స్నేహం చిరకాలం నిలిచే ఓ మధురానుభూతి
భీమదేవరపల్లి జూన్ 15 (ప్రజామంటలు) :
స్నేహం చిరకాలం నిలిచే బంధం అని మరోసారి నిరూపితమైన సందర్బంగా, ముల్కనూర్లోని శ్రీనివాస ఫంక్షన్ హాల్ ఒక భావోద్వేగ వేదికగా మారింది. 2006-07 విద్యా సంవత్సరంలో శ్రీ విద్యా భారతి ఉన్నత పాఠశాల లో విద్యాభ్యాసం పూర్తి చేసిన పూర్వ విద్యార్థులు, 18 సంవత్సరాల వేడుకను ఆదివారం సమ్మేళనంగా ఒకచోట చేరి పాత జ్ఞాపకాలను నెమరేసుకున్నారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు శ్రద్ధాభిమానాలతో పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ముందుగా చనిపోయిన మిత్రులకు శ్రద్ధాంజలి ఘటించి నివాళులర్పించారు. కాలంతోనూ మారని మమకారాన్ని ప్రతిబింబించేలా, నాటి రోజుల్ని గుర్తు చేసుకుంటూ, ఒకరితో ఒకరు కౌగిలించుకుని ఆనందంతో ఉప్పొంగిపోయారు. ఈ జ్ఞాపకాల సందడి మధ్యే పాఠశాలలో వారికి బోధించిన ఉపాధ్యాయుల్ని ప్రత్యేకంగా ఆహ్వానించి ఘనంగా సన్మానించారు. పూర్వ ఉపాధ్యాయులు, విద్యార్థుల అభివృద్ధిని చూసి హర్షం వ్యక్తం చేస్తూ, ఇలాంటి సంఘటనలు అనుబంధాలను మరింత బలోపేతం చేస్తాయని అన్నారు. సమ్మేళనం శుభాకాంక్షలతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలతో రోజంతా ఉత్సాహంగా సాగింది. అనంతరం అందరికీ జ్ఞాపికలు పంపిణీ చేసి, విందు భోజనంతో కార్యక్రమాన్ని ముగించారు. ఈ వేడుకలో పూర్వ ఉపాధ్యాయులు బేరె యాదగిరి, శ్రీనివాస్ రెడ్డి, నర్సయ్య, చంద్రమౌళి, నరోత్తం రెడ్డి, కిరణ్, శ్రీనివాస్, రాములు సత్యవతి, లత, పూర్వ విద్యార్థులు అరుణ్, వంశీ, రామకృష్ణ, కిరణ్, మాధవరావు, తిరుపతి, శ్రీకాంత్, సదానందం, అనిల్, శ్రీధర్, శిరీష, ప్రియ వాణి, అనూష, దివ్య, మానస తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
గాయపడినవారిని ఉస్మానియాలో పరామర్శించిన MLA సంజయ్

నేను చాలా చేస్తాను, మరియు దేనికీ క్రెడిట్ పొందను - ఇరాన్-ఇజ్రాయెల్ శాంతి ఒప్పందం 'జరుగుతుంది'- ట్రంప్
.jpeg)
మహిళల ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ కు టీడీఎఫ్ ఆర్థిక సాయం

ఎమ్మార్పీఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకల సన్నాహాక సమావేశం

విద్యుత్ ప్రమాదంలో గాయపడిన వారిని కలెక్టర్ పరామర్శ

శ్రీ శ్రీ శ్రీ మాధవానంద సరస్వతీ స్వామి కర కమలములచే మహాభాగ్య నగర బ్రాహ్మణ సేవా సమితి వార్షికోత్సవ కరపత్రం ఆవిష్కరణ

కవి ఇంటికి కళాశ్రీ భాగంగా రుద్రాంగి కమలకు కళాశ్రీ పురస్కారం

దొడ్డి కొమరయ్య వారసత్వ స్ఫూర్తి తోసామాజిక తెలంగాణ నిర్మిద్దాం.- తుల ఉమ

స్నేహం చిరకాలం నిలిచే ఓ మధురానుభూతి

సేవా కార్యక్రమాల ద్వారానే ప్రజల్లో గుర్తింపు....ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

ఇరాన్ అణుకేంద్రాలపై ఇజ్రాయిల్ దాడులు

హెలికాప్టర్ ప్రమాదంలో 7గురి మృతి - తాత్కాలికంగా చర్దం యాత్ర సేవలు నిలిపివేత
.jpg)