గాంధీలో అత్యాధునిక వైద్య పద్దతులతో రోగులకు మరిన్ని సేవలు
గాంధీలో అనస్తిషియా విభాగం ఆధ్వర్యంలో సీఎంఈ ప్రొగ్రాం
సికింద్రాబాద్, జూన్ 14 (ప్రజామంటలు) :
వైద్యరంగంలో ఆత్యాధునిక పద్దతులు, నేర్చుకుని పేషంట్లకు మరింత మెరుగైన సేవలు అందించాలని పలువురు వైద్యనిపుణులు సూచించారు. గాంధీ అనస్టీషియా విభాగం ఆధ్వర్యంలో అలుమ్నీ హాలులో శనివారం ఇన్సైట్స్ ఆఫ్ పెయిన్ మేనేజ్మెంట్ అంశంపై కంటిన్యూయింగ్ మెడికల్ ఎడ్యుకేషన్ (సీఎంఈ) సదస్సు నిర్వహించారు. గాంధీ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ఇందిర, సూపరింటెండెంట్ ప్రొఫెసర్ సీహెచ్ఎన్ రాజకుమారి లు ముఖ్యఅతిథులుగా హజరై జ్యోతి ప్రజ్వళన చేసి సదస్సును ప్రారంభించారు.
పెయిన్ మేనేజ్మెంట్ నిపుణులు మురళీధర్జోషీ, సుధీర్థార, నాగలక్ష్మీ, ఉమామహేశ్వరరావు, సచిన్లు అల్ట్రాసౌండ్, సియామ్ గైడెడ్, రేడియోఫ్రీక్వెన్సీ ఆఫ్ అబ్లేషన్, నొప్పి నివారణ కేంద్రంలో ఎటువంటి వైద్యసేవలు అందించాలి, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఆధునిక వైద్యవిధానాలు తదితర అంశాలపై పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించి సందేహాలను నివృత్తి చేశారు.
ఉస్మానియా యూనివర్సిటీ విశ్రాంత ప్రొఫెసర్ పద్మావతి తనవంతు సాయంగా గాంధీ పెయిన్ క్లినిక్కు రూ. 20 లక్షల విలులైన అడ్వాన్స్డ్ మెడికల్ ఎక్విప్ మెంట్ ను డొనేట్ చేయనున్నట్లు ప్రకటించారు. కార్యక్రమంలో గాంధీ అనస్టీషియా హెచ్ఓడీ ప్రొఫెసర్ ఆవుల మురళీధర్, ప్రొఫెసర్ కిరణ్ మాదల, అసోషియేట్ అబ్బయ్య, వైస్ ప్రిన్సిపాల్ రవిశేఖరరావులతోపాటు పలు ప్రాంతాల్లోని ఆసుపత్రులకు చెందిన 150 మంది అనస్టీషియా వైద్యులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
సఖి అవగాహనా కార్యక్రమం

హైకోర్టు ఆదేశాలకు మెట్రో రైల్ అధికారుల స్పందన

ఖబర్దార్ కాంగ్రెస్ నాయకుల్లారా.... తలసాని విమర్శించే స్థాయి మీది కాదు

జగిత్యాలలో ద్విచక్ర వాహనాల దొంగ అరెస్ట్ 3 ద్విచక్ర వాహనాలు, వెండి ఆభరణాలు స్వాదీనం

పదవి విరమణ పొందిన హోం గార్డ్ రామస్వామి కి జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆత్మీయ వీడ్కోలు

గాంధీలో అత్యాధునిక వైద్య పద్దతులతో రోగులకు మరిన్ని సేవలు

సీఎం రేవంత్ రెడ్డితో కోట నీలిమా భేటి

తుకారం గేట్ లో విరబూసిన బ్రహ్మాకమలం

పెండింగ్ పనులన్నీ సత్వరమే పూర్తి చేయండి..

గాంధీనగర్ డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ గా వెంకటేశ్వర్లు

దొంగలు దొంగలు కలిశారు - దొంగ పిర్యాదులు చేశారు. బుగ్గారంలో దళితునికి అన్యాయం

జాతీయ లోక్ అదాలత్ పై రైతులకు అవగాహన
.jpg)