ఉన్నది ఒక్కటే జిందగీ... బలవన్మరణాలు వద్దు...
డాక్టర్. వై. సంజీవ కుమార్,
ఫౌండర్ & ప్రెసిడెంట్, స్కై ఫౌండేషన్,
9493613555, 9393613555.
రేపు ప్రపంచ ఆత్మహత్యల నివారణ రోజు (సెప్టెంబర్ 10వ తేది)
సికింద్రాబాద్, సెప్టెంబర్ 09 ( ప్రజామంటలు):
సమస్యలు మనిషికి కాకపోతే మరెవరికి వస్తాయి అనే ఆలోచన వస్తే జీవితంలో ఆత్మహత్య చేసుకోవాలి అనే ఆలోచననే కలుగదు. ఉన్నది ఒక్కటే జిందగీ, జీవిస్తున్న జీవితమే, ఆర్థిక, వ్యక్తిగత, మానసికవేదనకు, క్షోభతో ఇలా అనేక కారణాలతో క్షణికావేశంలో తీసుకునే నిర్ణయంతో తనువు చాలిస్తున్నారు. అయితే బతికి సాధించుకోవాలని, ఆత్మహత్యతో ఏ ప్రయోజనం లేకపోగా మీ జీవితమే కోల్పోకుండా, మీ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్న వారి జీవితాలను అంధకారంలోకి నెడుతుంది. నేటి ఆధునిక పోకడతో చిన్న, పెద్దా అనే తారతమ్యం లేకుండా చదువులేనివాళ్ళు, చుదువుతూ ఉన్నవాళ్లు, ఉన్నతమైన స్థానాలలో ఉన్నవాళ్లు సైతం బలవర్మరణాలకు పాల్పడుతున్నారు, మరికొందరు బెట్టింగ్, జూదం, డ్రగ్స్, ఇతర వ్యసనాలకు బానిసలుగా మారి శారీరకంగా నష్టపోవడమే కాకుండా ఆర్థికంగా చితికిపోతున్నారు, పర్యావసనంగా తనువు చాలించాలి అనే ఆలోచనలకు వెళ్లిపోతున్నారు. ప్రేమ విఫలం అని, ఉద్యోగం రాలేదని, ఉద్యోగం పోయిందని, కుటుంబ తగాదాలు అని ఇలా అనేక రకాల కారణాలు చెప్తూ మృత్యువును కోరుకుంటున్నారు. ప్రేమలో ఓడిపోయినంత మాత్రాన మీరు ఒంటరి కాదు, మీకు మీరు ఉన్నారు, మరోపక్క మీ శ్రేయోభిలాషులు, బంధువులు ఎందరో ఉన్నారు, వారి గురించి ఒక్కసారి ఆలోచించు. ప్రేమ జీవితం కాదు.. జీవితంలో ఒక భాగం మాత్రమే. ఆర్థికంగా నష్టపోయినంత మాత్రాన మీరు చేవలేని, చాతకాని వాళ్ళు కాదు, ఒకదాంట్లో నష్టం వస్తే మరో మార్గం, కుదరకపోతే చిన్న ఉద్యోగం చేస్తూ కూడా దర్జాగా బ్రతికేయొచ్చు, వాళ్ళు ఏమంటారో, వీళ్ళు ఏమనుకుంటారో అని ఆలోచిస్తూ ప్రాణం తీసుకుంటే పోయేది నీ ప్రాణమే, వాళ్ళది కాదు. చేతకాక చనిపోయారు అనే అపవాదు కూడా చనిపోయాక మోయాలి, అది మీ కుటుంబసభ్యులకు సైతం తీరని లోటు అవుతుంది, వ్యసనాలు అని తెలిసి కూడా అలవాటు చేసుకోవడం ముమ్మాటికీ తప్పు మీదే అవుతుంది, ఎవరో బలవంతం చేస్తే, ఎవ్వరి ఆనందం కోసమో మీరు ఈ దురలవాట్ల రొంపిలో దిగితే కూరకపోయేది మీరే, మీరే తప్పటకుడు వేస్తె మీ కుటుంబంలో ఎవ్వరికి మంచి చెప్పగలరు. వ్యసనాలకు అలవాటు చేసే ఎవ్వరైనా వాళ్ళు మీ ఆప్తులు కాదు అని గ్రహించండి, వాళ్ళు చెడ్దయిందే కాకుండా మిమ్మల్ని తప్పుడు మార్గాలలో తీసుకెళ్తున్నారు అనేది మొదట్లోనే గ్రహించండి. అలాంటి స్నేహాలు, బంధాలు ఏవైనా విదిలించుకోండి, మిమ్మల్ని మీరు గెలవండి. మీరు వేసే ఒక్క చిన్న తప్పట్టడుగు జీవితాన్నే తారుమారు చేస్తుంది. ఒక్క క్షణం ఒకే ఒక్క క్షణం మిమ్మల్ని మీరు నిగ్రహించుకొని ఆలోచిస్తే మీ నిర్ణయం ఎంత అసహ్యించుకునేదో మీకే అర్థం అవుతుంది. మీరు ఎంత పెద్ద తప్పు చేయాలనుకున్నారో అర్థం అవుతుంది. చుట్టూ ఉండే జీవితాలను గమనించండి, ఎందరో ఎన్నో కష్టాలు, నష్టాలు బాధలు పడుతూ, అనేక సమస్యలను ఎదుర్కొంటూ, ఎదురయ్యే సమస్యలకు ఛాలెంజ్ విసురుతూ విజయం వైపు పయనిస్తున్నారు, ఉన్నంతలో సర్దుకుపోతూ జీవితాలను వెళ్లబుచ్చుతున్నారు. వాళ్లకు ఉండే సమస్యలలో మీ సమస్య ఎంత ? ఆర్థిక నష్టం అనేది పరిస్థితుల ప్రభావంలో సహజం, అంత మాత్రాన ఆత్మహత్య చేసుకుంటే ఆర్థిక సమస్యలు తీరిపోతాయా ? మీరు పిరిగివాళ్లుగా మిగిలిపోతారు. ప్రేమలో విఫలమైదని జీవితాన్ని ముగించేనుకుంటే మరి మీ ప్రేమ కన్నా మీ కన్నా వాళ్ళ ప్రేమ చిన్నదా ? వారి జీవితాలు ఎం అవుతాయని ఎప్పుడైనా ఆలోచించారా ? వివాహానికి ముందే ప్రేమ విఫలం అయినందుకు సంతోషపడాలి, ఇంకా మీ చేతిలో చాల సమయం ఉంది, చెడు జ్ఞాపకాలను ముగించేసి సరికొత్త ఆలోచనలతో, నూతన జీవితానికి పునాది వేయాలి. సరికొత్త జీవితాన్ని ప్రారంభం చేసి మీరు ఏమిటో నిరూపించుకునే అవకాశం ఉంటుంది. ఆ జీవితాన్ని సంతోషంగా ఆస్వాదించాలని, కష్టాలు ఎదుర్కొని మనచుట్టూ ఉండే వారిని సంతోషపెట్టాలి. ఓడిపోవడం తప్పు కాదు, విజయానికి ఓటమి ఒక మెట్టే, మారుతున్న కాలానికి తగ్గట్లుగా దైర్యంగా ముందుకు సాగండి, గెలుపుమార్గాలు ఎదురవుతాయి. ప్రేమ, పెళ్లి, వ్యాపారం, ఉద్యోగం, ఉన్నత చదువులు, బంధాలు ఏవైనా జీవితంలో ఒక భాగం మాత్రమే అవే జీవితం కాదు అనే సత్యాన్ని గ్రహిస్తే ఆత్మహత్య చేసుకోవాలి అనే ఆలోచన కూడా రాదు. జీవితం చాల విశాలమైనది,, ఒకటి కాకపోతే మరొకటి మనస్సును విశాలం చేసుకుంటే ప్రపంచం చాల పెద్దగా కనిపిస్తుంది, అనేక మార్గాలు బ్రతకడానికి, మీ గెలుపు లక్ష్యం ఏమిటో కూడా మీకు బోధపడుతుంది.
More News...
<%- node_title %>
<%- node_title %>
వెలుగుమట్ల బాధితులకు మద్దతుగా కల్వకుంట్ల కవిత నిరవధిక నిరాహార దీక్ష ప్రారంభం
ఖమ్మం, మార్చ్ 9 (ప్రజా మంటలు):
ఖమ్మం పోలీస్ స్టేషన్ నుంచి విడుదలైన అనంతరం తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అంబేద్కర్ భవన్లో వెలుగుమట్ల బాధితులతో కలిసి నిరవధిక నిరాహార దీక్ష ప్రారంభించారు.ఈ సందర్భంగా ఖమ్మం రూరల్ పోలీస్ స్టేషన్ వద్ద మాట్లాడిన ఆమె, తెలంగాణ జాగృతి, ఎస్సీ–ఎస్టీ–బీసీ జేఏసీ, ధర్మసమాజ్ పార్టీ... ప్రజావాణి ఫిర్యాదులను త్వరగా పరిశీలించాలి
జగిత్యాల మార్చ్ 9(ప్రజా మంటలు)ప్రజావాణి అర్జీల పై సమగ్ర విచారణ జరిపి సమస్యలను త్వరగా పరిష్కరించాలని అధికారులను జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) బి.ఎస్ లత అదేశించారు.
సోమవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుండి ఫిర్యాదులు, వినతులను ఆర్డీఓలతో కలిసి స్వీకరించారు.
అదనపు కలెక్టర్ (రెవెన్యూ) బిఎస్ లత మాట్లాడుతూ... ఇరాన్ సుప్రీం లీడర్గా మోజ్తభా ఖమెనీ నియామకం –
ఇరాన్ సుప్రీం లీడర్గా మోజ్తభా కామెనీ నియామకం
మధ్యప్రాచ్య దేశమైన ఇరాన్లో అత్యున్నత మత-రాజకీయ అధికారం అయిన సుప్రీం లీడర్ పదవికి మోజ్తభా కామెనీను ఎంపిక చేసినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. ఈ నిర్ణయం ప్రపంచవ్యాప్తంగా రాజకీయ, దౌత్య వర్గాల్లో చర్చకు దారితీసింది.మోజ్తభా కామెనీ, ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అయిన అయాతొల్లా... ఖమ్మంలో కల్వకుంట్ల కవిత అరెస్ట్ – మహిళా కానిస్టేబుళ్లు లేకుండానే అరెస్టుపై వివాదం
ఖమ్మం, మార్చి 09 (ప్రజా మంటలు):
వెలుగుమట్ల బాధితులకు మద్దతుగా ఖమ్మం జెడ్పీ సెంటర్ వద్ద ఆందోళన నిర్వహిస్తున్న తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమెతో పాటు ధర్మ సమాజ్ పార్టీ అధ్యక్షుడు విశారదన్ మహరాజ్, వెలుగుమట్ల బాధితులు మరియు జాగృతి నాయకులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.కవితతో... సైబర్ మోసలకు గురైతే వెంటనే 1930కి ఫిర్యాదు చేయాలి:సైబర్ క్రైమ్ డిఎస్పి వెంకటరమణ
జగిత్యాల మార్చ్ 9(ప్రజా మంటలు)అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నర్సింగ్ విద్యార్థినులకు సైబర్ నేరాల నివారణ పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని జగిత్యాల పట్టణంలోని ప్రభుత్వ మహిళా నర్సింగ్ కళాశాలలో సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సైబర్ క్రైమ్ డీఎస్పీ వెంకటరమణ ముఖ్య అతిథిగా... వెలుగుమట్ల బాధితుల ఆవేదన చూస్తే కడుపు తరుక్కుపోతోంది: కల్వకుంట్ల కవిత
ఖమ్మం, మార్చ్ 09 (ప్రజా మంటలు):
ఖమ్మం జిల్లా వెలుగుమట్లలో ఇళ్ల కూల్చివేత బాధితుల ఆవేదన చూస్తే కడుపు తరుక్కుపోతోందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. బాధితులతో కలిసి కలెక్టరేట్కు ర్యాలీగా బయల్దేరిన సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వానికి, రాజకీయ నాయకులకు ఇక్కడున్న ఆడబిడ్డల ఉసురు తగులుతుందని తీవ్రంగా వ్యాఖ్యానించారు.పిల్లల పరీక్షల... సీనియర్ సిటిజెన్స్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం. సందర్భంగా సన్మానాలు
జగిత్యాల మార్చి 8:తెలంగాణ ఆల్ సీనియర్ సిటిజెన్స్ అసోసియేషన్ జగిత్యాల జిల్లా శాఖ అధ్యక్షులు హరి అశోక్ కుమార్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకలను ఘనంగా నిర్వహించారు.ఆదివారం తెలంగాణ ఆల్ సీనియర్ సిటిజెన్స్ అస్సోసియేషన్ సమావేశ మందిరంలో జరిగిన ఈ వేడుకల్లో జిల్లాలో వివిధ రంగాల్లో విశిష్ట సేవలు అందించిన మహిళలను సన్మానించారు.
ధర్మపురి... హైదరాబాద్లో 2026 డిసెంబర్ 9 నాటికి 100% ఎలక్ట్రిక్ ఆర్టీసీ బస్సులు – సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్ మార్చ్ 08 (ప్రజా మంటలు):
దేశంలోని ఇతర మెట్రో నగరాలు ఎదుర్కొంటున్న సమస్యలు భవిష్యత్తులో హైదరాబాద్ నగరానికి రాకుండా ముందుగానే ప్రణాళికలు రూపొందిస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్ను ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన అన్నారు.
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా హైదరాబాద్లోని జ్యోతిరావు పూలే భవన్లో జరిగిన... మెట్రో ఛానల్ వద్ద మమతా బెనర్జీ ధర్నా – సింగూర్ ఉద్యమం జ్ఞాపకాలతో ఎన్నికల సమరానికి సంకేతం
బెంగాల్ రాజకీయాలపై ప్రత్యేక కథనం పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి Mamata Banerjee మరోసారి కోల్కతాలోని Metro Channel వద్ద ధర్నా చేపట్టడం రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. సాధారణంగా రాజకీయ పార్టీలు నిరసనలు నిర్వహించే ప్రదేశంగా ఈ స్థలం ప్రసిద్ధి పొందింది. కానీ మమతా బెనర్జీ రాజకీయ జీవితంలో ఈ ప్రదేశానికి ప్రత్యేకమైన ప్రాధాన్యం ఉంది.... రేచపల్లి లో బావిలో బాలుడి మృతదేహం
జగిత్యాల రూరల్, మార్చ్ 08 (ప్రజా మంటలు):
రేచపల్లి గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన చిన్నోజి రమేశ్ – జ్యోస్న దంపతుల కుమారుడు పవన్ తేజ (10) సమీపంలోని బావిలో మృతదేహంగా కనిపించాడు.పవన్ తేజ ఈ నెల 3వ తేదీన హోలీ ఆడుకోవడానికి ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాకపోవడంతో కుటుంబ... జగిత్యాల అభివృద్ధే నా లక్ష్యం – ఎంపీ అరవింద్ విమర్శలకు ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ కౌంటర్
జగిత్యాల మార్చ్ 07 (ప్రజా మంటలు):
జగిత్యాల అభివృద్ధే తన ప్రధాన ఎజెండా అని జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ స్పష్టం చేశారు. కేంద్రీయ విద్యాలయం విషయంలో కాలయాపన చేస్తున్నారని ఎంపీ అరవింద్ చేసిన ఆరోపణలకు ఆయన ఘాటుగా స్పందించారు.జగిత్యాల పట్టణంలోని మోతే రోడ్డు పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో... హింస ద్వారా సమస్యలకు పరిష్కారం సాధ్యం కాదు: సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్ మార్చ్ 07 (ప్రజా మంటలు):
హింస ద్వారా సమస్యలకు పరిష్కారం సాధ్యం కాదని, ప్రజాస్వామ్య మార్గంలోనే సమాజంలో మార్పు సాధ్యమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టులు కూడా ఆయుధాలు వదిలి జనజీవన స్రవంతిలోకి రావాలని పిలుపునిచ్చారు.లొంగిపోయిన మావోయిస్టులకు ప్రాణరక్షణతో పాటు ఆర్థిక సహాయం, పునరావాసం కల్పిస్తామని తెలిపారు. కేంద్ర... 