బెస్ట్ అవైలబుల్ స్కూల్ విద్యార్థుల తల్లిదండ్రులు రాస్తారోకో నిర్వహించారు.
ఎండపల్లి అక్టోబర్ 09 (ప్రజా మంటలు):
ధర్మపురి నియోజకవర్గం ఎండపల్లి మండలం లో బెస్ట్ అవైలబుల్ స్కూల్ విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చేశారు.బెస్ట్ అవైలబుల్ స్కూల్ విద్యార్థుల తల్లిదండ్రులు రాస్తారోకో నిర్వహించారు.
జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలంలోని రాజారాంపల్లిలో రాజీవ్ రహదారిపై బైఠాయించి ఆందోళన చేశారు. బెస్ట్ అవైలబుల్ స్కూల్ ఫీజులు చెల్లించాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. దీనితో రాజీవ్ రహదారిపై రవాణా స్తంభించింది.
రోడ్డు కిరువైపులా భారీ సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి.
స్థానిక ఎస్సై తన సిబ్బందితో వచ్చి ఆందోళనకారులను రోడ్డుపై నుండి తొలగించే ప్రయత్నం చేశారు.
ఈ నేపథ్యంలో పోలీసులకు బెస్ట్ అవైలబుల్ స్కూల్ పేరెంట్స్ కు మధ్య. సల్ప వాగ్వివాదం, చోటుచేసుకుంది. ఈ సందర్భంగా బెస్ట్ అవైలబుల్ స్కూల్ విద్యార్థుల తల్లిదండ్రులు మాట్లాడుతూ గత రెండు సంవత్సరాలుగా ప్రభుత్వం ఫీజులు చెల్లించకపోవడంతో తమ పిల్లల భవిష్యత్తు రోడ్డుపై పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఫీజులు రాకపోవడంతో రాజారాంపల్లిలోని అక్షర ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు తమ పిల్లలను పాఠశాలకు రానివ్వడం లేదని ఆవేదన వ్యక్తంచేశారు.
ప్రభుత్వం స్పందించి బెస్ట్ అవైలబుల్ స్కూల్ ఫీజులు చెల్లించి, తమ పిల్లల భవిష్యత్తును కాపాడాలని డిమాండ్ చేశారు.
సమాచారం అందుకున్న ఎంఈఓ విద్యార్థుల తల్లిదండ్రులకు సర్దిచెప్పడంతో ఆందోళన విరమించారు. అనంతరం అక్షర హైస్కూలు యాజమాన్యంతో మాట్లాడి విద్యార్థుల జీవితలతో అడుకివద్దని హెచ్చరించారు. దీనితో ప్రభుత్వం నుంచి నిధులు మంజూరు చేసేవరకు విద్యార్థులను యధావిధిగా తరగతులకు అనుమతించేలా విద్యార్థులను ఎలాంటి ఇబ్బందులకు గురిచేయకుండా చూడాలని హైస్కూల్ యాజమాన్యం ఆదేశించారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
గాంధీలో ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం

ఈనెల 12న సికింద్రాబాద్ లో ముదిరాజ్ ల దసరా సమ్మేళనం

బీసీ రిజర్వేషన్ల కార్యరూపానికి అంతా ఒకటవ్వాలి

రైల్ నిలయం వద్ద రైల్వే పింఛనర్ల ఆందోళన

రాష్ర్టంలో వేద పాఠశాలల అభివృద్దికి కృషి చేస్తాం - రాష్ర్ట దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ

గాంధీలో ఉచిత వాటర్ ప్యూరిఫైడ్ సెంటర్స్ ప్రారంభం

మెటా ఫండ్ నిందితుల అరెస్ట్ ల్యాప్ టాప్, ఏటీఎం ,క్రెడిట్ కార్డ్స్ పాస్బుక్కుల స్వాధీనం_ ఎస్పీ అశోక్ కుమార్

కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తా ఆదిలాబాద్ ,మంచిర్యాల టిపిసిసి ఆర్గనైజర్ , అబ్జర్వర్ గా అడువాల జ్యోతి
.jpg)
సైబర్ నేరాలపై ఆధునిక చట్టాలపై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలి _ పట్టణ సిఐ కరుణాకర్

మారియా కొరినా మచడో: 2025 నోబెల్ శాంతి బహుమతి

తీన్మార్ మల్లన్నకు మద్దతు పలికిన ప్రజాసేన పార్టీ అధ్యక్షులు ఆకుల హనుమాండ్లు

మున్సిపల్ స్టాండింగ్ కౌన్సిల్ మెంబర్ గా సిరిపురం మహేంద్ర నాథ్
