భూటాన్ దేశంలో ముల్కనూర్ వాసి ధనశ్రీకు భరతనాట్య అవార్డు
తింపు నగర బౌద్ధ ఆలయంలో మెరిసిన ధనశ్రీ నాట్య ప్రదర్శన
మండల వ్యాప్తంగా అభినందనల వెల్లువ
భీమదేవరపల్లి మే 23 (ప్రజామంటలు) :
భరతనాట్య క్షేత్రంలో మరొకసారి తెలంగాణ ప్రతిభ తళుక్కుమంది. హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ముల్కనూర్ గ్రామానికి చెందిన రామారపు సంధ్యారాణి, రాజు దంపతుల కుమార్తె ధనశ్రీ భూటాన్ రాజధాని తింపు నగరంలోని ప్రముఖ బౌద్ధ ఆలయంలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమంలో తన కూచిపూడి నాట్య ప్రదర్శనతో అందరినీ ఆకట్టుకుంది. హనుమకొండ మయూరి నాట్య కళాక్షేత్రం గురువు కుండే అరుణ రాజ్ కుమార్ మార్గదర్శకత్వంలో శిక్షణ పొందిన ధనశ్రీ ఇప్పటికే భారతదేశంలోని అనేక ప్రసిద్ధ దేవస్థానాలలో నాట్య ప్రదర్శనలు ఇచ్చి అనేక అవార్డులను గెలుచుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో భూటాన్ బౌద్ధ ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆమె ప్రదర్శనకు మెచ్చిన ఆలయ ప్రధాన అర్చకులు "బెస్ట్ పర్ఫార్మెన్స్ అవార్డు" ను అందజేశారు. ఈ సందర్భంగా గురువు అరుణ రాజ్ కుమార్ మాట్లాడుతూ, "ధనశ్రీ ప్రతిభ మరిన్ని అంతర్జాతీయ వేదికలపై వెలుగొందాలని ఆకాంక్షిస్తున్నాను," అని పేర్కొన్నారు. ఈ వార్త ముల్కనూర్ గ్రామ ప్రజల్లో హర్షాతిరేకాలను కలిగిస్తోంది.
More News...
<%- node_title %>
<%- node_title %>
పార్కింగ్ స్థలం లేక ఇబ్బందులకు గురవుతున్న బ్యాంకు వినియోగదారులు_* ట్రాఫిక్ పోలీసు అధికారులు చొరవ తీసుకోవాలని వినియోగదారుల ఆకాంక్ష

అకాల వర్షాల వల్ల తడిసిన ధాన్యాన్ని పరిశీలించిన జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్

అవాంఛనీయ ఘటనలకు ఆస్కారం లేకుండా పెద్ద హనుమాన్ జయంతి ఉత్సవాలకు అర్ధరాత్రి ఆకస్మికంగా భద్రత పై ఎస్పీ సమీక్ష

భూటాన్ దేశంలో ముల్కనూర్ వాసి ధనశ్రీకు భరతనాట్య అవార్డు

అపర ఏకాదశి.- వైశాఖ బహుళ ఏకాదశి

తాట్లవాయి హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు

భూకబ్జాదారులపై గాంధీనగర్ పీఎస్ లో కాంగ్రెస్ నేత ఫిర్యాదు

తార్నాక లో ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు

జీహెచ్ఎమ్సీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా నేతలు కార్యకర్తలు పని చేయాలి.

శ్రీ భక్తాంజనేయ స్వామి హనుమాన్ జయంతి వేడుకలు

చిలకలగూడ ఏసీపీగా శశాంక్ రెడ్డి బాధ్యతల స్వీకరణ

భాగ్య రెడ్డి వర్మ పోరాట స్ఫూర్తి మనందరికీ ఆదర్శం. కలెక్టర్ బి. సత్య ప్రసాద్
