రాష్ట్రం డెంగీ జ్వరాలతో ఇబ్బందులు పడుతున్నప్పటికీ  స్పందించని ప్రభుత్వం - మాజీ మంత్రి కొప్పుల విమర్శ

On
రాష్ట్రం డెంగీ జ్వరాలతో ఇబ్బందులు పడుతున్నప్పటికీ  స్పందించని ప్రభుత్వం - మాజీ మంత్రి కొప్పుల విమర్శ

రాష్ట్రం డెంగీ జ్వరాలతో ఇబ్బందులు పడుతున్నప్పటికీ  స్పందించని ప్రభుత్వం - మాజీ మంత్రి కొప్పుల విమర్శ

జగిత్యాల సెప్టెంబర్ 08:

రాష్ట్రంలో డెంగీ జ్వరాలతో జనం ఇబ్బందులు పడుతున్నప్పటికీ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుందనీ
 మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్  ప్రభుత్వంపై విమర్శలు చేశారు.

జగిత్యాల జిల్లా బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన ప్రెస్ మీట్ మాట్లాడుతూ, రాష్ట్రంలో హెల్త్ ఎమర్జెన్సీని అమలు చేయాల్సిన పరిస్థితులు నెలకొన్నాయనీ,రాష్ట్రంలో గత నెల రోజులుగా విషజ్వరాలు తీవ్రంగా పెరిగిపోతూనే ఉన్నాయనీ. ప్రాణంతకమైన డెంగ్యూ, చికెన్‌ గున్యా లాంటి రోగాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారనీ కొప్పుల ఆరోపించారు.

ఇందులో మాజీ జెడ్ పి ఛైర్పర్సన్ దావా వసంత,వైస్ చైర్మన్ హరి చరణ్, మాజీ కౌన్సిలర్ మల్లేశం తదితరులు పాల్గొన్నారు.

ఇంకా ఇలా అన్నారు.రాష్ట్రంలో ఆగస్టు చివరి నాటికే ఎనిమిదిన్నర లక్షల మందికి పైగా విషజ్వరాల భారిన పడినట్లు తెలుస్తోంది.ఒకే బెడ్ మీద ముగ్గురు నుంచి నలుగురికీ వైద్య అందిస్తున్నా పరిస్థితి ఉంది.

ఆగస్టు 27న రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ చెప్పిన లెక్కల ప్రకారం రాష్ట్రంలో 4,459 డెంగ్యూ కేసులు నమోదు అయ్యాయి..! కాని డెంగీ కేసుతోనే కాదు, ఇతర ఏ విషజ్వరం వల్ల ఒక్క మరణం సంభవించలేదు అన్నది రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ నివేదిక..!

డెంగీ మరణాలు లేవని ప్రభుత్వం చెబుతోంది.. కానీ పత్రికల్లో డెంగీ తో ప్రజలు చనిపోతున్నారని రోజు వార్తలు వస్తున్నాయి..!

ప్రభుత్వం నిజాలను ఎందుకు దాచి పెడుతోంది..!

వైద్య, ఆరోగ్యశాఖ ప్రకటనకు, క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితులకు తీవ్రమైన వ్యత్యాసం ఉంది...! ఆగస్టు 27వ తేదీ నాటికే రాష్ట్రంలో 128 మంది విషజ్వరాల భారిన పడి మృతిచెందినట్లు స్పష్టమైన నివేదికలున్నాయి..!

ఈ పదిరోజుల వ్యవధిలో మరో 50 మంది విషజ్వరాల భారిన పడి మృతిచెందారు..!

వైద్య ఆరోగ్యశాఖ ఇచ్చిన నివేదికలో ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో కేవలం లక్ష లోపు మంది మాత్రమే జ్వరాల భారిన పడ్డారు...! 

కరీంనగర్‌లో 40వేల మంది, జగిత్యాలలో 18వేల మంది, సిరిసిల్లాలో 16వేల మంది, పెద్దపల్లిలో 15,300ల మంది అని చెప్పారు. ఇవన్ని కాకి లెక్కలే...!

జగిత్యాల జిల్లాలోనే దాదాపు యాభై వేల మందికి పైగా విషజ్వరాల బారిన పడ్డారు. ఇరవై మందికి పైగా డెంగ్యూ, చికెన్‌ గున్యా లాంటి ప్రమాదకరమైన విషజ్వరాల భారిన పడి మృతిచెందారు..!

మూడు, నాలుగు రోజుల క్రితమే సారంగాపూర్‌ మండలంలో ఒక సింగిల్‌ విండో సి.ఇ.ఓ విషజ్వరంతో చనిపోయాడు..! మల్లాపూర్‌ మండలానికి చెందిన యువకుడు విదేశాల నుండి వచ్చి వివాహం చేసుకున్న పదిహను ఇరవై రోజులకే విషజ్వరంతో చనిపోయాడు..ఎటూ చూసిన విషజ్వరాలు విజృంభిస్తున్నాయి..!

జ్వరపీడితులతో ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆసుపత్రులు కిక్కిరిసిపోతుంటే, ప్రజలు విషజ్వరాలతో పిట్టలా రాలుతుంటే ప్రభుత్వం పట్టనట్టు చూస్తోంది..!

ప్రభుత్వ ఆసుపత్రుల్లో కనీస సౌకర్యాల లేకుండా పోయాయి...! వైద్యుల సమయ పాలన పాటించిన దాఖలాలు లేవు...! ఎప్పుడు వస్తున్నారో...! ఎప్పుడు వెళ్తున్నారో తెలియడం లేదు...! వారిపై పర్యవేక్షణ కరువైంది...!

జగిత్యాల జిల్లాలోని ఏ ఒక్క ఆసుపత్రిని ఒక్క మంత్రి, బాధ్యుడైన ప్రజాప్రతినిధి పరిశీలించిన దాఖలాలు లేవు..

ఆసుపత్రుల్లో విషజ్వరాలకు సంబంధించిన మందులు అందుబాటులో లేవు..విషజ్వరాలకు సంబంధించిన మందులు బయట నుండి రోగులు కొనుగోలు చేసుకోవాల్సి వస్తుంది..!

గత మూడు మాసాలుగా అజిత్రోమైసిన్‌, డైక్లోఫైన్‌ ఫార్ములాలకు చెందిన మందుల పంపిణీ జరగడం లేదు...ప్రస్తుతం విషజ్వరాలకు సంబంధించిన ట్రీట్మెంట్‌లో ఇవి కీలకమైనవి అని వైద్యులు చెబుతున్నారు..!

అజిత్రోమైసిన్‌ యాంటిబయటిక్‌ మందు...ఇది అత్యంత కీలకమైంది..కరోనా లాంటి కాలంలోను కోట్లాది మంది ప్రాణాలు కాపాడింది...డైక్లో మందు ప్పులు...ఫివర్‌ను కంట్రోల్‌ చేస్తుంది...ఇలాంటి కీలమైన మందులు ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందుబాటులో పెట్టడంలో ప్రభుత్వం విఫలం అయ్యింది..

మూడు మాసాలుగా ఆసుపత్రులకు నిధుల మంజూరు లేదంటున్నారు. కేసీఆర్‌ హాయాంలో ఆసుపత్రుల్లో ఉంచిన బఫర్‌ స్టాక్‌ మందులే ఇన్నాళ్లు వినియోగిస్తూ వచ్చామని, బఫర్‌ స్టాక్‌ పూర్తి కావడంతో మందుల కొరత తీవ్రంగా ఏర్పడిందని వైద్య సిబ్బందే చెబుతున్నారు..!
    ఆసుపత్రి సూపరిండెంట్‌ల వద్ద ఉన్న ప్రత్యేక నిధుల నుండి అత్యవసర మందులు తెచ్చుకునే పరిస్థితి ఉందని వైద్య సిబ్బంది వాపోతున్నారు. 

ఇలాంటి వార్తలను సమైక్య పాలనసేవాళ్లమని.. కాంగ్రెస్‌ పాలన పుణ్యమా అని నేడు ఏ పత్రిక చూసినా మళ్లీ ఆ వార్తలే కనిపిస్తున్నాయి..!

విషజ్వరాలే కాదు...ఆసుపత్రుల్లో సేవలు కుంటుపడ్డాయి...కేసీఆర్‌ కిట్లు అందడం లేదు...ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఒకప్పుడు ఎక్కువ ప్రసవాలు జరిగితే ప్రైవేట్‌లో ప్రసవాల సంఖ్య తగ్గిపోయింది..!

బీఆర్‌ఎస్ ప్రభుత్వ హాయంలో జగిత్యాల జిల్లాలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో 62 శాతం ప్రసవాలు నమోదు అయితే..! ప్రైవేట్‌లో 38 శాతం నమోదు అయ్యేవి...ఇప్పుడు సీన్‌ రివర్స్‍ అయ్యింది...!

ప్రైవేట్‌లో 65 శాతం ప్రసవాలు జరిగితే...ప్రభుత్వ ఆసుపత్రుల్లో 35 శాతం నమోదు అవుతున్నాయి...! -ప్రభుత్వం సిగ్గుపడాలి...!

ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని పారదర్శకంగా విష జ్వ‌రాల‌ నివారణ కోసం చర్యలు చేపట్టాలని సూచన..!

విషజ్వరాల కారణంగా ఏ ఒక్కరు ప్రాణం కోల్పోకుండా చూడాలని..! విషజ్వరాలు విజృంభించిన ప్రాంతాల్లో మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేసి వైద్యం అందించాలన్నారు..! పల్లె, పట్టణాల్లో పారిశుద్ధ్యం మెరుగు పరచాలని..! ప్రభుత్వ ఆసుపత్రుల్లో మందులు, డెంగీ కిట్స్ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలి..!

 

Tags

More News...

Local News 

భూటాన్‌ దేశంలో ముల్కనూర్ వాసి ధనశ్రీకు భరతనాట్య అవార్డు

భూటాన్‌ దేశంలో ముల్కనూర్ వాసి ధనశ్రీకు భరతనాట్య అవార్డు మండల వ్యాప్తంగా అభినందనల వెల్లువ
Read More...
National  Local News  State News  Spiritual  

అపర ఏకాదశి.- వైశాఖ బహుళ ఏకాదశి

అపర ఏకాదశి.- వైశాఖ బహుళ ఏకాదశి   (రామ కిష్టయ్య సంగన భట్ల...      9440595494) వైశాఖ బహుళ ఏకాదశిని అపర ఏకాదశి, సిద్ధ ఏకాదశి, జలకృత ఏకాదశి, అజల ఏకాదశి, భద్రకాళి ఏకాదశి అని వివిధ పేర్లతో పిలుస్తారు. ఏడాదిలో పదిహేను రోజులకు ఓసారి వచ్చే ఏకాదశి తిథికి ప్రత్యేకతను కల్పిస్తూ... ఏడాది పొడవునా ఉండే ఒకో ఏకాదశికి ఒకో పేరు పెట్టడం జరిగింది....
Read More...
Local News 

తాట్లవాయి హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు

తాట్లవాయి హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు రాయికల్ మే 22 :   తాట్లవాయి గ్రామంలో నూతనంగా ప్రతిష్ఠించిన పంచముఖ హనుమాన్ ఆలయంలో హనుమాన్ జయంతి సందర్భంగా, మండల పూజ కార్యక్రమం నిర్వహించారు.రాయికల్ మండల తాజా మాజీ ఎంపీపీ లావుడ్యా సంధ్యారాణి సురేంధర్ నాయక్ పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈరోజుతో పంచముఖ హనుమాన్ విగ్రహాన్ని ప్రతిష్టించి 41 వ రోజు అయినందున హనుమాన్...
Read More...
Local News 

భూకబ్జాదారులపై గాంధీనగర్  పీఎస్ లో కాంగ్రెస్ నేత ఫిర్యాదు

భూకబ్జాదారులపై గాంధీనగర్  పీఎస్ లో కాంగ్రెస్ నేత ఫిర్యాదు సికింద్రాబాద్ మే 22 (ప్రజామంటలు): బన్సీలాల్ పేట డివిజన్ లోని పలు ప్రభుత్వ భూములను కొందరు కబ్జాకు ప్రయత్నం చేస్తున్నారని, దీనిపై రెవిన్యూ అధికారులకు ఫిర్యాదుచేస్తే, తనపై దాడికి ప్రయత్నించారని డివిజన్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఐత చిరంజీవి ఆరోపించారు. ఐడీహెచ్ కాలనీలోని ప్రభుత్వానికి చెందిన ఆలయ భూమిని కొందరు కబ్జాకు యత్నిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. అలాగే...
Read More...
Local News 

తార్నాక లో ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు

తార్నాక లో ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు హాజరైన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సికింద్రాబాద్ మే22 (ప్రజామంటలు):   హనుమాన్ జయంతి వేడుకలను తార్నాక లోని గణపతి దేవాలయంలో గురువారం  బండ శివారెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన ఆంజనేయుని ప్రత్యేక పూజ లో ముఖ్యఅతిథిగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి , మాజీ మేయర్ బండ కార్తీక చంద్రారెడ్డి భగవంతుడు...
Read More...
Local News 

జీహెచ్ఎమ్సీ ఎన్నికల్లో  గెలుపే లక్ష్యంగా నేతలు కార్యకర్తలు పని చేయాలి.

జీహెచ్ఎమ్సీ ఎన్నికల్లో  గెలుపే లక్ష్యంగా నేతలు కార్యకర్తలు పని చేయాలి. త్వరలో డివిజన్ల వారిగా పాదయాత్రలు  *ఎంపీ అనిల్ కుమార్, ఆదం సంతోష్ వెల్లడి.. సికింద్రాబాద్ మే 22 (ప్రజామంటలు) : రాబోవు జీహెచ్ఎమ్సీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పార్టీ నేతలు, కార్యకర్తలు సమిష్టిగా పనిచేయాలని రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్, సికింద్రాబాద్ కాంగ్రెస్ ఇంచార్జీ అదం సంతోష్ కుమార్ లు పిలుపునిచ్చారు. సికింద్రాబాద్ ఇంచార్జ్...
Read More...
Local News 

శ్రీ భక్తాంజనేయ స్వామి హనుమాన్ జయంతి వేడుకలు 

శ్రీ భక్తాంజనేయ స్వామి హనుమాన్ జయంతి వేడుకలు  గొల్లపల్లి మే 22 (ప్రజా మంటలు): గొల్లపల్లి మండలం లోని దమ్మన్నపేట గ్రామంలోని శ్రీ భక్తాంజనేయ స్వామి దేవాలయంలో నిర్వహించిన 16 వ వార్షికోత్సవ మహోత్సవంలో పాల్గొని స్వామి వారిని దర్శించుకొని, ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్, మాజీ మంత్రి వర్యులు జీవన్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కీ.శే పాదం...
Read More...
Local News 

చిలకలగూడ ఏసీపీగా శశాంక్ రెడ్డి బాధ్యతల స్వీకరణ

చిలకలగూడ ఏసీపీగా శశాంక్ రెడ్డి బాధ్యతల స్వీకరణ సికింద్రాబాద్ మే 22(ప్రజా మంటలు):: సికింద్రాబాద్ ఈస్ట్ జోన్ చిలకలగూడ డివిజన్ ఏసిపిగా సి సి ఎస్  నుంచి బదిలీ పై వచ్చిన కె శశాంక్ రెడ్డి గురువారం ఉద్యోగ బాధ్యతలు తీసుకున్నారు.  1995 బ్యాచ్ కు చెందిన శశాంక్ రెడ్డి గతంలో మారేడుపల్లి స్టేషన్ హౌస్ ఆఫీసర్ గా, పంజాగుట్ట డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ గా...
Read More...
Local News 

భాగ్య రెడ్డి వర్మ పోరాట స్ఫూర్తి మనందరికీ ఆదర్శం. కలెక్టర్ బి. సత్య ప్రసాద్

భాగ్య రెడ్డి వర్మ పోరాట స్ఫూర్తి మనందరికీ ఆదర్శం. కలెక్టర్ బి. సత్య ప్రసాద్                                                                                                   సిరిసిల్ల. రాజేంద్ర శర్మ  జగిత్యాల, మే-22(ప్రజా మంటలు)    మ్యాదరి భాగ్య రెడ్డి వర్మ పోరాట స్ఫూర్తి మనందరికీ ఆదర్శమని జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ తెలిపారు.  గురువారం జిల్లాకలెక్టర్ బి. సత్య ప్రసాద్ సమీకృత జిల్లా కలెక్టరేట్ లో నిర్వహించిన మ్యాదరి భాగ్యరెడ్డి వర్మ 137వ జయంతి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా...
Read More...
Local News 

త్వరితగతంగా అభివృద్ధి పనులు పూర్తి చేయాలి ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్

త్వరితగతంగా అభివృద్ధి పనులు పూర్తి చేయాలి ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ జగిత్యాల మే 22 (ప్రజా మంటలు)    ఎమ్మెల్యే క్వార్టర్లో మున్సిపల్ అధికారులతో జగిత్యాల అభివృద్ధి పనులపై సమీక్ష సమావేశం నిర్వహించిన జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్   జగిత్యాల పట్టణంలో వార్డులలో జరుగుతున్న అభివృద్ధి పనులపై సమీక్ష సమావేశం నిర్వహించారు.  అభివృద్ధి పనుల పురోగతి పై చర్చించారు, వివిధ కారణాలతో ఆగిపోయిన అభివృద్ధి పనులకు తిరిగి...
Read More...
Local News 

హనుమాన్ పెద్ద జయంతి ఉత్సవాలలో అర్ధరాత్రి సమయంలో క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ అధికారులను, సిబ్బందిని సమన్వయ పరుస్తూ సూచనలు చేస్తున్న జిల్లా ఎస్పీ

హనుమాన్ పెద్ద జయంతి ఉత్సవాలలో అర్ధరాత్రి సమయంలో క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ అధికారులను, సిబ్బందిని సమన్వయ పరుస్తూ సూచనలు చేస్తున్న జిల్లా ఎస్పీ                                           సిరిసిల్ల . రాజేంద్ర శర్మ  మల్యాల మే 22 ( ప్రజా మంటలు)    కొండగట్టు  హనుమాన్ పెద్ద జయంతి ఉత్సవాల సందర్భంగా ఆధ్యాత్మిక వాతావరణంలో భక్తులు స్వామి వారిని దర్శించుకునేలా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పట్టిష్ట బందోబస్తు నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు. బుధవారం అర్థరాత్రి సమయంలో క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ అధికారులకు...
Read More...
Local News 

జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఘనంగా భాగ్యరెడ్డి వర్మ  జయంతి వేడుకలు

జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఘనంగా భాగ్యరెడ్డి వర్మ  జయంతి వేడుకలు                                                   సిరిసిల్ల. రాజేంద్ర శర్మ జగిత్యాల మే 22( ప్రజా మంటలు)    భాగ్యరెడ్డి వర్మ  జయంతిని పురస్కరించుకోని జిల్లా పోలీస్ ప్రధాన  కార్యాలయములో ఏర్పాటు చేసిన కార్యాక్రమములో అడిషనల్ ఎస్పీ భీమ్ రావు  భాగ్యరెడ్డివర్మ  చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు.  ఈ సందర్భంగా అడిషనల్ ఎస్పీ  మాట్లాడుతూ... దళిత ఉద్యమానికి పునాదులు వేసిన ప్రముఖ...
Read More...