హైకోర్టు ఆదేశాలకు మెట్రో రైల్ అధికారుల స్పందన

On
హైకోర్టు ఆదేశాలకు మెట్రో రైల్ అధికారుల స్పందన

అధిక ధ్వనుల నియంత్రణ చర్యలకు కదిలిన యంత్రాoగం 

సికింద్రాబాద్  జూన్14 (ప్రజామంటలు):: 

న్యూ బోయిగూడ మెట్రో పిల్లర్ నెం. బీ 1006 మలుపు వద్ద మెట్రో రైళ్లు రాత్రింబవళ్ళు చేస్తున్న అధిక ధ్వనులవల్ల స్థానికులు అనేక ఇబ్బందులకు, ఆరోగ్యసమస్యలకు గురవుతున్నట్లు ఎం ఎన్ కే విట్టల్ సెంట్రల్ కోర్టు సంక్షేమ సంఘం అధ్యక్షులు డాక్టర్ జి. హనుమాన్లు హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం, జిల్లా కలెక్టర్ ప్రజావాణిలో కంప్లైంట్ దాఖలు చేశారు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నిర్దేశితాల ప్రకారం నివాస ప్రాంతాల్లో డే టైములో 55 డెసిబెల్స్, రాత్రి సమయంలో 45 డెసిబెల్స్ కు మించిన ధ్వని ఉండకూడదని, అధిక సౌండ్ లెవల్స్ వినికిడి, గుండె, హై బ్లడ్ ప్రెషర్, నిద్రలేమి తదితర సీరియస్ ఆరోగ్య సమస్యలకు దారి తీస్తుందని డాక్టర్ హనుమాన్లు తెలిపారు.

హైదరాబాదులో మెట్రో రైళ్ల ధ్వని కాలుష్యం సమస్యను తప్పుదోవ పట్టించేందుకు గతంలో హైదరాబాదు మెట్రో రైల్ అధికారులు అమెరికన్ ట్రాన్స్పోర్ట్   అథారిటీ గైడ్లైన్స్ ప్రకారం నివాస ప్రాంతాల్లో 80 డెసిబెల్స్ సౌండ్ లెవల్స్ నార్మల్ అని ఉటంకిస్తూ ప్రజావాణి అధికారులను బురిడీ కొట్టించినట్లు ఆయన ప్రజావాణి అధికారులకు, ముఖ్యమంత్రికి లేఖ వ్రాయగా ఈ విషయంలో విచారణ జరిపించాలని ముఖ్యమంత్రి  కార్యాలయం జిల్లా కలెక్టర్ ను ఆదేశించింది. వారంలోగా విచారణ జరిపి రిపోర్ట్ సమర్పించాలని మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిప్యూటీ సెక్రటరీని, మెట్రో రైల్ అధికారులను  గత నెల 23 తేదీన జిల్లా కలెక్టర్ ఆదేశించినా ఎలాంటి విచారణ జరుపలేదని ఆయన  వాపోయారు.              
ఇది ఇలా ఉండగా మెట్రో రైళ్లు రాకపోకలు సాగిస్తున్న సమయంలో మెట్రో పిల్లర్ నెం. బీ 1006 మలుపు వద్ద సౌండ్ లెవెల్సును రికార్డు చేసి ధ్వని కాలుష్యంపై వాస్తవిక వివరణలతో కూడిన రిపోర్టును హైకోర్టుకు సమర్పించాలని పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులను హై కోర్టు ఆదేశించినట్లు సమాచారం. ఈమేరకు ఎన్విరాన్మెంటల్ సహాయ సైంటిస్ట్ విద్యుల్లత హైదరాబాదు మెట్రో రైల్ లిమిటెడ్ ప్రతినిధి శివకుమార్, ఎం ఎన్ కే అపార్టుమెంటు వాసుల  సమక్షంలో సౌండ్ లెవెల్సు రికార్డు చేశారు. అత్యధికంగా 97 డెసిబెల్స్ సౌండ్ రికార్డు అయినట్లు తెలిసింది. మెట్రో రైళ్ల వల్ల కలుగుతున్న ధ్వని కాలుష్యాన్ని నియంత్రించేందుకు అధికార యంత్రాoగం ఉపక్రమించడం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Tags

More News...

Local News 

సఖి అవగాహనా కార్యక్రమం

సఖి అవగాహనా కార్యక్రమం ఎల్కతుర్తి, జూన్ 15 (ప్రజామంటలు) : హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం ఇందిరానగర్ గ్రామపంచాయతీలో సఖి సెంటర్ ఆధ్వర్యంలో మహిళల కోసం అవగాహన కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో సఖి సెంటర్ లీగల్ కౌన్సిలర్ శ్రీదేవి మేడం పాల్గొని, సఖి సెంటర్ ప్రధాన లక్ష్యాలు, మహిళలకు అందించే సేవల గురించి వివరించారు. ఆమె మాట్లాడుతూ, "గృహహింస,...
Read More...
Local News 

హైకోర్టు ఆదేశాలకు మెట్రో రైల్ అధికారుల స్పందన

హైకోర్టు ఆదేశాలకు మెట్రో రైల్ అధికారుల స్పందన అధిక ధ్వనుల నియంత్రణ చర్యలకు కదిలిన యంత్రాoగం   సికింద్రాబాద్  జూన్14 (ప్రజామంటలు)::  న్యూ బోయిగూడ మెట్రో పిల్లర్ నెం. బీ 1006 మలుపు వద్ద మెట్రో రైళ్లు రాత్రింబవళ్ళు చేస్తున్న అధిక ధ్వనులవల్ల స్థానికులు అనేక ఇబ్బందులకు, ఆరోగ్యసమస్యలకు గురవుతున్నట్లు ఎం ఎన్ కే విట్టల్ సెంట్రల్ కోర్టు సంక్షేమ సంఘం అధ్యక్షులు డాక్టర్ జి....
Read More...
Local News 

ఖబర్దార్ కాంగ్రెస్ నాయకుల్లారా.... తలసాని విమర్శించే స్థాయి మీది కాదు 

ఖబర్దార్ కాంగ్రెస్ నాయకుల్లారా.... తలసాని విమర్శించే స్థాయి మీది కాదు  బిఆర్ఎస్ యువనేత రాగ నాగరాజు గౌడ్   సికింద్రాబాద్ జూన్ 14 (ప్రజామంటలు) : మాజీ మంత్రి, సనత్ నగర్ నియోజకవర్గ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ను విమర్శించే స్థాయి కాంగ్రెస్ నేతలకు లేదని,  ఇష్టం వచ్చినట్టుగా ఫ్లెక్సీలు పెడితే ఖబడ్దార్ కాంగ్రెస్ నాయకుల్లారా అని బిఆర్ఎస్ యువనేత రాగ నాగరాజు గౌడ్ కాంగ్రెస్ నాయకులను...
Read More...
Local News 

జగిత్యాలలో ద్విచక్ర వాహనాల దొంగ అరెస్ట్  3 ద్విచక్ర వాహనాలు, వెండి ఆభరణాలు స్వాదీనం

జగిత్యాలలో ద్విచక్ర వాహనాల దొంగ అరెస్ట్   3 ద్విచక్ర వాహనాలు, వెండి ఆభరణాలు స్వాదీనం                         బోరుగల్ల.దేవరాజ్జగిత్యాల జూన్ 14(ప్రజా మంటలు)    ద్విచక్ర వాహనాల దొంగతనాలకు పాల్పడుతున్నరూరల్ మండలం తాటిపల్లి, ప్రస్తుత నివాసం జగిత్యాలకు చెందిన వడ్లూరి నాగరాజును   అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్టు    టౌన్ సిఐ కరుణాకర్ తెలిపారు. ..  ఇతని వద్దనుండి 3 ద్విచక్ర వాహనాలు, ఇటీవల శ్రీ మడేలేశ్వర స్వామి దేవస్థానంలో దొంగిలించిన 10గ్రాముల...
Read More...
Local News 

పదవి విరమణ పొందిన హోం గార్డ్ రామస్వామి  కి జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆత్మీయ వీడ్కోలు

పదవి విరమణ పొందిన హోం గార్డ్ రామస్వామి  కి జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆత్మీయ వీడ్కోలు జగిత్యాల జూన్ 14(ప్రజా మంటలు)   పోలీస్ శాఖలో హోంగార్డ్ గా గత 33 సంవత్సరాలుగా విధులు నిర్వహించి పదవి విరమణ పొందుతున్న రామస్వామిని శనివారం జిల్లా పోలీస్ కార్యాలయంలో అడిషనల్ ఎస్పీ భీమ్ రావు  పూలమాల వేసి శాలువలతో ఘనంగా సన్మానించారు. పోలీస్ ఉద్యోగ నిర్వహణలో అంకిత భావంతో పనిచేసి అందరి మన్ననలను పొందినారు అన్నారు.సుధీర్ఘ...
Read More...
Local News 

గాంధీలో అత్యాధునిక వైద్య పద్దతులతో రోగులకు మరిన్ని సేవలు

గాంధీలో అత్యాధునిక వైద్య పద్దతులతో రోగులకు మరిన్ని సేవలు గాంధీలో అనస్తిషియా విభాగం ఆధ్వర్యంలో సీఎంఈ ప్రొగ్రాం సికింద్రాబాద్, జూన్ 14 (ప్రజామంటలు) : వైద్యరంగంలో ఆత్యాధునిక పద్దతులు, నేర్చుకుని పేషంట్లకు మరింత మెరుగైన సేవలు అందించాలని పలువురు వైద్యనిపుణులు సూచించారు. గాంధీ అనస్టీషియా విభాగం ఆధ్వర్యంలో అలుమ్నీ హాలులో శనివారం ఇన్‌సైట్స్‌ ఆఫ్‌ పెయిన్‌ మేనేజ్‌మెంట్‌ అంశంపై కంటిన్యూయింగ్‌  మెడికల్‌ ఎడ్యుకేషన్‌ (సీఎంఈ) సదస్సు...
Read More...
Local News 

సీఎం రేవంత్ రెడ్డితో కోట నీలిమా భేటి

సీఎం రేవంత్ రెడ్డితో కోట నీలిమా భేటి టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ పోస్టు ఇచ్చినందుకు సీఎం కు థ్యాంక్స్ సికింద్రాబాద్, జూన్ 14 (ప్రజామంటలు) : తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఉపాధ్యక్షురాలిగా ఇటీవల నూతనంగా నియమితులైన సనత్ నగర్ కాంగ్రెస్ ఇంచార్జీ డాక్టర్ కోట నీలిమ శనివారం రాష్ర్ట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. తనపై విశ్వాసంతో టీపీసీసీ...
Read More...
Local News 

తుకారం గేట్ లో విరబూసిన బ్రహ్మాకమలం

తుకారం గేట్ లో విరబూసిన బ్రహ్మాకమలం సికింద్రాబాద్, జూన్ 14 (ప్రజామంటలు): చాలా అరుదుగా పూసే  బ్రహ్మకమలం శుక్రవారం అర్ధరాత్రి సికింద్రాబాద్ తుకారం  గేట్ ప్రాంతంలో విరబూసింది. తుకారం గేట్ కు చెందిన ఓవీ షీలా రాణి అనే రిటైర్డ్ బీఎస్ఎన్ఎల్ ఎంప్లాయ్ ఇంటి వెనుక ఉన్న గార్డెన్ లో బ్రహ్మ కమలం చెట్టు ఉంది. శుక్రవారం అర్ధరాత్రి 11 గంటల ప్రాంతంలో...
Read More...
Local News 

పెండింగ్ పనులన్నీ  సత్వరమే  పూర్తి చేయండి..

పెండింగ్ పనులన్నీ  సత్వరమే  పూర్తి చేయండి.. (రామ కిష్టయ్య సంగన భట్ల)ధర్మపురి జూన్ 14: ధర్మపురి నియోజకవర్గంలో పెండింగ్లో ఉన్న పనులు అన్నింటిని అధికారులు సత్వరమే పూర్తి చేయించాలని ఎస్సీ, ఎస్టీ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆదేశించారు. అలాగే పెండింగ్ సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణ పనులపై ప్రత్యేక దృష్టి సారించాలని, అటు రైతులకు ఇటు ప్రజలకు...
Read More...
Local News 

గాంధీనగర్ డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ గా వెంకటేశ్వర్లు

గాంధీనగర్ డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ గా వెంకటేశ్వర్లు .సికింద్రాబాద్, జూన్ 14 (ప్రజామంటలు): గాంధీనగర్ పోలీస్ స్టేషన్ నూతన డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ గా ఆర్.వెంకటేశ్వర్లు శనివారం బాధ్యతలు స్వీకరించారు. 2007 బ్యాచ్ కు చెందిన నల్లగొండ జిల్లా వాస్తవ్యులు  వెంకటేశ్వర్లు కొంపల్లె  డయల్ 100 కంట్రోల్ రూమ్ నుంచి బదిలీపై  గాంధీనగర్ పోలీస్ స్టేషన్ కు వచ్చారు. ఇక్కడ పనిచేసిన డీఈ సైదేశ్వర్ సిటీ...
Read More...
Local News  State News 

దొంగలు దొంగలు కలిశారు - దొంగ పిర్యాదులు చేశారు. బుగ్గారంలో దళితునికి అన్యాయం

దొంగలు దొంగలు కలిశారు - దొంగ పిర్యాదులు చేశారు. బుగ్గారంలో దళితునికి అన్యాయం దొంగలు దొంగలు కలిశారు - దొంగ పిర్యాదులు చేశారు తప్పుడు పిర్యాదులు చేయించిన వారిపై పరువు నష్టం దావా తప్పదు నక్క రాజలింగును నిండా ముంచేందుకు కుట్రలు చేస్తున్న దోపిడీ దారులు - నిధుల దుర్వినియోగంలో క్రిమినల్ కేసులు తప్పవు చట్టాలు దోపిడీ దారులకు చుట్టాలు కాదు - తెలంగాణ జన సమితి జిల్లా అధ్యక్షులు...
Read More...
Local News 

జాతీయ లోక్ అదాలత్ పై రైతులకు అవగాహన

జాతీయ లోక్ అదాలత్ పై రైతులకు అవగాహన    ఎల్కతుర్తి జూన్ 13 (ప్రజామంటలు) : జాతీయ వ్యాప్తంగా శనివారం నిర్వహించనున్న లోక్ అదాలత్ ను రైతులు సద్వినియోగం చేసుకోవాలని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్ బీఐ) వరంగల్ అర్బన్ రీజినల్ మేనేజర్ అబ్దుల్ రహీమ్ షేక్ సూచించారు. హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండల కేంద్రం లోని సెర్ఫ్ కార్యాలయలో రైతులకు స్థానిక బ్రాంచ్...
Read More...