బహుజన ఎదుగుదలకు చదువొక్కటే మార్గం - సర్వాయి పాపాన్ని జయంతి వేడుకలలో రేవంత్ రెడ్డి
బీసీల రిజర్వేషన్లకు బీజేపీ, BRS లే అడ్డంకి
మతం పేర రాజకీయం
హైదరాబాద్ ఆగస్ట్ 18:
బహుజనులు సమాజంలో ఎదగాలన్నా, నిలదొక్కుకోవాలన్నా చదువు ఒక్కటే మార్గమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉద్గాటించారు. బహుజనులు ఉన్నత చదువులు చదవాలన్న లక్ష్యంతోనే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ పిల్లల కోసం రాష్ట్ర వ్యాప్తంగా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు.
హైదరాబాద్ ట్యాంక్బండ్ పైన తొలి తెలుగు బహుజన చక్రవర్తి శ్రీ శ్రీ శ్రీ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ మహారాజ్ విగ్రహ ఏర్పాటుకు ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు.
హైదరాబాద్ రవీంద్ర భారతిలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ మహారాజ్ గారి 375వ జయంతి ఉత్సవాల్లో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రరెడ్డి పాల్గొన్నారు.
ఈ శంకుస్థాపన కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావు, పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తో పాటు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, నగర మేయర్ తో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.
హైదరాబాద్ రవీంద్రభారతిలో శ్రీ శ్రీ శ్రీ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ మహారాజ్ 375 వ జయంతి కార్యక్రమంలో ముఖ్యమంత్రి, ఆ మహనీయుని చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క గారితో పాటు మంత్రులు, సలహాదారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ, బడుగు, బలహీన వర్గాల పక్షాన నిలబడ్డ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహం తెలంగాణ సమాజానికి ఆదర్శంగా నిలబడాలని, అందుకే గుండెకాయ లాంటి సచివాలయం ఎదురుగా ట్యాంక్బండ్ పైన ఏర్పాటు చేస్తున్నాం. సర్దార్ పాపన్న గౌడ్ నిర్మించిన ఖిలాషాపూర్ కోటను చారిత్రక క్షేత్రంగా, పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తున్నాం.
బీసీల రిజర్వేషన్లకు బీజేపీ, BRS లే అడ్డంకి
వందేళ్లుగా ఎదురుచూస్తున్న బడుగు, బలహీన వర్గాలకు ఇచ్చిన మాట ప్రకారం, ఏ రాష్ట్రంలో జరగని కుల గణనను తెలంగాణలో పూర్తి చేసి బలహీన వర్గాలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని సంకల్పించాం. నూటికి నూరు శాతం చిత్తశుద్ధితో పకడ్బందీగా జనాభాను లెక్కించి సమగ్ర సమాచారం సేకరించాం. ముస్లింల పేర బీజేపీ రిజర్వేషన్లు అడ్డుకుంటుంది.అలాగే బియారెస్ తొండి పెడుతుందని ముఖ్యమంత్రి అన్నారు.
తొండి వాదనలతో ప్రభుత్వం తీసిన లెక్కలను వక్రీకరిస్తే మళ్లీ రాబోవు వందేళ్ల వరకు బహుజనులకు న్యాయం జరగదు. క్షుణ్ణంగా ప్రతి అంశాన్ని పరిగణలోకి తీసుకుని అత్యంత పకడ్బందీగా సమాచారాన్ని సేకరించి క్రోడీకరించాం.
ఆ వివరాల ఆధారంగానే బీసీలకు స్థానిక సంస్థల్లో 42 శాతం, విద్య ఉద్యోగావకాశాల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ మంత్రిమండలి తీర్మానించి శాసనసభలో సమగ్ర చర్చ చేసి ఆమోదించిన రెండు బిల్లులను గవర్నర్ గారికి పంపించాం. అలాగే స్థానిక సంస్థల్లో మొత్తం రిజర్వేషన్లు 50 శాతం దాటడానికి వీలులేకుండా గత ప్రభుత్వం చేసిన పంచాయతీ రాజ్ చట్టం అడ్డంకిగా మారడంతో ఆ గరిష్ట పరిమితిని తొలగిస్తూ ఆర్డినెన్స్ జారీ చేశాం.
ఆ మూడింటినీ గవర్నర్ రాష్ట్రపతికి పంపించారు. వాటిని ఆమోదించాల్సిన అవసరం ఉంది. గడిచిన అయిదు నెలలుగా పెండింగ్లో పెట్టారు. వాటిని ఆమోదించాలని కేంద్రంపై ఒత్తిడి చేయడానికి యావత్ మంత్రిమండలి, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ప్రజా సంఘాల ప్రతినిధులందరం ఢిల్లీలో ఆందోళన చేశాం.
కుల గణన లెక్కల్లో ఎక్కడా ఒక్క తప్పు లేదు. ప్రతి 150 ఇండ్లకు ఒక ఎన్యుమరేటర్ చొప్పున 95 వేల మంది ఎన్యుమరేటర్లు 60 రోజుల పాటు ఇంటింటికీ తిరిగి సమాచారాన్ని సేకరించారు. ఆ సమాచారాన్ని సంపూర్ణంగా కంప్యూటర్ లో క్రోడీకరించాం.
మతం పేర రాజకీయం
దేశంలో మత ప్రాతిపదికన రిజర్వేషన్లకు చట్టంలోనే తావు లేదు. తెలంగాణ పంపించిన రెండు బిల్లులు, ఆర్డినన్స్లో అందుకు సంబంధించి ఒక ముక్కలేదు. వెనుకబాటు తనం ఆధారంగానే రిజర్వేషన్లు కల్పించాం.
సమస్యలన్నీ ఒక్కొక్కటిగా అధిగమిస్తూ ముందుకు పోవాలి. ప్రస్తుత పరిస్థితుల్లో బహుజనులు చదువుకోవడం ద్వారానే తలరాత మార్చుకోగలరు. బడుగు, బలహీన వర్గాలకు రాజ్యాధికారం కావాలంటే అందరూ చదువుకోవాలి. అప్పుడే రాష్ట్రం అభివృద్ధి జరిగి ఆర్థిక వ్యవస్థ నిలదొక్కుకుంటుంది.." అని ముఖ్యమంత్రి ఉద్ఘాటించారు.
ఈ కార్యక్రమంలో మంత్రులు జూపల్లి కృష్ణారావు, పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, సలహాదారులు కే. కేశవరావు, వేం నరేందర్ రెడ్డి , ఎమ్మెల్సీ, పీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ పాటు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, నగర మేయర్, వివిధ కార్పొరేషన్ చైర్మన్లతో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
వరల్డ్ మస్కిటో డే సందర్భంగా ర్యాలీ

సినిమాల్లో మహిళలకు సమానత్వం - పురుష-స్త్రీ బైనరీని దాటి వెళ్ళాలి, అంతర సంబంధితిత వాస్తవికతలను పరిష్కరించాలి: కేరళ హైకోర్టు

దేశ యువతకు స్ఫూర్తి రాజీవ్ గాంధీ - సీఎం రేవంత్ రెడ్డి

మాజీ ప్రధాని రాజీవ్ గాంధీకి మంత్రి అడ్లూరి లక్ష్మణ్,మాజీ మంత్రి జీవన్ రెడ్డి

వచ్చే ఎన్నికల్లో పోటీచేస్తా - నటుడు సుమన్
1.jpeg)
ఉప రాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డికి చిన్నారెడ్డి సంపూర్ణ మద్దతు
1.jpeg)
రేపటి నుండి శ్రీ లోక మాత పోచమ్మ తల్లి దేవాలయ 63వ వార్షికోత్సవాలు

ముంబై మోనో రైలు ప్రమాదంలో 400 మంది సురక్షితం

వాంకిడి ఘటనపై తెలంగాణ ప్రభుత్వానికి ఎన్హెచ్ఆర్సీ నోటీసులు

కాంగ్రెస్ కుట్రలను తిప్పికొట్టాలి - బిజెపి నాయకురాలు ఎం. రాజేశ్వరి

వైద్యుల సమస్యల్ని పరిష్కరించాలని మంత్రి కి టీజీజీడీఏ నేతల వినతి

గాంధీ ఆసుపత్రి కి స్పెషల్ ఆఫీసర్ ను నియమిస్తాం...వైద్య ఆరోగ్య శాఖ మంత్రి
.jpg)