నకిలీ విత్తనాలను అరికట్టేందుకు జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక నిఘా నెలవారీ క్రైమ్ మీటింగ్ లో జిల్లా ఎస్పీ అశోక్ కుమార్
జగిత్యాల మీ 29 ( ప్రజా మంటలు)
జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పి అశోక్ కుమార్ అధ్యక్షతన నేరాల సమీక్ష సమావేశం నిర్వహించబడింది. ఈ సమావేశంలో డీఎస్పీలు, సి.ఐ లు వివిధ పోలీస్ స్టేషన్ల నుంచి ఎస్ఐలు పాల్గొన్నారు.
ఈ యొక్క సమావేశం లో ప్రధానంగా ఎస్సీ ఎస్టీ కేస్ లపై పురోగతి, జిల్లా వ్యాప్తంగా నమోదైన తాజా నేరాల విశ్లేషణ, నేర నివారణకు తీసుకోవాల్సిన ముందస్తు చర్యలు, సీసీటీవీ వ్యవస్థల ప్రాముఖ్యత మరియు వాటి నిర్వహణ,రాత్రి గస్తీ వ్యవస్థను మరింత బలోపేతం చేయడం, మహిళల భద్రతపై,రోడ్డు ప్రమాదాల నివారణ, డ్రగ్స్ మరియు అసాంఘిక కార్యకలాపాల పై తీసుకోవాల్సిన చర్యలపై ఎస్పి అధికారులతో చర్చించడం జరిగింది.
ఎస్పీ మాట్లాడుతూ.... ఇప్పటివరకు నమోదైన కేసులలో నాన్ గ్రేవ్ కేసులు, గ్రేవ్ కేసుల విషయంలో తీసుకోవలసిన చర్యలు గురించి అధికారులకు వివరించారు. గుర్తుతెలియని మృతదేహాలు దొరికినప్పుడు కేసు నమోదు చేయగానే వెంటనే ఫోటోలు సీసీటీఎన్ఎస్ లో అప్లోడ్ చేయాలని సూచించారు దీని ద్వారా ఎక్కడైనా మిస్సింగ్ పర్సన్ ఉంటే రాష్ట్రవ్యాప్తంగా గుర్తించి మిస్సింగ్ కేసులను ఛేదించవచ్చని సూచించారు.
ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రతి రోజూ డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ లు, వాహన తనిఖీలు నిర్వహించాలని,బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవించే ప్రాంతాల పై నిఘా ఉంచాలని వారి పై కేస్ లు నమోదు చేయాలని అన్నారు. జిల్లాలో గంజాయి,మత్తు పదార్థాలు పూర్తి స్థాయిలో నిర్ములించేందుకు జిల్లా పోలీస్ యంత్రంగం ప్రత్యేక ప్రణాళికలను ఏర్పాటు చేసుకొని మండలాల్లో, గ్రామాల్లో నిత్యం తనిఖీలు నిర్వహించాలని అన్నారు.
రాబోవు బక్రీద్ సందర్భంగా జిల్లా లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మరియు గోవుల అక్రమ రవాణా, గోవధను నివారించేందుకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని జిల్లా అధికారులను ఆదేశించారు. సంతలో కొనుగోలు చేసిన పశువులకు, సంబంధిత పశు వైద్యాధికారిచే ఆరోగ్య మరియు రవాణాకు అనుమతి పత్రాలు కలిగి ఉండాలని సూచించారు.
గోవుల రవాణా జరిగే ప్రాంతాల్లో నిరంతరం నిఘా ఉంచాలని అక్రమంగా గోవులను రవాణా చేస్తున్నారనే సాకుతో బృందాలుగా ఏర్పడి అల్లర్లకు కారణమయ్యే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.
నకిలీ విత్తనాలను అరికట్టేందుకు జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక నిఘా.
జిల్లా పరిధిలో నకిలీ విత్తనాలు, ఎరువులు విక్రయాలకు పాల్పడే విక్రయదారులపై చట్టపరంగా చర్యలు తీసుకోవడంతో పాటు క్రిమినల్ కేసులను నమోదుచేయాలని అదికారులను ఆదేశించారు.గతంలో నకిలీ విత్తనాల ను అమ్ముతూ పట్టుబడ్డ వారి వివరాలను సేకరించాలని సూచించారు. ముఖ్యంగా గోదావరి నది పరివాహక రైతులకు నకిలీ పత్తి విత్తనాలు గురించి అవగాహన కల్పించాలని సూచించారు. నకిలీ విత్తనాల నివారణ కోసం స్పెషల్ టాస్క్ ఫోర్స్ టీం ఏర్పాటు చేయడం జరిగిందని ఈ యొక్క టీం జిల్లాలో వ్యవసాయ అధికారులను సహాయంతో అన్ని ఎరువుల దుకాణంలో తనిఖీ చేయడం జరుగుతుందని తెలిపారు. గ్రామాల్లోకి వచ్చి ఎవరైనా విత్తనాలు అమ్మితే కొనుగోలు చేయ వద్దని వెంటనే సంబంధిత పోలీస్ స్టేషన్లకు/వ్యవసాయ అధికారుల కు తెలపాలని లేదా డయల్ 100 కాల్ చేసి తెలిపినచో చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపినారు.
ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ అధికారులు తిరుపతి నాయక్ ,శ్రీనివాస్ గార్లతో ప్రత్యేక అవగాహన కార్యక్రమని ఏర్పాటు చేసి నకిలీ విత్తనాలను అరికట్టడానికి మరియు వాటిని గుర్తించడానికి తీసుకోవలసిన చర్యల గురించి వివరించారు.
ఈ యొక్క సమావేశంలో అదనపు ఎస్పి భీమ్ రావు, డిఎస్పిలు వెంకట రమణ, రఘు చంధర్, రాముల, రంగారెడ్డి మరియు డి సి ఆర్ బి, ఎస్ బి, ఐటి కోర్ , సి సి ఎస్, ఐటి కోర్ ఇన్స్పెక్టర్ లు శ్రీనివాస్,ఆరిఫ్అలీఖాన్,రఫీక్ ఖాన్, శ్రీనివాస్ రిజర్వ్ ఇనస్పెక్టర్ వేణు మరియు సి.ఐ లు వేణుగోపాల్,రామ్ నరసింహారెడ్డి,రవి,అనిల్ కుమార్, కృష్ణ రెడ్డి, సురేష్ ,మరియు ఎస్.ఐ లు, డి సి ఆర్ బి, ఐటీ కోర్ సిబ్బంది పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
టీపీసీసీ రాష్ట్ర సలహా కమిటీ లో జగిత్యాల టైగర్ టి. జీవన్ రెడ్డి కి చోటు.
.jpeg)
ఇందిరానగర్ బస్తి దవాఖానాలో మెరుగైన వైద్య సేవలు – డాక్టర్ మిట్టపల్లి సృజల

రూ.వంద కోట్లతో రాంగోపాల్ పేట డివిజన్ ను అభివృద్ది చేశాం

చిన్నపాటి వర్షానికే నీట మునిగిన రహదారి

విది నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన అదికారులకు, సిబ్బందికి ప్రశంస ప్రోత్సాహకాలు

మానసిక వేదనతోనే పంచాయతీ కార్యదర్శి మృతి. రాష్ట్ర పంచాయతీ కార్యదర్శుల ఫోరం అధ్యక్షులు బలరాం.

నకిలీ విత్తనాలను అరికట్టేందుకు జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక నిఘా నెలవారీ క్రైమ్ మీటింగ్ లో జిల్లా ఎస్పీ అశోక్ కుమార్

అభివృద్ధి నిరంతర ప్రక్రియ ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

ప్రజాపాలనలో ధరఖాస్తు చేసుకున్న రేషన్ కార్డుల ఇవ్వరా?

మహిళా సాధికారితకు స్ఫూర్తి రాణి "అహల్యాబాయి "

ప్రభుత్వ భూమి కబ్జాకు గురి కాకుండా హద్దులు ఏర్పాటు చేయండి

ఉచిత ఆస్తమా వ్యాధి నివారణ ఆయుర్వేద మందు
