రాయికల్ మండలంలోని బోర్నపల్లిలో గోదావరి వరద తీవ్రతను రైతులు గ్రామస్తులతో కలిసి పరిశీలించిన మాజీ మంత్రి జీవన్ రెడ్డి 

On
రాయికల్ మండలంలోని బోర్నపల్లిలో గోదావరి వరద తీవ్రతను రైతులు గ్రామస్తులతో కలిసి పరిశీలించిన మాజీ మంత్రి జీవన్ రెడ్డి 

యూరియా కొరత..కేంద్రందే బాధ్యత..!
నాలుగు వంతెనల నిర్మాణం...నాకు సంతృప్తినిచ్చింది..!
..బోర్నపల్లి,కమ్మునూరు బ్రిడ్జిల నిర్మాణం దగ్గరుండి పర్యవేక్షించా!
- పదేళ్ల తర్వాత రేషన్ కార్డులు, ఇండ్ల మంజూరు
- మాజీ మంత్రి జీవన్ రెడ్డి

రాయికల్ ఆగస్ట్ (ప్రజా మంటలు):

యూరియా కొరతపై మాట్లాడుతూ,కేంద్రం తెలంగాణ రాష్ట్రంపై వివక్ష చూపిస్తుందని, మంత్రులు తెలంగాణ రాష్ట్ర ఎంపీలు కేంద్రంపై ఉత్తిడి తీసుకువస్తున్నారని మాజీ మంత్రి జీవన్ రెడ్లి తెలిపారు. 

బోర్నపల్లి బ్రిడ్జి వద్ద గోదావరి వరదను పరిశీలించి, గ్రామస్తులతో మాట్లాడిన జీవన్ రెడ్డి, రాయికల్ లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు.

గత ప్రభుత్వం గ్రామాలలో ఒక్క ఇల్లు మంజూరు ఇవ్వలేదు హౌసింగ్ శాఖను నిర్వీర్యం చేసింది అన్నారు.గత ప్రభుత్వం 3 లక్షల రూపాయలు ఇంటి సహాయానికి అని పత్రం ఇచ్చిన అది అమలు చేయలేదు

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తదుపరి 5 లక్షల రూపాయల మంజూరుతో మొదటి విడతలో నియోజకవర్గానికి 3500 ఇండ్లు మంజూరు చేయడం జరుగుతుందని అన్నారు

యూరియా కొరత..కేంద్రందే బాధ్యత..!

రామగుండం ఎరువుల కర్మాగారంలో 8 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా ఉత్పత్తి కావలసి ఉండగా కేవలం 5 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా ఉత్పత్తి కావడంతో యూరియా కొరత ఏర్పడిందని దీనిపై కేంద్రందే బాధ్యత అని మాజీ మంత్రి జీవన్ రెడ్డి అన్నారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు రాయికల్ మండలంలోని బోర్నపల్లి బ్రిడ్జి వద్ద గోదావరి నీటి ఉధృతి పెరగడంతో గోదావరి తీర ప్రాంతాలను మంగళవారం పరిశీలించి ప్రజలు,అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

అనంతరం రాయికల్ పట్టణంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో మాజీ మంత్రి మాట్లాడుతూ రైతులకు సకాలంలో ఎరువులు అందక ఇబ్బందులు పడుతున్నారని రాష్ట్రంలో ఉన్న రామగుండం ఎరువుల కర్మాగారం నుండి ఉత్పత్తి అయ్యే యూరియా 90% తెలంగాణ రైతాంగానికి కేటాయించకపోవడం కేంద్ర మంత్రులు,బిజెపి ఎంపీల బాధ్యత రాహిత్యమని మండిపడ్డారు.

నాలుగు వంతెనల నిర్మాణం...నాకు సంతృప్తినిచ్చింది..!

ఉమ్మడి అదిలాబాద్, కరీంనగర్ జిల్లాల మధ్య వాణిజ్య వ్యాపార, రవాణా సౌకర్యార్థం కడెం,రాయికల్ మండలాల మధ్యలో బోర్నపల్లి బ్రిడ్జి,కమ్మనూరు, కలమడుగు మధ్య బ్రిడ్జి నిర్మాణం, మల్లాపూర్ మండల్ బాదనకుర్తి బ్రిడ్జి,నిజాంబాద్ జిల్లా మోర్తాడ్ మండలం గుమ్మిరియాల గోదావరి నదిపై ఈ నాలుగు వంతెనల నిర్మాణంలో నాకు భాగస్వామ్యం ఉండడం నా జీవితంలో అత్యంత తృప్తినిచ్చిన అంశమని మాజీ మంత్రి జీవన్ రెడ్డి అన్నారు.

జగిత్యాల నియోజకవర్గంలోని బోర్నపల్లి వంతెన నిర్మాణం చేపట్టాలని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకురాగా మంజూరు చేశారని, మీ బోర్నపల్లి,కమ్మునూరు బ్రిడ్జిల నిర్మాణం దగ్గరుండి పర్యవేక్షించానని పేర్కొన్నారు.

పదేళ్ల తర్వాత రేషన్ కార్డులు, ఇండ్ల మంజూరు

గత బిఆర్ఎస్ ప్రభుత్వం రెండు పర్యాయాలు అధికారం చేపట్టిన గడిచిన 10 ఏళ్లలో ఒక్క రేషన్ కార్డు, ఇళ్లను ఇవ్వలేదని పేర్కొన్నారు. 18 ఏళ్ల కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టిన వెంటనే రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లను, ఉచిత బస్సు, ఉచిత విద్యుత్తు, సన్నబియ్యం వంటి మహోన్నత కార్యక్రమాలను అమలు చేసిందన్నారు. 42 శాతం బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకమని కొనియాడారు.

IMG_20250819_184648ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు గోపి రాజారెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి గుర్రం మహేందర్ గౌడ్,నాయకులు కొయ్యేడి మహిపాల్,బాపురపు నర్సయ్య,బత్తిని భూమయ్య, కోడిపెల్లి ఆంజనేయులు,తలారి రాజేష్,పొన్నం శ్రీకాంత్,చింతల పెళ్లి గంగారెడ్డి,బత్తిని నాగరాజు, నరసింహారెడ్డి,ఏలేటి రాజేందర్,రాజీవ్,జలపతి రెడ్డి, ఉప్పు లక్ష్మణ్,రాజారెడ్డి,మసుద్,శివ,రాజేష్,రాజారెడ్డి,  తదితరులు పాల్గొన్నారు.

Tags

More News...

Local News 

ఓట్ల కుంభకోణంపై SIT ద్వారా విచారణ చేపట్టాలని సుప్రీంకోర్టులో పిటిషన్

ఓట్ల కుంభకోణంపై SIT ద్వారా విచారణ చేపట్టాలని సుప్రీంకోర్టులో పిటిషన్ న్యూ డిల్లీ ఆగస్ట్ 20: బెంగళూరు సెంట్రల్ నియోజకవర్గంలో రాహుల్ గాంధీ ఓటర్ల జాబితాలో అవకతవకలు జరిగాయని చేసిన ఆరోపణలపై సిట్ విచారణ కోరుతూ సుప్రీంకోర్టులో పిఐఎల్ దాఖలైంది 2024 లోక్‌సభ ఎన్నికల సమయంలో బెంగళూరు సెంట్రల్ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున ఓటర్ల జాబితాలో అవకతవకలు జరిగాయని ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ లేవనెత్తిన ఆరోపణలపై...
Read More...
Local News 

ఇందిరమ్మ ఇళ్ళ నిర్మాణ పనులు వేగవంతంగా పూర్తి చేయాలి - ఎంపీడీవో మహమ్మద్ సలీం

ఇందిరమ్మ ఇళ్ళ నిర్మాణ పనులు వేగవంతంగా పూర్తి చేయాలి - ఎంపీడీవో మహమ్మద్ సలీం ఇబ్రహీంపట్నం ఆగస్టు 20 (ప్రజా మంటలు):   ఇబ్రహీంపట్నం మండలంలోని వేములకుర్తి గ్రామాన్ని ఎంపీడీఓ సలీం బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా గ్రామంలోని ఇందిరమ్మ ఇళ్ళను పరిశీలించి, నిర్మాణ పనులు వేగవంతంగా పూర్తి చేయాలన్నారు. అదేవిధంగా ఇందిరమ్మ ఇళ్ళు మంజూరైనవారు ఇప్పటికీ ఇంకా ఇళ్ళ నిర్మాణాలు ప్రారంభించని లబ్ధిదారులు వెంటనే ఇళ్ళ నిర్మాణాలు ప్రారంభించి, నిర్ణిత సమయంలో...
Read More...
Local News 

ఇబ్రహీంపట్నం తాసిల్దార్ కార్యాలయ తనిఖీ.

ఇబ్రహీంపట్నం తాసిల్దార్ కార్యాలయ తనిఖీ. ఇబ్రహీంపట్నం ఆగస్టు 20 (ప్రజా మంటలు దగ్గుల అశోక్): ఇబ్రహీంపట్నం మండల్ తాసిల్దార్ కార్యాలయంనుఅదనపు కలెక్టర్  మరియు ఆర్డీవో మెట్పల్లి  తనిఖీ చేశారు, భూ భారత్ కి సంబంధించిన ఫైల్ వెరిఫై చేసి, త్వరగా పూర్తి చేయుటకు ఆదేశాలు జారీ చేసిసారు. కార్యాలయ సిబ్బందికి తగు సూచనలు జారీ చేసి,  గోదుర్ గ్రామంలో గల రాజరాజేశ్వర...
Read More...
Local News  State News 

మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి  వేడుకల్లో డాక్టర్ కోట నీలిమ

మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి  వేడుకల్లో డాక్టర్ కోట నీలిమ సికింద్రాబాద్, ఆగస్ట్ 20 (ప్రజామంటలు) : ఆధునిక భారత రూపకర్త, ఐటీ విప్లవ పితామహుడు, మాజీ ప్రధానమంత్రి భారతరత్న ,దివంగత రాజీవ్ గాంధీ 81వ జయంతి వేడుకలను బన్సీలాల్ పేట్, బేగంపేట్, అమీర్ పేట్, సనత్ నగర్ డివిజన్లలో పీసీసీ వైస్ ప్రెసిడెంట్, సనత్ నగర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి డాక్టర్ కోట నీలిమ...
Read More...
Local News  Crime  State News 

ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో దంపతుల అదృశ్యం

ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో దంపతుల అదృశ్యం ఇబ్రహీంపట్నం ఆగస్టు 20( ప్రజా మంటలు దగ్గుల అశోక్): ఇబ్రహీంపట్నం గ్రామానికి చెందిన బోడ రవి - బోడ ప్రమీల దంపతులిద్దరూ శనివారం 16వ తేదీన ఇంట్లో నుండి వెళ్లి, ఇప్పటివరకు ఇంటికి తిరిగి రాలేదని పోలీసులకు కూతురు ఫిర్యాదు చేసింది. అదృశ్యం అయిన వారి కూతురు అంబటి మీనాక్షి, ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు...
Read More...
Local News 

ఘనంగా రాజీవ్ గాంధీ గారి జయంతి వేడుక

ఘనంగా రాజీవ్ గాంధీ గారి జయంతి వేడుక (అంకం భూమయ్య)  గొల్లపల్లి ఆగస్టు 20 (ప్రజా మంటలు):  గొల్లపెల్లి మండల కేంద్రంలో స్థానిక ఎంపిడిఓ కార్యాలయం వద్ద మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారతదేశ మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు జరుపుకొన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించారు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ముస్కు...
Read More...
National  Opinion  State News 

130వ సవరణ రాజకీయ శుద్ధికా లేక రాజ్యాంగ మౌలికాంశాలనే మార్చడానికా? 

130వ సవరణ రాజకీయ శుద్ధికా లేక రాజ్యాంగ మౌలికాంశాలనే మార్చడానికా?  130వ రాజ్యాంగ సవరణ బిల్లు ప్రతిపక్షాల ప్రభుత్వాలను కూల్చడానికేనా?  రాష్ట్ర ప్రభుత్వాలు ఇక గవర్నర్ చేతిలో కీలుబొమ్మలేనా? న్యూ ఢిల్లీ ఆగస్ట్ 20:130వ సవరణ బిల్లు ఆర్టికల్ 75 (కేంద్ర మంత్రులకు సంబంధించిన నిబంధనలు), ఆర్టికల్ 164 (రాష్ట్ర మంత్రులకు సంబంధించిన నిబంధనలు), మరియు ఆర్టికల్ 239AA (దిల్లీ కేంద్రపాలిత ప్రాంతానికి సంబంధించిన నిబంధనలు)లలో...
Read More...
Local News 

ముల్కనూర్ నూతన ఎస్సైగా రాజు

ముల్కనూర్ నూతన ఎస్సైగా రాజు భీమదేవరపల్లి, ఆగస్టు 20 ప్రజామంటలు :  ముల్కనూర్ నూతన ఎస్సైగా గీసుకొండ పోలీస్ సషన్లో విధులు నిర్వర్తిస్తున్న ఎస్ఐ రాజు రానున్నారు.భీమదేవరపల్లి మండలంలో గత రెండున్నర సంవత్సరాలుగా సబ్‌ఇన్‌స్పెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న నండ్రు సాయిబాబును వర్ధన్నపేట పోలీస్ స్టేషన్ కు సాధారణ బదిలీలలో  భాగంగా బదిలీ అయ్యారు. బుధవారం వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని వివిధ...
Read More...
Local News 

వరల్డ్ మస్కిటో డే సందర్భంగా ర్యాలీ

వరల్డ్ మస్కిటో డే సందర్భంగా ర్యాలీ సికింద్రాబాద్, ఆగస్టు 20 (ప్రజామంటలు): ప్రపంచ దోమల దినోత్సవం సందర్భంగా జిహెచ్ఎంసి ఎంటమాలజీ సిబ్బంది బన్సీలాల్ పేట డివిజన్ బోయిగూడ ఐడిహెచ్ కాలనీ లో దోమల అవగాహన ర్యాలీ నిర్వహించారు.  దోమలతో కలుగు వ్యాధులు,  వాటి వ్యాప్తి, నివారణ పై స్థానికులకు అవగాహన కల్పించారు . ర్యాలీలో గాంధీ అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్  డాక్టర్...
Read More...
National  Filmi News  State News 

సినిమాల్లో మహిళలకు సమానత్వం - పురుష-స్త్రీ బైనరీని దాటి వెళ్ళాలి, అంతర సంబంధితిత వాస్తవికతలను పరిష్కరించాలి: కేరళ హైకోర్టు

సినిమాల్లో మహిళలకు సమానత్వం - పురుష-స్త్రీ బైనరీని దాటి వెళ్ళాలి, అంతర సంబంధితిత  వాస్తవికతలను పరిష్కరించాలి: కేరళ హైకోర్టు పబ్లిక్ పాలసీ ముసాయిదాను సమర్పించండి - కోర్ట్ ఆదేశాలు  సినిమాల్లో మహిళలకు సమానత్వ చట్టం పురుష-స్త్రీ బైనరీని దాటి వెళ్ళాలి, అంతర సంబంధితిత (intersectional) వాస్తవికతలను పరిష్కరించాలి: కేరళ హైకోర్టు లో న్యాయమూర్తులు మౌఖిక సూచన చేశారు వినోద పరిశ్రమలో మహిళల రక్షణ కోసం సమానత్వ చట్టాన్ని రూపొందించేటప్పుడు సంబంధితిత" అంశాలను కూడా...
Read More...
Local News  State News 

దేశ యువతకు స్ఫూర్తి రాజీవ్ గాంధీ - సీఎం రేవంత్ రెడ్డి 

దేశ యువతకు స్ఫూర్తి రాజీవ్ గాంధీ - సీఎం రేవంత్ రెడ్డి  మాజీ ప్రధాని రాజీవ్ గాంధీకి ఘన నివాళులు  దేశ సమగ్రతను కాపాడేందుకు ఆయన ప్రాణాలర్పించారు - రేవంత్ రెడ్డి  హైదరాబాద్ ఆగస్ట్ 20 (ప్రజా మంటలు): పారదర్శక పరిపాలన అందించడానికి సాంకేతికతను జోడించాలని ఆనాడు రాజీవ్ గాంధీ ఆలోచన చేశారని,18 ఏండ్లు నిండిన వారికి ఓటు హక్కును కల్పించి దేశ భవిష్యత్ ను నిర్ణయించే అవకాశం...
Read More...
Local News 

మాజీ ప్రధాని రాజీవ్ గాంధీకి మంత్రి అడ్లూరి లక్ష్మణ్,మాజీ మంత్రి జీవన్ రెడ్డి

మాజీ ప్రధాని రాజీవ్ గాంధీకి మంత్రి అడ్లూరి లక్ష్మణ్,మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఇందిరా భవన్ లో ఘనంగా రాజీవ్ గాంధీ జయంతి ఉత్సవాలు జగిత్యాల ఆగస్ట్ 20 ( ప్రజా మంటలు): జగిత్యాల జిల్లా కేంద్రంలో ఇందిరా భవన్ లో రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా రాజీవ్ గాంధీ చిత్రపటానికి, తెలంగాణ రాష్ట్ర ఎస్సీ ఎస్టీ మైనార్టీ వికలాంగుల శాఖ మంత్రి వర్యులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు...
Read More...