డాక్టర్ గొల్లపల్లి గణేష్ కు రాష్ట్ర ప్రభుత్వ అవార్డు.
రామ కిష్టయ్య సంగన భట్ల - సీనియర్ ఇండిపెండెంట్ జర్నలిస్ట్ కాలమిస్ట్
జగిత్యాల సెప్టెంబర్ 08 (ప్రజా మంటలు) :
ధర్మపురి కేత్రానికి చెందిన బహుముఖ సేవా తత్పరుడు డాక్టర్ గొల్లపల్లి గణేష్ ను రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు వరించింది. విద్యారంగంలో గణేష్ చేస్తున్న కృషికి గుర్తింపుగా ఈ అవార్డు అందుకోనున్న సందర్భంగా పలువురు సాహితీవేత్తలు, విద్యావేత్తలు, సమాజ సేవకులు మిత్రులు హితులు, సన్నిహితులు ఆయనను అభినందించారు.

ధర్మపురి క్షేత్రానికి చెందిన డాక్టర్ గొల్లపల్లి గణేష్ ప్రభుత్వ పాఠశాలలో, చైతన్య భారతి ప్రైవేటు పాఠశాలలో, ధర్మపురిలోని శ్రీ లక్ష్మీ నరసింహ సంస్కృతాంధ్ర డిగ్రీ కళాశాలలో డిగ్రీ వరకు చదివారు.
పట్టభద్రునిగా అత్యుత్తమ మార్కులు సాధించిన నేపథ్యంలో 2003 సంవత్సరానికి కాకతీయ విశ్వవిద్యాలయం నుండి బంగారు పతకం పొందారు.
ఉస్మానియా విశ్వవిద్యాలయం దూర విద్య ద్వారా తెలుగు, ఇంగ్లీష్ భాషల్లో స్నాతకోత్తర విద్య పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు.
ఉస్మానియా తెలుగు శాఖ నుండి ”అంతర్జాలంలో తెలుగు భాషా సాహిత్యాల అధ్యయనం ” అనే అంశంపై పరిశోధన గావించిన తనకు డాక్టరేట్ ప్రదానం చేసారు.
2008 డియస్సీ ద్వారా తెలుగు భాషా పండితునిగా, ఉద్యోగంలో చేరి, బీర్పూర్ మండలం తాళ్ళ ధర్మారం లో పదోన్నతి ద్వారా పోస్టింగ్ పొంది, ప్రస్తుతం ధర్మపురి క్షేత్రంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్ గా విధులు నిర్వర్తిస్తున్నారు.
ఉపాధ్యాయునిగా అందించిన సేవలకు 2021 సంవత్సరానికి జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు అందుకున్నారు.
ఇక సామాజిక సేవా విషయానికి వస్తే...
2016 సంవత్సరంలో పేద విద్యార్థులకు ఆర్థిక చేయూత అందించాలానే తపనతో ఉద్దేశ్యంతో విద్యార్థి దత్తత కార్యక్రమం (Student Adoption Program) చేపట్టారు.
ధర్మపురి, బుగ్గారం, వెల్గటూర్, బీర్పూర్ మండలాల్లోని సుమారు 3000 మంది నిరుపేద విద్యార్థులకు ₹20 లక్షల పైగా విలువ గల, సంవత్సరానికి సరిపడే స్టేషనరీ సామాగ్రి (బ్యాగు, నోటుపుస్తకాలు, పెన్నులు, పెన్సిల్లు తదితర) అందించారు.
6 గురు విద్యార్థుల ఉన్నత విద్యాభ్యాసం కొరకు దాతల సహకారంతో ఆర్థిక తోడ్పాటు అందించారు. ముగ్గురు విద్యార్థులు బిటెక్ చదువుతుండగా, ఒక విద్యార్థిని బాసర ట్రిపుల్ ఐటిలో, మరో విద్యార్థిని కరీంనగర్ లో పాలిటెక్నిక్ విద్యను అభ్యసిస్తున్నారు.
సన్నిహిత మిత్రులతో వుయ్ హెల్ప్ యు అనే సంస్థ 2012లో ఏర్పాటు చేసి, తద్వారా ఆరోగ్యం, విద్య కు సంబంధించిన అవసరాలు ఉన్న వారికి ఆర్థిక సహాయం, ఉన్నత చదువుల కొరకు తోడ్పాటు అందిస్తున్నారు. ఆర్థిక సాయం అందించారు.
కరోనా కష్టకాలంలో దాతల సహకారంతో సుమారు 300 నిరుపేద కుటుంబాలకు ₹1000 విలువ గలిగిన నిత్యావసర సామగ్రి కిట్ల పంపిణీ. ప్రజల అవసరార్థం ” మూడు ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ ” మిషిన్ ల కొనుగోలు చేశారు.
ధర్మపురిలో వరదలలో దెబ్బతిన్న సుమారు 380 కుటుంబాలకు దాతల సహకారంతో ₹4 లక్షల విలువైన దుప్పట్లు, చాపల పంపిణీ చేశారు.
సేవా కార్యక్రమాలలో , విద్యా బోధనలో సాటిలేని మేటి గా గుర్తింపు పొందిన గొల్లపల్లి గణేష్ రాష్ట్ర ప్రభుత్వ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు పొంది, ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా గ్రహిస్తున్న సందర్భంలో ధర్మపురి క్షేత్ర ఆబాల గోపాలం ఆయనను అభినందన వెల్లువలో ముంచెత్తింది.

More News...
<%- node_title %>
<%- node_title %>
బి.ఆర్.ఎస్ బహిరంగ సభ విజయవంతం చేయండి
జగిత్యాల ఏప్రిల్ 15 ( ప్రజా మంటలు)జిల్లా బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఈనెల 20వ తేదీన కేసీఆర్ బహిరంగ సభ గురించి సన్నాహక సమావేశంలో పాల్గొన్న జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు ఎమ్మెల్సీ ఎల్ రమణ కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ జిల్లా తొలి జడ్పీ చైర్పర్సన్ దావ... పరిగి ఇండస్ట్రియల్ కారిడార్ వ్యతిరేకంగా రైతుల ఆందోళన.. వికారాబాద్లో కవిత అరెస్ట్
వికారాబాద్, ఏప్రిల్ 15 (ప్రజా మంటలు):
పరిగి ఇండస్ట్రియల్ కారిడార్ కోసం రైతుల భూములను బలవంతంగా స్వాధీనం చేసుకోవడాన్ని నిరసిస్తూ వికారాబాద్లో రైతులు, తెలంగాణ జాగృతి, ధర్మ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. ఆర్డీవో కార్యాలయం ఎదుట ఎండలో కూర్చొని ధర్నా నిర్వహించారు.ఈ ఆందోళనలో పాల్గొన్న తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత,... జిల్లా గ్రంథాలయ అభివృద్ధికి కృషి చేస్తా జిల్లా గ్రంథాలయ చైర్మన్ సంఘనభట్ల దినేష్
జగిత్యాల ఏప్రిల్ 14 (ప్రజా మంటలు) జిల్లా గ్రంథాలయ అభివృద్ధికి కృషి చేస్తానని నూతనంగా నియామకమైన జిల్లా గ్రంథాలయ అధ్యక్షుడు సంఘనభట్ల దినేష్ అన్నారు. మంగళవారం సాయంత్రం జిల్లా కేంద్రంలోని బ్రాహ్మణ వీధి శ్రీరామ మందిరం ఆవరణ టిటిడి దేవస్థాన ధ్యానమండలిలో సంగనభట్ల దినేష్ కు తుంగూరు గ్రామ సర్పంచ్ గా ఎన్నికైన అర్షకోట రాజగోపాల్... మెట్పల్లిలో అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు – నివాళులు అర్పించిన ఎమ్మెల్యే సంజయ్
మెట్పల్లి, ఏప్రిల్ 14 (ప్రజా మంటలు):
బి. ఆర్. అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా మెట్పల్లిలో ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో కోరుట్ల ఎమ్మెల్యే కె. సంజయ్, న్యాయవాది తుల రాజేందర్ కుమార్, తులగంగవ్వ ట్రస్ట్ ప్రతినిధులు పాల్గొన్నారు.అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఆయన సేవలను స్మరించుకున్నారు. సమాజంలో సమానత్వం, న్యాయం కోసం... అజ్మీర్ దర్గాకు కవిత చాదర్ పంపిన కవిత.. కొత్త రాజకీయ సంకేతాలా?
హైదరాబాద్, ఏప్రిల్ 14 (ప్రజా మంటలు):
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత రాజస్థాన్లోని అజ్మీర్ షరీఫ్ దర్గాకు చాదర్ పంపించారు. రాజకీయంగా కొత్త పార్టీ ఆవిర్భావం దిశగా అడుగులు వేస్తున్న నేపథ్యంలో ఈ చర్యకు ప్రాధాన్యం ఏర్పడింది.మంగళవారం హైదరాబాద్ బంజారాహిల్స్లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించిన కవిత, ఆ చాదర్ను... రేవంత్ రెడ్డి యాంటీ అంబేడ్కర్: కవిత సంచలన వ్యాఖ్యలు – తెలంగాణ అంబేడ్కర్ భిక్షే
హైదరాబాద్, ఏప్రిల్ 14 (ప్రజా మంటలు):
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంబేడ్కర్ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తీవ్ర విమర్శలు గుప్పించారు. అంబేడ్కర్కు వ్యతిరేకిగా ఈ దేశంలో ఎవరైనా ఉంటే అది రేవంత్ రెడ్డే అని ఆమె ఆరోపించారు.ది యునైటెడ్ ఫోరం ఫర్ ఎస్సీ, ఎస్టీ ఎంప్లాయిస్... శ్రీ శ్రీనివాస ఆంజనేయ భవాని శంకర దేవాలయంలో ఘనంగా స్వామివారి కల్యాణ వేడుకలు
జగిత్యాలఏప్రిల్ 12(ప్రజా మంటలు) శ్రీ శ్రీనివాస ఆంజనేయ భవాని శంకర దేవాలయం లో ఆదివారం శ్రవణా నక్షత్రం పురస్కరించుకొని పద్మావతి అలివేలు మంగ సహిత శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా ఉత్సవ మూర్తులను ప్రత్యేక వేదికపై ఉంచి కళ్యాణాన్ని నిర్వహించారు. ఆలయాన్ని సర్వాంగ సుందరంగా అలంకరించారు. భక్తులు... విలేకరి ముసుగులో వసూళ్లు.. కత్తితో బెదిరించి ₹42వేలు దోపిడి – వేములవాడలో నకిలీ జర్నలిస్టు అరెస్ట్
వేములవాడ, ఏప్రిల్ 12 (ప్రజా మంటలు):
విలేకరుల ముసుగులో కొందరు నకిలీ జర్నలిస్టులు ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తూ వసూళ్లకు పాల్పడుతున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా వేములవాడ పట్టణంలో జరిగిన ఒక సంఘటనలో నకిలీ జర్నలిస్టుగా నటించిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.
వేములవాడ టౌన్ సీఐ బి. వీర ప్రసాద్ తెలిపిన... ఇంటర్ ఫలితాల్లో మెరిసిన ఆణిముత్యం – గుంటుకుల సహస్ర
గొల్లపల్లి, ఏప్రిల్ 12 (ప్రజా మంటలు):
ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం పరీక్షా ఫలితాల్లో గొల్లపల్లి మండలానికి చెందిన లోత్తునూర్ గ్రామ విద్యార్థిని గుంటుకుల సహస్ర తన ప్రతిభను చాటుకుంది. తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు విడుదల చేసిన ఫలితాల్లో మొత్తం 470 మార్కులకు గాను 467 మార్కులు సాధించి జగిత్యాల పట్టణంలో ప్రథమ స్థానం దక్కించుకుంది.ప్రస్తుతం... వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి కాంగ్రెస్ సర్కార్ కృషి –కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేశ్
సికింద్రాబాద్, ఏప్రిల్ 12 ( ప్రజామంటలు):
సమాజంలో వెనకబడిన వర్గాల అభ్యున్నతికి కాంగ్రెస్ సర్కార్ కట్టుబడి ఉందని కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేశ్ అన్నారు. తెలంగాణ తోటి, మెహతార్ కమ్యూనిటీ సంఘం 12వ వార్షికోత్సవ వేడుకలు ఆదివారం బొల్లారం కొత్త బస్తీలోని కమ్యూనిటీ హాల్లో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ ముఖ్య అతిథిగా... మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయిస్ ఫోరం అధ్యక్షునిగా డాక్టర్ రమేష్
సికింద్రాబాద్, ఏప్రిల్ 12 ( ప్రజామంటలు):
టీఎన్జీవో మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయిస్ ఫోరం హైదరాబాద్ జిల్లా అధ్యక్షునిగా సికింద్రాబాద్ గాంధీఆస్పత్రి ఫిజియోథెరపీ విభాగ వైద్యుడు డాక్టర్ పల్లాటి రమేష్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. టీఎన్జీవో యూనియన్ హైదరాబాద్ జిల్లా అధ్యక్షకార్యదర్శులు విక్రమ్, శ్రీనివాస్, కోశాధికారి బాలరాజుల నేతృత్వంలో సంఘ కార్యాలయంలో ఆదివారం జరిగిన ఎన్నికల్లో నూతన... స్కై ఫౌండేషన్ ఆధ్వర్యంలో 298వ అన్నదానం
సికింద్రాబాద్, ఏప్రిల్ 12 ( ప్రజామంటలు):
హైదరాబాద్ నగరంలో ఆకలితో అలమటిస్తున్న అనాథలు, నిరాశ్రయుల కోసం స్కై ఫౌండేషన్ ఆదివారం 298వ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించింది. ఫౌండేషన్ సభ్యులు వాహనంలో వివిధ ప్రాంతాల్లో సంచరిస్తూ, ఫుట్పాత్లపై నివసించే నిరుపేదలను గుర్తించి వారికి ఆహారాన్ని పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఫౌండేషన్ ప్రెసిడెంట్ డాక్టర్ వై. సంజీవ... 