సఖి అవగాహనా కార్యక్రమం
ఇందిరానగర్ గ్రామంలో మహిళలకి చట్టపరమైన అవగాహన
ఎల్కతుర్తి, జూన్ 15 (ప్రజామంటలు) :
హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం ఇందిరానగర్ గ్రామపంచాయతీలో సఖి సెంటర్ ఆధ్వర్యంలో మహిళల కోసం అవగాహన కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో సఖి సెంటర్ లీగల్ కౌన్సిలర్ శ్రీదేవి మేడం పాల్గొని, సఖి సెంటర్ ప్రధాన లక్ష్యాలు, మహిళలకు అందించే సేవల గురించి వివరించారు.
ఆమె మాట్లాడుతూ, "గృహహింస, లైంగిక వేధింపులు, పనిస్థల వేధింపులు, అత్యాచారాలు వంటి ఘటనల్లో బాధిత మహిళలు న్యాయ పరంగా ఎలా రక్షణ పొందవచ్చో తెలియజేయడమే సఖి ఉద్దేశం" అని చెప్పారు. మహిళలు ఎటువంటి సమస్య వచ్చినా తక్షణ సహాయానికి ఉమెన్ హెల్ప్లైన్ నంబర్ 181, చైల్డ్ లైన్ నంబర్ 1098 కు ఫోన్ చేయొచ్చని, అదేవిధంగా 08702452112, 7382983088 నంబర్లకు కాల్ చేసి అవసరమైన సహాయం పొందవచ్చని వివరించారు.
ఈ అవగాహన కార్యక్రమంలో సఖి కేస్ వర్కర్లు భారతి, జ్యోతి, సుమలత, రాధికలు పాల్గొన్నారు. అలాగే గ్రామంలోని ఎస్హెచ్జీ సభ్యులు కూడా హాజరై చట్టపరంగా తమ హక్కులపై సమాచారాన్ని పొందారు.ఈ అవగాహన కార్యక్రమం గ్రామ మహిళల్లో చట్టపరమైన చైతన్యాన్ని కలిగించిందని గ్రామస్తులు అభిప్రాయపడ్డారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
సఖి అవగాహనా కార్యక్రమం

హైకోర్టు ఆదేశాలకు మెట్రో రైల్ అధికారుల స్పందన

ఖబర్దార్ కాంగ్రెస్ నాయకుల్లారా.... తలసాని విమర్శించే స్థాయి మీది కాదు

జగిత్యాలలో ద్విచక్ర వాహనాల దొంగ అరెస్ట్ 3 ద్విచక్ర వాహనాలు, వెండి ఆభరణాలు స్వాదీనం

పదవి విరమణ పొందిన హోం గార్డ్ రామస్వామి కి జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆత్మీయ వీడ్కోలు

గాంధీలో అత్యాధునిక వైద్య పద్దతులతో రోగులకు మరిన్ని సేవలు

సీఎం రేవంత్ రెడ్డితో కోట నీలిమా భేటి

తుకారం గేట్ లో విరబూసిన బ్రహ్మాకమలం

పెండింగ్ పనులన్నీ సత్వరమే పూర్తి చేయండి..

గాంధీనగర్ డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ గా వెంకటేశ్వర్లు

దొంగలు దొంగలు కలిశారు - దొంగ పిర్యాదులు చేశారు. బుగ్గారంలో దళితునికి అన్యాయం

జాతీయ లోక్ అదాలత్ పై రైతులకు అవగాహన
.jpg)