గొల్లపల్లి మండల కేంద్రంలో తిరంగా యాత్ర...
ప్రతి భారతీయుడు సైనికులకు మద్దతుగా నిలవాలి..
బీజేపీ జిల్లా అధ్యక్షులు యాదగిరి బాబు
గొల్లపల్లి మే 28 (ప్రజా మంటలు):
పహాల్గామ్ సంఘటన విషయంలో పాకిస్తాన్ తో జరిగిన యుద్ధంలో భారత్ సైనికులు సాదించిన విజయానికి సంఘీభావం తెలుపుతూ గొల్లపల్లి మండల కేంద్రంలో సంఘభావంగా ర్యాలీ నిర్వహించారు. ఈసందర్బంగా బిజెపి జిల్లా అధ్యక్షులు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ భారతదేశ చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ ప్రేరేపిత తీవ్రవాద సంస్థలు అయిన జైష్ ఏ మహమ్మద్, ఐసిస్ లాంటి తీవ్రవాద సంస్థలు పహాల్గామ్ లో హిందూ పర్యాటకుల మీద దాడి చేయడం హేయమైన చర్య అని దానికి ప్రతీకారంగా భారత ప్రభుత్వం పాకిస్తాన్ ఉగ్రవాద స్థావరాలను, ఎయిర్ బేస్ లను పేల్చేయడం శుభపరిణామం అని తీవ్రవాదాన్ని మట్టుబెట్టడంలో భారత ప్రభుత్వం సైనికులకు పూర్తి స్వేచ్ఛను ఇవ్వడం వల్లనే 170 మంది ఉగ్రవాదులను, నలభై రెండు మంది పాక్ సైనికులను మట్టుబెట్టారని అన్నారు.
భారత సైన్యంలో ఇద్దరు మహిళా కమండోలు చూపిన తెగువ అనిర్వచనీయం అని పాకిస్తాన్ ను అంతమోందించడానికి ఇద్దరు మహిళలు సోఫియా ఖురేషి, వ్యోమిక సింగ్ లు కాళికదేవి అవతారం ఎత్తితేనే ఇంతగా ఉంటే ప్రతి భారతీయుడు పరశరాముని అవతారం ఎత్తితే పాకిస్తాన్ దేశం ప్రపంచం పటంలో కనిపించదని అన్నారు. భారత సైనికులకు భారతీయుల మద్దతు ఎల్లవేళలా ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి మండల అధ్యక్షులు చెవులమద్ది శేఖర్ బీజేపీ అసెంబ్లీ కన్వీనర్ కొమ్ము రాంబాబు, పిల్లి శ్రీనివాస్
బీజేపీ మాజీ మండల అధ్యక్షులు కట్ట మహేష్ బీజేవైఎం మండల అధ్యక్షులు లక్క కుల వెంకటేష్, పట్టణ అధ్యక్షులు సంగెం కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు..
More News...
<%- node_title %>
<%- node_title %>
టీపీసీసీ రాష్ట్ర సలహా కమిటీ లో జగిత్యాల టైగర్ టి. జీవన్ రెడ్డి కి చోటు.
.jpeg)
ఇందిరానగర్ బస్తి దవాఖానాలో మెరుగైన వైద్య సేవలు – డాక్టర్ మిట్టపల్లి సృజల

రూ.వంద కోట్లతో రాంగోపాల్ పేట డివిజన్ ను అభివృద్ది చేశాం

చిన్నపాటి వర్షానికే నీట మునిగిన రహదారి

విది నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన అదికారులకు, సిబ్బందికి ప్రశంస ప్రోత్సాహకాలు

మానసిక వేదనతోనే పంచాయతీ కార్యదర్శి మృతి. రాష్ట్ర పంచాయతీ కార్యదర్శుల ఫోరం అధ్యక్షులు బలరాం.

నకిలీ విత్తనాలను అరికట్టేందుకు జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక నిఘా నెలవారీ క్రైమ్ మీటింగ్ లో జిల్లా ఎస్పీ అశోక్ కుమార్

అభివృద్ధి నిరంతర ప్రక్రియ ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

ప్రజాపాలనలో ధరఖాస్తు చేసుకున్న రేషన్ కార్డుల ఇవ్వరా?

మహిళా సాధికారితకు స్ఫూర్తి రాణి "అహల్యాబాయి "

ప్రభుత్వ భూమి కబ్జాకు గురి కాకుండా హద్దులు ఏర్పాటు చేయండి

ఉచిత ఆస్తమా వ్యాధి నివారణ ఆయుర్వేద మందు
