రాష్ట్రం డెంగీ జ్వరాలతో ఇబ్బందులు పడుతున్నప్పటికీ  స్పందించని ప్రభుత్వం - మాజీ మంత్రి కొప్పుల విమర్శ

On
రాష్ట్రం డెంగీ జ్వరాలతో ఇబ్బందులు పడుతున్నప్పటికీ  స్పందించని ప్రభుత్వం - మాజీ మంత్రి కొప్పుల విమర్శ

రాష్ట్రం డెంగీ జ్వరాలతో ఇబ్బందులు పడుతున్నప్పటికీ  స్పందించని ప్రభుత్వం - మాజీ మంత్రి కొప్పుల విమర్శ

జగిత్యాల సెప్టెంబర్ 08:

రాష్ట్రంలో డెంగీ జ్వరాలతో జనం ఇబ్బందులు పడుతున్నప్పటికీ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుందనీ
 మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్  ప్రభుత్వంపై విమర్శలు చేశారు.

జగిత్యాల జిల్లా బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన ప్రెస్ మీట్ మాట్లాడుతూ, రాష్ట్రంలో హెల్త్ ఎమర్జెన్సీని అమలు చేయాల్సిన పరిస్థితులు నెలకొన్నాయనీ,రాష్ట్రంలో గత నెల రోజులుగా విషజ్వరాలు తీవ్రంగా పెరిగిపోతూనే ఉన్నాయనీ. ప్రాణంతకమైన డెంగ్యూ, చికెన్‌ గున్యా లాంటి రోగాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారనీ కొప్పుల ఆరోపించారు.

ఇందులో మాజీ జెడ్ పి ఛైర్పర్సన్ దావా వసంత,వైస్ చైర్మన్ హరి చరణ్, మాజీ కౌన్సిలర్ మల్లేశం తదితరులు పాల్గొన్నారు.

ఇంకా ఇలా అన్నారు.రాష్ట్రంలో ఆగస్టు చివరి నాటికే ఎనిమిదిన్నర లక్షల మందికి పైగా విషజ్వరాల భారిన పడినట్లు తెలుస్తోంది.ఒకే బెడ్ మీద ముగ్గురు నుంచి నలుగురికీ వైద్య అందిస్తున్నా పరిస్థితి ఉంది.

ఆగస్టు 27న రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ చెప్పిన లెక్కల ప్రకారం రాష్ట్రంలో 4,459 డెంగ్యూ కేసులు నమోదు అయ్యాయి..! కాని డెంగీ కేసుతోనే కాదు, ఇతర ఏ విషజ్వరం వల్ల ఒక్క మరణం సంభవించలేదు అన్నది రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ నివేదిక..!

డెంగీ మరణాలు లేవని ప్రభుత్వం చెబుతోంది.. కానీ పత్రికల్లో డెంగీ తో ప్రజలు చనిపోతున్నారని రోజు వార్తలు వస్తున్నాయి..!

ప్రభుత్వం నిజాలను ఎందుకు దాచి పెడుతోంది..!

వైద్య, ఆరోగ్యశాఖ ప్రకటనకు, క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితులకు తీవ్రమైన వ్యత్యాసం ఉంది...! ఆగస్టు 27వ తేదీ నాటికే రాష్ట్రంలో 128 మంది విషజ్వరాల భారిన పడి మృతిచెందినట్లు స్పష్టమైన నివేదికలున్నాయి..!

ఈ పదిరోజుల వ్యవధిలో మరో 50 మంది విషజ్వరాల భారిన పడి మృతిచెందారు..!

వైద్య ఆరోగ్యశాఖ ఇచ్చిన నివేదికలో ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో కేవలం లక్ష లోపు మంది మాత్రమే జ్వరాల భారిన పడ్డారు...! 

కరీంనగర్‌లో 40వేల మంది, జగిత్యాలలో 18వేల మంది, సిరిసిల్లాలో 16వేల మంది, పెద్దపల్లిలో 15,300ల మంది అని చెప్పారు. ఇవన్ని కాకి లెక్కలే...!

జగిత్యాల జిల్లాలోనే దాదాపు యాభై వేల మందికి పైగా విషజ్వరాల బారిన పడ్డారు. ఇరవై మందికి పైగా డెంగ్యూ, చికెన్‌ గున్యా లాంటి ప్రమాదకరమైన విషజ్వరాల భారిన పడి మృతిచెందారు..!

మూడు, నాలుగు రోజుల క్రితమే సారంగాపూర్‌ మండలంలో ఒక సింగిల్‌ విండో సి.ఇ.ఓ విషజ్వరంతో చనిపోయాడు..! మల్లాపూర్‌ మండలానికి చెందిన యువకుడు విదేశాల నుండి వచ్చి వివాహం చేసుకున్న పదిహను ఇరవై రోజులకే విషజ్వరంతో చనిపోయాడు..ఎటూ చూసిన విషజ్వరాలు విజృంభిస్తున్నాయి..!

జ్వరపీడితులతో ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆసుపత్రులు కిక్కిరిసిపోతుంటే, ప్రజలు విషజ్వరాలతో పిట్టలా రాలుతుంటే ప్రభుత్వం పట్టనట్టు చూస్తోంది..!

ప్రభుత్వ ఆసుపత్రుల్లో కనీస సౌకర్యాల లేకుండా పోయాయి...! వైద్యుల సమయ పాలన పాటించిన దాఖలాలు లేవు...! ఎప్పుడు వస్తున్నారో...! ఎప్పుడు వెళ్తున్నారో తెలియడం లేదు...! వారిపై పర్యవేక్షణ కరువైంది...!

జగిత్యాల జిల్లాలోని ఏ ఒక్క ఆసుపత్రిని ఒక్క మంత్రి, బాధ్యుడైన ప్రజాప్రతినిధి పరిశీలించిన దాఖలాలు లేవు..

ఆసుపత్రుల్లో విషజ్వరాలకు సంబంధించిన మందులు అందుబాటులో లేవు..విషజ్వరాలకు సంబంధించిన మందులు బయట నుండి రోగులు కొనుగోలు చేసుకోవాల్సి వస్తుంది..!

గత మూడు మాసాలుగా అజిత్రోమైసిన్‌, డైక్లోఫైన్‌ ఫార్ములాలకు చెందిన మందుల పంపిణీ జరగడం లేదు...ప్రస్తుతం విషజ్వరాలకు సంబంధించిన ట్రీట్మెంట్‌లో ఇవి కీలకమైనవి అని వైద్యులు చెబుతున్నారు..!

అజిత్రోమైసిన్‌ యాంటిబయటిక్‌ మందు...ఇది అత్యంత కీలకమైంది..కరోనా లాంటి కాలంలోను కోట్లాది మంది ప్రాణాలు కాపాడింది...డైక్లో మందు ప్పులు...ఫివర్‌ను కంట్రోల్‌ చేస్తుంది...ఇలాంటి కీలమైన మందులు ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందుబాటులో పెట్టడంలో ప్రభుత్వం విఫలం అయ్యింది..

మూడు మాసాలుగా ఆసుపత్రులకు నిధుల మంజూరు లేదంటున్నారు. కేసీఆర్‌ హాయాంలో ఆసుపత్రుల్లో ఉంచిన బఫర్‌ స్టాక్‌ మందులే ఇన్నాళ్లు వినియోగిస్తూ వచ్చామని, బఫర్‌ స్టాక్‌ పూర్తి కావడంతో మందుల కొరత తీవ్రంగా ఏర్పడిందని వైద్య సిబ్బందే చెబుతున్నారు..!
    ఆసుపత్రి సూపరిండెంట్‌ల వద్ద ఉన్న ప్రత్యేక నిధుల నుండి అత్యవసర మందులు తెచ్చుకునే పరిస్థితి ఉందని వైద్య సిబ్బంది వాపోతున్నారు. 

ఇలాంటి వార్తలను సమైక్య పాలనసేవాళ్లమని.. కాంగ్రెస్‌ పాలన పుణ్యమా అని నేడు ఏ పత్రిక చూసినా మళ్లీ ఆ వార్తలే కనిపిస్తున్నాయి..!

విషజ్వరాలే కాదు...ఆసుపత్రుల్లో సేవలు కుంటుపడ్డాయి...కేసీఆర్‌ కిట్లు అందడం లేదు...ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఒకప్పుడు ఎక్కువ ప్రసవాలు జరిగితే ప్రైవేట్‌లో ప్రసవాల సంఖ్య తగ్గిపోయింది..!

బీఆర్‌ఎస్ ప్రభుత్వ హాయంలో జగిత్యాల జిల్లాలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో 62 శాతం ప్రసవాలు నమోదు అయితే..! ప్రైవేట్‌లో 38 శాతం నమోదు అయ్యేవి...ఇప్పుడు సీన్‌ రివర్స్‍ అయ్యింది...!

ప్రైవేట్‌లో 65 శాతం ప్రసవాలు జరిగితే...ప్రభుత్వ ఆసుపత్రుల్లో 35 శాతం నమోదు అవుతున్నాయి...! -ప్రభుత్వం సిగ్గుపడాలి...!

ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని పారదర్శకంగా విష జ్వ‌రాల‌ నివారణ కోసం చర్యలు చేపట్టాలని సూచన..!

విషజ్వరాల కారణంగా ఏ ఒక్కరు ప్రాణం కోల్పోకుండా చూడాలని..! విషజ్వరాలు విజృంభించిన ప్రాంతాల్లో మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేసి వైద్యం అందించాలన్నారు..! పల్లె, పట్టణాల్లో పారిశుద్ధ్యం మెరుగు పరచాలని..! ప్రభుత్వ ఆసుపత్రుల్లో మందులు, డెంగీ కిట్స్ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలి..!

 

Tags

More News...

Local News  State News 

తల్లిదండ్రుల దినోత్సవం - జన్మదాతలకు పాదపూజ 

తల్లిదండ్రుల దినోత్సవం - జన్మదాతలకు పాదపూజ  జగిత్యాల జూన్ 01:తల్లిదండ్రుల దినోత్సవం సందర్భంగా జగిత్యాల పట్టణం పురాణిపేటకు చెందిన పేపర్ ఏజెంట్ జూపాక గంగారాం_జయ దంపతులకు వారి సంతాన పాదపూజ చేసి, వారి ప్రేమను చాటుకొన్నారు.  గంగారాంకు,ఇద్దరు కుమారులు. రాజశేఖర్ బీఈడీ చదువగా, సూర్యతేజ పాలిటెక్నిక్ చదువుతున్నాడు. తల్లిదండ్రులు త్యాగాలకు ప్రతిరూపం అంటారు ఆదర్శవంతులు తమ జీవితం పిల్లల కోసం అన్నట్లు...
Read More...
Local News  State News 

నిరుపేద బాలిక వైద్యం కోసం 1.21 లక్షలు విరాళాలు.

నిరుపేద బాలిక వైద్యం కోసం 1.21 లక్షలు విరాళాలు. (రామ కిష్టయ్య సంగన భట్ల) క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న నిరుపేద బాలిక వైద్యం కోసం దాతలైన సామాజిక మిత్రులు రూ.1.21 లక్షలు విరాళాలు అందించి తమ దాతృత్వం చాటుకున్నారు.    మహారాష్ట్రలోని చంద్రాపూర్ జిల్లా, దేవడ గ్రామానికి చెందిన చెనవెనవార్  సుభాష్ ,రేణుక దంపతులకు ఇద్దరు కూతుళ్లు ఉండగా పెద్ద కూతురు నిక్షిత (9) ఏడాది ఎన్నారైలు...
Read More...
Local News 

మున్నూరు కాపు సంఘ అభివృద్ధిలో యువత భాగస్వాములు కావాలి

మున్నూరు కాపు సంఘ అభివృద్ధిలో యువత భాగస్వాములు కావాలి సికింద్రాబాద్ జూన్ 01 (ప్రజా మంటలు): రాష్ట్రవ్యాప్తంగా యువతలో నాయకత్వాన్ని బలోపేతం చేయాలనే లక్ష్యంతో, తెలంగాణ మున్నూరు కాపు మహాసభ అధ్యక్షులు శ్రీ పిల్లీ శ్రీనివాస్ రావు నేడు అధికారికంగా ప్రతాప్ వనీత్ కుమార్ ను రాష్ట్ర కన్వీనర్‌గా, మరియు దండు ఆనంద్ ను రాష్ట్ర కో-కన్వీనర్‌గా యువకమండలికి నియమించారు. ఈ నియామకాన్ని నూతనంగా ఎన్నికైన...
Read More...
Local News 

ఫుట్ పాత్ అనాధలకు దుస్తులు,  మందుల పంపిణీ

ఫుట్ పాత్ అనాధలకు దుస్తులు,  మందుల పంపిణీ సికింద్రాబాద్  జూన్ 01 (ప్రజా మంటలు): సిటీలోని ప్రధాన రహదారుల పక్కన ఫుట్ పాత్ లపై ఉన్న అనాధలు సంచార జాతుల వారికి ఆదివారం స్కై ఫౌండేషన్ నిర్వాహకులు దుస్తులు దుప్పట్లను పంపిణీ  చేశారు అలాగే వివిధ రుగ్మతలతో బాధపడుతున్న వారిని గుర్తించి ఔషధాలను అందించారు ప్రమాదాల బారినపడి గాయపడిన వారికి ప్రథమ చికిత్స చేశారు...
Read More...
Local News 

పలు అభివృద్ధి పనులకు భూమి పూజ చేసిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

పలు అభివృద్ధి పనులకు భూమి పూజ చేసిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్    జగిత్యాల జూన్ 1 (ప్రజా మంటలు) పట్టణములోని 29వ వార్డులో ఈద్గా వద్ద 15 లక్షలతో బీటీ రోడ్డు నిర్మాణానికి , దగ్గులమ్మ ఆలయం దగ్గర 21 లక్షలతో బీటీ రోడ్డు నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే  డా. సంజయ్ కుమార్   ఎమ్మెల్యే మాట్లాడుతూ  జగిత్యాల పట్టణం అభివృధి నా లక్ష్యం... ముఖ్యమంత్రి రేవంత్...
Read More...
Local News 

పావని కంటి ఆసుపత్రిలో ఉచిత నేత్ర చికిత్సలు అద్దాలు మందుల పంపిణీ

పావని కంటి ఆసుపత్రిలో ఉచిత నేత్ర చికిత్సలు అద్దాలు మందుల పంపిణీ    జగిత్యాల జూన్ 1 (ప్రజా మంటలు) పట్టణములోని పావని కంటి ఆసుపత్రిలో ఆపి రోటరీ క్లబ్ జగిత్యాల ఆధ్వర్యంలో జగిత్యాల నియోజకవర్గానికి చెందిన 19 మంది నిరుపేదలకు ఉచిత కంటి శస్త్ర చికిత్సలు చేసిన జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్  అనంతరం ఉచిత కంటి అద్దాలు మందులను పంపిణీ చేశారు . ఈ కార్యక్రమంలో...
Read More...
Local News 

రాష్ట్ర ప్రభుత్వం అందించే అత్యంత ప్రతిషాత్మకమైన పోలీస్‌ పతకాల ను అందుకోనున్న జిల్లా పోలీసులు.

రాష్ట్ర ప్రభుత్వం అందించే అత్యంత ప్రతిషాత్మకమైన పోలీస్‌ పతకాల ను అందుకోనున్న జిల్లా పోలీసులు. జగిత్యాల జూన్ 1 ( ప్రజా మంటలు)    పోలీస్‌ శాఖలో విశేషమైన సేవలందించినందుకుగాను రాష్ట్ర ప్రభుత్వం అందించే అత్యంత ప్రతిష్టాత్మకమైన పోలీస్‌ పతకాలు ఎంపిక అయన పోలీస్‌ సిబ్బంది   జిల్లా ఎస్పీ  అశోక్ కుమార్  అభినందించారు.    విధినిర్వహణలో భాగంగా కష్టించి పనిచేసే వారికి గుర్తింపు వస్తుందని అన్నారు. రానున్న రోజుల్లో కూడా ప్రజలకు ఉత్తమమైన సేవలు...
Read More...
State News 

తెలంగాణ జాగృతి కార్యాలయ కార్యదర్శిగా పొన్నమనేని బాలాజీ రావు 

తెలంగాణ జాగృతి కార్యాలయ కార్యదర్శిగా పొన్నమనేని బాలాజీ రావు  హైదరాబాద్ జూన్ 01: తెలంగాణ జాగృతి కార్యాలయ కార్యదర్శిగా పొన్నమనేని బాలాజీ రావు నియమితులయ్యారు. ఈ మేరకు శనివారం నాడు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నియామక ఉత్తర్వులు జారీ చేశారు.  పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని కొదురుపాకకు చెందిన బాలాజీ రావు 2002 నుంచి దాదాపు 17 ఏళ్ల పాటు బీఆర్ఎస్...
Read More...
Local News 

ఈసారి వానలు బాగా ఉన్నాయి...అధికారులు అప్రమత్తంగా ఉండాలి

ఈసారి వానలు బాగా ఉన్నాయి...అధికారులు అప్రమత్తంగా ఉండాలి అల్లాఉద్దీన్ కోటి ప్రాంతంలో డా.కోట నీలిమ పర్యటన సికింద్రాబాద్, మే 31 ( ప్రజామంటలు): ప్రస్తుత వర్షాకాలంలో అధికారులు అప్రమత్తంగా ఉండి, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని సనత్నగర్ కాంగ్రెస్ డాక్టర్ కోట నీలిమ పేర్కొన్నారు. శనివారం ఆమె జీహెచ్ఎమ్సీ, టీజీఎస్పీడీసీఎల్, మెట్రో వాటర్ శాఖల అధికారులతో కలసి సనత్ నగర్ డివిజన్...
Read More...
Local News  State News 

మారువేషంలో కిలాడీ లేడీ దొంగతనం

మారువేషంలో కిలాడీ లేడీ దొంగతనం చీరతో ఎంట్రీ, ప్యాంట్ షర్ట్ తో ఎగ్జిట్  *సీసీ టీవీ ఫుటేజీలతో లేడీని పట్టుకున్న పోలీసులు  *రూ8లక్షల నగదు,గోల్డ్,సిల్వర్, అర్నమెంట్స్ స్వాధీనం సికింద్రాబాద్ మే 31 (ప్రజామంటలు) : తనకు తెలిసిన ఫ్రెండ్స్, బంధువుల ఇండ్లే టార్గెట్ గా, వారు ఇంట్లో లేని సమయాల్లో  మారువేషం ధరించి రాత్రి వేళలో  తాళం వేసి ఉన్న ఇంట్లో...
Read More...
Local News 

రాజమాత అహల్యాబాయి హోల్కర్ ను కీర్తిస్తూ శోభాయాత్ర*

రాజమాత అహల్యాబాయి హోల్కర్ ను కీర్తిస్తూ శోభాయాత్ర* సికింద్రాబాద్, మే31 (ప్రజామంటలు):   రాజమాత అహల్యా బాయి హోల్కర్  త్రిశతాబ్ది (300) జయంతి సందర్భంగా కవాడిగూడ సి.జీ.ఓ. టవర్స్ నుండి గాంధీ నగర్ వరకు వైభవంగా శోభాయాత్ర  నిర్వహించారు. ముఖ్య అతిథిగా బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు చింతల రామచంద్రారెడ్డి, మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు డా. శిల్పా రెడ్డి, బిజెపి మహంకాళి సికింద్రాబాద్ జిల్లా అధ్యక్షులు...
Read More...
Local News 

ఎన్ఎమ్సీ చైర్మన్ తో భేటి అయిన జూడా ప్రతినిధులు

ఎన్ఎమ్సీ చైర్మన్ తో భేటి అయిన జూడా ప్రతినిధులు సికింద్రాబాద్, మే31 (ప్రజామంటలు): నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎమ్సీ) చైర్మన్ డా.బీఎన్ గంగాధర్ ను తెలంగాణ జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ (టీజూడా) ప్రతినిధులు ఉస్మానియా మెడికల్ కాలేజీలో శనివారం కలిసి, జూడాల సమస్యలను ఆయన దృష్టికి తీసుకువెళ్ళారు. ఈమేరకు పలు సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని అందచేశారు. పీజీ విద్యార్థుల మానసిక ఆరోగ్యంపై దృష్టి పెట్టాలని, అధిక...
Read More...