పెండింగ్ పనులన్నీ  సత్వరమే  పూర్తి చేయండి..

సంక్షేమ శాఖల మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ 

On
పెండింగ్ పనులన్నీ  సత్వరమే  పూర్తి చేయండి..

(రామ కిష్టయ్య సంగన భట్ల)
ధర్మపురి జూన్ 14:

ధర్మపురి నియోజకవర్గంలో పెండింగ్లో ఉన్న పనులు అన్నింటిని అధికారులు సత్వరమే పూర్తి చేయించాలని ఎస్సీ, ఎస్టీ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆదేశించారు. అలాగే పెండింగ్ సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణ పనులపై ప్రత్యేక దృష్టి సారించాలని, అటు రైతులకు ఇటు ప్రజలకు తాగు సాగునీటికి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. 

శనివారం ధర్మపురి లోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఫంక్షన్ హాల్ లో ధర్మపురి అసెంబ్లీ నియోజకవర్గ స్థాయి అభివృద్ధి పనులపై జగిత్యాల జిల్లా ఉన్నతాధికారులతో మంత్రి లక్ష్మణ్ కుమార్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్, అదనపు కలెక్టర్ బీఎస్ లతా వివిధ శాఖల ఉన్నతాధికారులు, జిల్లా స్థాయి అధికారులు హాజరయ్యారు. 

ఈ సందర్భంగా మంత్రి సాగునీరు, తాగునీరు, విద్యా, వైద్యం పంచాయతీరాజ్, రోడ్లు భవనాల శాఖ, సివిల్ సప్లైస్, వ్యవసాయం, సంక్షేమ హాస్టళ్ల పనితీరు, విద్యుత్ తో పాటు వివిధ శాఖలకు సంబంధించి అభివృద్ధి పనులపై సుదీర్ఘంగా మంత్రి సమీక్ష నిర్వహించారు. ధర్మపురి నియోజకవర్గంలో పెండింగ్లో ఉన్న పనులు.. కంప్లీట్ అయిన అభివృద్ధి పనులు.. రాబోయే రోజుల్లో చేపట్టే కార్యాచరణ ప్రణాళిక.. అభివృద్ధి.. వివిధ పనులు పెండింగ్లో ఉండడానికి గల కారణాలు మంత్రి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి పలు కీలక సూచనలు చేశారు అధికారులకు. 

సందర్భంగా మంత్రి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ ధర్మపురి నియోజకవర్గంలో సమస్యల పరిష్కారానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని, తాను ప్రత్యేక దృష్టి సారిస్తానని తెలిపారు. పెండింగ్ పనులు అన్నీ సత్వరమే పూర్తి చేయాలని, 
ఎక్కడా ఇబ్బందులున్న తన దృష్టికి తీసుకురావాలని, పనులు పూర్తి చేయించేందుకు అవసరమైన నిధులు మంజూరు చేయించే బాధ్యత నాది 
అని స్పష్టం చేశారు. ధర్మపురి నియోజకవర్గంలో పెండింగ్ సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి అత్యధిక ప్రాధాన్యతతో సాగునీటిపారుదల అధికారులు పూర్తి చేయించాలని ఆదేశించారు. అదేవిధంగా తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా పక్కా ప్రణాళికతో ముందుకు సాగాలని సూచించారు. ధర్మపురి నియోజకవర్గంలో 95% వ్యవసాయ రంగంపై ఆధారపడి జీవిస్తారని, అటు సాగునీరు ఇటు తాగునీటికి ఇబ్బందులు ఏర్పడకుండా అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొన్నారు.

సమీక్షలో అధికారులు తెలిపిన సమస్యలు తొందరగా పరిష్కారం మార్గాలు అన్వేషించి పరిష్కరించుకోవాలని సూచించారు. మళ్లీ వచ్చే సమావేశం వరకు వాటి పెండింగ్లో పెట్టవద్దని మంత్రి పేర్కొన్నారు. రోళ్ళ వాగు ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించిన అటవీ శాఖ అనుమతులు వచ్చేలా అధికారులు కృషి చేయాలని, ఇందుకు తాను ప్రత్యేకంగా ఢిల్లీ వెళ్లి అధికారులతో మాట్లాడతానని తెలిపారు.IMG-20250614-WA0007 

అదేవిధంగా ఇతర సాగునీటి ప్రాజెక్టుల  నిర్మాణ పనులకు టాప్ ప్రయారిటీ ఇవ్వాలని సూచించారు. రాబోయే రోజుల్లో గ్రామాల్లో ఏ ఒక్క సమస్య రాకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సంక్షేమ హాస్టళ్లకు బియ్యం పంపిణీ చేసే విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలని, ఎప్పటికప్పుడు బియ్యం నాణ్యతను పరిశీలించాలని పేర్కొన్నారు. అదేవిధంగా పాఠశాలల్లో విద్యార్థులకు మౌలిక వసతులు కల్పించాలని, టాయిలెట్స్, మరుగుదొడ్లు లేని చోట త్వరగా నిర్మించాలని ఆదేశించారు. వానకాలం వ్యవసాయ సీజన్లో రైతులకు విత్తనాలు ఎరువులు యూరియా అందుబాటులో ఉంచాలని రైతులు ఇబ్బందులు పడకుండా చూడాలని తెలిపారు. విద్యుత్ పరంగా కూడా గ్రామాల్లో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా వ్యవహరించాలని అధికారులకు సూచించారు.

రాబోయే వర్షాకాలంలో గ్రామీణ ప్రాంత ప్రజలు ఇబ్బందులు పడకుండా తాత్కాలికంగా రోడ్ల నిర్మాణం చేపట్టాలని ఆదేశించారు.. సంక్షేమ హాస్టల్లో నాణ్యమైన సన్న బియ్యం పంపిణీ చేయాలని, అదేవిధంగా ప్రజలకు సైతం నాణ్యమైనవి అందించాలని అధికారులకు సూచనలు చేశారు. అభివృద్ధి పనులు..సమస్యల పరిష్కారంలో అధికారులు ఏమైనా ఇబ్బందులు తలెత్తితే తన దృష్టికి,
జిల్లా కలెక్టర్ దృష్టికి అధికారుల దృష్టికి తీసుకురావాలని సలహా ఇచ్చారు. ప్రజా సమస్యల పరిష్కారానికి అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ మాట్లాడుతూ ధర్మపురి నియోజకవర్గానికి సంబంధించిన అభివృద్ధి పనుల విషయంలో అధికారులు పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్లాలని పేర్కొన్నారు. పెండింగ్లో ఉన్న అభివృద్ధి పనులను స్పీడుగా కంప్లీట్ చేయాలని సూచించారు. అధికారులు పనితీరును మరింత మెరుగుపరుచుకోవాలని, అభివృద్ధి పనుల విషయంలో ఏమైనా ఇబ్బందులు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని పేర్కొన్నారు.

ధర్మపురి నియోజకవర్గానికి సంబంధించిన ప్రతి విషయంలో యాక్టివ్ గా ముందుకు సాగాలని సూచించారు. ఎప్పటికప్పుడు అధికారులు సమస్యలను అధిగమించుకుంటూ పనులను వేగవంతంగా పూర్తి చేయాలని ఆదేశించారు. అంతకు ముందు మంత్రి లక్ష్మణ్ కుమార్ జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ తో కలిసి ధర్మపురి లో పలువురు లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి సంబంధించి మంజూరు పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పేదల సొంత ఇంటి కలను రాష్ట్ర ప్రభుత్వ నెరవేరుస్తున్నదని, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని లబ్ధిదారులు సత్వరమే పూర్తి చేసుకోవాలని సూచించారు. ఇందిరమ్మ ఇల్లు  నిర్మించుకునే లబ్ధిదారులకు ప్రభుత్వం ఉచితంగా ఇసుక సరఫరా చేస్తుందని తెలిపారు. ఈ పథకాన్ని లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

ఈ సమావేశంలో ఆర్డిఓ మధుసూదన్, ఇరిగేషన్ సీఈ సుధాకర్ రెడ్డి,జిల్లా ఉన్నత స్థాయి అధికారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Tags

More News...

Local News 

సఖి అవగాహనా కార్యక్రమం

సఖి అవగాహనా కార్యక్రమం ఎల్కతుర్తి, జూన్ 15 (ప్రజామంటలు) : హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం ఇందిరానగర్ గ్రామపంచాయతీలో సఖి సెంటర్ ఆధ్వర్యంలో మహిళల కోసం అవగాహన కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో సఖి సెంటర్ లీగల్ కౌన్సిలర్ శ్రీదేవి మేడం పాల్గొని, సఖి సెంటర్ ప్రధాన లక్ష్యాలు, మహిళలకు అందించే సేవల గురించి వివరించారు. ఆమె మాట్లాడుతూ, "గృహహింస,...
Read More...
Local News 

హైకోర్టు ఆదేశాలకు మెట్రో రైల్ అధికారుల స్పందన

హైకోర్టు ఆదేశాలకు మెట్రో రైల్ అధికారుల స్పందన అధిక ధ్వనుల నియంత్రణ చర్యలకు కదిలిన యంత్రాoగం   సికింద్రాబాద్  జూన్14 (ప్రజామంటలు)::  న్యూ బోయిగూడ మెట్రో పిల్లర్ నెం. బీ 1006 మలుపు వద్ద మెట్రో రైళ్లు రాత్రింబవళ్ళు చేస్తున్న అధిక ధ్వనులవల్ల స్థానికులు అనేక ఇబ్బందులకు, ఆరోగ్యసమస్యలకు గురవుతున్నట్లు ఎం ఎన్ కే విట్టల్ సెంట్రల్ కోర్టు సంక్షేమ సంఘం అధ్యక్షులు డాక్టర్ జి....
Read More...
Local News 

ఖబర్దార్ కాంగ్రెస్ నాయకుల్లారా.... తలసాని విమర్శించే స్థాయి మీది కాదు 

ఖబర్దార్ కాంగ్రెస్ నాయకుల్లారా.... తలసాని విమర్శించే స్థాయి మీది కాదు  బిఆర్ఎస్ యువనేత రాగ నాగరాజు గౌడ్   సికింద్రాబాద్ జూన్ 14 (ప్రజామంటలు) : మాజీ మంత్రి, సనత్ నగర్ నియోజకవర్గ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ను విమర్శించే స్థాయి కాంగ్రెస్ నేతలకు లేదని,  ఇష్టం వచ్చినట్టుగా ఫ్లెక్సీలు పెడితే ఖబడ్దార్ కాంగ్రెస్ నాయకుల్లారా అని బిఆర్ఎస్ యువనేత రాగ నాగరాజు గౌడ్ కాంగ్రెస్ నాయకులను...
Read More...
Local News 

జగిత్యాలలో ద్విచక్ర వాహనాల దొంగ అరెస్ట్  3 ద్విచక్ర వాహనాలు, వెండి ఆభరణాలు స్వాదీనం

జగిత్యాలలో ద్విచక్ర వాహనాల దొంగ అరెస్ట్   3 ద్విచక్ర వాహనాలు, వెండి ఆభరణాలు స్వాదీనం                         బోరుగల్ల.దేవరాజ్జగిత్యాల జూన్ 14(ప్రజా మంటలు)    ద్విచక్ర వాహనాల దొంగతనాలకు పాల్పడుతున్నరూరల్ మండలం తాటిపల్లి, ప్రస్తుత నివాసం జగిత్యాలకు చెందిన వడ్లూరి నాగరాజును   అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్టు    టౌన్ సిఐ కరుణాకర్ తెలిపారు. ..  ఇతని వద్దనుండి 3 ద్విచక్ర వాహనాలు, ఇటీవల శ్రీ మడేలేశ్వర స్వామి దేవస్థానంలో దొంగిలించిన 10గ్రాముల...
Read More...
Local News 

పదవి విరమణ పొందిన హోం గార్డ్ రామస్వామి  కి జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆత్మీయ వీడ్కోలు

పదవి విరమణ పొందిన హోం గార్డ్ రామస్వామి  కి జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆత్మీయ వీడ్కోలు జగిత్యాల జూన్ 14(ప్రజా మంటలు)   పోలీస్ శాఖలో హోంగార్డ్ గా గత 33 సంవత్సరాలుగా విధులు నిర్వహించి పదవి విరమణ పొందుతున్న రామస్వామిని శనివారం జిల్లా పోలీస్ కార్యాలయంలో అడిషనల్ ఎస్పీ భీమ్ రావు  పూలమాల వేసి శాలువలతో ఘనంగా సన్మానించారు. పోలీస్ ఉద్యోగ నిర్వహణలో అంకిత భావంతో పనిచేసి అందరి మన్ననలను పొందినారు అన్నారు.సుధీర్ఘ...
Read More...
Local News 

గాంధీలో అత్యాధునిక వైద్య పద్దతులతో రోగులకు మరిన్ని సేవలు

గాంధీలో అత్యాధునిక వైద్య పద్దతులతో రోగులకు మరిన్ని సేవలు గాంధీలో అనస్తిషియా విభాగం ఆధ్వర్యంలో సీఎంఈ ప్రొగ్రాం సికింద్రాబాద్, జూన్ 14 (ప్రజామంటలు) : వైద్యరంగంలో ఆత్యాధునిక పద్దతులు, నేర్చుకుని పేషంట్లకు మరింత మెరుగైన సేవలు అందించాలని పలువురు వైద్యనిపుణులు సూచించారు. గాంధీ అనస్టీషియా విభాగం ఆధ్వర్యంలో అలుమ్నీ హాలులో శనివారం ఇన్‌సైట్స్‌ ఆఫ్‌ పెయిన్‌ మేనేజ్‌మెంట్‌ అంశంపై కంటిన్యూయింగ్‌  మెడికల్‌ ఎడ్యుకేషన్‌ (సీఎంఈ) సదస్సు...
Read More...
Local News 

సీఎం రేవంత్ రెడ్డితో కోట నీలిమా భేటి

సీఎం రేవంత్ రెడ్డితో కోట నీలిమా భేటి టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ పోస్టు ఇచ్చినందుకు సీఎం కు థ్యాంక్స్ సికింద్రాబాద్, జూన్ 14 (ప్రజామంటలు) : తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఉపాధ్యక్షురాలిగా ఇటీవల నూతనంగా నియమితులైన సనత్ నగర్ కాంగ్రెస్ ఇంచార్జీ డాక్టర్ కోట నీలిమ శనివారం రాష్ర్ట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. తనపై విశ్వాసంతో టీపీసీసీ...
Read More...
Local News 

తుకారం గేట్ లో విరబూసిన బ్రహ్మాకమలం

తుకారం గేట్ లో విరబూసిన బ్రహ్మాకమలం సికింద్రాబాద్, జూన్ 14 (ప్రజామంటలు): చాలా అరుదుగా పూసే  బ్రహ్మకమలం శుక్రవారం అర్ధరాత్రి సికింద్రాబాద్ తుకారం  గేట్ ప్రాంతంలో విరబూసింది. తుకారం గేట్ కు చెందిన ఓవీ షీలా రాణి అనే రిటైర్డ్ బీఎస్ఎన్ఎల్ ఎంప్లాయ్ ఇంటి వెనుక ఉన్న గార్డెన్ లో బ్రహ్మ కమలం చెట్టు ఉంది. శుక్రవారం అర్ధరాత్రి 11 గంటల ప్రాంతంలో...
Read More...
Local News 

పెండింగ్ పనులన్నీ  సత్వరమే  పూర్తి చేయండి..

పెండింగ్ పనులన్నీ  సత్వరమే  పూర్తి చేయండి.. (రామ కిష్టయ్య సంగన భట్ల)ధర్మపురి జూన్ 14: ధర్మపురి నియోజకవర్గంలో పెండింగ్లో ఉన్న పనులు అన్నింటిని అధికారులు సత్వరమే పూర్తి చేయించాలని ఎస్సీ, ఎస్టీ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆదేశించారు. అలాగే పెండింగ్ సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణ పనులపై ప్రత్యేక దృష్టి సారించాలని, అటు రైతులకు ఇటు ప్రజలకు...
Read More...
Local News 

గాంధీనగర్ డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ గా వెంకటేశ్వర్లు

గాంధీనగర్ డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ గా వెంకటేశ్వర్లు .సికింద్రాబాద్, జూన్ 14 (ప్రజామంటలు): గాంధీనగర్ పోలీస్ స్టేషన్ నూతన డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ గా ఆర్.వెంకటేశ్వర్లు శనివారం బాధ్యతలు స్వీకరించారు. 2007 బ్యాచ్ కు చెందిన నల్లగొండ జిల్లా వాస్తవ్యులు  వెంకటేశ్వర్లు కొంపల్లె  డయల్ 100 కంట్రోల్ రూమ్ నుంచి బదిలీపై  గాంధీనగర్ పోలీస్ స్టేషన్ కు వచ్చారు. ఇక్కడ పనిచేసిన డీఈ సైదేశ్వర్ సిటీ...
Read More...
Local News  State News 

దొంగలు దొంగలు కలిశారు - దొంగ పిర్యాదులు చేశారు. బుగ్గారంలో దళితునికి అన్యాయం

దొంగలు దొంగలు కలిశారు - దొంగ పిర్యాదులు చేశారు. బుగ్గారంలో దళితునికి అన్యాయం దొంగలు దొంగలు కలిశారు - దొంగ పిర్యాదులు చేశారు తప్పుడు పిర్యాదులు చేయించిన వారిపై పరువు నష్టం దావా తప్పదు నక్క రాజలింగును నిండా ముంచేందుకు కుట్రలు చేస్తున్న దోపిడీ దారులు - నిధుల దుర్వినియోగంలో క్రిమినల్ కేసులు తప్పవు చట్టాలు దోపిడీ దారులకు చుట్టాలు కాదు - తెలంగాణ జన సమితి జిల్లా అధ్యక్షులు...
Read More...
Local News 

జాతీయ లోక్ అదాలత్ పై రైతులకు అవగాహన

జాతీయ లోక్ అదాలత్ పై రైతులకు అవగాహన    ఎల్కతుర్తి జూన్ 13 (ప్రజామంటలు) : జాతీయ వ్యాప్తంగా శనివారం నిర్వహించనున్న లోక్ అదాలత్ ను రైతులు సద్వినియోగం చేసుకోవాలని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్ బీఐ) వరంగల్ అర్బన్ రీజినల్ మేనేజర్ అబ్దుల్ రహీమ్ షేక్ సూచించారు. హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండల కేంద్రం లోని సెర్ఫ్ కార్యాలయలో రైతులకు స్థానిక బ్రాంచ్...
Read More...