డాక్టర్ గొల్లపల్లి గణేష్ కు రాష్ట్ర ప్రభుత్వ అవార్డు.

On
డాక్టర్ గొల్లపల్లి గణేష్ కు రాష్ట్ర ప్రభుత్వ అవార్డు.

రామ కిష్టయ్య సంగన భట్ల - సీనియర్ ఇండిపెండెంట్ జర్నలిస్ట్ కాలమిస్ట్ 

 జగిత్యాల సెప్టెంబర్ 08 (ప్రజా మంటలు) : 

ధర్మపురి కేత్రానికి చెందిన బహుముఖ సేవా తత్పరుడు డాక్టర్ గొల్లపల్లి గణేష్ ను రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు వరించింది. విద్యారంగంలో గణేష్ చేస్తున్న కృషికి గుర్తింపుగా ఈ అవార్డు అందుకోనున్న సందర్భంగా పలువురు సాహితీవేత్తలు, విద్యావేత్తలు, సమాజ సేవకులు మిత్రులు హితులు, సన్నిహితులు ఆయనను అభినందించారు.

IMG-20250907-WA0021

ధర్మపురి క్షేత్రానికి చెందిన డాక్టర్ గొల్లపల్లి గణేష్ ప్రభుత్వ పాఠశాలలో, చైతన్య భారతి ప్రైవేటు పాఠశాలలో, ధర్మపురిలోని శ్రీ లక్ష్మీ నరసింహ సంస్కృతాంధ్ర డిగ్రీ కళాశాలలో డిగ్రీ వరకు చదివారు.

పట్టభద్రునిగా అత్యుత్తమ మార్కులు సాధించిన నేపథ్యంలో 2003 సంవత్సరానికి కాకతీయ విశ్వవిద్యాలయం నుండి బంగారు పతకం పొందారు.

ఉస్మానియా విశ్వవిద్యాలయం దూర విద్య ద్వారా తెలుగు, ఇంగ్లీష్‌ భాషల్లో స్నాతకోత్తర విద్య పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు.

 ఉస్మానియా తెలుగు శాఖ నుండి ”అంతర్జాలంలో తెలుగు భాషా సాహిత్యాల అధ్యయనం ” అనే అంశంపై పరిశోధన గావించిన తనకు డాక్టరేట్‌ ప్రదానం చేసారు.

2008 డియస్సీ ద్వారా తెలుగు భాషా పండితునిగా, ఉద్యోగంలో చేరి, బీర్పూర్ మండలం తాళ్ళ ధర్మారం లో పదోన్నతి ద్వారా పోస్టింగ్ పొంది, ప్రస్తుతం ధర్మపురి క్షేత్రంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్ గా విధులు నిర్వర్తిస్తున్నారు.

ఉపాధ్యాయునిగా అందించిన సేవలకు 2021 సంవత్సరానికి జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు అందుకున్నారు.

ఇక సామాజిక సేవా విషయానికి వస్తే...

2016 సంవత్సరంలో పేద విద్యార్థులకు ఆర్థిక చేయూత అందించాలానే తపనతో ఉద్దేశ్యంతో విద్యార్థి దత్తత కార్యక్రమం (Student Adoption Program) చేపట్టారు.

ధర్మపురి, బుగ్గారం, వెల్గటూర్‌, బీర్‌పూర్‌ మండలాల్లోని సుమారు 3000 మంది నిరుపేద విద్యార్థులకు ₹20 లక్షల పైగా విలువ గల, సంవత్సరానికి సరిపడే స్టేషనరీ సామాగ్రి (బ్యాగు, నోటుపుస్తకాలు, పెన్నులు, పెన్సిల్‌లు తదితర) అందించారు.

6 గురు విద్యార్థుల ఉన్నత విద్యాభ్యాసం కొరకు దాతల సహకారంతో ఆర్థిక తోడ్పాటు అందించారు. ముగ్గురు విద్యార్థులు బిటెక్‌ చదువుతుండగా, ఒక విద్యార్థిని బాసర ట్రిపుల్‌ ఐటిలో, మరో విద్యార్థిని కరీంనగర్‌ లో పాలిటెక్నిక్‌ విద్యను అభ్యసిస్తున్నారు. 

సన్నిహిత మిత్రులతో వుయ్ హెల్ప్ యు అనే సంస్థ 2012లో ఏర్పాటు చేసి, తద్వారా ఆరోగ్యం, విద్య కు సంబంధించిన అవసరాలు ఉన్న వారికి ఆర్థిక సహాయం, ఉన్నత చదువుల కొరకు తోడ్పాటు అందిస్తున్నారు. ఆర్థిక సాయం అందించారు.

కరోనా కష్టకాలంలో దాతల సహకారంతో సుమారు 300 నిరుపేద కుటుంబాలకు ₹1000 విలువ గలిగిన నిత్యావసర సామగ్రి కిట్ల పంపిణీ. ప్రజల అవసరార్థం ” మూడు ఆక్సిజన్‌ కాన్సన్ట్రేటర్‌ ” మిషిన్‌ ల కొనుగోలు చేశారు.

ధర్మపురిలో వరదలలో దెబ్బతిన్న సుమారు 380 కుటుంబాలకు దాతల సహకారంతో ₹4 లక్షల విలువైన దుప్పట్లు, చాపల పంపిణీ చేశారు.

సేవా కార్యక్రమాలలో , విద్యా బోధనలో సాటిలేని మేటి గా గుర్తింపు పొందిన గొల్లపల్లి గణేష్ రాష్ట్ర ప్రభుత్వ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు పొంది, ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా గ్రహిస్తున్న సందర్భంలో ధర్మపురి క్షేత్ర ఆబాల గోపాలం ఆయనను అభినందన వెల్లువలో ముంచెత్తింది.

IMG-20250907-WA0022

Tags

More News...

Local News 

గాంధీ చీఫ్ ఫార్మసీ ఆఫీసర్ గా వేణుగోపాల్ రెడ్డి

గాంధీ చీఫ్ ఫార్మసీ ఆఫీసర్ గా వేణుగోపాల్ రెడ్డి సికింద్రాబాద్, సెప్టెంబర్ 10 (ప్రజామంటలు) : సికింద్రాబాద్‌ గాంధీఆస్పత్రి చీఫ్‌ ఫార్మసీ ఆఫీసర్‌గా వేణుగోపాల్‌రెడ్డి పదవీ బాధ్యతలు చేపట్టారు.  ఉస్మానియా ఆస్పత్రి ఫార్మసీ విభాగంలో విధులు నిర్వహిస్తున్న ఆయన పదోన్నతిపై గాంధీకి బదిలీ అయ్యారు. నల్గొండ జిల్లాకు చెందిన ఆయన 1990లో ప్రభుత్వ ఉద్యోగంలో చేరారు. బొల్లేపల్లి, భువనగిరి, బొమ్మల రామారం, ఉస్మానియా ఆస్పత్రుల్లో వివిధ...
Read More...
Local News 

జిల్లాస్థాయి పోటీలకు ఎంపికైన బ్రిలియంట్ మోడల్ పాఠశాల బాలురు 

జిల్లాస్థాయి పోటీలకు ఎంపికైన బ్రిలియంట్ మోడల్ పాఠశాల బాలురు  (అంకం భూమయ్య) గొల్లపల్లి సెప్టెంబర్ 10  (ప్రజా మంటలు):  గొల్లపల్లి మండలం లోని బుధవారం చిల్వకోడూరులో జరిగిన మండల స్థాయి ఆటల పోటీలలో బ్రిలియంట్ మోడల్ పాఠశాల బాలురు పాల్గొన్ను ఎస్ .లక్ష్మినివాస్, బి .ఆశ్రిత్, ఎస్ .నిశాంత్ ,కె .హర్షవర్ధన్ జిల్లా స్థాయి పోటీలకు అర్హత సాధించారు జిల్లా స్థాయి పోటీలకు ఎంపికైన విద్యార్థులను...
Read More...
Local News 

దేశంలోనే నెంబర్ వన్ ఆసుపత్రిగా గాంధీని తీర్చిదిద్దుతాం  - అడిషనల్ డీఎంఈ వాణీ

దేశంలోనే నెంబర్ వన్ ఆసుపత్రిగా గాంధీని తీర్చిదిద్దుతాం  - అడిషనల్ డీఎంఈ వాణీ ఆకస్మికంగా గాంధీ ఆసుపత్రి సందర్శన సికింద్రాబాద్, సెప్టెంబర్ 10 (ప్రజామంటలు) : కార్పోరేట్‌ ఆస్పత్రులకు తీసిపోని విదంగా  సికింద్రాబాద్‌ గాంధీఆస్పత్రిని తీర్చిదిద్ధి బ్రాండింగ్‌కే బ్రాండ్‌ అంబాసిడర్‌గా దేశంలోనే నంబర్‌ వన్‌గా నిలుపుతామని మెడికల్‌ ఎడ్యుకేషన్‌ అడిషనల్‌ డీఎంఈ ప్రొఫెసర్‌ వాణి అన్నారు. హెల్త్ మినిస్టర్, ప్రిన్సిపల్‌ సెక్రటరీ ఆదేశాల మేరకు ఆమె బుధవారం గాంధీఆస్పత్రిని ఆకస్మికంగా...
Read More...
Local News 

దేశానికి వెన్నెముక యువత" - అడిషనల్ కలెక్టర్ బిఎస్ లత, అసిస్టెంట్ ప్రొఫెసర్ కాంత కుమారి 

 దేశానికి వెన్నెముక యువత బి బి కే ఫౌండేషన్ ఆధ్వర్యంలో, లీడ్ ఇండియా కార్యక్రమాన్ని ప్రారంభించిన అడిషనల్ కలెక్టర్ బిఎస్ లత, డీఎస్పీ రఘుచందర్   (అంకం భూమయ్య)  గొల్లపల్లి సెప్టెంబర్ 10 (ప్రజా మంటలు): నేటి యువత భారతదేశంలో 54 కోట్లకు పైగా  ఉన్నారని  దానికిగాను వీరిని అన్ని రంగాలలో నేటి సమాజానికి బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని అడిషనల్...
Read More...
National  State News  Crime 

డేటింగ్ యాప్‌లో యువకుని ప్రేమ, వైద్యురాలికి రూ. 25 లక్షల టోకరా!

డేటింగ్ యాప్‌లో యువకుని ప్రేమ, వైద్యురాలికి రూ. 25 లక్షల టోకరా! హైదరాబాద్ సెప్టెంబర్ 10 (ప్రజా మంటలు): డేటింగ్ యాప్‌లో మహిళా డాక్టర్‌తో పరిచయం పెంచుకున్న యువకుడు, పెళ్లి చేసుకుంటానని నమ్మించి ప్రేమ నాటకం ఆడి, ఆమె నుండి ₹25 లక్షలు తీసుకొని, పెళ్ళి పేరెత్తగానే ఉడాయించిన ఘటన సికింద్రాబాద్ లోని అల్వాల్ లో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి:-  గత...
Read More...
National  State News 

కిషన్ రెడ్డి రాజీనామా చేస్తే - నేను చేస్తా - ఎమ్మెల్యే రాజాసింగ్ 

కిషన్ రెడ్డి రాజీనామా చేస్తే - నేను చేస్తా - ఎమ్మెల్యే రాజాసింగ్  హైదరాబాద్ సెప్టెంబర్ 10 (ప్రజా మంటలు): ఎమ్మెల్యే రాజాసింగ్‌ కిషన్ రెడ్డి రాజీనామా చేస్తే నేను చేస్తానని ఎమ్మెల్యే రాజా సింగ్ అన్నారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయను..ఏం చేస్తారు, కిషన్‌రెడ్డి రాజీనామా చేస్తే నేనూ చేస్తా ఇద్దరం స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేస్తాం అని బీజేపీకి సవాలు విసిరారు. పార్టీ కోసం పని చేయడానికి...
Read More...
Local News 

కేంద్ర పథకాలను గడప గడపకు చేర్చాలి  మోడీ జన్మదినోత్సవాన రక్త ధాన శిభిరాలు

కేంద్ర పథకాలను గడప గడపకు చేర్చాలి   మోడీ జన్మదినోత్సవాన రక్త ధాన శిభిరాలు      17 నుంచి అక్టోబర్ 2 వరకు కేంద్ర పథకాలపై అవగాహనాజగిత్యాల సెప్టెంబర్ 10(ప్రజా మంటలు)  _సేవా  పక్వాడ జిల్లా స్థాయి కార్యశాలలో జిల్లా అధ్యక్షులు యాదగిరి బాబు_  జగిత్యాల, సెప్టెంబర్ 10: కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోడీ చేపడుతున్న జనామోధిత పథకాలపై ప్రజలకు అవగాహనను పెంచుతూ గడప గడపకు కేంద్ర ప్రభుత్వ పథకాలను చేర్చాలని...
Read More...
Local News 

రామంతాపూర్ లో చాకలి ఐలమ్మ 40వ వర్ధంతి 

రామంతాపూర్ లో చాకలి ఐలమ్మ 40వ వర్ధంతి  సికింద్రాబాద్,  సెప్టెంబర్ 10 (ప్రజా మంటలు): రామంతపూర్ ప్రగతి నగర్ లో చాకలి ఐలమ్మ  40వ వర్ధంతి సందర్భంగా రజక నాయకులు పూలమాలలువేసి నివాళులర్పించారు.రజకుల సంఘం నాయకులు మొగిలి కృష్ణయ్య ,మోరపాక సతీష్ లు మాట్లాడుతూ... భూమికోసం,  భుక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసంతెలంగాణ సాయుధ రైతాంగ పోరాటానికి నాంది పలికిన వీర...
Read More...
Local News 

ప్రపంచ ఆత్మహత్య నివారణ దినోత్సవం ర్యాలీ

ప్రపంచ ఆత్మహత్య నివారణ దినోత్సవం ర్యాలీ సికింద్రాబాద్, సెప్టెంబర్ 10 (ప్రజా మంటలు):    ప్రపంచ ఆత్మహత్య నివారణ దినోత్సవం సందర్భంగా బుధవారం సైకియాట్రి డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో గాంధీ మెడికల్ కళాశాలలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా గాంధీ వైద్య కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఇందిర  ర్యాలీని ప్రారంభించిన అనంతరం మాట్లాడుతూ.. ఆత్మహత్య అనేది సమస్యలకు పరిష్కారం కాదని ఆవేశంతో తీసుకునే నిర్ణయాలు సమాజంలో...
Read More...
Local News 

ఇసుక దోపిడీని అరికట్టేందుకే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయం. జగిత్యాల కేంద్రంలో ప్రారంభించిన సంక్షేమ శాఖ మంత్రి :. అడ్లూరి

ఇసుక దోపిడీని అరికట్టేందుకే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయం.  జగిత్యాల కేంద్రంలో ప్రారంభించిన సంక్షేమ శాఖ మంత్రి :. అడ్లూరి జగిత్యాల సెప్టెంబర్ 10(ప్రజా మంటలు)ఇసుక బజార్' లను సద్వినియోగం చేసుకోవాలి : జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ బుధవారం జిల్లాకేంద్రంలోని వాణినగర్ లో ప్రభుత్వ ఖానిజాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ   ప్రజలకు ఇసుక అందుబాటులో ఉండేసాండ్...
Read More...
Local News 

లతా పేష్కర్ రచనలు స్పూర్తి దాయకం

లతా పేష్కర్ రచనలు స్పూర్తి దాయకం రచయిత లతా పేష్కర్ ను సత్కరించిన ట్రస్మా సికింద్రాబాద్  సెప్టెంబర్ 10 (ప్రజా మంటలు): లతా పేస్కర్ రచనలు నేటి తరానికి స్ఫూర్తిదాయకమని ట్రస్మా హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు ఉమామహేశ్వరరావు అన్నారు. ఉపాధ్యాయ దినోత్సవ వేడుకల్లో ప్రముఖ రచయిత్రి లతా పేష్కర్ ను ట్రస్మా ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఉమామహేశ్వరరావు...
Read More...
Local News 

75000/ వేల రూ " ఎల్ ఓ సి అందజేసిన ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ 

75000/ వేల రూ జగిత్యాల సెప్టెంబర్ 10(ప్రజా మంటలు)జగిత్యాల పట్టణ అరవింద్ నగర్ కి చెందిన శివరాత్రి రామ్ చరణ్ కుడి చేతి శస్త్ర చికిత్స నిమిత్తం హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స కోసం జగిత్యాల ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం లో 75000 వేల రూపాయల  ఎల్ ఓ సి అందజేసిన జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్...
Read More...