హాస్పిటల్ అడ్మినిస్ర్టేషన్ కోర్సు చేసిన వారికి జాబ్స్ ఇవ్వండి..
హెల్త్ మినిస్టర్ కు నిరుద్యోగులు విజ్ఞప్తి
సికింద్రాబాద్ మే 28 (ప్రజామంటలు):
హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ కోర్స్ పూర్తి చేసిన వారికి ప్రభుత్వ ఆసుపత్రులల్లో అడ్మినిస్ట్రేషన్ మేనేజర్లుగా శాశ్వత ప్రాతిపదికపై ఉద్యోగాలను ఇవ్వాలని నిరుద్యోగులు డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం తెలంగాణ హెల్త్ కేర్ అండ్ హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ అసోసియేషన్ ప్రతినిధులు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి, గౌరవ అధ్యక్షుడు, హెచ్ సీయూ ప్రొఫెసర్ జీ.ఆచార్య మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో గాంధీ దవఖానలో హాస్పిటల్ అడ్మిట్ స్టేషన్ మేనేజర్లను పైలట్ ప్రాతిపదికన నియమించడం జరిగిందని, దానివలన వంద శాతం విజయవంతమైన ఫలితాలు వచ్చాయని వారు మంత్రికి గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని ఈఎస్ఐ కార్పొరేషన్, స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా, నేషనల్ హెల్త్ మిషన్ కు చెందిన ఆసుపత్రులలో డిస్ట్రిక్ట్ క్వాలిటీ హెల్త్ ఆఫీసర్ పేరుతో ఉద్యోగులను నియమించడం జరిగిందని వారు మంత్రి వివరించారు. ఆస్పత్రిలో రోజువారి కార్యకలాపాలను సమర్థవంతంగా నిర్వహించే అడ్మినిస్ట్రేషన్ మేనేజర్ల నియామకం వలన వైద్యుల పై భారం తగ్గుతుందని, తద్వారాప్రభుత్వ దవాఖానలకు వచ్చే నిరుపేద రోగులకు నాణ్యమైన వైద్యం అందించడానికి వీలవుతుందని అన్నారు. వివిధ ప్రభుత్వ వైద్య కళాశాలలో, యుజీసీ నిబంధనల ప్రకారం తెలంగాణలోని మెడికల్ కాలేజీలలో హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్, హెల్త్ కేర్ మేనేజ్ మెంట్ కోర్సులను పూర్తి చేసిన 30 వేల మంది నిరుద్యోగులను ప్రభుత్వం ఆదుకోవాలని, తమకు నోటిఫికేషన్ ద్వారా పర్మినెంట్ ఉద్యోగాలను ఇవ్వాలని కోరుతున్నామని వారు అన్నారు. తాము ఇచ్చిన వినతికి పత్రానికి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సానుకూలంగా స్పందించారని అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
టీపీసీసీ రాష్ట్ర సలహా కమిటీ లో జగిత్యాల టైగర్ టి. జీవన్ రెడ్డి కి చోటు.
.jpeg)
ఇందిరానగర్ బస్తి దవాఖానాలో మెరుగైన వైద్య సేవలు – డాక్టర్ మిట్టపల్లి సృజల

రూ.వంద కోట్లతో రాంగోపాల్ పేట డివిజన్ ను అభివృద్ది చేశాం

చిన్నపాటి వర్షానికే నీట మునిగిన రహదారి

విది నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన అదికారులకు, సిబ్బందికి ప్రశంస ప్రోత్సాహకాలు

మానసిక వేదనతోనే పంచాయతీ కార్యదర్శి మృతి. రాష్ట్ర పంచాయతీ కార్యదర్శుల ఫోరం అధ్యక్షులు బలరాం.

నకిలీ విత్తనాలను అరికట్టేందుకు జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక నిఘా నెలవారీ క్రైమ్ మీటింగ్ లో జిల్లా ఎస్పీ అశోక్ కుమార్

అభివృద్ధి నిరంతర ప్రక్రియ ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

ప్రజాపాలనలో ధరఖాస్తు చేసుకున్న రేషన్ కార్డుల ఇవ్వరా?

మహిళా సాధికారితకు స్ఫూర్తి రాణి "అహల్యాబాయి "

ప్రభుత్వ భూమి కబ్జాకు గురి కాకుండా హద్దులు ఏర్పాటు చేయండి

ఉచిత ఆస్తమా వ్యాధి నివారణ ఆయుర్వేద మందు
