మానవత్వంతో వ్యవహరించిన సీఏఆర్ కానిస్టేబుల్కు టీఎస్హెచ్ఆర్సీ చైర్పర్సన్ ప్రశంస
హైదరాబాద్ సెప్టెంబర్ 09:
తెలంగాణ మానవ హక్కుల కమిషన్ (TGHRC) చైర్పర్సన్, గౌరవ డా. జస్టిస్ షమీమ్ అఖ్తర్, గత వారం నగరంలో కురిసిన భారీ వర్షాల సమయంలో ఒక యువతిని రక్షించి, సురక్షితంగా ఇంటికి చేర్చిన హైదరాబాదు సిటీ ఆర్మ్డ్ రిజర్వ్ (CAR) హెడ్ కానిస్టేబుల్ శ్రీధర్ వర్మ ను నేడు ప్రశంసిస్తూ అభినందన పత్రం అందజేశారు.
సంఘటన వివరాలు:-
7-8-2025 వ తేదీ సాయంత్రం హైదరాబాద్లో కురిసిన భారీ వర్షాల కారణంగా బంజారా హిల్స్ రహదారులు నడుము లోతు వరద నీటితో మునిగిపోయాయి. ఈ పరిస్థితుల్లో, చైర్పర్సన్ భద్రతా బృందంలో పైలట్-కమ్-ఎస్కార్ట్ సిబ్బందిగా విధులు నిర్వహిస్తున్న హెడ్ కానిస్టేబుల్ శ్రీధర్ వర్మ, రోడ్ నెం. 3 వద్ద బస్టాప్లో ఒంటరిగా నిలబడి భయాందోళనలకు లోనైన 22 ఏళ్ల యువతి నైనికను గమనించారు.
ఆస్ట్రేలియాలో ఎంబీఏ చదువుకుంటూ రామంతపూర్లో కుటుంబ సభ్యులను కలుసుకోవడానికి వచ్చిన నైనిక, తన అన్న వదిలి వెళ్ళిన తర్వాత పెరుగుతున్న వరదలో ఇరుక్కుపోయింది. నీటి భయం (హైడ్రోఫోబియా)తో విలవిలలాడుతూ, మొబైల్ ఫోన్ పనిచేయకపోవడంతో తల్లిదండ్రులను సంప్రదించలేని పరిస్థితి. ఈ సమయంలో, హెడ్ కానిస్టేబుల్ శ్రీధర్ వర్మ నడుము లోతు నీటిలోకి వెళ్లి, ఆమెకు తన జెర్కిన్ ఇవ్వడంతో పాటు ధైర్యం చెప్పి, ఆమె కుటుంబ సభ్యులను సమాచారం అందించారు.
ప్రయాణ సౌకర్యాలు లభించకపోవడంతో, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు, ఆయన స్వయంగా నైనికను వానలతో ముంచెత్తిన రహదారులను దాటుతూ వనస్థలీపురంలోని ఆమె ఇంటికి తీసుకెళ్లి, రాత్రి ఆలస్యంగా తల్లి, చెల్లెలు వద్దకు క్షేమంగా చేర్చారు.
ఈ సంఘటన పత్రికలు మరియు సామాజిక మాధ్యమాల్లో విస్తృత ప్రచారం పొందింది. దీనిపై డా. జస్టిస్ షమీమ్ అఖ్తర్, హెడ్ కానిస్టేబుల్ శ్రీధర్ వర్మ సేవను,విధి నిర్వాహణకు మించి మానవత్వం మరియు కర్తవ్యబద్ధతకు ప్రతీకగా అభినందించారు.
ఆయన చూపిన నిస్వార్థ సేవ ఒక బాధలో ఉన్న పౌరుడి సురక్షితత్వం, గౌరవాన్ని కాపాడడమే కాకుండా, పోలీసింగ్ మరియు మానవ హక్కుల పరిరక్షణలోని అసలు స్ఫూర్తిని ప్రతిబింబిస్తుందని చైర్పర్సన్ పేర్కొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
గాంధీ చీఫ్ ఫార్మసీ ఆఫీసర్ గా వేణుగోపాల్ రెడ్డి

జిల్లాస్థాయి పోటీలకు ఎంపికైన బ్రిలియంట్ మోడల్ పాఠశాల బాలురు

దేశంలోనే నెంబర్ వన్ ఆసుపత్రిగా గాంధీని తీర్చిదిద్దుతాం - అడిషనల్ డీఎంఈ వాణీ

దేశానికి వెన్నెముక యువత" - అడిషనల్ కలెక్టర్ బిఎస్ లత, అసిస్టెంట్ ప్రొఫెసర్ కాంత కుమారి

డేటింగ్ యాప్లో యువకుని ప్రేమ, వైద్యురాలికి రూ. 25 లక్షల టోకరా!
.jpeg)
కిషన్ రెడ్డి రాజీనామా చేస్తే - నేను చేస్తా - ఎమ్మెల్యే రాజాసింగ్
.jpeg)
కేంద్ర పథకాలను గడప గడపకు చేర్చాలి మోడీ జన్మదినోత్సవాన రక్త ధాన శిభిరాలు

రామంతాపూర్ లో చాకలి ఐలమ్మ 40వ వర్ధంతి

ప్రపంచ ఆత్మహత్య నివారణ దినోత్సవం ర్యాలీ

ఇసుక దోపిడీని అరికట్టేందుకే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయం. జగిత్యాల కేంద్రంలో ప్రారంభించిన సంక్షేమ శాఖ మంత్రి :. అడ్లూరి

లతా పేష్కర్ రచనలు స్పూర్తి దాయకం

75000/ వేల రూ " ఎల్ ఓ సి అందజేసిన ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్
