కోరుట్ల మధ్యలో హరే కృష్ణ రోడ్డు, పెద్దపూర్ క్యాంప్ గురుకుల స్కూల్ దగ్గర, చౌలమద్ది శివారులో గల ISKCON శ్రీ శ్రీ రాధా గోవర్ధన ఆలయంలో శ్రీ కృష్ణ జన్మాష్టమి మహోత్సవం...
Read More...
National  State News 

మళ్ళీ ఆసుపత్రిలో చేరిన నవీన్ పట్నాయక్!

మళ్ళీ ఆసుపత్రిలో చేరిన నవీన్ పట్నాయక్! భువనేశ్వర్ ఆగస్ట్ 17: ఒడిశా ప్రతిపక్ష నాయకుడు, బిజు జనతాదళ్ నాయకుడు నవీన్ పట్నాయక్ (78) మళ్ళీ ఈరోజు ఆసుపత్రి చేరారు. గత జూలైలో వెన్నెముక శస్త్రచికిత్స చేయించుకున్న ఆయనను ఇప్పుడు వయస్సు సంబంధిత సమస్యల కారణంగా ఆసుపత్రికి తరలించారు. వయసు సంబంధిత సమస్యల కారణంగా నవీన్ పట్నాయక్ను ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారని బిజు జనతాదళ్...
Read More...
National  State News 

మూర్తీభవించిన RSS కార్యకర్తను ఎంపిక చేసిన బిజేపి

 మూర్తీభవించిన RSS కార్యకర్తను ఎంపిక చేసిన బిజేపి మూర్తీభవించిన RSS కార్యకర్త న్యూ ఢిల్లీ ఆగస్ట్ 17: బీజేపీ పార్టీ మరియు కూటమితో సైద్ధాంతిక సమన్వయం కలిగిన పార్టీ వ్యక్తిని, అలాగే రాజ్యసభ చైర్మన్‌గా చేరుకోగల వ్యక్తిని ఎంపిక చేయాలని బిజెపి నాయకత్వం ఆసక్తిగా ఉందని చెబుతున్నారు. హిందీని విధించడం మరియు వచ్చే ఏడాది ప్రారంభంలో తమిళనాడులో కఠినమైన ఎన్నికలకు వెళ్లడం అనే ప్రశ్నపై...
Read More...
National  State News 

NDA ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా రాధాకృష్ణన్

NDA ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా రాధాకృష్ణన్ న్యూ ఢిల్లీ ఆగస్ట్ 17: చంద్రపురం పొన్నుసామి రాధాకృష్ణన్ (జననం 20 అక్టోబర్ 1957) NDA ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో నిర్ణయించారు. దక్షిణాది పై, ముఖ్యంగా, తమిళనాడు రాష్ట్రంలో పట్టు సంపాదించుకోవడానికి ఈయనను ఎంపిక చేసినట్లు భావిస్తున్నారు. తదుపరి ఉపరాష్ట్రపతి ఏకగ్రీవంగా ఎన్నిక కావాలని మేము కోరుకుంటున్నాము, మేము ప్రతిపక్ష నాయకులను...
Read More...
Local News  State News 

అధికారులపై కుక్కల దాడి ఘటనపై ఎస్హెచ్ఆర్సీ కి అడ్వకేట్ ఫిర్యాదు

అధికారులపై కుక్కల దాడి ఘటనపై ఎస్హెచ్ఆర్సీ కి అడ్వకేట్ ఫిర్యాదు విచారణకు స్వీకరించిన మానవ హక్కుల కమిషన్    *ప్రతివాదిగా రాష్ర్ట ప్రభుత్వ  ముఖ్య కార్యదర్శిని చేర్చిన కమిషన్ సికింద్రాబాద్, ఆగస్ట్ 17 (ప్రజామంటలు) : సూర్యాపేట జిల్లా తుంగతుర్తి జిల్లా పరిషత్ హైస్కూల్ ఆవరణలో  అధికారులపై వీధి కుక్కలు కరిచి గాయపరిచిన  ఘటనపై సిటీకి చెందిన అడ్వకేట్ రామారావు ఇమ్మనేని చేసిన ఫిర్యాదును తెలంగాణ రాష్ర్ట మానవ...
Read More...
Local News 

ఎలక్షన్స్ వరకే పాలిటిక్స్..తర్వాత అభివృద్దే లక్ష్యంగా ముందుకు - కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేశ్

ఎలక్షన్స్ వరకే పాలిటిక్స్..తర్వాత అభివృద్దే లక్ష్యంగా ముందుకు - కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేశ్ సికింద్రాబాద్, ఆగస్ట్ 17 (ప్రజామంటలు): రాజకీయాలు ఎన్నికల వరకే పరిమితమని, ఇక పదవీకాలమంతా అభివృద్దే లక్ష్యంగా ముందుకు వెళ్తామని కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేశ్ అన్నారు. ఆదివారం బోయిన్ పల్లి వార్డు 6 అరవెల్లి ఎన్క్లేవ్, రాయల్ ఎన్క్లేవ్ కాలనీలలో రూ.39 లక్షలతో చేపట్టనున్న అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, ఓపెన్ నాలా పనులను ఎమ్మెల్యే, కంటోన్మెంట్ బోర్డు...
Read More...
Local News 

పద్మశాలి సంఘం నూతన కార్యవర్గం ఎన్నిక 

పద్మశాలి సంఘం నూతన కార్యవర్గం ఎన్నిక  గొల్లపల్లి పట్టణ పద్మశాలి సేవా సంఘం అధ్యక్షులుగా అంకం భూమయ్య      గొల్లపెల్లి ఆగస్టు 17 (ప్రజా మంటలు):  గొల్లపల్లి పట్టణ పద్మశాలి సంఘం ఎన్నికలు ఆదివారం సంఘ భవనంలో నిర్వహించారు. అధ్యక్షులుగా అంకం భూమయ్య, ప్రధాన కార్యదర్శిగా చౌటపల్లి తిరుపతి (బట్టల), ఉపాధ్యక్షులుగా గాజెంగి హనుమాన్లు, హోరహోరిగా సాగిన ఎన్నికలలో విజయం సాధించారు. కోశాధికారిగా అంకం...
Read More...
National  Filmi News  State News 

కోల్‌కతాలో బెంగాల్ ఫైల్స్ సినిమా ట్రైలర్ విడుదల నిలుపుదల

కోల్‌కతాలో బెంగాల్ ఫైల్స్ సినిమా ట్రైలర్ విడుదల నిలుపుదల కోల్‌కతా ఆగస్ట్ 17: కోల్‌కతాలో వివాదాస్పద, ఎజెండా చిత్ర దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి చిత్రం, "బెంగాల్ ఫైల్స్" సినిమా ట్రైలర్ విడుదలపై వివాదం చెలరేగింది. అన్ని అనుమతులు పొందినప్పటికీ పోలీసులు సినిమా ప్రదర్శనను శనివారం, మధ్యలో నిలిపివేసారని దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి అన్నారు; తృణమూల్ కాంగ్రెస్ నాయకత్వం ఈ సినిమా రాజకీయ ప్రేరేపితమని, సమాజంలో విభజనలను...
Read More...
National  State News 

ఉపరాష్ట్రపతి ఎన్నికకు బీజేపీ పార్లమెంటరీ కమిటీ సమావేశం

ఉపరాష్ట్రపతి ఎన్నికకు బీజేపీ పార్లమెంటరీ కమిటీ సమావేశం వెంకయ్య నాయుడు, వసుంధర రాజే, రాజనాథ్ సింగ్ ల పేర్లు పరిశీలన న్యూ ఢిల్లీ ఆగస్ట్ 17: న్యూఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశం జరుగుతోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు, ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా, హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఇతర...
Read More...
National  State News 

ప్రధాన మంత్రి కొత్త కార్యాలయం -వచ్చే నెలలో ప్రారంభం

 ప్రధాన మంత్రి కొత్త కార్యాలయం -వచ్చే నెలలో ప్రారంభం న్యూ ఢిల్లీ ఆగస్ట్ 17:   ప్రధాన మంత్రి కార్యాలయం అంటే PMO ఇప్పుడు కొత్త భవననంలోకి మారబోతోంది. ప్రస్తుతం PMO సౌత్ బ్లాక్‌లో ఉంది కానీ వచ్చే నెలలో PMO ఎగ్జిక్యూటివ్ ఎన్‌క్లేవ్‌కు మారుతుంది. స్వాతంత్రం వచ్చిన 78 ఏళ్లకు కొత్త కార్యాలయంలోకి పీఎంఓ మారబోతోంది. సెంట్రల్ విస్టా ప్రాజెక్ట్ కింద నిర్మించబడిన ఈ కొత్త...
Read More...
National  State News 

ఓటరు జాబితా శుద్దీకరణ బాధ్యత రాజకీయ పార్టీలదే - ఎన్నికల కమీషన్

ఓటరు జాబితా శుద్దీకరణ బాధ్యత రాజకీయ పార్టీలదే - ఎన్నికల కమీషన్ బిజూ జనతాదళ్ కానీ అఖిలేష్ కానీ అఫిడవిట్ సమర్పించలేదు?  బూత్ లెవెల్ లో ఉన్న రాజకీయ పార్టీల ల నాయకులు ఏంచేస్తున్నారు?  ఎన్నికలజరిగిన 45 రోజుల్లో ఎందుకు ఫిర్యాదు చేయలేదు?  7 రోజుల్లో రాహుల్ క్షమాపణ చెప్పాలి? ఎన్నికల ప్రధాన కమిషనర్ ఙ్ఞానేష్ కుమార్  న్యూ డిల్లీ ఆగస్టు 17: బీహార్‌లో ఓటర్ల జాబితాల స్పెషల్...
Read More...