ధర్మజ్ఞాన ప్రవాహం... చాగంటి కోటేశ్వరరావు

నవంబర్ 12,12 తేదీలలో ధర్మపురిలో ప్రవచనాలు

On
ధర్మజ్ఞాన ప్రవాహం... చాగంటి కోటేశ్వరరావు

IMG_20251010_230343(రామ కిష్టయ్య సంగన భట్ల)

తెలుగు సాంస్కృతిక సంప్రదాయంలో ఆధ్యాత్మిక చైతన్యాన్ని ప్రజల్లో మేల్కొలిపి, వేదపురాణ జ్ఞానాన్ని సులభమైన భాషలో సమాజానికి చేరవేసిన ఆధునిక యుగ ధర్మబోధకులలో బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు అగ్రగణ్యులు. ఆయన వచన జ్యోతి కోట్లాది మంది భక్తుల హృదయాలను ప్రకాశింప జేస్తూ, వేదాంత బోధనలకు ప్రజా ప్రాచుర్యాన్ని కలిగించిన మహనీయుడిగా నిలిచారు. చాగంటి కోటేశ్వరరావు 1959 జూలై 14న తూర్పు గోదావరి జిల్లాలోని కాకినాడ పట్టణంలో జన్మించారు. తండ్రి చాగంటి సీతారామయ్య గారు, తల్లి అంజనమ్మ గారు. చిన్ననాటి నుంచే వేదమంత్రాల శ్రవణం, శాస్త్ర చర్చలపై ఆసక్తి ఆయనలో పుష్కలంగా కనిపించింది. రాజమండ్రిలోనే విద్యాభ్యాసం పూర్తి చేసిన ఆయన వృత్తిరీత్యా ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (కాకినాడ)లో ఉద్యోగం చేశారు. ఆయన జీవితం నిబద్ధత, నియమ పాలన, నిజాయితీకి మాదిరిగా నిలిచింది. పదవీ విరమణ అనంతరం సమస్త సమయాన్ని ఆధ్యాత్మిక ప్రసంగాలకు, ధర్మప్రచార సేవలకు అంకితం చేశారు. ప్రభుత్వ సేవ ముగిసినా ప్రజాసేవ ఆయనలో అంతర్భూతంగా కొనసాగింది.

చాగంటి ప్రవచనాలు భక్తి, జ్ఞానం, తాత్వికతల సమ్మేళనం. ఆయన వాక్యాలలో శాస్త్ర సారం, జీవిత మార్గదర్శనం, మానవ విలువల ప్రతిబింబం స్పష్టంగా కనిపిస్తాయి. రామాయణం, మహాభారతం, భాగవతం, శివపురాణం, దేవీభాగవతం, ఉపనిషత్తులు, వేదాంత సూక్తులు వంటి శాస్త్ర సమూహాల సారాంశాన్ని సూటిగా, సులభంగా ప్రజలకు అందించడం ఆయన ప్రత్యేకత. ఆయన చెప్పే భాషలో కవితాత్మకత, ఆయన బోధనలో తాత్వికత, ఆయన ప్రవచనంలో ఆచరణాత్మకత సమన్వయమై ఉంటుంది. ఆయన మాటలు కేవలం వినోదం కాదు — మనసును మేల్కొలిపే జ్ఞాన స్ఫురణ.

చాగంటి ప్రవచనాల ప్రధాన ఉద్దేశ్యం శాస్త్ర జ్ఞానాన్ని జీవన జ్ఞానంగా మార్చడం. ఆయన తరచూ చెబుతారు — “శాస్త్రం పుస్తకంలో ఉండకూడదు, మన హృదయంలో ఉండాలి; ప్రార్థన దేవునికోసం కాదు, మన మనసు శాంతికోసం.” ఈ వాక్యమే ఆయన ఆధ్యాత్మికతకు ప్రతీక. రామాయణం ఆయనకు భక్తి శాస్త్రం, మహాభారతం ధర్మ విజ్ఞానం, భాగవతం ఆత్మ వికాసానికి మార్గదర్శి. ఆయన ప్రవచనాలు వింటే పౌరాణిక కథలు మన ముందే సజీవమవుతాయి.

భక్తి టీవీ, ఎస్‌వీబీసీ, ఇతర భక్తి చానెల్స్, యూట్యూబ్ వేదికల ద్వారా ఆయన ప్రవచనాలు కోట్లాది మంది ప్రజలకు చేరాయి. ఆయన 42 రోజుల రామాయణ పారాయణం, 42 రోజుల శ్రీమద్భాగవత ప్రవచనం, శివ పురాణం, లలితా సహస్రనామ బోధనలు విస్తృత ప్రజాదరణ పొందాయి. తిరుమలలో జరిగిన మహా భాగవత ప్రవచన శ్రేణులు ఆయనకు జాతీయ స్థాయి ఖ్యాతిని తెచ్చి పెట్టాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2016లో ఆయనను రాష్ట్ర సాంస్కృతిక సలహాదారుగా నియమించింది. అదేవిధంగా స్వచ్ఛ ఆంధ్ర ప్రదేశ్ కార్యక్రమానికి ఆయనను బ్రాండ్ అంబాసడర్‌గా నియమించడం ఆయన సేవలకు ప్రభుత్వ గుర్తింపు.

చాగంటి ప్రవచనాల్లో హాస్యం, ఉదాహరణ, శాస్త్రం, సంస్కారం అన్నీ సమన్వయమై ఉంటాయి. ఆయన వ్యంగ్యం కూడా శాంతి, సత్యం, ధర్మం వైపు దారి తీస్తుంది. కుటుంబ విలువలు, దంపతుల పరస్పర గౌరవం, పిల్లల్లో సంస్కారం, సమాజంలో నైతిక జీవనశైలి, ఆచరణీయ ధర్మం — ఇవన్నీ ఆయన ప్రసంగాల్లో తరచూ ప్రతిధ్వనిస్తాయి. ఆయన “సంస్కారం లేని భక్తి అర్థరహితం; భక్తి లేని విద్య హృదయ రహితం” అని చెప్పిన వాక్యం ఆయన ఆలోచనా లోతుని ప్రతిబింబిస్తుంది. ఆయన ప్రసంగాలు భక్తిని మాత్రమే కాదు, మనస్సును శుద్ధి చేసే ఆధ్యాత్మిక సాధనాలు.

చాగంటి బహుమతులను, ఆర్థిక లాభాలను స్వీకరించరు; ఆయన ఆధ్యాత్మిక వాక్య ప్రచారం స్వార్థ రహితం. ప్రజల ఆధ్యాత్మిక మేలు కోసం మాత్రమే మాట్లాడుతారు. ఈ ఆచరణ ఆయనలోని నిజమైన సన్యాసత్వానికి నిదర్శనం. ఆయన ప్రసంగాల ద్వారా ఎన్నో కుటుంబాలు ధార్మిక విలువలకు మళ్లాయి; యువత ధర్మబద్ధ జీవనానికి ఆకర్షితమయ్యారు. ఆయన రచనలు, పుస్తకాలు, ఆడియో, వీడియో ప్రసంగాలు భక్తి, జ్ఞానం, తాత్వికతను ప్రజలకు చేరువ చేస్తున్నాయి.

కొన్ని సందర్భాల్లో ఆయన వ్యాఖ్యలు వివాదాస్పదమైనా అవగాహన లోపం తొలగగానే ప్రజలు ఆయన ఉద్దేశ్యాన్ని గౌరవంగా అర్థం చేసుకున్నారు. ఆయన ప్రతి ప్రసంగం సత్యాన్ని సున్నితంగా చెప్పే శైలికి ముద్ర. ఆయన చెబుతారు — “ధర్మం మనిషిని దేవుని దగ్గరికి తీసుకుపోదు; అది మనిషిని నిజమైన మనిషిగా మలుస్తుంది.” ఇదే ఆయన బోధనలోని తాత్విక సారం. చాగంటి కోటేశ్వరరావు ఆధునిక వ్యాసులు; ఆయన జీవితం ఒక ఉపనిషత్తు వంటిది. ఆయన చెప్పిన ప్రతి మాటలో వేదాంతముంది, బోధించిన ప్రతి అంశంలో భక్తితత్త్వముంది, చూపిన ప్రతి దారిలో జీవన మార్గదర్శకం ఉంది. ప్రజల్లో ఆయనకు ఉన్న గౌరవం భక్తి మాత్రమే కాదు, బుద్ధి పట్ల ఉన్న మన్నన కూడా. జ్ఞానం విన్నవాడు పండితుడు, జ్ఞానం పంచినవాడు గురువు, జ్ఞానాన్నే జీవించినవాడు చాగంటి కోటేశ్వరరావు. ఆయన వాక్యజ్యోతి ఎప్పటికీ ఆరని దీపంలా తెలుగు భూమిలో వెలుగుతూ ఉంటుంది.

ఇంతటి గొప్ప ఆధ్యాత్మిక వేత్త బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు దక్షిణ కాశీగా, నవ నరసింహ క్షేత్రాలలో ఒకటిగా, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు త్రిమూర్తుల నిలయంగా, ఈ క్షేత్రాన్ని దర్శిస్తే యమ లోకం వెళ్ళే అవకాశం అవసరం ఉండదని పేరెన్నిక గన్న, గంభీర గౌతమీ తీరాన వెలసిన తీర్థం క్షేత్రం అయిన ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి పుణ్యక్షేత్రంలో  శ్రీమఠం స్వామి మైదాన ప్రాంగణంలో శనివారం, ఆదివారం సాయంత్రం 6 గంటల నుండి 8గంటల వరకు ప్రవచనాలను ఏర్పాటు చేశారు. రాష్ట్ర సంక్షేమ శాఖల మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ప్రత్యేక ఆహ్వానం మేరకు చాగంటి ధర్మపురిలో ప్రవచించ డానికి అంగీకరించారు. మంత్రి లక్ష్మణ్ కుమార్ ఆదేశానుసారం దేవస్థానం చైర్మన్ జక్కు రవీందర్ నేతృత్వం లోని ధర్మ కర్తలు, ఈఓ శ్రీనివాస్, సిబ్బంది, అధికారులు, ప్రభుత్వ, మున్సిపల్, దేవస్థాన ఉద్యోగులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. భక్తులకు అసౌకర్యాలు కలగకుండా ముందస్తు చర్యలు, స్వాగత తోరణాలు, రంగురంగుల విద్యుత్ దీపాలతో అందంగా అలంకరించారు.

Tags
Join WhatsApp

More News...

Local News 

కాంగ్రెస్ అరాచకానికి బీసీ బిడ్డ బలి: వసంత సురేష్ తీవ్ర విమర్శలు

కాంగ్రెస్ అరాచకానికి బీసీ బిడ్డ బలి: వసంత సురేష్ తీవ్ర విమర్శలు రాయికల్, డిసెంబర్ 7 (ప్రజా మంటలు): కాంగ్రెస్ ప్రభుత్వం రిజర్వేషన్లను అమలు చేయకుండానే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లిన నిర్ణయం బీసీ వర్గాలపై తీవ్ర అన్యాయం చేసిందని, ఆ నిరాశతోనే బీసీ బిడ్డ ఈశ్వర చారి ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని జగిత్యాల జిల్లా తొలి జడ్పీ చైర్పర్సన్ దావ వసంత సురేష్ మండిపడ్డారు. రాయికల్...
Read More...
Local News 

పెన్షనర్ల సమస్యల పరిష్కారానికి కార్యాచరణ  సమావేశం.                            -టీ పి సీ ఏ రాష్ట్ర కార్యదర్శి హరి అశోక్ కుమార్.                          

పెన్షనర్ల సమస్యల పరిష్కారానికి కార్యాచరణ  సమావేశం.                            -టీ పి సీ ఏ రాష్ట్ర కార్యదర్శి హరి అశోక్ కుమార్.                                                 జగిత్యాల డిసెంబర్ 7:పెన్షనర్ల సమస్యల పరిష్కారం కోసం సోమవారం హైదరాబాద్ లో రాష్ట్ర స్థాయి సమావేశం  తెలంగాణ పెన్షన ర్స్ సెంట్రల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో  నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర కార్యదర్శి, జిల్లా అధ్యక్షులు హరి అశోక్ కుమార్ తెలిపారు.ఆదివారం జిల్లా  టి. పి. సీ. ఏ. కార్యాలయంలో అయన విలేకరుల తో మాట్లాడుతూ  హైదరాబాద్ లోని ఈ...
Read More...

అఖిల బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో ఆర్ద్ర నక్షత్రం సందర్భంగా హరిహరాలయంలో ఫల ,పంచామృత అభిషేకాలు

అఖిల బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో ఆర్ద్ర నక్షత్రం సందర్భంగా హరిహరాలయంలో ఫల ,పంచామృత అభిషేకాలు జగిత్యాల డిసెంబర్ 7 (ప్రజా మంటలు)అఖిల బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో బ్రాహ్మణ వీధి హరిహరాలయంలో ఆదివారం ఆరుద్ర నక్షత్రం సందర్భంగా పరమశివునికి పంచామృతాలు ,వివిధ ఫల రసాలతో సూర్యోదయానికి పూర్వమే అభిషేకాలు నిర్వహించారు.  భక్తులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా భక్తులు తమ స్వహస్తాలతో సాంబశివుని కి పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించారు....
Read More...

అగ్ని ప్రమాద బాధితులకు  భగవాన్ శ్రీ సత్యసాయి సేవా సమితి సభ్యుల చేయూత

అగ్ని ప్రమాద బాధితులకు  భగవాన్ శ్రీ సత్యసాయి సేవా సమితి సభ్యుల చేయూత    మల్యాల డిసెంబరు 7 ( ప్రజా మంటలు)స్థానిక కొండగట్టు లో ఒక దారుణ అగ్నిప్రమాదంలో దాదాపు 20 చిరువ్యాపారులు చేసుకొనే షాపులు పూర్తిగా కాలిపోయి , కుటుంబాలు అన్ని రోడ్డు మీదకి వచ్చాయి.  ఇతర స్థానిక కుటుంబీకులు సామ శ్రీనాథ్ గారి కుటుంబ సభ్యులు మరియు మహేష్ గారు మన సత్యసాయి సంస్థ ని...
Read More...
Local News 

ఓటర్లకు భరోసా కల్పిస్తూ ఇబ్రహీంపట్నం లో పోలీసుల ఫ్లాగ్‌మార్చ్

ఓటర్లకు భరోసా కల్పిస్తూ ఇబ్రహీంపట్నం లో పోలీసుల ఫ్లాగ్‌మార్చ్ ఇబ్రహీంపట్నం, డిసెంబర్ 07 (ప్రజా మంటలు – దగ్గుల అశోక్):రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంలో ఓటర్లు స్వేచ్ఛాయుత వాతావరణంలో తమ ఓటు హక్కును వినియోగించుకునేలా భద్రతా హామీ ఇవ్వడం కోసం ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో విస్తృతంగా ఫ్లాగ్‌మార్చ్ నిర్వహించారు. జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఐపీఎస్ ఆదేశాల మేరకు మెట్టుపల్లి...
Read More...

మహాభారత జ్ఞాన యజ్ఞం కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి  ప్రారంభించిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

మహాభారత జ్ఞాన యజ్ఞం కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి  ప్రారంభించిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్   జగిత్యాల డిసెంబర్ 7(ప్రజా మంటలు)జిల్లా కేంద్రం కరీంనగర్ రోడ్ లోని రెడ్డి ఫంక్షన్ హాల్ లో నిర్వహిస్తున్న మహాభారత జ్ఞాన యజ్ఞము రెండవ రోజు ఎమ్మెల్యే సంజయ్ కుమార్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అట్టహాసంగా శనివారం ప్రారంభమైన మహాభారత                నవహాన్నిక ప్రవచన జ్ఞాన యజ్ఞం ఆదివారం రెండవ రోజుకు చేరింది. విశ్వ కళ్యాణర్థం...
Read More...
Local News  State News 

సిటీలో క్రిస్మస్ ముందస్తు సెలబ్రేషన్స్. : కేక్ మిక్సింగ్..ఫన్ గేమ్స్..శాంతాక్లాజ్ సందడి

సిటీలో క్రిస్మస్ ముందస్తు సెలబ్రేషన్స్. : కేక్ మిక్సింగ్..ఫన్ గేమ్స్..శాంతాక్లాజ్ సందడి సికింద్రాబాద్, డిసెంబర్ 07 (ప్రజామంటలు): క్రిస్మస్ ముందస్తు సెలబ్రేషన్స్ సిటీలో ఘనంగా మొదలయ్యాయి. బేగంపేట లోని మ్యారీగోల్డ్ హోటల్ లో క్రిస్మస్ ముందస్తు వేడుకలు కన్నులపండువగా జరిగాయి. ఈసందర్బంగా నీలిమా వేముల నిర్వహించిన స్పెషల్ ఈవెంట్ లో మహిళలు మెరిశారు. ముఖ్య అతిథిగా  బేబక్క, స్పీకర్ గా రజిత హాజరయ్యారు. సుధా నాయుడు, లావణ్య, ప్రణతి...
Read More...
International   State News 

మోంబాసా సాటర్ డే క్లబ్‌ ఫండ్‌ రైజింగ్‌లో MOMTA సభ్యుల ప్రదర్శన

మోంబాసా సాటర్ డే క్లబ్‌ ఫండ్‌ రైజింగ్‌లో MOMTA సభ్యుల ప్రదర్శన సికింద్రాబాద్, డిసెంబర్ 07 ( ప్రజామంటలు) : కెన్యా లోని మోంబాసా తెలుగు అసోసియేషన్ ( MOMTA) ఆధ్వర్యంలో ఫండ్ రైజింగ్  కొరకు "సాటర్ డే క్లబ్" నిర్వహించిన  అసోసియేషన్ సభ్యుల సాంస్కృతిక ప్రదర్శన ఆకట్టుకుంది. బోర్‌ వెల్లుల ఏర్పాటు, విద్యార్థుల విద్యా సహాయం, భారీ నీటి నిల్వ ట్యాంకుల విరాళం, ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు...
Read More...

కొండగట్టు అగ్ని ప్రమాద బాధితులకు సత్యసాయి సేవా సమితి చేయూత

కొండగట్టు అగ్ని ప్రమాద బాధితులకు సత్యసాయి సేవా సమితి చేయూత కొండగట్టు, డిసెంబర్ 06 (ప్రజా మంటలు):స్థానికంగా జరిగిన అగ్ని ప్రమాదంలో దాదాపు 20 మంది చిరు వ్యాపారుల షాపులు పూర్తిగా కాలిపోవడంతో కుటుంబాలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యాయి. పరిస్థితి తెలుసుకున్న భగవాన్ శ్రీ సత్యసాయి సేవా సమితి, జగిత్యాల తరఫున తక్షణ సహాయం అందించారు. సామ శ్రీనాథ్ కుటుంబ సభ్యులు, మహేష్ మొదలైన వారు...
Read More...
National  Comment 

కాసేపు హాయిగా నవ్వుకోండి..చాలా సీరియస్ అంశం?

కాసేపు హాయిగా నవ్వుకోండి..చాలా సీరియస్ అంశం? నేటి సామాజిక ఆలోచనలపై వ్యంగ్య రచన  (జర్నలిస్ట్ నాగ్ రాజ్ FB నుండి) ఇందాక ఆకలేసి, దారిలో పంచెకట్టు దోశ సెంటర్ కనిపిస్తే వెళ్లా.  మెనూ చెక్ చేసి,"ఓ ఘీంకారం దోశ.. టోకెన్ ఇవ్వు" అనడిగా. (అంటే ఏనుగు అరుపు కాదు) -ed  "అది ఘీంకారం కాదు, ఘీ కారం" అన్నాడాయన కోపంగా.  "ఓహ్,...
Read More...
Local News 

జగిత్యాలలో ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ శుభాకాంక్షల పరంపర

జగిత్యాలలో ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ శుభాకాంక్షల పరంపర జగిత్యాల డిసెంబర్ 07 (ప్రజా మంటలు): కన్వెన్షన్ హాల్‌లో శృంగేరి శారద పీఠ ఆస్థాన పండితులు డాక్టర్ బాచంపల్లి సంతోష్ కుమార్ శాస్త్రి గారి మహాభారత ప్రవచన మహాయజ్ఞం రెండో రోజు కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రవచన కార్యక్రమాన్ని...
Read More...
State News 

ఇండిగో సీఈఓ కు dgca నోటీస్

ఇండిగో సీఈఓ కు dgca నోటీస్ న్యూ ఢిల్లీ డిసెంబర్ 06; ఇండిగో flights ఆలస్యాలు, క్రూ కొరత, ప్రయాణీకుల అసౌకర్యంపై దేశవ్యాప్తంగా వచ్చిన తీవ్ర విమర్శల నేపథ్యంలో, డీజీసీఏ నేరంగా ఇండిగో సీఈఓ పీటర్ ఎల్బర్స్‌కు షోకాజ్ నోటీసు జారీ చేసింది. “మీపై తగిన అమలు చర్య ఎందుకు ప్రారంభించకూడదు?” అనే ప్రశ్నకు సంబంధించి, ఎల్బర్స్ 24 గంటల్లోపు వివరణ ఇవ్వాలని...
Read More...