మహిళా సాధికారితకు స్ఫూర్తి రాణి "అహల్యాబాయి "
అంటరానితనం, అసమానతలను నిర్మూలిన్చింది.. అహల్యబాయి జయంతి ఉత్సవ కమిటీ జిల్లా కన్వీనర్ మర్రిపెల్లి సత్యమ్..
గొల్లపల్లి మే 29 (ప్రజా మంటలు):
అంటరానితనం, అసమానతలు, మూఢనమ్మకాలపై మహిళల్లో చైతన్యం నింపి 500మహిళలతో సొంతంగా సైన్యాన్ని తయారుచేసి ఆడది అంటే అబల కాదు సబల అని నిరూపించిన గొప్ప యోధురాలు రాణి అహల్యబాయి హోల్కర్ అని అహల్యబాయి హోల్కర్ జయంతి ఉత్సవాల కమిటీ జిల్లా కన్వీనర్ బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి మర్రిపెల్లి పేర్కొన్నారు.
గొల్లపెల్లి మండలంలోని గుంజపడుగు గ్రామంలో జరిగిన స్వయం సహాయక సంఘాల,మహిళా సంఘాలతో ఏర్పాటు చేసిన సమావేశంలో మర్రిపెల్లి సత్యమ్ మాట్లాడుతూ అహల్యబాయి హోల్కర్ పాలనకాలంలో మహిళలు ఎదుర్కొంటున్న అంటరానితనం, అసమానతలు, సతిసహా గమనం లాంటి అసాంఘీక కార్యక్రమాలకు వ్యతిరేకంగా పోరాడి యావత్ మహిళా లోకానికి స్ఫూర్తిగా నిలిచిందని అన్నారు. మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని మహిళలతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించి ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా ఎదగడానికి ప్రత్యేక నిధులను కేటాయించిందని అన్నారు.నేడు నరేంద్రమోదీ అహల్యబాయి పాలనను స్ఫూర్తిగా తీసుకొని మహిళలకు 33%రిజర్వేషన్ కల్పించి ఆర్ధికంగా, రాజకీయంగా, సామాజికంగా ఎదగడానికి ప్రోత్సహిస్తున్నారని అన్నారు. అలాగే పహాల్గామ్ ఘటనకు ప్రతీకారంగా ఆపరేషన్ సిందూర్ లో భారత సైన్యంలో ఇద్దరు మహిళా కమాండోలకు పూర్తి స్వేచ్చను ఇచ్చి చిరకాల ప్రత్యర్థి అయిన పాకిస్తాన్ ను చిత్తు చేయించి ప్రపంచం ముందు మహిళా శక్తిని చాటరని పదకొండేళ్లుగా మోదీ గారి క్యాబినెట్ లో రక్షణ, విత్త శాఖ మంత్రిగా ఒక మహిళకు అవకాశం కల్పించి భారత ఆర్థిక వ్యవస్థను మెరుగుపరుస్తున్నారని అన్నారు. అలాగే ఒక గిరిజన మహిళను దేశ ప్రథమ పౌరురాలిని చేసిన ఘనత మోదీ గారిదేనని బేటీ బచావో బేటీ పడావో లాంటి కార్యక్రమాల ద్వారా మహిళలో ఆత్మస్థైర్యం నింపాడని అన్నారు.కాంగ్రెస్, కమ్యూనిస్ట్ భావజాలం ఉన్న కొందరు భారతదేశంలో మహిళకు రక్షణ లేదని అణచివేతకు గురవుతున్నారని చేస్తున్న వ్యాఖ్యల్లో నిజం లేదని భారత ఇతిహాస, పురాణాలలో కూడ మహిళలకు పెద్దపీట వేశారని అందుకే లక్ష్మిదేవి ఆర్థిక మంత్రిగా, సరస్వతి విద్యా శాఖ మంత్రిగ, పార్వతీదేవి మహిశాసుర మర్దనం చేసి రక్షణ శాఖ మంత్రిగా నిలిచారని అన్నారు.ముగ్గురు శక్తి మాతలను స్ఫూర్తిగా తీసుకున్న రాణి అహల్యబాయిని స్ఫూర్తిగా తీసుకొని మహిళలు ముందుకెళ్లాలని ఆర్ధికంగా, సామాజికంగా, రాజకీయంగ ఎదగడానికి కృషి చేయాలని కోరారు.రాజమాత రాణి అహల్యబాయి దేశం, ధర్మం కోసం చేసిన కృషి చేసి పుణ్యశ్లోక అనే బిరుదు పొందిందని అన్నారు. ప్రపంచంలో ఇంతవరకు పుణ్యశ్లోక బిరుదు పొందినవారు ఆది శంకరాచార్యులు, అహల్యబాయి మాత్రమేనని అన్నారు.
ఈసందర్బంగా స్వయం సహాయక బృంద సభ్యులను సన్మానించారు.ఈసమావేశంలో కమిటీ సభ్యులు సాంబారి కళావతి, దురిశెట్టి మమత, స్థానిక బిజెపి నాయకులు మారం గణేష్,చందు,రంగు మహేందర్, శెట్టి మధు, తవుటు రాము మరియు 150 మహిళలు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
టీపీసీసీ రాష్ట్ర సలహా కమిటీ లో జగిత్యాల టైగర్ టి. జీవన్ రెడ్డి కి చోటు.
.jpeg)
ఇందిరానగర్ బస్తి దవాఖానాలో మెరుగైన వైద్య సేవలు – డాక్టర్ మిట్టపల్లి సృజల

రూ.వంద కోట్లతో రాంగోపాల్ పేట డివిజన్ ను అభివృద్ది చేశాం

చిన్నపాటి వర్షానికే నీట మునిగిన రహదారి

విది నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన అదికారులకు, సిబ్బందికి ప్రశంస ప్రోత్సాహకాలు

మానసిక వేదనతోనే పంచాయతీ కార్యదర్శి మృతి. రాష్ట్ర పంచాయతీ కార్యదర్శుల ఫోరం అధ్యక్షులు బలరాం.

నకిలీ విత్తనాలను అరికట్టేందుకు జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక నిఘా నెలవారీ క్రైమ్ మీటింగ్ లో జిల్లా ఎస్పీ అశోక్ కుమార్

అభివృద్ధి నిరంతర ప్రక్రియ ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

ప్రజాపాలనలో ధరఖాస్తు చేసుకున్న రేషన్ కార్డుల ఇవ్వరా?

మహిళా సాధికారితకు స్ఫూర్తి రాణి "అహల్యాబాయి "

ప్రభుత్వ భూమి కబ్జాకు గురి కాకుండా హద్దులు ఏర్పాటు చేయండి

ఉచిత ఆస్తమా వ్యాధి నివారణ ఆయుర్వేద మందు
