ఉన్నది ఒక్కటే జిందగీ... బలవన్మరణాలు వద్దు...

On
ఉన్నది ఒక్కటే జిందగీ... బలవన్మరణాలు వద్దు...

IMG_20250909_190950 డాక్టర్. వై. సంజీవ కుమార్, 
ఫౌండర్ & ప్రెసిడెంట్, స్కై ఫౌండేషన్, 
9493613555,   9393613555.

రేపు ప్రపంచ ఆత్మహత్యల నివారణ రోజు (సెప్టెంబర్ 10వ తేది)

సికింద్రాబాద్, సెప్టెంబర్ 09 ( ప్రజామంటలు):

సమస్యలు మనిషికి కాకపోతే మరెవరికి వస్తాయి అనే ఆలోచన వస్తే జీవితంలో ఆత్మహత్య చేసుకోవాలి అనే ఆలోచననే కలుగదు. ఉన్నది ఒక్కటే జిందగీ, జీవిస్తున్న జీవితమే, ఆర్థిక, వ్యక్తిగత, మానసికవేదనకు, క్షోభతో ఇలా అనేక  కారణాలతో  క్షణికావేశంలో తీసుకునే నిర్ణయంతో తనువు చాలిస్తున్నారు. అయితే బతికి సాధించుకోవాలని, ఆత్మహత్యతో ఏ ప్రయోజనం లేకపోగా  మీ జీవితమే కోల్పోకుండా, మీ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్న వారి జీవితాలను అంధకారంలోకి నెడుతుంది. నేటి ఆధునిక పోకడతో చిన్న, పెద్దా అనే తారతమ్యం లేకుండా చదువులేనివాళ్ళు, చుదువుతూ ఉన్నవాళ్లు, ఉన్నతమైన స్థానాలలో ఉన్నవాళ్లు సైతం బలవర్మరణాలకు పాల్పడుతున్నారు, మరికొందరు బెట్టింగ్, జూదం, డ్రగ్స్, ఇతర  వ్యసనాలకు బానిసలుగా మారి శారీరకంగా నష్టపోవడమే కాకుండా ఆర్థికంగా  చితికిపోతున్నారు, పర్యావసనంగా తనువు చాలించాలి అనే ఆలోచనలకు వెళ్లిపోతున్నారు. ప్రేమ విఫలం అని, ఉద్యోగం రాలేదని, ఉద్యోగం పోయిందని, కుటుంబ తగాదాలు అని ఇలా అనేక రకాల కారణాలు చెప్తూ మృత్యువును కోరుకుంటున్నారు. ప్రేమలో ఓడిపోయినంత మాత్రాన మీరు ఒంటరి కాదు, మీకు మీరు ఉన్నారు, మరోపక్క మీ శ్రేయోభిలాషులు, బంధువులు ఎందరో ఉన్నారు, వారి గురించి ఒక్కసారి ఆలోచించు. ప్రేమ జీవితం కాదు.. జీవితంలో ఒక భాగం మాత్రమే. ఆర్థికంగా నష్టపోయినంత మాత్రాన మీరు చేవలేని, చాతకాని వాళ్ళు కాదు, ఒకదాంట్లో నష్టం వస్తే మరో మార్గం, కుదరకపోతే చిన్న ఉద్యోగం చేస్తూ కూడా దర్జాగా బ్రతికేయొచ్చు, వాళ్ళు ఏమంటారో, వీళ్ళు ఏమనుకుంటారో అని ఆలోచిస్తూ ప్రాణం తీసుకుంటే పోయేది నీ ప్రాణమే, వాళ్ళది కాదు. చేతకాక చనిపోయారు అనే అపవాదు కూడా చనిపోయాక మోయాలి, అది మీ కుటుంబసభ్యులకు సైతం తీరని లోటు అవుతుంది, వ్యసనాలు అని తెలిసి కూడా అలవాటు చేసుకోవడం ముమ్మాటికీ తప్పు మీదే అవుతుంది, ఎవరో బలవంతం చేస్తే, ఎవ్వరి ఆనందం కోసమో మీరు ఈ దురలవాట్ల రొంపిలో దిగితే కూరకపోయేది మీరే, మీరే తప్పటకుడు వేస్తె మీ కుటుంబంలో ఎవ్వరికి మంచి చెప్పగలరు. వ్యసనాలకు అలవాటు చేసే ఎవ్వరైనా వాళ్ళు మీ ఆప్తులు కాదు అని గ్రహించండి, వాళ్ళు చెడ్దయిందే కాకుండా మిమ్మల్ని తప్పుడు మార్గాలలో తీసుకెళ్తున్నారు అనేది మొదట్లోనే గ్రహించండి. అలాంటి స్నేహాలు, బంధాలు ఏవైనా విదిలించుకోండి, మిమ్మల్ని మీరు గెలవండి.  మీరు వేసే ఒక్క చిన్న తప్పట్టడుగు జీవితాన్నే తారుమారు చేస్తుంది. ఒక్క క్షణం ఒకే ఒక్క క్షణం మిమ్మల్ని మీరు నిగ్రహించుకొని ఆలోచిస్తే మీ నిర్ణయం ఎంత అసహ్యించుకునేదో మీకే అర్థం అవుతుంది. మీరు ఎంత పెద్ద తప్పు చేయాలనుకున్నారో అర్థం అవుతుంది. చుట్టూ ఉండే జీవితాలను గమనించండి, ఎందరో ఎన్నో కష్టాలు, నష్టాలు బాధలు పడుతూ, అనేక సమస్యలను ఎదుర్కొంటూ, ఎదురయ్యే సమస్యలకు ఛాలెంజ్ విసురుతూ విజయం వైపు పయనిస్తున్నారు, ఉన్నంతలో సర్దుకుపోతూ జీవితాలను వెళ్లబుచ్చుతున్నారు. వాళ్లకు ఉండే సమస్యలలో మీ సమస్య ఎంత ? ఆర్థిక నష్టం అనేది పరిస్థితుల ప్రభావంలో సహజం, అంత మాత్రాన ఆత్మహత్య చేసుకుంటే ఆర్థిక సమస్యలు తీరిపోతాయా ? మీరు పిరిగివాళ్లుగా మిగిలిపోతారు. ప్రేమలో విఫలమైదని జీవితాన్ని ముగించేనుకుంటే మరి మీ ప్రేమ కన్నా మీ కన్నా వాళ్ళ ప్రేమ చిన్నదా ? వారి జీవితాలు ఎం అవుతాయని ఎప్పుడైనా ఆలోచించారా ? వివాహానికి ముందే ప్రేమ విఫలం అయినందుకు సంతోషపడాలి, ఇంకా మీ చేతిలో చాల సమయం ఉంది, చెడు జ్ఞాపకాలను ముగించేసి సరికొత్త ఆలోచనలతో, నూతన జీవితానికి పునాది వేయాలి. సరికొత్త జీవితాన్ని ప్రారంభం చేసి మీరు ఏమిటో నిరూపించుకునే అవకాశం ఉంటుంది.  ఆ జీవితాన్ని సంతోషంగా ఆస్వాదించాలని, కష్టాలు ఎదుర్కొని మనచుట్టూ ఉండే వారిని సంతోషపెట్టాలి.  ఓడిపోవడం తప్పు కాదు, విజయానికి ఓటమి ఒక మెట్టే,  మారుతున్న కాలానికి తగ్గట్లుగా దైర్యంగా ముందుకు సాగండి, గెలుపుమార్గాలు ఎదురవుతాయి. ప్రేమ, పెళ్లి, వ్యాపారం, ఉద్యోగం, ఉన్నత చదువులు, బంధాలు ఏవైనా జీవితంలో ఒక భాగం మాత్రమే అవే జీవితం కాదు అనే సత్యాన్ని గ్రహిస్తే ఆత్మహత్య చేసుకోవాలి అనే ఆలోచన కూడా రాదు. జీవితం చాల విశాలమైనది,, ఒకటి కాకపోతే మరొకటి మనస్సును విశాలం చేసుకుంటే ప్రపంచం చాల పెద్దగా కనిపిస్తుంది, అనేక మార్గాలు బ్రతకడానికి, మీ గెలుపు లక్ష్యం ఏమిటో కూడా మీకు బోధపడుతుంది. 

 

Tags
Join WhatsApp

More News...

Local News 

మెట్పల్లిలో అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు – నివాళులు అర్పించిన ఎమ్మెల్యే సంజయ్

మెట్పల్లిలో అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు – నివాళులు అర్పించిన ఎమ్మెల్యే సంజయ్ మెట్పల్లి, ఏప్రిల్ 14 (ప్రజా మంటలు): బి. ఆర్. అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా మెట్పల్లిలో ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో కోరుట్ల ఎమ్మెల్యే కె. సంజయ్, న్యాయవాది తుల రాజేందర్ కుమార్, తులగంగవ్వ ట్రస్ట్ ప్రతినిధులు పాల్గొన్నారు.అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఆయన సేవలను స్మరించుకున్నారు. సమాజంలో సమానత్వం, న్యాయం కోసం...
Read More...
State News 

అజ్మీర్ దర్గాకు కవిత చాదర్ పంపిన కవిత.. కొత్త రాజకీయ సంకేతాలా?

అజ్మీర్ దర్గాకు కవిత చాదర్ పంపిన కవిత.. కొత్త రాజకీయ సంకేతాలా?   హైదరాబాద్, ఏప్రిల్ 14 (ప్రజా మంటలు): తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత రాజస్థాన్‌లోని అజ్మీర్ షరీఫ్ దర్గాకు చాదర్ పంపించారు. రాజకీయంగా కొత్త పార్టీ ఆవిర్భావం దిశగా అడుగులు వేస్తున్న నేపథ్యంలో ఈ చర్యకు ప్రాధాన్యం ఏర్పడింది.మంగళవారం హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించిన కవిత, ఆ చాదర్‌ను...
Read More...
State News 

రేవంత్ రెడ్డి యాంటీ అంబేడ్కర్: కవిత సంచలన వ్యాఖ్యలు – తెలంగాణ అంబేడ్కర్ భిక్షే

రేవంత్ రెడ్డి యాంటీ అంబేడ్కర్: కవిత సంచలన వ్యాఖ్యలు – తెలంగాణ అంబేడ్కర్ భిక్షే హైదరాబాద్, ఏప్రిల్ 14 (ప్రజా మంటలు): తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంబేడ్కర్ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తీవ్ర విమర్శలు గుప్పించారు. అంబేడ్కర్‌కు వ్యతిరేకిగా ఈ దేశంలో ఎవరైనా ఉంటే అది రేవంత్ రెడ్డే అని ఆమె ఆరోపించారు.ది యునైటెడ్ ఫోరం ఫర్ ఎస్సీ, ఎస్టీ ఎంప్లాయిస్...
Read More...
Local News 

శ్రీ శ్రీనివాస ఆంజనేయ భవాని శంకర దేవాలయంలో ఘనంగా స్వామివారి కల్యాణ వేడుకలు 

శ్రీ శ్రీనివాస ఆంజనేయ భవాని శంకర దేవాలయంలో ఘనంగా స్వామివారి కల్యాణ వేడుకలు  జగిత్యాలఏప్రిల్ 12(ప్రజా మంటలు) శ్రీ శ్రీనివాస ఆంజనేయ భవాని శంకర దేవాలయం లో ఆదివారం శ్రవణా నక్షత్రం పురస్కరించుకొని పద్మావతి అలివేలు మంగ సహిత శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉత్సవ మూర్తులను ప్రత్యేక వేదికపై ఉంచి కళ్యాణాన్ని నిర్వహించారు. ఆలయాన్ని సర్వాంగ సుందరంగా అలంకరించారు. భక్తులు...
Read More...
Crime  State News 

విలేకరి ముసుగులో వసూళ్లు.. కత్తితో బెదిరించి ₹42వేలు దోపిడి – వేములవాడలో నకిలీ జర్నలిస్టు అరెస్ట్

విలేకరి ముసుగులో వసూళ్లు.. కత్తితో బెదిరించి ₹42వేలు దోపిడి – వేములవాడలో నకిలీ జర్నలిస్టు అరెస్ట్ వేములవాడ, ఏప్రిల్ 12 (ప్రజా మంటలు): విలేకరుల ముసుగులో కొందరు నకిలీ జర్నలిస్టులు ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తూ వసూళ్లకు పాల్పడుతున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా వేములవాడ పట్టణంలో జరిగిన ఒక సంఘటనలో నకిలీ జర్నలిస్టుగా నటించిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. వేములవాడ టౌన్ సీఐ బి. వీర ప్రసాద్ తెలిపిన...
Read More...
Local News 

ఇంటర్ ఫలితాల్లో మెరిసిన ఆణిముత్యం – గుంటుకుల సహస్ర

ఇంటర్ ఫలితాల్లో మెరిసిన ఆణిముత్యం – గుంటుకుల సహస్ర గొల్లపల్లి, ఏప్రిల్ 12 (ప్రజా మంటలు): ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం పరీక్షా ఫలితాల్లో గొల్లపల్లి మండలానికి చెందిన లోత్తునూర్ గ్రామ విద్యార్థిని గుంటుకుల సహస్ర తన ప్రతిభను చాటుకుంది. తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు విడుదల చేసిన ఫలితాల్లో మొత్తం 470 మార్కులకు గాను 467 మార్కులు సాధించి జగిత్యాల పట్టణంలో ప్రథమ స్థానం దక్కించుకుంది.ప్రస్తుతం...
Read More...
Local News 

వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి కాంగ్రెస్ సర్కార్ కృషి –కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేశ్

వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి కాంగ్రెస్ సర్కార్ కృషి –కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేశ్ సికింద్రాబాద్, ఏప్రిల్ 12 ( ప్రజామంటలు): సమాజంలో వెనకబడిన వర్గాల అభ్యున్నతికి కాంగ్రెస్ సర్కార్ కట్టుబడి ఉందని కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేశ్ అన్నారు.  తెలంగాణ తోటి, మెహతార్ కమ్యూనిటీ సంఘం 12వ వార్షికోత్సవ వేడుకలు ఆదివారం బొల్లారం కొత్త బస్తీలోని కమ్యూనిటీ హాల్‌లో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ ముఖ్య అతిథిగా...
Read More...
Local News 

మెడికల్‌ అండ్‌ హెల్త్‌ ఎంప్లాయిస్‌ ఫోరం అధ్యక్షునిగా డాక్టర్‌ రమేష్‌ 

మెడికల్‌ అండ్‌ హెల్త్‌ ఎంప్లాయిస్‌ ఫోరం అధ్యక్షునిగా డాక్టర్‌ రమేష్‌     సికింద్రాబాద్, ఏప్రిల్ 12 ( ప్రజామంటలు): టీఎన్‌జీవో మెడికల్‌ అండ్‌ హెల్త్‌ ఎంప్లాయిస్‌ ఫోరం హైదరాబాద్‌ జిల్లా అధ్యక్షునిగా సికింద్రాబాద్‌ గాంధీఆస్పత్రి ఫిజియోథెరపీ విభాగ వైద్యుడు డాక్టర్‌ పల్లాటి రమేష్‌ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.  టీఎన్‌జీవో యూనియన్‌ హైదరాబాద్‌ జిల్లా అధ్యక్షకార్యదర్శులు విక్రమ్, శ్రీనివాస్, కోశాధికారి బాలరాజుల నేతృత్వంలో  సంఘ కార్యాలయంలో ఆదివారం జరిగిన ఎన్నికల్లో నూతన...
Read More...
Local News 

స్కై ఫౌండేషన్ ఆధ్వర్యంలో 298వ అన్నదానం 

స్కై ఫౌండేషన్ ఆధ్వర్యంలో 298వ అన్నదానం  సికింద్రాబాద్,  ఏప్రిల్ 12 ( ప్రజామంటలు):  హైదరాబాద్ నగరంలో ఆకలితో అలమటిస్తున్న అనాథలు, నిరాశ్రయుల కోసం స్కై ఫౌండేషన్ ఆదివారం 298వ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించింది. ఫౌండేషన్ సభ్యులు వాహనంలో వివిధ ప్రాంతాల్లో సంచరిస్తూ, ఫుట్‌పాత్‌లపై నివసించే నిరుపేదలను గుర్తించి వారికి ఆహారాన్ని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఫౌండేషన్ ప్రెసిడెంట్ డాక్టర్ వై. సంజీవ...
Read More...
Local News 

ఇంటర్ ఫలితాల్లో ప్రభుత్వ జూనియర్ కళాశాల మార్కుల ప్రభంజనం

ఇంటర్ ఫలితాల్లో ప్రభుత్వ జూనియర్ కళాశాల మార్కుల ప్రభంజనం ఇబ్రహీంపట్నం, ఏప్రిల్ 12 (ప్రజా మంటలు): ఇబ్రహీంపట్నంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాల్లో రాష్ట్రస్థాయి మార్కులు సాధించి తమ ప్రతిభను మరోసారి చాటారు. ద్వితీయ సంవత్సరం ఫలితాలు:MPC: ఎం. లవిష – 979/1000BiPC: కె. నవీన – 971/1000CEC: కె. రతిక – 935/1000...
Read More...
National  Filmi News 

బాలీవుడ్ గానకోకిల ఆశా భోస్లే కన్నుమూత – 92 ఏళ్ల వయసులో సంగీత యుగానికి ముగింపు

బాలీవుడ్ గానకోకిల ఆశా భోస్లే కన్నుమూత – 92 ఏళ్ల వయసులో సంగీత యుగానికి ముగింపు ప్రఖ్యాత బాలీవుడ్ గాయని Asha Bhosle (92) కన్నుమూశారు. గుండెపోటుతో ముంబైలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆమె మరణించినట్లు కుటుంబ సభ్యులు ధృవీకరించారు. ఆమె మరణంతో భారతీయ సినీ సంగీతంలో ఒక మహా యుగానికి ముగింపు పలికినట్టైంది. ఎనిమిది దశాబ్దాల పాటు సాగిన ఆమె సంగీత ప్రయాణంలో 12,000కు పైగా పాటలు పాడి కోట్లాది అభిమానుల...
Read More...
Crime 

భార్యను కాపురానికి పంపలేదని అత్తను కరెంట్ షాక్‌తో హత్యాయత్నం నిందితుడు అరెస్ట్ – రిమాండ్‌కు తరలింపు

భార్యను కాపురానికి పంపలేదని అత్తను కరెంట్ షాక్‌తో హత్యాయత్నం నిందితుడు అరెస్ట్ – రిమాండ్‌కు తరలింపు   గొల్లపల్లి, ఏప్రిల్ 11 (ప్రజా మంటలు): భార్యను తిరిగి కాపురానికి పంపలేదనే కోపంతో అత్తను కరెంట్ షాక్‌తో చంపేందుకు ప్రయత్నించిన ఘటన వెంగటూరు మండలంలో చోటుచేసుకుంది.వెల్గటూర్ మండలం జగదేవపేట గ్రామానికి చెందిన గాగిరెడ్డి మల్లారెడ్డి (48) తన భార్య పద్మతో గత కొన్నేళ్లుగా వివాదాలు కొనసాగుతున్నాయి. భర్త హింసను భరించలేక పద్మ తన పిల్లలతో...
Read More...